అణు ఆయుధాలు ఉండేది పండగ చేసుకోవడానికి కాదు ఇది ఆనాటి మాట..ప్రపంచాన్నే
వణికించిన ఆల్ కాయిదా ఉగ్రవాదులు మా హీరోలు ఇది నేటి మాట..ఇంతకీ ఈ మాటలు
అన్నది ఎవరో తెలుసా..పాకిస్తాన్ అనే సామ్రాజ్యాన్ని ఒకప్పుడు ఏలిన
అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్. పాకిస్తాన్ బలహీన దేశం కాదని..మా దగ్గర
అత్యాధునిక ఆయుధాలు ఉన్నాయని దాడికి ఎప్పుడైనా మేము సిధ్ధమని నాడు చెప్పిన
ముషారఫ్ నేడు ఉగ్రవాదమనే పాముకు పాలు పోసి పెంచింది మేమేనని వాస్తవాలను
వెల్లడించారు. ఉగ్రవాదులే మా హీరోలని ప్రపంచాన్ని నాశనం చేయడానికే వారిని
తయారు చేశామని చెబుతున్నారు. ప్రపంచానికే షాక్ నిస్తున్న ముషారప్ మాటల కథనం
స్లైడర్ లో.... అమెరికా ఉగ్ర దాహానికి లక్షల మంది బలి
ఉగ్రవాదానికి పాక్ ప్రభుత్వం అందించిన అండదండల బండారం ..
పాక్కు చెందిన దునియా న్యూస్ చానల్కు మాజీ అధ్యక్షుడు జనరల్ ముషారఫ్
ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉగ్రవాదానికి పాక్ ప్రభుత్వం అందించిన అండదండల బండారం
బయటపెట్టారు. 1990లో కశ్మీర్ వేర్పాటువాద ఉద్యమం మొదలైనప్పుడు..
లష్కరేతాయిబా సహా 11 లేదా 12 ఉగ్రవాద సంస్థలు ఏర్పడ్డాయి. వాటికి పాక్
ప్రభుత్వం, సైన్యం పూర్తిగా సహకరించింది.
ఆ సంస్థల్లో చేరిన యువకులకు శిక్షణ ఇచ్చాం.. వారు సరిహద్దులు దాటేందుకు
సహకరించాం అని పేర్కొన్నారు. పాక్ ప్రభుత్వం సర్వ సౌకర్యాలు
సమకూర్చుతున్నది ...
2008 ముంబై ఉగ్రదాడి మాస్టర్మైండ్స్ సయీద్, లఖ్వీపై పాక్ చర్యలు
తీసుకుంటుందా..? అని ప్రశ్నించగా భారత్కు సయీద్ మోస్ట్ వాంటెడ్
టెర్రరిస్ట్ కానీ, పాక్లో యథేచ్ఛగా తిరుగడమే కాకుండా.. విద్వేష ప్రసంగాలు
చేస్తున్నాడు. ఇందుకు పాక్ ప్రభుత్వం సర్వ సౌకర్యాలు సమకూర్చుతున్నది అని
ముషారఫ్ వెల్లడించారు. హఫీజ్ సయీద్, లఖ్వీలను హీరోలుగా ఆరాధించామని..
కశ్మీర్ స్వేచ్ఛకోసం పోరాడిన హఫీజ్ సయీద్, లఖ్వీలను హీరోలుగా ఆరాధించామని, ఆ
తర్వాత మత పోరాటం (జిహాద్) ఉగ్రవాదంగా మారిందని చెప్పారు. ఇప్పుడు వాళ్లు
(పాక్లోని ఉగ్ర మూకలు) సొంత ప్రజలనే చంపుతుండటం బాధాకరమని ఆవేదన వ్యక్తం
చేశారు.సయీద్, లఖ్వీని కూడా పాక్ నియంత్రిస్తుందా..? అని మీడియా అడిగిన
ప్రశ్నకు ముషారఫ్ సమాధానం చెప్పేందుకు నిరాకరించారు. ఆఫ్ఘన్లో సోవియట్
రష్యా సైనిక దళాలను ఎదుర్కొనేందుకు పన్నిన వ్యూహం..
మత పోరాటం (జిహాద్).. 1979లో ఆఫ్ఘన్లో సోవియట్ రష్యా సైనిక దళాలను
ఎదుర్కొనేందుకు పన్నిన వ్యూహం.. నేడు ప్రపంచాన్నే వణికిస్తున్న ఉగ్రవాదంగా
మారింది అని చెప్పారు. రష్యా దళాలపై పోరాటానికి తాలిబన్లకు మేమే సైనిక
శిక్షణ ఇచ్చాం. తాలిబన్, హక్కానీ, ఒసామా బిన్ లాడెన్, అల్ జవహరి మాకు
హీరోలు. ఆ తర్వాత విలన్లుగా మారారు అని తెలిపారు. 1990ల్లో కశ్మీర్లో
కల్లోలం సృష్టించేందుకు ఉగ్రవాద సంస్థలను సృష్టించి..
కశ్మీర్లో మత తీవ్రవాదాన్ని రెచ్చగొట్టేందుకు లష్కరే తోయిబాతో పాటు పలు
ఉగ్రవాద సంస్థలకు శిక్షణతోపాటు పూర్తి మద్దతిచ్చినట్లు పాక్ మాజీ
అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ తెలిపారు. పాక్ మాజీ మిలటరీ చీఫ్ కూడా అయిన
ముషార్రఫ్ 1990ల్లో కశ్మీర్లో కల్లోలం సృష్టించేందుకు ఉగ్రవాద సంస్థలను
సృష్టించి, శిక్షణ ఇచ్చినట్లు ఓ టీవీ చానల్తో అన్నారు. హఫీజ్ సయీద్, లఖ్వీ
తదితరులను పాక్ ప్రజలు హీరోలుగా
ఉగ్రవాద నాయకులైన లాడెన్, హక్కానీ, అల్ జవహరీ, లష్కరే నాయకులు హఫీజ్ సయీద్,
లఖ్వీ తదితరులను పాక్ ప్రజలు హీరోలుగా గుర్తించారన్నారు.'1990ల్లో
'స్వతంత్ర కశ్మీర్' ఉద్యమం మొదలైనప్పుడు లష్కరేతోపాటు 11, 12 చిన్న చిన్న
తీవ్రవాద సంస్థలు పుట్టుకొచ్చాయి. ప్రాణాలకు తెగించి పోరాడేలా వారికి
శిక్షణతో పాటు పూర్తి మద్దతిచ్చాం. మతతీవ్రవాదం కోసం వారిని పుట్టిస్తే..
