ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు అఖిల భారత సర్వీస్ అధికారుల తాత్కాలిక
కేటాయింపు ఉత్తర్వులను కేంద్రం ప్రభుత్వ శుక్రవారం రాత్రి విడుదల చేసింది. ఈ
జాబితాకు ప్రధాన మంత్రి మోడీ ఇప్పటికే ఆమోదముద్ర వేసిన విషయం తెలిసిందే. ఈ
మేరకు తాత్కాలిక జాబితాలను విడుదల చేసిన సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ
(డీవోపీటీ) వెంటనే ఆయా రాష్ట్రాల సీఎస్లు సీఎంలను సంప్రదించి పోస్టింగ్లు
ఇవ్వాలని, ఆ వెంటనే అధికారులు ఆయా పోస్టుల్లో చేరాల్సి ఉంటుందని తాజా
ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
ఈ జాబితాలో తెలంగాణ రాష్ర్టానికి 128 మంది ఐఏఎస్ అధికారులు, 92 మంది
ఐపీఎస్ అధికారులు, 51 మంది ఐఎఫ్ఎస్ అధికారులను కేటాయించారు. మరో నలుగురు
ఐఏఎస్లను తాత్కాలికంగా కేటాయించినా ఇంకా అడ్వయిజరీ కమిటీ తుది నిర్ణయం
తీసుకోవాల్సి ఉంది. తెలంగాణకు ఆరుగురు డీజీపీ స్థాయి, 13 మంది అదనపు డీజీపీ
స్థాయి అధికారులు వచ్చారు.
ఆంధ్రప్రదేశ్కు 166 మంది ఐఏఎస్ అధికారులు, 119 మంది ఐపీఎస్ అధికారులు, 76
మంది ఐఎఫ్ఎస్ అధికారులను కేటాయించారు. ఈ జాబితాపై అభ్యంతరాలను పక్షం
రోజుల్లోగా ప్రత్యూష్సిన్హా కమిటీ దృష్టికి తీసుకెళ్లాల్సి ఉంటుంది.
వీటిని పరిశీలించి 45
రోజుల్లోగా కమిటీ పరిష్కరిస్తుంది. పరస్పర మార్పిడి(స్వాపింగ్),
భార్యాభర్తలు, రెండేళ్లలో పదవీ విరమణ చేసే వారు సమర్పించే అభ్యంతరాలను కూడా
పరిశీలిస్తుంది. కాగా ఐదుగురు ఐఏఎస్ల కు వారు కోరిన చోట పనిచేయడానికి
కేంద్రం అనుమతించింది. వీరి కేటాయింపులను తర్వాత ప్రకటిస్తారు. ప్రస్తుత
జాబితా ప్రకారం జేఎస్వీ ప్రసాద్(ఏపీ), తెలంగాణలో ఉన్న ఎ.శాంతికుమారి,
ఎ.వాణిప్రసాద్, వాకాటి కరుణ, ప్రశాంతికి ఈ మినహాయింపు లభించింది.
పరస్పర అధికారుల మార్పిడికి నిబంధనలు
ఒకే కేడర్, ఒకే గ్రేడ్ పే ఉన్న మరో అధికారితో పరస్పర మార్పిడి
చేసుకోవచ్చు. అలాగే భార్యాభర్తలు కూడా ఇందుకోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
రాష్ట్ర విభజన జరిగిన రోజు నాటికి రెండేళ్ల సర్వీసు మాత్రమే మిగిలి ఉన్న
వారు నచ్చిన రాష్ట్రానికి వెళ్లడానికి దరఖాస్తు చేసుకోవచ్చు. జనవరి 10లోగా
ప్రత్యూష్సిన్హా కమిటీకి దరఖాస్తు చేసుకోవాలి. భార్యాభర్తలను ఒకే
రాష్ట్రానికి కేటాయించేందుకు వీలులేని పక్షంలో తర్వాత ప్రత్యేకంగా
పరిశీలించి నిర్ణయిస్తారు. ఇప్పటికే పదవీ విరమణ పొందిన వారు కూడా కేడర్
కేటాయింపు కోసం దరఖాస్తు చేయొచ్చు.
ఆంధ్రాకు కే టాయించిన ఐఏఎస్ అధికారులుః
ఆంధ్రప్రదేశ్ కేడర్కు 166 ఐఏఎస్లను కేటాయించారు. ఏపీకి కేటాయించిన
ఐఏఎస్లు ఇంద్రజిత్పాల్, ఆర్పీ వతల్, ఐవీ సుబ్బారావు, ఐవైఆర్ కష్ణారావు,
జె.రమానంద్, సత్యనారాయణ్ మహంతి, చిర్రావూరి విశ్వనాధ్, సత్యప్రకాష్ టక్కర్,
రమేష్ కుమార్ నిమ్మగడ్డ, శ్యాం కుమార్ సిన్హా, లింగరాజ్ పాణిగ్రహి,
టి.విజయకుమార్, ఎల్వీ సుబ్రహ్మణ్యం, బిభూ ప్రసాద్ ఆచార్య, దినేష్కుమార్,
అజేయ కల్లాం, భన్వర్లాల్, టి.రాధ, బూసి శాం బాబ్, ప్రీతీ సుదాన్, అనిల్
చంద్ర పునేఠా, ఎ.ఆర్.సుకుమార్, నీలం సహానీ, సమీర్ శర్మ, ఆర్.సుబ్రహ్మణ్యం,
పి.వెంకట రమేష్బాబు, వీణా ఈష్, మన్మోహన్ సింగ్, జగదీష్ చందర్ శర్మ,
డి.సాంబశివరావు, అభయ్ త్రిపాఠి, సతీష్ చంద్ర, నీరబ్ కుమార్ ప్రసాద్,
డి.శ్రీనివాసులు, ఆదిత్య నాధ్ దాస్, అరమనే గిరిధర్, పూనం మాలకొండయ్య, విజయ్
కుమార్, షాలినీ మిశ్రా, సోమేష్ కుమార్, ఎ.శాంతికుమారి, ఆర్.కరికాల వలవెన్,
శశాంక్ గోయల్, కె.ఎస్.జవహర్ రెడ్డి, జి.అనంతరాము, ప్రవీణ్ కుమార్
