విద్యుత్ నిరోధానికి ప్రమాణం



http://cdn.newshunt.com/fetchdata2/20140215/namasthe/CurrentAffairs/images/350x350_IMAGE27158863.png

టాన్స్ ఫార్మర్ ద్వారా AC కరెంట్‌ని ప్రసారం చేసినట్టయితే ఆ ప్రసార నష్టం తక్కువగా ఉంటుంది. కానీ DC కరెంట్‌ను ప్రసారం చేసినట్టయితే ప్రసార నష్టం ఎక్కువగా ఉంటుంది. ఓమ్ : రాబర్ట్ సైమన్ ఓమ్‌ను ప్రవేశపేట్టాడు. -స్థిరమైన ఉష్ణోగ్రత వద్ద ఒక తీగ ద్వారా ప్రవహిస్తున్న విద్యుత్ దానిలోని ప్రొటెన్షియల్ తేడాకు అనుపాతంలో ఉంటుంది iav i = I/RXV i = V/R లేదా i = IR లేదా i = V/R ఈ సమీకరణంలో R = విద్యుత్ నిరోధం విద్యుత్ నిరోధం : -ఏదైనా ఒక వలయం గుండా లేదా తీగగుండా విద్యుత్ ప్రవహిస్తున్నా ఆ ప్రవాహాన్ని అడ్డగించి లేదా వ్యతిరేకించే ధర్మమే విద్యుత్ నిరోధం -విద్యుత్ నిరోధానికి ప్రమాణం ఓమ్ విద్యుచ్చాలక బలం : -ఎలక్ట్రానులను అధిక పొటెన్షియల్ గల బిందువు వైపునకు తరలించడానికి విద్యుత్‌ఘటం చేసే పనిని విద్యుచ్చాలక బలం(e.m.f) అంటారు. -దీనికి ప్రమాణం వోల్టు -విద్యుచ్చాలక బలం అందించు సాధనాలను విద్యుచ్చాలక పీటాలు అంటారు. ఉదా : విద్యుత్ జనరేటర్, సైకిల్ డైనమో. విశిష్ట నిరోధం : -వాహక ప్రమాణ పొడవుపై ఉండే నిరోధాన్ని విశిష్ట నిరోధం అంటారు. -విశిష్ట నిరోధానికి ప్రమాణం- వోమ్ మీటర్ రియోస్టాట్ : ప్రయోగశాలలో విద్యుత్ వలయాల్లోని విద్యుత్ ప్రవాహాన్ని తగ్గించడానికి/పెంచడానికి ఉపయోగించే పరికరాన్ని రియోస్టాట్ అంటారు. అతివాహకత్వం : -ఉష్ణోగ్రతను తగ్గిస్తూపోతే కొన్ని పదార్థాల నిరోధకత ఒకానొక ఉష్ణోగ్రత వద్ద ఒక్కసారిగా శూన్యమవుతుంది. ఆ ఉష్ణోగ్రతను సందిగ్ధ ఉష్ణోగ్రత అంటారు. ఆ స్థితిలో పదార్థాన్ని అతివాహకం(Super conductor) అంటారు. -పాదరసం అతివాహక ఉష్ణోగ్రత 4.2 కెల్విన్లు -అతివాహకత్వంను కనుగొన్న శాస్త్రవేత్త కామన్ లింక్స్ ఓమ్. విద్యుత్ ప్రవాహంపై ఉష్ణోగ్రత ప్రవాహం : -ఉష్ణోగ్రతను పెంచినట్లయితే వాహకాల నిరోధం పెరిగి వాటి ద్వారా ప్రవహించే విద్యుత్ తగ్గిపోతుంది. ట్రాన్స్‌ఫార్మర్ : తక్కువ వోల్టేజి నుంచి ఎక్కువ వోలేజికి లేదా ఎక్కువ ఓల్టేజి నుంచి తుక్కువ ఓల్టేజికి విద్యుత్ సరఫరా చేయడానికి ట్రాన్స్‌ఫార్మర్‌ను ఉపయోగిస్తారు. ఇది పరస్పర ప్రేరణ లేదా అనూహ్య ప్రేరణ అను సూత్రం ఆధారంగా అనిచేస్తుంది. -ఈ సూత్రాన్ని లెంజ్ ప్రతిపాదించాడు. -ఈ సూత్రాన్ని ఆధారంగా చేసుకొని మొదటి ట్రాన్స్‌ఫార్మర్‌ను మైఖేల్ ఫారడే నిర్మించాడు. -సాధారణంగా ట్రాన్స్‌ఫార్మర్‌ను సులభంగా అయస్కాంతీకరణం చెందే సాఫ్ట్ ఐరన్‌తో నిర్మిస్తారు. సోలినాయిడ్ : ఒక పొడవైన విద్యుద్బంధకపు స్థూపాకార గొట్టాన్ని