అదే ఇప్పుడు ఉగ్రవాదమై మన వారినే చంపుతోంది. అందుకే దీన్ని
నియంత్రించాల్సిన అవసరం ఉంది' అన్న ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం
రేపుతున్నాయి. భారత్ చేస్తున్న వాదనకు ముషారఫ్ వ్యాఖ్యలు ..
అయితే పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషారఫ్
చేసినవ్యాఖ్యలు భారత్ కంటే ఆయన దేశానికే ఎక్కువ ఆశ్చర్యం కలిగించి
వుంటాయి. భారత్లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాకిస్థాన్ అండదండలున్నాయనీ,
భారత్ చేస్తున్న వాదనకు ముషారఫ్ వ్యాఖ్యలు కొండంత బలాన్నిచ్చాయి.
నిరాధారమైన ఆరోపణలంటూ అంతర్జాతీయ వేదికలమీద ఇంతకాలమూ బుకాయిస్తూ వస్తున్న
పాకిస్థాన్ను ఆయన వ్యాఖ్యలు ఇరకాటంలో పడేశాయి. ఒసామా బిన్ లాడెన్ తమ
దేశంలో ఆశ్రయం పొందుతున్నట్టు ..
ఒసామా బిన్ లాడెన్ తమ దేశంలో ఆశ్రయం పొందుతున్నట్టు తమ పాలకులకూ, నిఘా
వ్యవస్థలకు మొదటినుంచీ తెలుసునంటూ ఇటీవలే భారత్కు చెందిన చానెల్కు ఇచ్చిన
ఇంటర్వ్యూలో పాకిస్థాన్ మాజీ రక్షణమంత్రి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా
ఖండించిన వారిలో ముషారఫ్ కూడా ఉన్నారు. స్పష్టమైన వివరణ ఇచ్చుకోవాలంటూ
పాకిస్థాన్ ప్రభుత్వం ..
ఆయన తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలనీ, లేదా స్పష్టమైన వివరణ ఇచ్చుకోవాలంటూ
పాకిస్థాన్ ప్రభుత్వం కూడా ఆగ్రహించింది. ఇప్పుడు సాక్షాత్తూ ఆ దేశ మాజీ
అధ్యక్షుడు తాలిబాన్ ఆవిర్భావం నుంచి నేటివరకూ పాకిస్థాన్ నిర్వహించిన
ఉగ్రవాద పాత్రను విప్పిచెప్పడం ద్వారా తన దేశానికి కాకున్నా తనకు మేలు
చేసుకోవాలని ఆయన భావిస్తున్నట్టు కనిపిస్తున్నది. ముషారఫ్ ప్రస్తుతం అనేక
కేసుల్లో..
ముషారఫ్ ప్రస్తుతం అనేక కేసుల్లో ఇరుక్కుని ఉన్నారు. బెనజీర్ భుట్టో
హత్యకేసు ఆయనను వెంటాడుతున్నది. కొద్దిరోజుల క్రితమే అమెరికన్
పాత్రికేయుడు సీగల్ ఈ కేసు విచారిస్తున్న రావల్పిండి కోర్టుకు బేనజీర్
భుట్టోను ముషారఫ్ బెదిరించిన ఫోన్కాల్ వీడియో లింకేజ్ను పంపడంతో
ముషారప్ మరింత ఇరకాటంలో పడ్డారు. లాల్ మసీదుపై జరిగిన దాడి..
భుట్టో హత్యకు సూత్రధారి ముషారఫ్ మాత్రమేనని ఆయన కుండబద్దలు కొట్టారు.
దీనితోపాటుగా, లాల్ మసీదుపై జరిగిన దాడి, ఒక ముస్లిం మతపెద్ద హత్య
కేసులోనూ ముషారఫ్ ఇరుక్కున్నారు. ఈ నేపథ్యంలో, డెబ్పైరెండేళ్ళ వయసులో ఒక
కొత్త రాజకీయపార్టీతో మరోప్రస్థానం ఆరంభించాలనుకుంటున్న ముషార్ఫకు ప్రజలతో
పాటు, పాకిస్థాన్లోని వివిధవర్గాల వారిని ఆకట్టుకోవలసిన అవసరం ఉండవచ్చు.
బాల్ థాకరేమీద కూడా కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు ..
పాకిస్థాన్ నాయకులను, కళాకారులను అవమానిస్తూ, భారత్లోని మైనారిటీ
ముస్లింలపై తీవ్ర వ్యతిరేకత కనబరుస్తున్నదంటూ శివసేన వ్యవహారశైలిపై
అంతర్జాతీయస్థాయిలో ప్రచారం చేయాలని పాకిస్థాన్ ప్రభుత్వం సంకల్పిస్తున్న
నేపథ్యంలో ముషారఫ్ బాల్ థాకరేమీద కూడా కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు
చేశారు. ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ని వెనకేసుకొస్తూ, బాల్ థాకరే
పేరు ప్రస్తావించారు. వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయడం ముషార్ఫకు ..
వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయడం ముషార్ఫకు కొత్తకాదు కానీ, భారత్ వ్యతిరేక
ఉగ్రవాద కార్యకలాపాలకు పాకిస్థాన్ ఆదినుంచీ అండగా ఉన్నదని అంగీకరించడం
మాత్రం ఇదే ప్రధమం. ఇటువంటి వ్యాఖ్యలు ఎవరో సాదాసీదా వ్యక్తుల నుంచి
వచ్చివుంటే వాటికి ప్రాధాన్యం ఉండివుండేది కాదు. పదేళ్ళపాటు పాకిస్థాన్ను
ఏలిన వ్యక్తి ..
కానీ, అత్యంత కీలకమైన సందర్భంలో పదేళ్ళపాటు పాకిస్థాన్ను ఏలిన వ్యక్తి
ఆయన. సైనిక నియంతగా పాకిస్థాన్లోని సర్వ వ్యవస్థలనూ తన నియంత్రణలో
ఉంచుకున్న వ్యక్తి. అధికారంలోకి రాకముందు కూడా భారత్తో వ్యవహరించే విషయంలో
పాకిస్థాన్ పాలకులను పూర్తిగా నియంత్రించిన వ్యక్తి. పాకిస్థాన్ ఉగ్రవాద
సంస్థలకు నెలవుగా..
పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థలకు నెలవుగా, శిక్షణాకేంద్రంగా పనిచేసిందని ఆయన
ఒప్పుకోలు ఇంతకాలమూ పాక్ ప్రేరేపిత ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న వాదనకు
ఎనలేని బలాన్ని చేకూర్చింది. ముషారఫ్ వ్యాఖ్యలు అంతర్జాతీయ వేదికలమీద
పాకిస్థాన్ వ్యవహారశైలిని బలంగా ఎండగట్టడానికే కాదు, దావూద్ వంటివారి
విషయంలో కఠినంగా వ్యవహరించాలనుకుంటున్న భారత్కు అనూహ్యంగా అందివచ్చిన
ఆయుధంగానూ ఉపకరిస్తాయి. పాకిస్తాన్ తో పెట్టుకోవద్దని భారత్ కు సవాల్..
అయితే ఆయన ఇంతకు ముందు సైతం పాకిస్తాన్ తో పెట్టుకోవద్దని భారత్ కు సవాల్
విసిరాడు. పాకిస్తాన్ భూభాగంలోకి భారత్ ప్రవేశించాలని చూస్తే పాకిస్తాన్
చూస్తూ ఊరుకోదు..మేము చిన్న పిల్లలం కాదంటూ కుండబద్దలు కొట్టారు. పాక్
బలహీన దేశం కాదని ..
పాకిస్తాన్ తో దాడికి దిగొద్దని పాక్ బలహీన దేశం కాదని అత్యాధునిక ఆయుధాలు
ఉన్నాయని మయన్మార్ లాంటిది కాదని మా దగ్గర దాదాపు అణు ఆయుధాలు ఉన్నాయని మన
దేశానికి వార్నింగ్ ఇచ్చినంత పని చేశారు. 2020 కల్లా వీటిని 200లకు పెంచడమే
తమ లక్ష్యమని...
2020 కల్లా వీటిని 200లకు పెంచడమే తమ లక్ష్యమని కాబట్టి మాతో గేమ్స్
ఆడేందుకు ట్రై చేయవద్దని ఆయన అన్నారు. మరి ఇప్పుడు ఉగ్రవాదంపై కూడా తనదైన
శైలిలో చెప్పారు...దీనిపై ప్రపంచదేశాలు ఎలా స్పందిస్తాయో చూడాలి. ముఖ్యంగా
భారత్ ఈ విషయంలో ఎలా స్పందిస్తుందో చూడాలి.
Telangana General Knowledge Bits in Telugu
Telangana Government has recently announced lot of recruitment notifications. candidates who are preparing for Govt jobs in Telangana they must and should check Post wise syllabus, model papers for better preparation. here i am sharing some important dates and some general knowledge questions in telugu, also you can download in PDF files on your android mobile.
1.తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల
పెద్ద మనుషుల మధ్య జరిగిన ఒప్పందంలో కల్పించిన హామీల అమలుకు 1958 ఫిబ్రవరిలో
ఏర్పడిన కమిటీ
Ans: తెలంగాణ ప్రాంతీయ కమిటి
2. తెలంగాణ ప్రాంతీయ కమిటి
తొలి అధ్యక్షులు
Ans: అచ్యుత్ రెడ్డి
3.ఆంధ్రప్రదేశ్ ఏర్పడే
నాటికీ హైదరాబాద్ రాష్ట్రం ఎన్ని కోట్లు మిగులుతో ఉంది?
Ans: రూ. 4,49 కోట్లు
4.1956 – 68 మధ్య కలంలో
అధికార గుణాంకాల ప్రకారం తెలంగాణకు చెందిన ఎన్ని నిధులను ఆంధ్రప్రాంతంలో ఖర్చు
చేయడం జరిగింది?
Ans: రూ. 110 కోట్లు
5.తెలంగాణ ప్రాంతీయ కమిటీ
అద్యక్షుడు అచ్యతన్ రెడ్డి లేఖకు స్పందిస్తూ 1961లో అప్పటి ముఖ్యమంత్రి దామోదరం
సంజీవయ్య తెలంగాణ మిగులు నిధులతో ఏ ప్రాజెక్టు నిర్మాణానికి హామి ఇచ్చారు
Ans: పోచంపాడు ప్రాజెక్టు,
కొత్తగూడెంలో ఎరువుల కర్మాగారం
6. 1969 జనవరిలో తెలంగాణ
ప్రయోజనాల పరిరక్షణ కోసం విద్యార్ధుల ఉద్యమం ఎక్కడ మొదలెంది?
Ans: ఖమ్మంలో (ఇదే అనంతరం ప్రతేక
తెలంగాణ ఉద్యమంగా రూపుదాల్చింది)
7. ఉస్మానియా
విశ్వవిద్యాలయానికి గ్రాంటు మంజూరు చేయడంలో జాప్యం చేసి, దాన్ని ప్రభుత్వంలో ఒక
శాఖగా మార్చాలని చేసిన ప్రభుత్వ ప్రయత్నాన్ని తిప్పికోడుతూ, తెలంగాణ రాష్ట్ర
ప్రాతిపత్తి కోసం పోరాటం జరపాలని నిర్ణయించిన విద్యార్ధి నేత
Ans: ఉస్మానియా విద్యార్ధి సంగు
ప్రధాన కార్యదర్శి మల్లికార్జున్
8. 1956 జనవరిలో మాదన్మోహన్
కన్వినర్ గా ఏర్పడి సంస్థ
Ans: తెలంగాణా పీపుల్స్
కన్వెన్షన్
9. విద్యార్ధులు చేపటిన
ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి మద్దతు తెలిపిన ఎన్. జి. ఓ. ల సంగం
Ans: కె. ఆర్. ఆమోస్
10. 1969లో ప్రత్యక తెలంగాణ
ఉద్యమానికి మద్దతుగా మంత్రి పదవికి రాజీనామా చేసినది
Ans: కొండా లక్ష్మన్ బాపూజీ
11. 1969లో తెలంగాణ
పీపుల్స్ కన్వెన్షన్ ను ఏ సంస్థగా మార్చడం జరిగింది?