కొలవెంటి, రజత్ కుమార్, సుమిత్రా దావ్రా, జి.సాయిప్రసాద్, రాం ప్రకాష్
సిసోడియా, జి.అశోక్ కుమార్, ఎల్.ప్రేం చంద్రారెడ్డి, కె.మదుసూదనరావు, జయేష్
రంజన్, కె.విజయానంద్, వికాస్రాజ్, బుడితి రాజశేఖర్, షంషేర్ సింగ్ రావత్,
ఎం.టి. కష్ణబాబు, గోపాలకష్ణ ద్వివేది, బి.కిషోర్, ఎం.వి.సత్యనారాయణ, వైవీ
అనూరాధ, బి.ఉదయలక్ష్మి, కె.దమయంతి, డి.కాడ్మియేల్, జి.జయలక్ష్మి,
వి.ఉషారాణి, ఐ.శ్రీనివాస్ శ్రీ నరేష్, కె.రాం గోపాల్, ఎ.వాణీ ప్రసాద్,
బి.రామాంజనేయులు, ముద్దాడ ర విచంద్ర, లవ్ అగర్వాల్, శశి భూషణ్ కుమార్,
కె.సునీత, జి.వాణీ మోహన్, పీయూష్ కుమార్, జంజం శ్యామలరావు, డి.వరప్రసాద్,
రామ శంకర్ నాయక్, శ్రీకాంత్ నాగులాపల్లి, ముఖేష్ కుమార్ మీనా, బి.శ్రీధర్,
వి.శేషాద్రి, కాంతిలాల్ దండే, ఎన్.గుల్జార్, ఎస్.సురేష్ కుమార్, సాల్మన్
ఆరోఖ్యరాజ్, జీఎస్ఆర్కేఆర్ విజయ కుమార్, కె .ఎస్.శ్రీనివాసరాజు,
కె.ఆర్బీహెచ్ఎన్ చక్రవర్తి, ఎం. గిరిజా శంకర్, సౌరభ్ గౌర్, జి.రవిబాబు,
కోన శశధర్, ఎ.బాబు, యోగితా రాణా, విజయమోహన్, ఎన్.కష్ణ, కె.వి.రమణ, పి.వెంకట
రామిరెడ్డి, పి.లక్ష్మీ నరసింహం కాటంనేని భాస్కర్, పీఎస్ ప్రద్యుమ్న,
ఎం.జగన్నాథం, ఐ.సామ్యూల్ ఆనంద్ కుమార్, వి.కరుణ, కె.వి.సత్యనారాయణ్,
హెచ్.అరుణ్ కుమార్, ఎం.పద్మ, పి.ఉషా కుమారి, పి.ఎ.శోభ, ఎన్.యువరాజ్,
ముదావత్ ఎం.నాయక్, ఎం.జానకి, కె.హర్షవర్ధన్, పి.భాస్కర, ప్రవీణ్ కుమార్,
డి.రోనాల్డ్ రోజ్, సుజాతా శర్మ, ఎం.హరిజవహర్లాల్, టి.బాబూరావునాయుడు,
ఎం.రామారావు, కె.శారదాదేవి, కె.ధనుంజయరె డ్డి, ముత్యాల రాజు రేవు,
జె.మురళి, సీహెచ్ శ్రీధర్, ఎంవీ శేషగిరి బాబు, డి.మురళీధర్ రెడ్డి,
బి.లక్ష్మీకాంతం, కె.కన్నబాబు, ఎస్.సత్యనారాయణ, పి.బసంత్ కుమార్, వినయ్
చంద్ వాడరేవు, వివేక్ యాదవ్, కార్తికేయ మిశ్రా, జి.వీరపాండ్యన్, బాలాజీ
దిగంబర్ మంజులే, నారాయణ భరత్గుప్తా, ఆమ్రపాలి కాటా, జె.నివాస్, గంధం
చంద్రుడు, శ్వేతా మహంతి, కె.వి.ఎన్ చక్రధరబాబు, హరినారాయణన్ ఎం, శ్వేతా
టియోటియా, లత్కర్ శ్రీ కేష్ బాలాజీరావు, మల్లికార్జున.ఎ, గగన్ దీప్ సింగ్,
విజయరామరాజు.వి, ప్రసన్న వెంకటేష్.వి, నాగలక్ష్మి.ఎస్, విజయ.కె,
పట్టాన్శెట్టి రవిసుభాష్, హిమాంశు శుక్లా, సగిలి షాన్మోహన్, లక్ష్మీ
షా.జి, బి.రామారావు, ఎ.సూర్యకుమారి. జి.రేఖారాణి, డాక్టర్ సి.శ్రీధర్,
ఎ.ఎండి ఇంతియాజ్, పి.కోటేశ్వరరావు, ఎం.ప్రశాంతి ఉన్నారు.
ఆంధ్ర ప్రదేశ్కు కేటాయించిన ఐపీఎస్ అధికారులు:
కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 119 మంది ఐపీఎస్ అధికారులను
కేటాయించింది. ఏపీకి కేటాయించిన ఐపీఎస్ అధికారుల జాబితా వివరాలు ఇలా
ఉన్నాయి. అశోక్ ప్రసాద్, బి. ప్రసాద రావు, ఎస్.ఎ.హుడా, వివేక్ దూబే, జాస్తి
వెంకట రాముడు, ఎస్. వెంకటరమణమూర్తి, డా.బి.భూబతిబాబు, ఎన్. సాంబశివరావు,
టి. కష్ణ రాజు, ఎం.మాలకొండయ్య, ఐష్ కుమార్, వి.ఎస్.కె. కౌముది, ఆర్.పి,
ఠాకూర్, రాయ్ వినయ రంజన్, డి. గౌతమ్ సేవాంఘ్, టి.ఎ.తిరుపతి, సంతోష్ మెహ్రా,
ఎన్.వి.సురేంద్ర బాబు, ఎ.బి. వెంకటేశ్వరరావు, కె.ఆర్.ఎం. కిషోర్
కుమార్,సిహెచ్. డి. తిరుమల రావు, అంజని కుమార్, అంజనా సిన్హా, మాదిరెడ్డి
ప్రతాప్, మహ్మద్ అహ్సన్ రెజా, హరీష్ కుమార్ గుప్తా, పి.ఎస్.ఆర్ అంజనేయులు,
కె.వి. రాజేంద్రనాథ్ రెడ్డి, ఎన్ ప్రభాత్, మహేష్ దీక్షిత్, అమిత గార్గ్,
పి.వి. సునీల్ కుమార్, వి. వేణుగోపాల కష్ణ, కుమార్ విశ్వజిత్, డా. ఎ. రవి
శంకర్, ఎన్.బాలసుబ్రహ్మణ్యం, కె. త్రిపాఠి ఊజలా, ఎంఎస్ అభిలాష బిష్త్,
అతుల్ సింగ్, రాజీవ్ కుమార్ మీనా, మహేష్ మురళీధర్ భగవత్, డా. ఎస్. బి.
