కాకతీయులు - పరిపాలనాంశాలు Telangana History


కాకతీయులు సంప్రదాయ రాజరికం అమలు చేశారు. సంప్రదాయ పద్ధతిలో అంటే తండ్రి నుంచి కుమారునికి వారసత్వంగా రాజ్యం సంక్రమిస్తుంది. రాజులకు ప్రజా శ్రేయస్సు, ప్రజలకు రాజులయెడల అనురక్తి, కలిగించేటట్లు ఎలా పరిపాలన చేయాలో, కాకతీయుల నుంచే కన్పిస్తుంది.


ఏ రాజులైనా నేర్చుకోవాల్సిన అంశాలు?


-ముఖ్యంగా కాకతీయులు ప్రజల్లో జాతీయభావం, సమైక్య దృష్టి, దేశాభిమానం, పెంపొందించాల్సిన అవసరం ఉందని గ్రహించిన తొలి రాజులు. కాకతీయ సామ్రాజ్యాన్ని అనన్య సామాన్యంగా తీర్చిదిద్ది, అనితర సాధ్యమైన రీతిలో పాలించారు.

పాలనలో గమనించాల్సిన విషయాలు


-రాజ ముద్ర: వరాహ లాంఛనం- వరాహాన్ని కాకతీయులు తమ రాజముద్రగా ఎంచుకోవడానికి గల ముఖ్య కారణం?

-హిరణ్యాక్షుడు భూమిని చాపలా చుట్టి సముద్రంలో పడవేసినప్పుడు విష్ణువు వరాహావతారం ఎత్తి భూమిని రక్షించాడు. అలాగే భూమిని రక్షించాలనే ఉద్దేశంతో కాకతీయులు వరాహాన్ని రాజలాంఛనంగా చేసుకున్నారు.

-గరుడ ధ్వజం: అంటే వారి జెండా మీద గరుడ పక్షి బొమ్మ ఉండేది. (గరుడ ఎంత ఎత్తులో వెళ్తున్నా భూమిపై ఉన్న చిన్న సూదిని కూడా గుర్తించగలిగే శక్తి గరుడ పక్షికి ఉంది. ప్రజల సమస్యలేంటో తెలుసుకొని పరిపాలించే శక్తి ఒక్క కాకతీయులకే సాధ్యం)

-విశాల ప్రపంచంలో అనంత కాలగమనంలో జన్మించిన కోట్లాది స్త్రీలల్లో అఖండ మణిద్వీపం రుద్రాంబ (రుద్రమదేవి మహారాజు, మొట్టమొదటి హిందూ సామ్రాజ్ఞి)ను అందించిన ఘనత కాకతీయలదే.

-(హిందూ రాజవంశాలలో స్త్రీని సింహాసనం ఎక్కించిన అపూర్వ గౌరవం కాకతీయులది).

-ప్రథమంగా ఒక వేదికపై రెండు సింహాసనాలు వేసుకొని పాలించడం, దత్తత ద్వారా కిరీటం లభించే పద్ధతి కూడా కాకతీయ వంశంలోనే జరిగింది.

-మంత్రిమండలి: రాజ్యక్షేమం, ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు పనిచేయడం, రాజుకు సహకరించేందుకు మంత్రి పరిషత్తు ఉండేది.

-భట్టారక నియోగాధిపతి: సమర్థ్దులైన మంత్రుల ఎంపికలో కీలకపాత్ర పోషించేదిగా శ్రీనీలకంఠశాస్త్రి, పరబ్రహ్మశాస్త్రి, గులాం యాజ్దానీ, సోమశేఖర శర్మ, సింథియా తాల్‌బోట్ (అమెరికా) మొదలైన వారు కాకతీయుల పాలనపై స్పష్టమైన అభిప్రాయాలు తెలిపారు.
రాజరిక సిద్ధాంతం: కాకతీయుల కాలంలో రాజు దైవాంశ సంభూతుడు. రాజుకు అసమానమైన అధికారాలు ఉండేవి.