Ans: తెలంగాణ ప్రజా సమితి
12. 1969 మార్చిలో ఏర్పడ్డ
తెలంగాణ ప్రజాసమితి అధ్యక్ష కార్యదర్శులు
Ans: మదన్ మోహన్,
వెంకట్రామారెడ్డి
13. 1969 జూన్ 1న కొండా
లక్ష్శణ్ బాపూజీ అధ్యక్షతన ఏర్పాటైన పార్టీ
Ans: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్
14. స్థానిక ఉద్యోగాల్లో
తెలంగాణ ప్రాoతియులనే భర్తీ చేయాలనే, స్థానికేతర ఉద్యోగులందరినీ వారి సొంత
జిల్లాలకు తాత్కాలిక ఖాళీలలోకి బదిలి చేయాలని 1969లో ప్రభుత్వం జారీ చేసిన జీవో
Ans: జీ. వో. నం. 36
15. ప్రత్యేక తెలంగాణ
ఉద్యమంఫై ప్రభుత్వ అణచివేత చర్యల కారణంగా ఎంత మంది మరంచారు?
Ans: దాదాపు 369 మంది
16. తెలంగాణ మృతవీరుల
స్మారకార్ధం హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్ వద్ద నిర్మించిన స్మారక స్థూపం పేరు
Ans: గన్ పార్క్
17. గన్ పార్క్
శిల్పాని చెక్కినది
Ans: ఎ. యాదగిరిరావు
18. 1969లో తెలంగాణ ఉద్యమం
సందర్బంగా దోపిడి చేసే ప్రాంతేతరులను దూరం
దాకా తన్ని తరుమాలే, ప్రాంతం వాడే దోపిడి చేస్తే, ప్రాణంతోటే పాతరపెట్టాలే’ అన్నది
Ans: ప్రజాకవి కాళోజి నారాయణరావు
19. తెలంగాణ ఉద్యమంలో ఘలమీ
కి జిందగీసే మౌత్ అచ్చి (బానిస బతుకు కంటే చావడం మేలు) అని ఉపన్యసించినది ఎవరు?
Ans: కె. వి. రంగారెడ్డి
20. 1969 ఉద్యమ నేపధ్యంలో
తెలంగాణ ప్రజలను సంత్రుప్తిపరచడానికి అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రకటించిన పథకం
Ans: అష్టసుత్ర పథకం
21. 1971లో జారిగిన
సార్వత్రిక ఎనికల్లో తెలంగాణలోని 14 ఎంపి స్థానాలకు గాను 10 స్థానాలను గెలుచుకున్న
పార్టీ
Ans: మర్రి చెన్నారెడ్డి
నేతృత్వంలోని తెలంగాణ ప్రజాసమితి (టిపిఎస్)
22. తెలంగాణ ప్రాంతంలోని
నాన్ గెజిటెడ్ ఉద్యోగాలకు, తహసిల్దార్, జూనియర్ ఇంజనీరిoగ్ పదవులకు ముల్కి
నిబంధనలు వర్తింపజేస్తూ 1971లో ప్రకటించిన పథకం
Ans: అష్టసుత్ర పథకం
23. తెలంగాణ ఉద్యమ
నేపధ్యంలో 1971లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మనందరెడ్డిని
గద్దెదింపి ఎవరిని ముఖ్యమంత్రిగా శ్రీమతిగా ఇందిరాగాంధీ నియమించెను?
Ans: పి. వి. నరసింహారావు
24. తెలంగాణ ఉద్యమ నాయకుడైన
మర్రి చేనరెడ్డి తెలంగాణ ప్రజాసమితి ఏ పార్టీలో విలీనం చేసెను?
Ans: కాంగ్రెస్ పార్టీలో
25. ఆంధ్రప్రదేశ్ అవతరణ
తరువాత కూడా ముల్కి నిబంధనలు అమల్లో ఉంటాయని, అవి చట్టబద్దమైనవేనని సుప్రీంకోర్టు
చారిత్రాత్మక తీర్పు చెపిన తేది
Ans: 1972 అక్టోబర్ 3
26. 1972 అక్టోబర్ 3 నాటి
సుప్రీంకోర్టు తీర్పు నేపధ్యంలో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర కావాలంటూ ఆంధ్ర ప్రాంతంలో
తల్లెత్తిన ఉద్యమం
Ans: జై ఆంధ్ర ఉద్యమం
27. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర
ఉద్యమాన్ని దృస్టిలో పెట్టుకొని ప్రధాని ఇందిరాగాంధీ 1973 సెప్టెంబర్ 21న
ప్రకటించిన పథకం
Ans: ఆరు సూత్రాల పథకం
28. తెలంగాణ ప్రాంతంలో ఉన్న
ఆంధ్ర ఉద్యోగులను తొలగించి, వారి స్థానంలో తెలంగాన వారిని నియమించేందుకు 1985
డిసెంబర్ 30న జారి చేసిన జీవో
Ans: 610 జీ.వో.
29. 610 జే.వో. అమలును
పరిశీలించడానికి 2001లో ఏర్పాటు చేసిన కమిషన్
Ans: గిర్ గ్లానీ ఏకసభ్య కమిషన్
30. తెలంగాణ సమస్యలపై అధ్యయనం
చేసందుకు 1985లో విద్యావంతుల సదస్సును ఎక్కడ ఏర్పాటు చేసారు?
Ans: కరీంనగర్
31. తెలంగాణ ఇన్ఫర్మేషన్
ట్రస్టూ ఎప్పుడు ఏర్పడింది
Ans: 1986
32. 1989లో తెలంగాణ కోసం
పలు కర్యక్రమాలు చేపట్టిన సంస్థ
Ans: తెలంగాణ అభివృద్ధి ఫోరం
౩౩.1991 లోఉస్మానియా
యూనివర్సిటీలో ఆందోళనలు జరిపిన సంస్థ\
Ans: తెలంగాణ స్టూడెంట్స్ ఫ్రంట్
34.తెలంగాణా సమస్యల గురించి
ప్రదాని పి. వి. నరసింహరావు ప్రబుత్వానికి 1992లో నివేదికలు సమర్పించిన సంఘం
Ans: తెలంగాణా ఇంజనీర్ల సంగం
35.1996లో తెలంగాణా
ప్రజాసమితి వరంగల్లులో నిర్వహించిన సదస్సులో అవిర్బవించిన పార్టీ
Ans: తెలంగాణ ప్రజాపార్టీ
36.ప్రజాకవి కాళోజీ
నారాయణరావు నేతృత్వంలో ప్రజాస్వామిక తెలంగాణా సదస్సు 1997డిసెంబర్లో ఎక్కడ
జరిగింది?