బాగ్చీ, ఎన్.సంజయ్, భావన సక్సెనా, జి. సూర్య ప్రకాశ రావు, ఎన్. మధుసూధన్
రెడ్డి, విజయ్ కుమార్, మహేష్ చంద్ర లడ్డా, బి. శ్రీనివాసులు, పి. ఉమాపతి,
ఈ. దామోదర్, బి. బాలకష్ణ,అబ్రహం లింకన్, ఎ. సుందర్ కుమార్ దాస్, టి.
యోగానంద్, కె. వెంకటేశ్వరరావు, ఎం. శివప్రసాద్, ఎ. రవి చంద్ర, డి. ఆరమ
కష్ణయ్య, షేక్ మహ్మద్ ఇక్బాల్, డా. ఎం. కాంతారావు, మనీష్ కుమార్ సిన్హా,
పీ.వీ.ఎస్. రామకష్ణ, కె.వి.వి.గోపాలరావు, బి.వి రమణ కుమార్, పి. హరి
కుమార్, సి.ఎస్.ఆర్.కె.ఎల్,ఎన్. రాజు, డా. ఎం. నాగన్న, వినీత్ బ్రిజ్ లాల్,
చిరువోలు శ్రీకాంత్, రాజేష్ కుమార్, ఎ.ఎస్. ఖాన్, జె. సుబ్రహ్మణ్యం, జె.
ప్రభాకరరావు, జి. శ్రీనివాస్, డి. నాగేంద్ర కుమార్, నవీన్ గులాటి, కె రాణా
టాటా, శ్యాంసుందర్ ఎస్. సి.ఎం.త్రివిక్రమ వర్మ, కొల్లి రఘురామ్ రెడ్డి, ఆకే
రవి కష్ణ, సర్వశ్రేష్ట త్రిపాఠి, ఆర్. జయలక్ష్మి, బురుగు రాజా కుమారి,
గజారావు భూపాల్, గోపినాథ్ జెట్టి, ఎస్. సెంథిల్ కుమార్,ఎంఎస్ షేముషి,
గ్రేవాల్ నవదీప్ సింఘ్ కె.ఎస్, కొయా ప్రవీణ్, భాస్కర్ భూషణ్, విజయరావు
సిహెచ్, రాహుల్ దేవ్ శర్మ, విశాల్ గున్ని,భూసరపు సత్య ఏసుబాబు, అభిషేక్
మహంతి, వెంకటఅప్పలనాయుడు చింతం,అంబురాజన్ కె.కె.ఎన్, బాబుజీ
అత్తడా,ఫక్కీరప్ప కాగినెల్లి, వరుణ్ బి.ఆర్, కె. శశి కుమార్, సిద్ధార్ధ్
కౌషల్, ఎ. నయుమ్ ఆష్మి, ఐశ్వర్య ఆర్, టి. రవి కుమార్ మూర్తి, కె.
కోటేశ్వరరావు, ఎల్.కె.వి. రంగారావు, పి.వెంకటరామి రెడ్డి, పి. పాలరాజు,
జి.వి,జి.అశోక్ కుమార్, ఎస్. హరి కష్ణ, ఎం. రవి ప్రకాష్, ఎస్.వి. రాజశేఖర్
బాబు, కె.వి. మోహన్ రావు, పిహెచ్డి రామకష్ణ, డా. సిహెచ్. శ్యాం ప్రసాద
రావులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించిన ఐఏఎస్ అధికారులు.
తెలంగాణకు కేటాయించిన ఐపీఎస్ అధికారులు:
టీపీ దాస్, అరుణా బహుగుణ, నవనీత్ రంజన్ వాసన్, కె.దుర్గాప్రసాద్, అబ్దుల్
ఖయ్యూమ్ఖాన్, అనురాగ్శర్మ, తేజ్దీప్కౌర్ మీనన్, సుదీప్ లక్తాకియ,
రాజీవ్ త్రివేది, మహేందర్రెడ్డి, ప్రభాకర్ అలోక్, టి.క్రిష్ణప్రసాద్,
వి.కె.సింగ్, సత్యనారాయణ, డాక్టర్ బి.ఎల్.మీనా, ఎం.గోపికృష్ణ,
ఏ.ఆర్.అనురాధ, జె.పూర్ణచందర్రావు, ఉమేష్ షరాఫ్, గోవింద్సింగ్, రవిగుప్తా,
రాజీవ్ రతన్, సీవీ ఆనంద్, జితేందర్, సందీప్ శాండిల్య, వినాయక్ ప్రభాకర్
ఆప్టే, కె.శ్రీనివాస్రెడ్డి, బి.శివధర్రెడ్డి, డాక్టర్ సౌమ్యా మిశ్రా,
శిఖా గోయల్, డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, వీవీ శ్రీనివాసరావు,
స్వాతిలక్రా, అనిల్కుమార్, చారూ సిన్హా, వీసీ సజ్జనార్, రీతూ మిశ్రా, వి.