తీసుకొని దాని చుట్టూ విద్యుద్బంధకపు పూతగల రాగి తీగను ఖాళీ లేకుండా దగ్గరగా చుట్టినట్లయితే దానిని సోలినాయిడ్ అంటారు. దాని గుండా విద్యుత్ ప్రవహింపజేస్తే దండయస్కాంతం వలె అయస్కాంత క్షేత్రాన్ని ఏర్పరుస్తుంది. విద్యుత్ విశ్లేషనం : విద్యుత్‌ను ఉపయోగించి, సమ్మేళనాలను రసాయనికంగా విభజించి, వాటి మూలకాలుగా మార్చే ప్రక్రియను విద్యుత్ విశ్లేషనం అంటారు. విద్యత్ విశ్లేషనం ఉపయోగాలు : ఎలక్ట్రో ప్లేటింగ్ : ఇనుము తుప్పు పట్టకుండా నిరోధించడానికి, దానిపై నికెల్ లేదా క్రోమియం పూతను విద్యుద్విశ్లేషణం ద్వారా ఏర్పడేటట్లు చేస్తారు. గిల్టినగల తయారీ : తక్కువ ఖరీదుగల ఇత్తడి వంటి లోహంతో నగలు తయారుచేసి దానిపై విద్యుద్విశ్లేషణం ద్వారా బంగారు పూత పూస్తారు. లోహ సంగ్రహణం : విద్యుద్విశ్లేషణం ద్వారా లోహ ఖనిజాల నుంచి పరిశుభ్రమైన లోహాలను పొందవచ్చు. -విద్యుద్విశ్లేషణం ఉపయోగించి ఎలక్ట్రిక్ ప్రింటింగ్, గ్రామ్‌ఫోన్ రికార్డులు తయారు చేస్తారు. ఫ్యూజ్ : ఇది టిన్‌నొడ్ మిశ్రమంతో చేసిన తక్కువ ద్రవీభవన స్థానం గల వైరు ముక్క బల్బు : -విద్యుత్ బల్బును థామస్ ఆల్ఫా ఎడిసిన్ కనుగొన్నాడు. -విద్యుత్ బల్బులో వేడెక్కే భాగం ఫిలమెంట్ -ఫిలమెంట్‌ను సాధారణంగా టంగ్‌స్టన్‌తో తయారు చేస్తారు. -బల్బుల్లో ఆర్గాన్, నియాన్ వంటి జడవాయువులతో నింపుతారు.

రైల్వే బడ్జెట్

కేంద్ర రైల్వే మంత్రి మల్లికార్జున ఖర్గే తన తొలి రైల్వే బడ్జెట్‌ను ఫిబ్రవరి 12, 2014న లోక్ సభలో ప్రవేశపెట్టారు. ఎన్నికల నేపథ్యంలో ప్రయాణికులపై ఎలాంటి అదనపు భారం వేయలేదు. రూ 1,60,775 కోట్ల మేర సరకు రవాణా ఆదాయమే లక్ష్యంగా ఈ దఫా రైల్వే బడ్జెట్ పట్టాలనెక్కింది. కొత్తగా 72 రైళ్లను రైల్వే మంత్రి ప్రతిపాదించారు. ఇందులో 17 ప్రీమియం, 38 ఎక్స్‌వూపెస్, 10 పాసింజర్ రైళ్లతో పాటు నాలుగు మెమో, మూడు డెమో రైళ్లున్నాయి. మన రాష్ట్రానికి తాజా బడ్జెట్‌లో కొంత ప్రాధాన్యం పెరిగిందనే చెప్పొచ్చు. వివిధ అంశాల వారీగా రైల్వే బడ్జెట్‌ను పరిశీలిస్తే.. భద్రతకు సంబంధించిన అంశాలు: కాపలాలేని క్రాసింగ్‌లను పూర్తిగా తొలగించేందుకు చర్యలు. ఇప్పటి దాకా కాపలాలేని 5, 400 క్రాసింగ్‌లను పూర్తిగా తొలగించారు. రైళ్లు ఢీ కొనకుండా దేశీయంగా అభివృద్ధి పరచిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించేందుకు రైల్వే మంత్రి ప్రతిపాదించారు. ఇటీవలే పలు రైళ్లలో అగ్ని ప్రమాదాలు భారీ ఎత్తున జరిగిన నేపథ్యంలో ఆ తరహా ప్రమాదాల నివారణకు ప్రతిపాదనలు చేశారు. ప్రస్తుతం ఈ ప్రయోగాన్ని రాజధాని ఎక్‌వూపెస్‌లో చేపట్టనున్నారు. ఇది విజయవంతమైతే అన్ని రైళ్లకు క్రమంగా విస్తరిస్తారు. సదుపాయాల