Ans: వరంగల్లులో
37.ప్రొఫెసర్ జయశంకర్
ఆద్వర్యంలో తెలంగాణ సంస్థల విలీనంతో 1998లో అవిర్బవించిన సంస్థ
Ans: తెలంగాణ ఐక్యవేదిక
38.తెలంగాణ రాష్ట్ర సమితి
(టి.ఆర్.ఎస్) ఎప్పుడు ఏర్పాటయింది?
Ans: 2001 ఏప్రిల్ 27
39.తెలంగాణ రాష్ట్ర సమితి
అధ్యక్షుడు
Ans: కె.చంద్రశేఖరరావు (కె.సి
ఆర్)
40.టి.ఆర్.ఎస్. అద్యక్షుడు
కె.చంద్రశేఖరరావు ఆమరణ నిరాహార దీక్ష ప్రారంబించిన తేదీ
Ans: 2009 నవంబర్ 29
41.కేంద్ర హోం మంత్రి
తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ ప్రారంబంమైనట్లు ప్రకటించిన తేదీ
Ans: 2009 డిసెంబర్ 9
42.2009డిసెంబర్ 23న కేంద్ర ప్రభుత్వం తెలంగాణ
ప్రకటన పై వెనక్కు తగ్గడంతో తెలంగాణ రాష్ట్ర సదన కోసం అన్ని రాజకీయ పార్టీలతో
ఎర్పాటు చేయబడిన జాయింట్ యాక్షన్ కమిటీ
(జెఎసి) కి చైర్మన్ ఎవరు?
Ans: ప్రొఫెసర్ ఎం. కోదండరాం
43.తెలంగాణ జాయింట్
యాక్షన్ కమిటీ 2010 ఫిబ్రవరి 3న
నిర్వహించిన ఆందోళన
Ans: 500 కిలోమీటర్ల
మేర మనవ హారం ఏర్పాటు
44.తెలంగాణ ఉద్యమం
నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ లో పరిస్థిత పై సంప్రదింపుల కోసo కేంద్ర ప్రభుత్వం 2010
ఫిబ్రవరి 3న ప్రకటించిన కమిటీ పేరు
Ans: జస్టిస్ శ్రీ కృష్ణ కమిటీ
45.ప్రపంచ చరిత్రలో శాంతియుతంగా
జరిగిన అతిపెద్ద ప్రజప్రదర్శనలో ఒకటిగా నిలిచినా (టి.ఆర్.ఎస్) పార్టీ తెలంగాణ మహా
గర్జన సభను 2010 డిసెంబర్ 16న ఎక్కడ నిర్వహించింది?
Ans: వరంగల్
46. తెలంగాణలో సహాయ నిరాకరణ
ఉద్యమం ఎప్పుడు ప్రారంభమయేను?
Ans: 2011 ఫిబ్రవరి 17నుండి
47. .తెలంగాణ జాయింట్
యాక్షన్ కమిటీ నేతృత్వంలో 2011 మార్చి 10 నిర్వహించిన ఆందోళన
Ans: మిలియన్ మార్చ్
48.2011 సెప్టెంబర్ 12
నుండి అక్టోబర్ 24 వరకు 42 రూజుల పాటు తెలంగాణ లో
జరగిన చారిత్రాత్మక ఉద్యమం
Ans: సకల జనుల సమ్మే
49. 2011 నవంబర్ 1 నుండి వారం రోజుల పాటు ఢిల్లీ
లోని జంతర్ మంతర్ వద్ద సత్యాగ్రహం నిర్వహించిన, స్వతంత్ర సమరయోధుడు తెలంగాణ స్వతంత్ర సమరయోధుల ఫోరం
చైర్మన్
Ans: కొండా లక్ష్మన్ బాపూజీ
50. తెలంగాణ మార్చ్
నిర్వహించబడిన తేదీ
Ans: 2012 సెప్టెంబర్ 30
51. కాంగ్రెస్ వర్కింగ్
కమిటీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తీర్మాన్ని ఏకగ్రీవంగా ఆమోడించిన తేదీ
Ans: జూలై 30 2013
52. 29వ రాష్ట్రం తెలంగాణ ఏర్పాటుకు కేంద్ర
కేబినెట్ ఆమోదం తెలిపిన తేదీ
Ans: 2013 అక్టోబర్ 3
53. తెలంగాణ రాష్ట్ర
ఏర్పాటులో తలెతే సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన కేంద్ర మంత్రుల బృందానికి
నాయకత్వం వహించినది
Ans: అప్పటి హోంమంత్రి సుశీల్
కుమార్ షిండే
54. తెలంగాణ ముసాయిదా
బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన తేదీ
Ans: 2013 డిసెంబర్ 3
55. తెలంగాణ బిల్లు
లోక్సభలో ఆమోదం పొందిన తేదీ
Ans: 2014 ఫిబ్రవరి 18
56. తెలంగాణ బిల్లు
రాజ్యసభలో ఆమోదం పొందిన తేదీ
Ans: 2014 ఫిబ్రవరి 20
57. తెలంగాణ బిల్లు
(ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్తికరణ చట్టం 2014) కు రాష్ట్రపతి ఆమోదం తెలిపిన తేది
Ans: 2014 మార్చ్ 1
58.భారత సముఖ్యలో 29వ
రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఎప్పటి నుండి ఉనికిలోకి వచ్చింది
Ans: 2014 జూన్ 2
తెలంగాణలోని ముఖ్యమైన అంశాలు 2
తెలంగాణలోని ముఖ్యమైన అంశాలు 2
- తెలంగాణ మారుపేరు ఏమిటి?...................రత్నగర్భ
- భారతదేశంలో ఏ ప్రాంతం లో తెలంగాణ ఉన్నది?.......... దక్షిణ భారతదేశం లో
- తెలంగాణలో అతిపెద్ద రాజధాని ఏది?........... హైదరాబాద్
- తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం ఎప్పుడు?............ 2014 జూన్ 2
- తెలంగాణలో పెద్ద నగరం ఏమిటి?............ హైదరాబాద్
- తెలంగాణలోని జిల్లాల సంఖ్య?............ 10 (హైదరాబాద్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, ఆదిలాబాద్, మెదక్, రంగారెడ్డి, మహబూబాబాద్)
- తెలంగాణలోని మొట్ట మొదటి గవర్నర్ ఎవరు?.......... ఇ. ఎస్. ఎల్. నరసింహన్
- తెలంగాణలోని తొలి ముఖ్యమంత్రి ఎవరు?............ కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసిఆర్)
- తెలంగాణలోని డిప్యూటీ ముఖ్యమంత్రి ఎవరు?.......... టి. రాజయ్య,మొహమద్ అలీ
- తెలంగాణలోని శాసన మండలి స్థానాలు ఎన్ని?........... 40
- తెలంగాణలోని లోక్ సభ స్థానాలు ఎన్ని?........... 17
- తెలంగాణలోని రాజ్యసభ స్థానాలు ఎన్ని?............ 7
- తెలంగాణ శాసనసభ తొలి స్పీకర్ ఎవరు?........... పద్మాదేవేందర్ రెడ్డి
- తెలంగాణ హైకోర్టు ఎక్కడ వుంది?........... హైకోర్టు ఆఫ్ జ్యుడికేచార్ ఎట్ హైదరాబాద్
- తెలంగాణ రాష్ట్రం మొత్తం వైశాల్యం ఎంత?.......... 114,840 చ.కి.మీ.