నవీన్చంద్, యారం నాగిరెడ్డి, దేవేంద్ర సింగ్ చౌహాన్, సంజయ్కుమార్ జైన్,
ఎన్.సూర్యనారాయణ, ఎంకే సింగ్, విక్రమ్సింగ్ మాన్, ఆర్బీ నాయక్,
కె.వేణుగోపాలరావు, బి.మల్లారెడ్డి, టి.మురళీకృష్ణ, స్టీఫెన్ రవీంద్ర, టీవీ
శశిధర్రెడ్డి, వై.గంగాధర్, పి.మునిస్వామి, అకున్ సబర్వాల్,
జి.సుధీర్బాబు, టి.ప్రభాకర్రావు, సి.రవివర్మ, పి.ప్రమోద్కుమార్,
ఎన్.శివశంకర్రెడ్డి, షానవాజ్ ఖాసీం, ఏ.సత్యనారాయణ, డాక్టర్ వి.రవీందర్,
తరుణ్జోషి, అవినాష్ మొహంతి, కార్తీకేయ, విక్రమ్జిత్ దుగ్గల్, తఫ్సీర్
ఎగ్బాల్, బి.నవీన్కుమార్, అంబర్ కిషోర్ ఝా, ఆర్.రామరాజేశ్వరి, ఎన్.ప్రకాష్
రెడ్డి, డి.జోయల్ డేవిస్, సన్ప్రీత్ సింగ్, విజయ్కుమార్ ఎస్ఎం,
ఆర్.భాస్కరన్, జి.చందనా దీప్తి, కల్మేశ్వర్ సింగే నవార్, విశ్వజిత్ కంపాటి,
విష్ణు ఎస్. వారిర్, చేత్న మైలాభూతల, కె.రమేష్ నాయుడు, వి.సత్యనారాయణ,
వి.శివకుమార్, వీబీ కమలాసన్ రెడ్డి, ఎస్.చంద్రశేఖర్రెడ్డి, ఏఆర్
శ్రీనివాస్, పి.విశ్వప్రసాద్, ఎం. రమేష్, ఎస్జే జనార్దన్, ఏవీ రంగనాథ్,
బి.సుమతి, ఎం.శ్రీనివాసులు, ఏ.వెంకటేశ్వర రావు.
తెలంగాణకు కేటాయించిన ఐఏఎస్ అధికారులు:
తెలంగాణకు కేటాయించిన 128 మంది ఐఏఎస్ అధికారులు వీరే... ఆర్. భట్టాచార్య,
చందనా ఒన్, డి.లక్ష్మి, పి.భాస్కర్, అశ్విని కుమార్ పరిదా,
సి.బి.వెంకటరమణ, రాజీవ్శర్మ, కె. ప్రదీప్ చంద్ర, శేఖర్ ప్రసాద్ సింగ్,
ముక్కామల జి. గోపాల్, రణదీప్ సుడాన్, బినయ్ కుమార్, వినోద్కుమార్
అగర్వాల్, రాజీవ్ ఆర్. ఆచార్య, వి.నాగిరెడ్డి, జె.రేమండ్ పీటర్, శైలీంద్ర
కుమార్ జోషి, అజయ్ మిశ్రా, ఎ.విద్యాసాగర్, అజయ్ ప్రకాశ్ సహానీ, పుష్పా
సుబ్రమణ్యం, సుథీర్థ భట్టాచార్య, సురేష్ చందా, హీరాలాల్ సమారియా, చిత్రా
రామచంద్రన్, రాజేశ్వర్ తివారీ, బి.ఆర్.మీనా, బి.అరవింద్ రెడ్డి,
జె.ఎస్.వి.ప్రసాద్, రాజీవ్ రంజన్ మిశ్రా, వసుధా మిశ్రా, ఎర్రా శ్రీలక్ష్మి,
అదర్సిన్హా, ఐ.రాణి కుముదిని, రజిత్ భార్గవ, సునీల్ శర్మ,
కె.రామకృష్ణారావు, హర్ప్రీత్ సింగ్, అజయ్ జైన్, అరవింద్ కుమార్, సంజయ్
జాజూ, అనిల్కుమార్ సింఘాల్, బి.వెంకటేశ్వర్ రావు, ఎన్.శివశంకర్,
ఎం.జగదీశ్వర్, సి.పార్థసారథి, వి.ఎన్.విష్ణు, ఆర్.వి.చంద్రవదన్, ప్రవీణ్
ప్రకాశ్, సవ్యసాచి ఘోష్, జి.డి.అరుణ, బి.వెంకటేశం, బెన్హర్ మహేష్ దత్
ఎక్కా, వి.అనిల్కుమార్, నవీన్ మిట్టల్, ఎం.దానకిషోర్, బి.జనార్థన్ రెడ్డి,
ఎల్.శశిధర్, శైలజా రామయ్యర్, అహ్మద్ నదీం, ఎన్.శ్రీధర్,
జి.వెంకటరామిరెడ్డి, ఎ.అశోక్, ఎం.వీరబ్రహ్మయ్య, సందీప్ కుమార్ సుల్తానియా,
అనితా రాజేంద్ర, సయ్యద్ ఒమర్ జలీల్, సయ్యద్ అలీ ముర్తాజా రిజ్వీ,
ఎం.జగన్మోహన్, రాహుల్ బొజ్జా, ఎ.దినకర్ బాబు, స్మితా సభర్వాల్, సిద్ధార్థ
జైన్, నీతూ కుమారి ప్రసాద్, క్రిస్టినా జెడ్. ఛోంగ్తూ, జి.కిషన్,
సి.సుదర్శన్ రెడ్డి, జ్యోతి బుద్దప్రకాశ్, ఎం. రఘునందన్ రావు,
టి.చిరంజీవులు, జి.డి.ప్రియదర్శిని, లోకేష్కుమార్ డిఎస్, టి.విజయ్కుమార్,
టి.సత్యనారాయణ రెడ్డి, ఇ.శ్రీధర్, మహ్మద్ అబ్దుల్ అజీమ్, టి.కె.శ్రీదేవి,
బి.బాల మాయాదేవి, అనితా రామచంద్రన్, కె.నిర్మల, గౌరవ్ ఉప్పల్, ఇలంబర్తి కె,
కె. మానికా రాజ్, ఎల్.శర్మన్, పార్వతి సుబ్రమణ్యన్, ఎ.శరత్, గొర్రెల
సువర్ణ పండాదాస్, ఎం.చంపాలాల్, ఆకునూరి మురళి, పౌసుమి బసు, రజత్కుమార్
షైనీ, బి.భారతి లక్పతి నాయక్, బి.విజియేంద్ర, కె.వై.నాయక్,
పి.వెంకటరామిరెడ్డి, కె.సురేంద్ర మోహన్, ఎం.వి.రెడ్డి, హరికిరణ్ చెవ్వూరు,
సర్ఫరాజ్ అహ్మద్, డి.దివ్య, భారతి హొళ్లికేరి, హరిచందన దాసరి, ప్రీతిమీనా,
పాటిల్ ప్రశాంత్ జీవన్, బి.కృష్ణ భాస్కర్, అలగు వర్శిని వి.ఎస్,
రాజీవ్గాంధీ హన్మంతు, ఆర్.వి.కర్నన్, కె.కె.సుదమ్రావు, కె.శశాంక,
శ్రీజనజీ, శ్రుతి ఓజా, అద్వైత్ కుమార్ సింగ్, శివశంకర్ ఎల్, డి.వెంకటేశ్వర్
రావు, ఎ.శ్రీదేవ సేన, ఎన్.సత్యనారాయణ్, ఎస్.అర్విందర్ సింగ్.