కల్పన: కర్ణాటక, జార్ఖంఢ్, మహారాష్ట్ర, ఆంధ్రవూపదేశ్ తదితర రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాల సాయంతో వ్యయ వాటా విధానంతో మౌలిక సదుపాయాలను పెంచనున్నారు. రైల్వే రంగంలో విదేశీ ప్రత్యేక్ష పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రతిపాదనలు చేశారు. రైల్వే టారిఫ్ అథారిటీని ఏర్పాటు చేయనున్నట్లు రైల్వే మంత్రి ప్రకటించారు. ప్రయాణ, రవాణా చార్జీలను సహేతుకంగా నిర్ణయించడంలో స్వతంత్ర ప్రతిపత్తి ఈ సంస్థకు ఉంటుంది. పర్యావరణ పెంపునకు దోహదపడే పలు చర్యలను కూడా తాజా బడ్జెట్‌లో రైల్వే మంత్రి ప్రతిపాదించారు. రైల్వే ఎనర్జీ మేనేజ్‌మెంట్ అమలుల్లోకి రానుంది. పవన, సౌరశక్తిలను వినియోగించే ప్రాజెక్టులను చేపట్టనున్నారు. సంబంధిత మంత్రిత్వ శాఖతో చర్చించి 40% మేర రాయితీని ఇందులో ప్రతిపాదించనున్నారు. బయో టాయిపూట్ల వినియోగాన్ని 2, 500 రైళ్లకు విస్తరించారు. నిధుల సమీకరణకు రుణాలు:రూ. 13, 800 కోట్ల మేర రుణాలను మార్కెట్ల నుంచి రైల్వే శాఖ ఈ ఆర్థిక సంవత్సరంలో తీసుకోనుంది. రైలు వ్యాగన్లు, కంటెయినర్ల తయారీకి గానూ వీటిని వినియోగించనున్నారు. ఇందుకుగానూ రూ 12, 800 కోట్లను కేటాయించారు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం కింద మరో రూ 6, 005 కోట్లను సమీకరించాలని నిర్ణయించారు. ఇది సాకారం అయితే, 2014-15 ఆర్థిక సంవత్సరంలో రైల్వేలు రూ. 19, 805 కోట్ల మేర నిధులను సమీకరించుకుంటుంది. బడ్జెట్‌లో ఆంధ్రవూపదేశ్ భారీగా కాకున్నా, ఈ దఫా రైల్వే బడ్జెట్‌లో ఆంధ్రవూపదేశ్‌కు కొంత మేర ప్రయోజనం దక్కింది. దేశ వ్యాప్తంగా ప్రతిపాదితమైన 55 ఎక్స్‌వూపెస్ రైళ్లలో, 15 దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉండనున్నాయి. ఇవి రాష్ట్ర రాజధాని హైదరాబాద్ గుండా ప్రయాణించనున్నాయి. తాజా బడ్జెట్‌లో రెండు డబుల్ డెక్కర్ ఎక్సవూపెస్ రైళ్లను ప్రతిపాదించారు. ఇవి రెండు ఆంధ్రవూపదేశ్ రాష్ట్రానికే దక్కాయి. రాష్ట్ర రాజధానిలోని కాచిగూడ నుంచి తిరుపతికి, ఒక డబుల్ డెక్కర్ పరుగులు తీయనుంది. హైదరాబాద్ గుల్బర్గాల మధ్య ఇంటర్ సిటీ ఎక్సవూపెస్ రానుంది. చార్జీల మోత పెంచనప్పటికీ, రైల్వే టారీఫ్ అథారిటీ ఏర్పాటు, పరోక్షంగా చార్జీల పెంపునకు ఉద్దేశించిందేని భావించవచ్చు. మరో మూడు నెలల్లో సాధారణ ఎన్నికలు రానున్న నేపథ్యంలో తాజా బడ్జెట్‌లో చార్జీల పెంపు వంటి నిర్ణయాన్ని తీసుకోలేదని చెప్పొచ్చు. నిజానికి ఈ టారీఫ్ ఏర్పాటు, 2012లో ప్రతిపాదించిన రైల్వే బడ్జెట్‌లోనే 2012 లోనే నాటి రైల్వే శాఖ మంత్రి దినేశ్ ద్వివేదీ ప్రతిపాదించారు. మరో వైపు రైల్వే మంత్రులుగా ఉన్నవారు, సొంత రాష్ర్టం, లేదా సొంత నియోజకవర్గానికి అధిక లబ్ధి పొందేలా నిర్ణయాలు తీసుకోవడం పరిపాటిగా మారింది. ప్రస్తుత రైల్వే మంత్రి అదే తీరును ప్రదర్శించారు. ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న గుల్బర్గా నియోజక వర్గానికి మంచి ప్రాధాన్యం ఇచ్చారు. కొత్తగా వచ్చిన రైళ్లలో సుమారుగా 15, ఈ నియోజకవర్గం గుండా పరుగులు తీయనున్నాయి. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో కొత్తగా రానున్న ఎనిమిది ఎక్సవూపెస్ రైళ్లలో అయిదు ఉత్తర కర్ణాటకలో ఉన్న గుల్బర్గా మీదుగా ప్రయాణించేవే. ఉత్తర కర్ణాటకకు అత్యంత సమీపంలో ఉన్న రెండు లైన్ల డంబ్లింగ్ సర్వేకు కూడా రైల్వేమంత్రి పచ్చజెండా ఊపారు. రైల్వే బడ్జెట్ చరిత్ర: భారత సాధారణ బడ్జెట్ నుంచి, రైల్వే బడ్జెట్‌ను 1924లో వేరు చేశారు. పది మంది సభ్యులతో కూడిన విలియం ఆక్‌వర్త్ నేతృత్వంలోని కమిటీ సూచన మేరకు, రైల్వేకు ప్రత్యేక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. స్వాతంత్య్రం వచ్చాక, తొలి రైల్వే శాఖ మంత్రిగా జాన్ మత్తాయ్ బాధ్యతలు స్వీకరించారు. తొలిసారిగా రైల్వే బడ్జెట్ ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం 24 మార్చి, 1994లో చేశారు. యూపీఏ-1 ప్రభుత్వ హయాంలో వరుసగా ఆరు సార్లు నాటి రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ప్రవేశపెట్టారు. యూపీఏ-2 హయాంలో ఆరుగురు రైల్వే శాఖ బాధ్యతలు నిర్వహించారు. తొలుత ఆ పదవిలో నియామకం అయిన తృణమూల్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ, పశ్చిమబెంగాల్ ముఖ్య మంత్రిగా బాధ్యతలు స్వీకరించింది. దీంతో అదే పార్టీకి చెందిన దినేశ్ త్రివేదీ రైల్వే మంత్రి అయ్యారు. అయితే ఆయన 2012 బడ్జెట్‌లో రైల్వే చార్జీలు పెంచడంతో మమత ఒత్తిడి మేరకు ఆయన పదవీత్యాగం చేయాల్సి వచ్చింది. అదే పార్టీకి చెందిన ముకుల్ రాయ్ బాధ్యతలు స్వీకరించారు. అయితే యూపీఏ కూటమి నుంచి తృణమూల్ వైదొలగడంతో తాత్కాలికంగా సీజీ జోషీ అదనంగా రైల్వే శాఖ బాధ్యతలను స్వీకరించారు. అనంతరం పూర్తి స్థాయి మంత్రిగా పవన్ కుమార్ బన్సల్‌ను నియమించారు. అయితే అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆయన కూడా వైదొలిగారు. దీంతో మల్లికార్జున ఖర్గే ఆ బాధ్యతలను చేపట్టారు. ఇతర ముఖ్యాంశాలు: ఆదాయ అంచనాలు - ప్రయాణికుల ద్వారా రూ 45, 255 కోట్లు -సరకు రవాణా చార్జీల ద్వారా రూ 1,05,770 కోట్లు - ఇతరేతర మార్గాల ద్వారా రూ 9, 700 కోట్లు -4,556 కిలోమీటర్ల మేర విద్యుదీకరణ, 2,027 కిలోమీటర్ల మేర కొత్త మార్గాల నిర్మాణం -దేశ వాణిజ్య రాజధాని ముంబై, అలహాబాద్‌ల మధ్య హైస్పీడ్ రైలు