- తెలంగాణ రాష్ట్రం వైశాల్యంలో ఎన్నవ స్థానంలో ఉంది?......... 12
- తెలంగాణ రాష్ట్రం మొత్తం జనాభా ఎంత?........... 3,51,93,978
- తెలంగాణ అధికార భాష ఏమిటి?............ తెలుగు, ఉర్దూ
- తెలంగాణ రాష్ట్ర సరిహద్దులు:
- తూర్పు: దక్షిణపు సరిహద్దుగా ఆంధ్రప్రదేశ్ ఉంది.ఉత్తర మరియు వాయువ్య సరిహద్దుగా మహారాష్ట ఉంది.
- పడమర: సరిహద్దుగా
కర్ణాటక ఉంది. ఈశాన్యం: సరిహద్దుగా ఛత్తీస్గడ్ ఉంది
తెలంగాణలోని ముఖ్యమైన అంశాలు
తెలంగాణలోని ముఖ్యమైన అంశాలు:
- తెలంగాణ రాష్ట్రం తొలి ముఖ్యమంత్రి ఎవరు?............ కె. చంద్రశేఖరరావు
- తెలంగాణ రాష్ట్ర జైళ్ళ మొదటి డైరెక్టర్ జనరల్ ఎవరు?............ వినయ్ సింగ్
- తెలంగాణలో తక్కువ అసెంబ్లీ స్థానాలు గల జిల్లా ఏది?........... నిజామాబాద్ (9)
- బాగ్యనగర్ నందనవనం పార్కు ఎక్కడ ప్రారంభమైంది?........... రంగారెడ్డి జిల్లా ఘటకేసర్ మండలం నారపల్లి వద్ద ప్రారంభమైంది.
- తెలంగాణలో ఏ జిల్లా వరి, పసుపు ఉత్పత్తిలో ప్రధమస్థానంలో ఉంది?............. కరీంనగర్
- తెలంగాణలోని కుటుంబాలకు ఎంత శాతం విద్యుత్ సౌకర్యం ఉంది?............ 92.3 శాతం
- హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు ఏ జిల్లా వాసి?........... మహాబూబ్ నగర్
- 2001-2011 దశాబ్ద కాలంలో తెలంగాణలో దశాబ్ద వృద్ధిరేటు తక్కువగా గల జిల్లా?............ హైదరాబాద్
- తెలంగాణా ప్రభుత్వం చెరువుల పునరుద్ధరణ కార్యక్రమానికి పెట్టిన పేరు?.............. మిషన్ కాకతీయ
- తెలంగాణలో శీతాకాలంలో ఎక్కువగా చల్లగా ఉండే ప్రాంతాలు ఏవి?.............. నిజామాబాద్, హైదరాబాద్
- తెలంగాణా విశ్వవిద్యాలయాన్ని నిజామాబాద్ జిల్లాలోని డిచ్ పల్లి వద్ద ఏ సంవత్సరంలో స్థాపించారు? ......... 2006 లో
- హైదరాబాద్ లోని హైకోర్టు భవనాన్ని ఎవరు డిజైన్ చేసారు?............ బ్రిటిష్ ఆర్కిటెక్ట్ విన్సెంట్
- 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సి జనాభా అధికంగా గల జిల్లా ఏది?........... కరీంనగర్
- తెలంగాణలో అత్యధిక అసెంబ్లీ స్థానాలు గల జిల్లా ఏది?............ హైదరాబాద్ (15)
- తెలంగాణా రాష్ట్రంలో వాతావరణం ఏ విధంగా వుంటుంది?............ వేడి మరియు పొడిగా
- 2011 జనాభా లెక్కల ప్రకారం స్త్రీ పురుష జనాభా నిష్పత్తి తక్కువగా గల జిల్లా ఏది?............ హైదరాబాద్ (954: 1000)
- ఉద్యాన విశ్వవిధ్యాలయాన్ని ఎక్కడ నెలకొల్పనునారు?.............. మెదక్ జిల్లా గజ్వేల్ లోని ములుగులో
- తెలంగాణాలో మొక్కజొన్నను అధికంగా పండించే జిల్లాలు ఏవి?.......... మెదక్, కరీంనగర్, నిజామాబాద్.
- హైదరాబాద్ లోని దుర్గం చెరువును ఏమి అని పిల్లుస్తారు?........... రహస్య సరస్సు
- దేశంలో తొలి సునామి కేంద్రం ఎక్కడ ఉంది?.............. హైదరాబాద్ లో ఉంది.
- దేశంలోనే అతిపెద్దదైన నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ ఏ జిల్లా లో ఉంది?........... నిజామాబాద్ జిల్లా బోధన్ లో వుంది .