ఐఏఎస్ల్లో భారీ మార్పులు:
కేంద్రం విడుదల చేసిన తాజా జాబితా ప్రకారం పలువురు ఐఏఎస్లు ఇరు రాష్ట్రాల
మధ్య అటూఇటు మారారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు 50 మంది మారుతుండగా..
తెలంగాణ నుంచి ఏపీకి 30 మంది అధికారులు వెళుతున్నారు.
తెలంగాణ నుంచి ఆంధ్రాకు మారుతున్న అధికారులు:
బీపీ ఆచార్య, టీ. రాధా, నీరబ్కుమార్ ప్రసాద్, పూనం మాలకొండయ్య,
విజయ్కుమార్, సోమేష్కుమార్, జయేష్రంజన్, వికాస్రాజ్, బి.కిషోర్,
ఐ.శ్రీనివాస్ శ్రీనరేష్, లవ్ అగర్వాల్, శ్యామలరావు, ముఖేష్కుమార్ మీనా,
బి.శ్రీధర్, ఎం.గిరిజా శంకర్, ఎ.బాబు, పి.వెంకటరామిరెడ్డి, పీఎస్
ప్రద్యుమ్న, శామ్యూల్ ఆనందకుమార్, ఎం.పద్మ, సుజాతాశర్మ, రోనాల్డ్రాస్, హరి
జవహర్లాల్, బి.లక్ష్మీకాంతం, కార్తికేయ మిశ్రా, అమ్రపాలి కాట, జె.
నివాస్, ఎం. హరినారాయణన్, బాలాజీరావు, పి.కోటేశ్వరరావు
ఆంధ్రా నుంచి తెలంగాణకు మారుతున్న ఐఏఎస్ అధికారులు:
ఎస్పీ సింగ్, చందనాఖన్, ఎంజీ గోపాల్, రాజీవ్ ఆర్. ఆచార్య, ఎ. విద్యాసాగర్,
ఎ.పి. సహానీ, రాజేశ్వర్ తివారి, అదర్సిన్హా, అజయ్జైన్, అరవింద్కుమార్,
సంజయ్జాజూ, అనిల్ కుమార్ సింఘాల్, నవీన్ మిట్టల్, దానకిషోర్,
జి.వెంకటరామిరెడ్డి, సందీప్ కుమార్ సుల్తానియా, అనితా రాజేంద్ర, దినకర్
బాబు, సిద్దార్థ్జైన్, నీతూ కుమారి ప్రసాద్, క్రిస్టినా జడ్ చొంగ్తూ,
సుదర్శన్రెడ్డి, జ్యోతి బుద్దప్రకాశ్, ఎం. రఘునందన్రావు, లోకేష్కుమార్,
పి. సత్యనారాయణరెడ్డి, మహ్మద్ అబ్దుల్ అజీమ్, టీకే శ్రీదేవి, బి.
బాలమాయాదేవి, అనితా రామచంద్రన్, కె. నిర్మల, గౌరవ్ ఉత్పల్, పార్వతీ
సుబ్రమణియన్, ఆకునూరి మురళి, రజత్కుమార్ షైనీ, భారత్ లక్పతి నాయక్,
విజయేంద్ర, కేవై నాయక్, పి. వెంకటరామిరెడ్డి, చెవ్వూరి హరికి రణ్, భారతి
హోళ్లికేరి, హరిచందనా దాసరి, అలగు వర్షిణి, ఆర్వీ కర్ననన్, కె. శశాంక, జి.
శ్రీజన, శివశంకర్ లోతేటి, శృతి ఓజా, అద్వైత్ కుమార్ సింగ్, దేవసేన
అల్లంరాజు
నేతాజీ సుభాష్ చంద్రబోస్కు భారతరత్న.. ఎవరు తీసుకుంటారు?
నేతాజీ సుభాష్ చంద్రబోస్కు అత్యున్నత భారతరత్న పురస్కారం ఇవ్వాలని నరేంద్ర
మోడీ సర్కారు నిర్ణయించిందట. అయితే మాలవ్యా, వాజ్పేయిలతో పాటు నేతాజీకి ఆ
మహోన్నత పురస్కారాన్ని అందిస్తే.. నేతాజీ తరపున స్వీకరించే వారు లేక
కేంద్రం వెనక్కు తగ్గినట్టు తెలుస్తోంది.
1945 ఆగస్ట్లో అదృశ్యమైన ఆయన మరణించాడనటానికి సాక్ష్యాలు లేవు. అలాగని
బతికే ఉన్నాడని చెప్పేందుకూ నిదర్శనం లేదు. నేతాజీ ఎక్కడో జీవించే
ఉన్నారని, ఏదో ఒక రోజు తిరిగి వస్తారని నేతాజీ కుటుంబ సభ్యులు ఇప్పటికీ
నమ్ముతున్నారు.