ప్రాజెక్టు నిర్మాణం/ ఈ ఏడాది ఏప్రిల్ కల్లా పూర్తి చేసేలా లక్ష్యం. - ప్రస్తుతం దేశంలో రెండే రెండు రాష్ట్రాల్లో రైల్వే సౌకర్యాలు అందుబాటులో లేవు, అవి అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, ఈ రెండు రాష్ట్రాలకు ఈ ఏడాది రైల్వే సౌకర్యాలు అందుబాట్లోకి రానున్నాయి. -19 కొత్త లైన్ల కోసం ఈ ఆర్థిక సంవత్సరంలో సర్వే చేపట్టనున్నారు. ఇందులో భాగంగా అయిదు డంబ్లింగ్ ట్రాక్‌లకు కూడా సర్వే చేస్తారు. -దేశ వాణిజ్య రాజధాని ముంబైలో జులై నుంచి ఏసీ ఈఎంయూ రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. -టికెట్ కన్‌ఫర్మ్ అయిన పక్షంలో ప్రయాణికుల మొబైల్‌కు సంక్షిప్త సందేశం రానుంది. ప్రస్తుతం ఉన్న వాటికి అదనంగా మరికొన్ని ఆహార కేంద్రాలు, ఎస్కలేటర్లను ఏర్పాటు చేయనున్నారు. -వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ 1.6 లక్షల కోట్ల ఆదాయాన్ని ఆర్జించే లక్ష్యం -ప్రత్యేక పార్శిల్ రైళ్లలో పాల రవాణ చేపట్టాలని నిర్ణయం -ప్యాంట్రీలలో ఎల్పీజీ సిలిండర్ల స్థానంలో ఎలక్ట్రిక్ వంట పరికరాలు -రాష్ట్ర 13వ అసెంబ్లీ సమావేశాలు ముగిసాయి. ద్రవ్యవినిమయ బిల్లు- 2014ను ఉభయ సభలు ఆమోదించడంతో శాసన సభ నిరవధికంగా వాయిదా పడింది. -గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీతో అమెరికా రాయబారి నాన్సీ పావెల్ సమావేశమయ్యారు. 2002లో జరిగిన గోద్రా అల్లర్ల తరువాత నరేంద్ర మోడీకి వీసా ఇవ్వడానికి అమెరికా నిరాకరిస్తూ వస్తోంది. గత 13 ఏళ్లలో ఓ విదేశీ రాయబారి స్థాయి అధికారి గాంధీనగర్ రావడం ఇదే ప్రథమం. -సౌర కుటుంబంలో సూర్యుడి చుట్టూ తిరుగుతున్న ఒక తోకచుక్కను యూరోపియన్ ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనికి 'టోటాస్' అని పేరు పెట్టారు. -సైనిక యుద్ధట్యాంకులకు 'నైట్ విజన్' పరికరాలను సమకూర్చడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించి. రూ. 1,800 కోట్లతో ఈ పరికరాల కొనుగోలు ఒప్పందానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫిబ్రవరి 14 -ఆమ్ ఆద్మీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయన కాంగ్రెస్ పార్టీ మద్దతుతో డిసెంబర్ 28న ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. -ఇండోనేసియాలోని జావా దీవిలోని 'మౌంట్ కెలూద్' అగ్నిపర్వతం గురువారం రాత్రి బద్దలైంది. దీంతో బూడిద, శకలాలు 18 కిలోమీటర్ల దూరం వరకు వెదజిల్లాయి. -బ్లడ్ కేన్సర్ (ల్యుకేమియా) వ్యాపించడానికి కారణమవుతున్న 'బీఆర్‌జీ1' అనే జన్యువును కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్ మాంట్రియెల్ శాస్త్రవేత్తలు గుర్తించారు.