- శ్రీరాంసాగర్ కు ఎన్ని ప్రధాన కాలువలు ఉన్నాయి?.......... 3 కాకతీయ కాలువ, లక్ష్మి కాలువ, సరస్వతి కాలువ
- పండ్ల ప్రాసెసింగ్ తయారి కేంద్రం ఎక్కడ ఉంది?.............. ఆదిలాబాద్ జిల్లాలోని బెల్లంపల్లి లో
- తెలంగాణ రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కమిషనర్ ఎవరు?............ శ్యామ్ కుమార్ సిన్హా.
- తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం ప్రారంభించిన సుభోజనం పథకానికి ఏమి అని పేరు పెట్టారు?.......... సద్దిముట అని పేరు పెట్టారు.
- తెలంగాణా తొలి అటవీశాఖ ముఖ్య సంరక్షణదికార (పీసీసీఎఫ్) ఎవరు?............ ఎస్ బీఎల్ మిశ్రా
- తెలంగాణ ఇంజనీర్స్ డే ఎప్పుడు?.............. జూలై 11
- భారతదేశంలోనే అత్యంత కాలుష్య ప్రాంతమైన పటాన్ చెరువు ఎక్కడ ఉంది?............ మెదక్
- రామప్పదేవాలయం ఎక్కడ ఉంది?............ వరంగల్ జిల్లా పాలంపేట లో
- కిన్నెరసాని నీటిపారుదల ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది?............. ఖమ్మం జిల్లాలో
- విస్తిర్ణపరంగా అతిపెద్ద టైగర్ రిజర్వ్ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఉంది?............ మన్ననూర్ నుంచి నాగార్జునసాగర్ వరకు ఉంది.
- సిమెంట్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా కర్మాగారం ఎక్కడ ఉంది?............. ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాలలో
- వరంగల్ జిల్లాలోని ముఖ్యమైన సరస్సులు ఏవి?........... 1. లక్కవరం సరస్సు 2. పాకాల సరస్సు
- తెలంగాణా రాష్ట్రంలో అత్యధికంగా పశువులు, గొర్రెలు, మేకలు ఎక్కడ వున్నవి?............. మహబూబ్ నగర్ జిల్లలో
- భారతదేశంలో మూడవ అతిపెద్ద మర్రి చెట్టు ఎక్కడ కలదు .................మహబూబ్ నగర్ జిల్లలో గల పిల్లల మర్రిలో
- 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో ఎస్.సి బాల బాలికల నిష్పత్తి తక్కువగా ఉన్న జిల్లా..........హైదరాబాద్
- 2011 జనాబా లెక్కల ప్రకారం అత్యల్ప జనాబా గల జిల్లా........నిజామాబాద్
- తెలంగాణలో ముక్యనదులు ఎన్ని వాటి పేర్లు .....4.గోదావరి,కృష్ణ,మంజీర,ముసి
- కాకతీయ విశ్వవిద్యాలం వరంగల్ లో ఎ సం.. లో ప్రారంభం ఐంది ..........1976
- 2011 జనాబా లెక్కల ప్రకారం ఎస్సి జనాబా తక్కువగా గల జిల్లా ...........హైదరాబాద్
- తెలంగాణలో ఎండాకాలంలో ఎక్కువ వేడిగా ఉండే ప్రాంతాలు ...........కొత్తగూడెం,రామగుండము,మణుగూరు
- 2011 జనాబా లెక్కల ప్రకారం తెలంగాలో ఎస్సి బాల బాలికల నిష్పత్తి ఎక్కువగా ఉన్న జిల్లా .........ఖమ్మం
- ఖమ్మం జిల్లలో గల ఏ ప్రాజెక్ట్ 9.20 వేల హెక్టార్లకు నీరు లబిస్తుంది ?.... ముక్క మామిడి
- హైదరాబాద్ పురాణం హవేలిలో సిటీ సివిల్ కోర్ట్ ఎన్ని సంవత్సరాలు పూర్తి చేస్కుంది?.......150 సం..
- తెలంగాణ పోలీస్ శాఖా నుతన లోగొ ను రూపొందించింది ఎవరు?........ఏలే లక్ష్మణ్
- తెలంగాణలో ఏ జిల్లలో పత్తిని అధికంగా పండిస్తారు ........ ఆదిలాబాద్
- తెలంగాణలో గోండు జాతి అదికంగా ఉన్న జిల్లా ఏది ?......ఆదిలాబాద్
- తెలంగాణలో ఏ ఉత్పత్తులకు 0 పన్ను రేటు పరిదిలో ఉన్నది ?.......సోయబిన్ డి అయిల్ద్ కేక్
- తెలంగాణలో ఆదిలాబాద్ ను పూర్వం ఏ పేరుతో పిలిచే వారు ...........ఎదులపురం
- తెలంగాణ రాష్టం తొలి సమాచార పౌరసంబందాల కమీషనర్ ఎవరు?.....ఆర్.వి చంద్రవదన్
- హైదరాబాద్ లోని నల్సార్ యూనివర్సిటీ రిజిస్టర్ ప్రొఫెసర్ ఎవరు?.......వి, బాలకృష్ణ రెడ్డి
- దక్షణ భారత దేశంలో బొగ్గు ఉత్పతి చేసే ఏకైక రాష్టం?.......తెలంగాణ రాష్టం
- తెలంగాణ రాష్టంలో గల ఏ నిక్షేపాలు ప్రపంచం లోని అత్యుత్త మైనవిగా పేరు గాంచాయి?........బైరైటీస్
- తెలంగాణలో సున్నపు రాయి లబించే జిల్లాలు?........ ఖమ్మం, మహబూబ్ నగర్
- తుంగ చపలకు ఏ జిల్లా ప్రసిద్ధి?........మహబూబ్ నగర్
- సితఫాలలు అదికంగా లబ్యం ఐయే ప్రదేశం?........మహబూబ్ నగర్
- చైనేత మరియు పట్టు వస్త్రాలకు ప్రసిద్ది పొందిన ప్రాంతం?......మహబూబ్ నగర్ లోని గద్వాల్