బతికున్న వ్యక్తి పురస్కారాన్ని నేతాజీ తరపున ఎలా స్వీకరిస్తామని వారు
ప్రశ్నించడమే ప్రభుత్వం వెనక్కు తగ్గటానికి కారణమని సమాచారం. కాగా నేతాజీ
బతికే వున్నారని... ఆయన్ని కోర్టు ముందు హాజరు పరుస్తామని ఓ పిటిషనర్
కోర్టుకు తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం భారతరత్న
పురస్కారం నేతాజీ అందజేయడంపై వెనక్కి తగ్గడం గమనార్హం.
కంప్యూటర్ నెట్ వర్కింగ్
నెట్వర్కింగ్ అనగా ఏమిటి:
ముందు మనం నెట్వర్క్ అంటే ఏమిటో తెలుసుకోవాలి . రెండు లేక అంత కన్నా
ఎక్కువ పరికరాలు (కంప్యూటర్లు, ప్రింటర్లు ఇంకా ఇలాంటివి) ఒక మాధ్యమం
ద్వారా అనుసంధానించబడితే దానినే ఒక నెట్వర్క్ అంటాము. ఇప్పుడు ఈ
నెట్వర్క్ ద్వార సమాచారాన్ని ఒక పరికరం నుండి ఇంకో పరికరానికి పంపే
ప్రక్రియను నెట్వర్కింగ్ అంటారు .
ఏమేం కావాలి?:
రెండు పరికరాలను అనుసంధానించాలంటే మనకొక మాధ్యమం కావాలి . మాధ్యమం రెండు
రకాలు . 1 తీగలు ఉపయోగించి అనుసంధానించడం, 2. తీగలు లేకుండా అనుసంధానించడం.
ఈ రెండింటి లో ఏదో ఒక మార్గం అనుసరించి అనుసంధానించవచ్చు. మనం ఒక్కొక్క
మార్గాన్నీ విడివిడిగా చూద్దాం. ఇక్కడ చెప్పే విధానంలో విండోస్ ఆపరేటింగ్
సిస్టమ్ని తీస్కోవడం జరిగింది. ఇదే సమాచారంలో వివరణ లింక్సుకి కూడా
వర్తిస్తుంది. అనుసంధానించబడాలంటే ప్రతి పరికరానికి ఒక ప్రత్యేక గుర్తింపు
నామం, డొమైన్ నామం,నెట్వర్క్ గుర్తింపు ఉండాలి.
ప్రత్యేక గుర్తింపు నామం: ఇది మీ కంప్యూటర్ నామం. ఇది సాధారణంగా
ఇన్స్టాల్ చేసేప్పుడు ఇచ్చి వుంటారు . ఇప్పుడు చూడాలనుకుంటే మౌస్ మీద
రైట్-క్లిక్ ఇచ్చి ఆప్షన్ని
ఎంచుకోండి .
డొమైన్ నామం:
నెట్వర్క్లోని కొన్ని పరికరాలు ఒక సముదాయముగా ఏర్పడితే దానిని ఒక డొమైన్
అంటాము. ప్రతి కంప్యూటరుకు ఒక డొమైన్ నామం ఉంటుంది. ఇది కూడా ఇన్స్టాల్
చేసేప్పుడు ఇచ్చి వుంటారు .ఇప్పుడు చూడాలనుకుంటే మౌస్ మీద రైట్-క్లిక్
ఇచ్చి ఆప్షన్ని ఎంచుకోండి
నెట్వర్క్ గుర్తింపు:
నెట్వర్క్లో మీ కంప్యూటర్ రిజిస్టర్ ఐన వెంటనే నెట్వర్క్
అడ్మినిష్ట్రేటర్ మీకు ఈ సభ్యత్వ గుర్తింపుని ఇస్తారు . డొమైన్ నామం
లాగానే ఈ గుర్తింపు కూడా కంప్యూటర్లకు మాత్రమే వర్తిస్తుంది. ఇది
ఇంటర్నెట్ లేదా ఇతర ప్రైవేటు నెట్వర్క్ లో మాత్రమే. మీరు ఇంట్లోనే
నెట్వర్క్ ఏర్పరుచుకోదలిస్తే ఈ గుర్తింపుని మీరే ఇచ్చుకోవచ్చు.
నెట్వర్క్ నిపుణుల అవసరం:
ఆయా సంస్థల్లో, ప్రభుత్వ, ప్రయివేటు రంగాల్లో ఉపయోగించే కంప్యూటర్లలో ఉండే
సమాచారంపై లక్షలాదిమంది జీవితాలు ముడిపడి ఉంటాయి కాబట్టి ఏ లోపమూ
చోటుచేసుకున్నా దాని ప్రభావం అధికంగా ఉంటుంది. అందుకే ఇలాంటి పరిస్థితి
తలెత్తకుండా చూసుకునేందుకు ప్రస్తుతం నెట్వర్క్ నిపుణులు అవసరం అవుతు
న్నారు. వీరికి ప్రపంచ వ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. కాబట్టి సంబంధిత
కెరీర్వైపు నేటి యువత ఆసక్తి చూపు తోంది. ఇప్పుడే దేశ విదేశాల్లో అత్యధిక
ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న రంగాల్లో కంప్యూటర్ నెట్వర్క ఒకటి. ఇందులో
ప్రవేశించిన వారికి ఆకర్షణీయమైన వేతనాలతో కూడిన ఉద్యోగాలు లభిస్తాయి.
అవకాశాలు:
కంప్యూటర్ అప్లికేషన్లను రూపొందించడం, సొంతంగా నెట్వర్క్ను డిజైన్
చేయడం అవసరాన్నిబట్టి హార్డ్వేర్, సాఫ్ట్వేర్ సిస్టమ్స్ను సృష్టించడం
వంటి పనివిధానం కంప్యూటర్ నెట్వర్కింగ్లో భాగంగా ఉంటుంది. బ్యాంకులు,
మాన్యుఫాక్చరింగ్, మీడియా వంటి సంస్థల్లో భారీ సంఖ్యలో కంప్యూటర్లుంటాయి.