బిల్లులు, సభలు- రాజ్యాంగ పద్ధతులు


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును లోక్‌సభలో కేంద్రం ప్రవేశపెట్టింది. ఈ బిల్లును ఏ సభలో ప్రవేశపెట్టాలన్న అంశంపై అంతకు ముందే పెద్ద ఎత్తున చర్చ జరిగింది. విభిన్న రకాల అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఒక బిల్లు చట్టంగా మారాలంటే, లోక్‌సభలో మూడు దశలు, రాజ్యసభలో మూడు దశలు దాటాల్సి ఉంటుంది. తాజాగా పునర్వ్యవస్థీకరణ బిల్లును తొలుత రాజ్యసభలో ప్రవేశపెట్టాలని భావించారు. అయితే ఇది ద్రవ్యబిల్లు అన్న అంశం తెరపైకి రావడంతో లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఎందుకంటే ద్రవ్యబిల్లు, లేదా ఆర్థిక బిల్లులను కేవలం లోక్‌సభలోనే ప్రవేశపెట్టాలని రాజ్యాంగం నిర్దేశించింది. ద్రవ్య లేదా మనీ బిల్లుకు సంబంధించిన నిర్వచనం అధికరణం 110లో పేర్కొన్నారు. ఒక బిల్లు, ద్రవ్య బిల్లా కాదా అన్న అంశాన్ని నిర్ణయించే అధికారం, లోకసభ స్పీకర్‌దే. ఈ బిల్లును ప్రవేశపెట్టడానికి రాష్ట్రపతి పూర్వానుమతి అవసరం. అయితే ద్రవ్య బిల్లులకు సంబంధించి రాష్ర్టపతికి పాకెట్ వీటో అధికారం లేదు (అధికరణం 111) ద్రవ్యబిల్లు, ఆర్థిక బిల్లుకు కూడా తేడా ఉంది. ద్రవ్య బిల్లులో ముఖ్యంగా ఆరు అంశాలు ఉంటాయి. పన్ను విధింపు లేక చెల్లింపునకు సంబంధించింది ప్రభుత్వం తీసుకునే రుణాలు సంఘటిత నిధికి సంబంధించి ప్రభుత్వ గణాంకాలకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ గణాంకాల తనిఖీకి సంబంధించిన అంశాలు ద్రవ్యబిల్లులో ఉంటాయి. ఈ పరిధిలోకి రాని, ఇతర ఆర్థిక అంశాలను కలిగి ఉన్న బిల్లులను ఆర్థిక బిల్లులు అంటారు. ఆర్థిక బిల్లులకు సంబంధించి స్పీకర్ నిర్ణయం ఉండదు. అలాగే ద్రవ్య, ఆర్థిక బిల్లుల మధ్య కొన్ని సారూప్యాలు కూడా ఉంటాయి. ఈ రెండింటిని మొదట రాజ్యసభలో ప్రవేశపెట్టడానికి వీలులేదు. రెండింటిని లోక్‌సభలో ప్రవేశపెట్టడానికి రాష్ట్రపతి పూర్వానుమతి తప్పనిసరి. ఆర్థిక బిల్లుల ఆమోదం సాధారణ బిల్లుల ఆమోదం తరహాలోనే ఉంటుంది. సాధారణ బిల్లులను ఏ సభలో అయిన ప్రవేశపెట్టొచ్చు. అధికరణం 123 ప్రకారం, రాష్ట్రపతి జారీ చేసిన ఆర్డినెన్స్‌లు కూడా పార్లమెంట్ అనుమతి పొందాల్సి ఉంటుంది. లేదా అవి రద్దు అవుతాయి. ఇటీవలి కాలంలో, ఆహార భద్రత చట్టం, నిర్భయ చట్టం కూడా మొదట ఆర్డినెన్స్‌ల రూపంలో వచ్చి, తర్వాత చట్టసభల్లోకి ప్రవేశించి చట్టాలుగా మారాయి. లోక్‌సభలో కేంద్రం ప్రవేశపెట్టిన రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లులోని ప్రధాన అంశాలు ప్రస్తుత రాజధాని హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఉమ్మడిగా ఒకే గవర్నర్ ఉంటారు. ఉమ్మడి రాజధానిగా, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి మొత్తం ఉంటుంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి కొత్త రాజధాని ఏర్పాటుకు నిపుణుల కమిటీని కేంద్రం ఏర్పాటు చేస్తుంది. 