- శాతవహనలకు సంబందించిన ఆనవాలు ఎక్కడ లబించాయి?........కోటిలింగాల, కరీంనగర్ జిల్లా
- తెలంగాణలో జరి చీరలకు ప్రసిద్ది పొందిన ప్రాంతాలు?...గద్వాల్, సిద్దిపెట్, సిరిసిల్ల
- తెలంగాణలో బొగ్గును తొలి సారిగా ఎక్కడ వెలికి తీశారు?........ ఇల్లందు,ఖమ్మం జిల్లా
- తెలంగాణలో బొగ్గును తొలి సరిగా ఎవరి అద్వర్యంలో వెలికి తీశారు?......డా,కింగ్
- 2006 లో భారత ప్రభుత్వo ఏ జిల్లాను వెనకపడ్డ జిల్లాగా ప్రకటించింది?........ఖమ్మం
- తెలంగాణ సాయుధ పోరాటం ఎప్పుడు ప్రారంభం అయినది?.........1946 జూలై 4
- హైదరాబాద్ సంస్థానం భారత దేశంలో విలీనం అయిన సం..?........1948 సెప్టెంబర్ 17
- 1920 లో విసునూరు దేశ్ముఖ్ కు వ్యతిరేకంగా ఎవరు పోరాటం జరిపారు?.......షేక్ బందగి
- తెలంగాణలో సంచార జాతులైన బంజరాలను ఏమని అంటారు?......లంబాడీలు, సుగాలీలు
- 1947 డిసెంబర్ 4 న నిజాం ఫై బాంబు దాడి చేసింది ఎవరు?.........నారాయణ రావు పవర్
- నిజాం ప్రభుత్వం భారత సైన్యానికి లొంగి పోయిన సం..?.........1948 సెప్టెంబర్ 17
- హైదరాబాద్ లో ఇ.సి.ఐ.ఎల్. ను ఏ సం..లో స్థాపించారు?........1967 ఏప్రెల్ 11
- దేశంలోని అతిపొడవైన ఎక్స్ ప్రెస్ వే ఎక్కడ ఉన్నది?......హైదరాబాద్
- ఉస్మానియా విశ్వ విద్యాలయం ఏ సం.. లో ప్రారంభం అయింది?.....1919
- తెలంగాణలో జరి చీరాల తయారికి ప్రసిద్ది పొందిన ప్రాంతం?........ నారాయణపేట
- ఇక్రిశాట్ డైరెక్టర్ ఎవరు?......సి.ఎస్ రాజీవ్ శర్మ
- తెలంగాణ సాయుధ పోరాటం మొదట ఏ జిల్లలో ప్రారంభం అయింది?....... సూర్యాపేట, నల్గొండ జిల్లా
- హైదరాబాద్ లో గల దేశంలోని అతి పొడవైన ఎక్స్ ప్రెస్ వే పేరు?...... పి.వి. నరసింహారావు ఫ్లైఓవర్
- తెలంగాణలో జిల్లా పరిషత్ లేని ఏకైక జిల్లా?....... హైదరాబాద్
- తెలంగాణకు ప్రకృతి ఇచ్చిన భూగర్బ ఖనిజ శాల గా దేనిని పిలుస్తారు?......ఖమ్మం
- బుడాపెస్ట్ అఫ్ ఇండియాగా ప్రసిద్ది చెందినా జిల్లా?........హైదరాబాద్
- ఏ ప్రాంత అడవులలో సువాసనగల రూసాగడ్డి లబిస్తుంది?........నిజామబాద్
- ఇండియన్ ఇనిస్తుట్ అఫ్ కెమికల్ టెక్నాలజీ ఎక్కడ కలదు ?........హైదరాబాద్
- భారతదేశంలో బు పరివేష్టిత రాష్టం ఏది?.........తెలంగాణ
- నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ న్యూట్రిషన్{NIN} ఎక్కడ కలదు?.....హైదరాబాద్
- డిఫెన్సు రిసెర్చ్ డవలప్మెంట్ లబో రేటరీ {DRDL}ఎక్కడ ఉన్నది?.......హైదరాబాద్
- బండివేనక బండి కట్టి గేయ రచయిత యాదగిరి, ఎక్కడ జన్మించాడు?....... సూర్యాపేట, నల్గొండ
- భారతదేశంలో మొట్ట మొదటి పారి శుద్య పురస్కారం పొందిన మున్సిపాలిటీ?.....సూర్యాపేట,నల్లగొండ
- మహబూబ్ నగర్ పాత పేరు?.......పాలమూరు,రుక్కమ్మ పేట
- నిజామబాద్ పాత పేరు?......ఇందూరు
- తెలంగాణ రాష్ట బ్రాండ్ అంబసీడర్?.......సానియా మిర్జా
- తెలంగాణలో విద్యుత్ సగటు వినియోగం?.........985 యూనిట్లు
- తెలంగాణలో మొత్తం మున్సిపల్ కార్పొరేషన్లు ఎన్ని?......... 6
- కొడిగుడ్ల ఉత్పత్తిలో తెలంగాణ స్థానం?.........3
- గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ {G H M C } కు మరో పేరు?......... బల్దియ
- నల్లగొండ జిల్లలో మిషన్ కాకతియ పైలాన్ ను ఎక్కడ నిర్మించారు?...........చౌటుప్పల్,
- మహబూబ్ నగర్ జిల్లలో ఉన్న జల పాతం?..........మల్లెలతీర్డం
- తెలంగాణలో నిమ్మ జాతి పండ్లకు ప్రసిద్ది చెందినా ప్రాంతం?.........నకరేకల్, నల్గొండ జిల్లా
- అత్యధిక మండలాలు కల్గిన జిల్లా?..........మహబూబ్ నగర్
- తొలి విద్య శాఖా మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ప్రాతి నిద్యం వహించిన నియోజక వర్గం?..........సూర్యాపేట,నల్గొండ జిల్లా
- తెలంగాణ లో రెండవ అతి పెద్ద వ్యవసాయ మార్కెట్ ఎక్కడ కలదు?......సూర్యాపేట,నల్గొండ జిల్లా
- మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ {MANNU}ఎక్కడ ఉన్నది?........ గచ్చిబౌలి,హైదరాబాద్
- తెలంగాణలో రెండవ అతి పెద్ద జాతర ఏది?.......లింగామంతుల జాతర,సూర్యాపేట
Subscribe to:
Posts (Atom)