వీటి నెట్వర్క్ సజావుగా ఉండేలా చూసేందుకు నిపుణుల అవసరం తప్పనిసరి.
నెట్వర్క్ నిష్ణాతులకు హెచ్సిఎల్, విప్రో, ఇతర ఔట్సోర్సింగ్
కంపెనీల్లో నేడా అనేక కొలువులు లభిస్తున్నాయి. ఇంటర్నెట్ సర్వీస్
ప్రొవైడర్లు, టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్లలో భారీ సంఖ్యలో ఉద్యోగ
అవకాశాలు ఉంటాయి. నెట్వర్క్ సిస్టమ్ సాఫ్ట్వేర్ డెవలపర్స్,
నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్గా పనిచేయవచ్చు. క్వాలిటీ
అస్యూరెన్స్/టెస్టింగ్ ఆఫ్ నెట్వర్క్ ప్రోటోకాల్స్, రీసెర్చ్ ఇన్
నెట్వర్కింగ్లో సేవలు అందించవచ్చు. దేశంలోని ప్రధాన నగరాలు,
ద్వితీయశ్రేణి నగరాలు పెరుగుతున్న కొద్దీ నెట్వర్క్ నిపుణులకు అవకాశాలు
కూడా అదేస్థాయిలో విస్తరిస్తున్నాయి.
ఎలాంటి స్కిల్స్ అవసరం:
కంప్యూటర్ నెట్వర్క్ నిపుణులకు శాస్ర్తీయ దృక్పథం అవసరం. విశ్లేషణాత్మక
ఆలోచనా ధోరణి ఉండాలి. సాంకేతిక సమస్యలను పరిష్కరించే నేర్పు కలిగి ఉండాలి.
తమ రంగానికి సంబంధించిన కొత్త విషయాలను నేర్చుకోవాలన్న తపనతో ఎప్పటికప్పుడు
వృత్తినైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలి.
dsc 2014 syllabus dsc new syllabus 2014 dsc syllabus 2014 8th class history audiofree download ap dsc 2013 new syllabus ap dsc studymaterial ap dsc syllabus ap dscpsychology material apdsc hindi material d.s.c.syllabus hindi
జార్ఖండ్ సీఎం రఘువర్దాస్
రాష్ర్టానికి తొలిసారి గిరిజనేతర సీఎం
-దాస్ను ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారన్న నడ్డా
-రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణం
-అమిత్షా, మోదీకి కొత్త సీఎం కృతజ్ఞతలు
-ప్రభుత్వ ఏర్పాటు కోసం గవర్నర్ను కలిసిన బీజేపీ కూటమి
-బీజేపీ నిర్ణయంపై గిరిజనుల నిరసన
రాంచీ, డిసెంబర్ 26: రాష్ట్రం ఏర్పడిన 14 ఏండ్ల తర్వాత తొలిసారి
జార్ఖండ్ను ఓ గిరిజనేతర ముఖ్యమంత్రి ఏలబోతున్నారు. తమ శాసనసభాపక్షనేతగా
బీజేపీ ఉపాధ్యక్షుడు, ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రఘువర్దాస్ను ఆ
పార్టీ ఎమ్మెల్యేలు శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. సీఎం రేసులో ఉన్న
మరో అభ్యర్థి సరయురాయ్, సీపీ సింగ్.. దాస్ పేరును ప్రతిపాదించగా మిగతా
ఎమ్మెల్యేలంతా మద్దతు తెలిపినట్లు పార్టీ పరిశీలకుడు జేపీ నడ్డా
వెల్లడించారు. జార్ఖండ్ పదో ముఖ్యమంత్రిగా రఘువర్దాస్ ఆదివారం ప్రమాణం
చేయనున్నారు. ఆయనతోపాటు పది మంది మంత్రులు ప్రమాణం చేస్తారు. తనకు ఈ అవకాశం
ఇచ్చిన బీజేపీ అధ్యక్షుడు అమిత్షా, ప్రధాని నరేంద్రమోదీలకు దాస్ ఈ
సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
అవినీతిరహిత పాలన అందజేస్తానని హామీఇచ్చారు. 82 స్థానాలు కలిగిన
జార్ఖండ్లో బీజేపీ-ఏజేఎస్యూ కూటమి 42
స్థానాలు గెలుచుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయబోతున్నాయి. ఈ మేరకు
శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు దాస్తోపాటు పలువురు ఎమ్మెల్యేలు గవర్నర్
సయ్యద్ అహ్మద్ను కలిశారు. మరోవైపు గిరిజనేతరున్ని బీజేపీ ముఖ్యమంత్రిగా
చేయడంపై పలు గిరిజన సంఘాలు నిరసన వ్యక్తంచేశాయి. ఇది గిరిజనుల వ్యతిరేక
నిర్ణయమంటూ దాస్ ముఖ్యమంత్రిగా ప్రమాణంచేసే రోజు రాష్ట్రబంద్కు జార్ఖండ్
పీపుల్స్ పార్టీ పిలునిచ్చింది.
పోటీ లేకుండానే..
జార్ఖండ్లో తొలిసారి ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన పూర్తి మెజారిటీని
బీజేపీ సాధించినా.. ముఖ్యమంత్రి ఎవరన్నదానిపై మూడురోజులుగా ఉత్కంఠ
నెలకొన్నది. అయితే శుక్రవారం జరిగిన ఎమ్మెల్యేల సమావేశంలో మాత్రం
రఘువర్దాస్ను శాసనసభాపక్షనేతగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం విశేషం.
ముఖ్యమంత్రిగా రఘువర్ పేరును ప్రకటించగానే ఆయన నియోజకవర్గంలో పండుగ
వాతావరణం నెలకొన్నది. తనకు ఈ బాధ్యతలు అప్పగించిన బీజేపీ అగ్రనాయకత్వానికి
కృతజ్ఞతలు తెలిపిన దాస్.. ఓ సాధారణ కార్మికుడు కూడా సీఎం కావటం
బీజేపీతోనేలాంటి పార్టీలోనే సాధ్యమవుతుందని అన్నారు.