45 రోజుల్లో ఇది తన సిఫారసులను ఇస్తుంది. నీటి పంపకాలకు సంబంధించి కేంద్రం ఒక అత్యున్నత మండలిని ఏర్పాటు చేస్తుంది. కష్ణా, గోదావరి జలాల పంపకాలను ఇది పర్యవేక్షిస్తుంది తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలు, అవశేష ఆంధ్రప్రదేశ్‌లో 25 లోక్‌సభ స్థానాలు ఉంటాయి. అలాగే తెలంగాణలో 119 శాసనసభ స్థానాలు, అవశేష ఆంధ్రప్రదేశ్‌లో 175 శాసనసభ స్థానాలు ఉంటాయి. పోలవరం ప్రాజెక్ట్‌కు జాతీయ ప్రాజెక్ట్ హోదానిస్తారు. కొత్త రాష్ట్రంలో హైకోర్ట్ ఏర్పాటు చేసే వరకు ప్రస్తుతం రాష్ట్రంలోని సర్వోన్నత న్యాయస్థానమే, ఇరు రాష్ర్ర్టాలకు ఉమ్మడిగా కొనసాగుతుంది. సాధారణ బిల్లు- ఆమోదం పొందే తీరు సాధారణ బిల్లును లోక్‌సభ లేదా రాజ్యసభలో ప్రవేశపెట్టవచ్చు. ఆయా సభలో ఆమోదించిన వెంటనే రెండో సభకు పంపిస్తారు. రెండో సభ ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. లేదా సవరణ చేసి తిరిగి మొదటి సభకు పంపించవచ్చు. లేదా ఆరు నెలల పాటు పెండింగ్‌లో ఉంచవచ్చు. బిల్లు స్వభావాన్ని బట్టి ఆ అంశం ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుందో ఆ మంత్రి ఆ బిల్లును ప్రవేశ పెట్టడం రివాజు. ఉభయసభల సమావేశం : ఉభయ సభల సమావేశానికి సంబంధించి అధికరణం 108లో పేర్కొన్నారు. ఉభయ సభల సమావేశ పరిచే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. అయితే దీనికి లోక్‌సభ స్పీకర్ అధ్యక్షత వహిస్తారు. ఏ అంశంపైనయినా సందిగ్ధత నెలకొంటే ఉభయ సభలు సమావేశమవుతాయి. ఈ తరహా సమావేశం తొలిసారిగా 1961లో వరకట్న నిషేధ బిల్లుకు సంబంధించిన అంశంపై నిర్వహించారు. 1978లో బ్యాంకింగ్ సర్వీస్ కమిషన్‌కు సంబంధించి నిర్వహించిన ఉభయ సభల సమావేశం రెండోది. (పోటా) ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ యాక్ట్ బిల్లుకు సంబంధించి 2002లో మూడోసారి ఉభయ సభల సమావేశం జరిగింది. రాజ్యాంగ సవరణ బిల్లును రెండు సభలు విడివిడిగా ఆమోదించాలి. ఈ అంశంలో ఉమ్మడి సమావేశానికి ఆస్కారం లేదు. ఏదైనా బిల్లుకు సంబంధించి లోతైన అధ్యయనం అవసరం అని భావిస్తే స్టాండింగ్ కమిటీలకు ఆయా సభలు సిఫారసు చేస్తాయి. బిల్లు ఉభయ సభల్లో ఆమోదం పొందాక రాష్ట్రపతి వద్దకు వెళ్తుంది. ద్రవ్య బిల్లును మాత్రం విధిగా రాష్ట్రపతి ఆమోదించవలసి ఉంటుంది. మిగతా బిల్లులను మాత్రం ఆమోదించవచ్చు లేదా తన దగ్గరే ఉంచుకోవచ్చు. రాష్ట్రపతి సంతకం చేసిన రోజే ఆయా బిల్లులు చట్టంగా మారుతాయి. రాజ్యాంగ సవరణ బిల్లుకు సంబంధించి కూడా రాష్ట్రపతి విధిగా ఆమోదించాల్సి ఉంటుంది.


Followers