గిరిజన సంఘాల నిరసన
గిరిజనేతరుడైన రఘువర్దాస్ను ముఖ్యమంత్రిగా చేయడంపై రాష్ట్రంలోని గిరిజన
సంఘాలు తీవ్రంగా మండిపడ్డాయి. ప్రకటన వెలువడగానే రాష్ట్రవ్యాప్తంగా నిరనస
ప్రదర్శనలు మిన్నంటాయి. బీజేపీ దిష్టిబొమ్మలను తగులబెట్టారు. ఈ నిర్ణయాన్ని
నిరసిస్తూ దాస్ ముఖ్యమంత్రిగా ప్రమాణంచేసే రోజు రాష్ట్రబంద్కు జార్ఖండ్
పీపుల్స్ పార్టీ పిలునిచ్చింది. గిరిజనుల ఆకాంక్షలను నెరవేర్చే ఉద్దేశంతోనే
జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడిందని, అలాంటిది బీజేపీ ఇప్పుడు దాస్ను సీఎంగా
ప్రకటించి గిరిజన సమాజం మనోభావాలను దెబ్బతీసిందని జేపీపీ అధ్యక్షుడు
సూర్యాసింగ్ ఆరోపించారు. ఈ నిర్ణయం ద్వారా గిరిజుపై తమకు విశ్వాసం లేదని
బీజేపీ సందేశమిచ్చినట్లయ్యిందని మాజీ సీఎం నితీశ్ విమర్శించారు.
రాష్ర్టానికి గతంలో సీఎంలుగా చేసిన బాబులాల్ మరాండీ, అర్జున్ముండా,
శిబుసోరెన్, మధుకోడా, హేమంత్సోరెన్ గిరిజనులే కావడం గమనార్హం.
టాటాస్టీల్ ఉద్యోగే ఇప్పుడు సీఎం
జార్ఖండ్ రాష్ట్ర తొలి గిరిజనేతర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోతున్న
రఘువర్దాస్.. ఒకప్పుడు టాటాస్టీల్లో ఉద్యోగం చేశారు. ఆయన సొంత రాష్ట్రం
ఛత్తీస్గఢ్ అయినా.. జార్ఖండ్లో స్థిరపడ్డారు. 1954, డిసెంబర్ 18న
జన్మించిన దాస్.. సైన్స్, న్యాయశాస్ర్తాల్లో పట్టా అందుకొన్నారు. 1974లో
విద్యార్థి ఉద్యమాల్లో చురుగ్గా పాలుపంచుకొన్న దాస్.. తర్వాత టెల్కోలో
కార్మికుల ఆందోళనల్లోనూ తనవంతు పాత్ర పోషించారు. లోక్నాయక్
జయప్రకాశ్నారాయణ్, మాజీ ప్రధాని అటల్బిహారీ వాజపేయి.. ఆయన ఆరాధ్య నేతలు.
1995 నుంచి జంషెడ్పూర్ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా చేస్తున్న
రఘువర్దాస్.. 2009 డిసెంబర్ 30-2010 మే 29 మధ్యకాలంలో జార్ఖండ్
ఉపముఖ్యమంత్రిగా పనిచేశారు. 59 ఏండ్ల దాస్ ప్రస్తుతం బీజేపీ జాతీయ
ఉపాధ్యక్షుడిగానూ ఉన్నారు.
అంతరిక్ష చరిత్ర సృష్టించిన భారత్
ఈ ఏడాది ఇస్రో వరుస ప్రయోగాలతో జైత్రయాత్ర సాగించింది. ప్రథమార్థంలో
స్వదేశీ క్రయోజనిక్ పరిజ్ఞానంతో జీఎస్ఎల్వీ-డీ5 రాకెట్ సాయంతో బరువైన
జీషాట్-14 కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని నిర్ధేషిత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.
ఏప్రిల్లో రెండవ నావిగేషన్ ఉపగ్రహాన్ని పీఎస్ఎల్వీ-సీ24 ద్వారా
ప్రయోగించింది.
జూన్లో పీఎస్ఎల్వీ-సీ23 రాకెట్ ద్వారా ఐదు విదేశీ ఉపగ్రహాలను
అంతరిక్షంలోకి చేర్చారు. సెప్టెంబరులో ఇస్రో అరుదైన విజయం సాధించింది.
మొదటి ప్రయత్నంలోనే మార్స్ ఆర్బిటర్ మిషన్ను అరుణ గ్రహ కక్ష్యలోకి
ఫలప్రదంగా ప్రవేశపెట్టింది. దీనికి దేశంలోనే కాక ప్రపంచం నుండి ప్రశంసలు
వచ్చాయి.
జీఎస్ఎల్వీ మార్క్-3 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. దీంతో మనుషులను
అంతరిక్షంలోకి పంపే దిశగా ఇస్రో ముందడుగు వేసింది. శ్రీహరికోటలోని సతీష్
ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఇస్రో ఈ ప్రయోగం చేపట్టింది. ప్రయోగం
ప్రారంభమైన వెంటనే రాకెట్ నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లింది. 3,735 కిలోల
వ్యోమగాముల గదిని 126.15 కి.మీ ఎత్తులో మార్క్-3 ప్రవేశపెట్టింది.
అంతరిక్షంలోకి మానవులను పంపే క్రమంలో భాగంగా ఇస్రో ఈ ప్రయోగం చేపట్టింది.
అంతరిక్షంలోకి ఇప్పటివరకు రష్యా, అమెరికా, చైనా దేశాలు మాత్రమే విజయవంతంగా
మానవులను పంపించాయి. నేడు ఇస్రో చేపట్టిన ఈ ప్రయోగ విజయవంతంతో
అంతరిక్షంలోకి మానవులను పంపే దిశగా భారత్ గణనీయమైన పురోభివృద్ధిని
సాధించింది. జీఎస్ఎల్వీ మార్క్-3 రాకెట్ వ్యయం రూ.155 కోట్లు.
Subscribe to:
Posts (Atom)