-హిందూ ధర్మశాస్ర్తాలను అనుసరించి రాజనీతి జరిగింది. యాజ్ఞవల్కుని న్యాయస్మృతిని కేతన, విజ్ఞానేశ్వరీయం పేరుతో తెలుగులో అనువదించాడు.(విజ్ఞానేశ్వరుడు మితాక్షరి పేరుతోయాజ్ఞవల్కస్మృతికి వ్యాఖ్యానం రచించెను. దానిని తెలుగులో కేతన అనువదించెను. ఇది తెలుగులో వచ్చిన తొలి న్యాయశాస్త్రం. శిక్షాస్మృతి, ఇది భారతదేశంలో మనుస్మృతి, యజ్ఞవల్కస్మృతి, పరాశస్మృతి, నారదస్మృతి మొదలైనవి. లీగల్ గ్రంథాలు, శిక్షాస్మృతులు రచించిరి. తెలుగులో తొలిసారిగా కేతన కాకతీయుల కాలంలో రచించడం గర్వకారణం)

-రాజనీతిపై కాకతీయుల కాలంలో స్వయంగా ప్రతాపరుద్రుడు -1 నీతిసారం రచించెను. ఇంకనూ బద్దెన (సుమతిశతకం) నీతిశాస్త్రముక్తావళి, మడికి సింగన సకలనీతి సమ్మతం మొదలైనవి రచించెను.


కాకతీయుల రాజ్య విభజన

రాజ్య విభజన: కాకతీయులు పాలనా సౌలభ్యం కోసం రాజ్యాన్ని కొన్ని నాడులుగా విభజించారు. నాడులను తిరిగి స్థలాలుగా విభజించారు. స్థలాలను తిరిగి గ్రామాలుగా విభజించారు. ఒక స్థలంలో 10 నుంచి 60 గ్రామాలు ఉంటాయి. వాడి భూమి, సీమ అనే పదాలు నాడు అనే పదానికి సమానార్థాకాలు. పన్నిద్దరు ఆయంగార్లు అని అంటారు. (ఆయం అనగా పొలం. గ్రామంలో కొంత పొలం(ఆయం) వీరికి ఇవ్వబడుతుంది. వీరికి జీతాలుండవు. రాజు ఈ విధంగా ఇచ్చిన దానిపై (ఆయం) పన్ను కట్టనవసరం లేదు. అంతేకాకుండా గ్రామంలో పండిన పంటలో కొంతభాగం ఆయంగార్లకు ఇస్తారు)

-1. కరణం 2. రెడ్డి 3. తలారి 4. పురోహితుడు 5. కమ్మరి 6. కంసాలి 7. వడ్రంగి 8. కుమ్మరి 9. చాకలి 10. మంగలి 11. శెట్టి 12. చర్మకారుడు

-పై వారందరూ పన్ను మినహాయింపు పొందిన పొలం కల్గియున్నారు. కాబట్టి ఆయంగార్లుగా పిలవబడ్డారు.

నాయంకర విధానం 


-కాకతీయుల పరిపాలన ముఖ్యంగా జాగీర్దారీ లేదా భూస్వామ్య వ్యవస్థ (ప్యూడలిజం)పై ఆధారపడి ఉంది. వీరు ప్రవేశపెట్టిన ఈ విధానాన్ని నాయంకర విధానం అని అంటారు. రాజ్యాన్ని అనేక రాష్ర్టాలుగా విభజించి వాటికి పరిపాలనాధిపతులుగా సైన్యాధ్యక్షులను నియమించేవారు. వీరిని నాయంకరులు అని అంటారు. వీరు ఎక్కువగా వెలమ, రెడ్డి, బ్రాహ్మణ కులాలకు చెం దినవారే.

-ఈ నాయంకరులు చక్రవర్తి (రాజు) నుంచి భూములను పొంది వాటి నుంచి వచ్చే ఆదాయంతో చతురంగ బలాలను పొషించి, యుద్ధసమయాల్లో చక్రవర్తికి తోడ్పడేవారు. సాధారణంగా రాజ్యంలోని దాదాపు నాల్గోవంతు భూమి ఈ నాయంకరుల ఆధీనంలో ఉం డేది. కాకతీయులు ప్రవేశపెట్టిన ఈ నాయంకర విధానం తర్వాత విజయనగర రాజుల కాలంలో అభివృద్ధి చెంది ఆంగ్లేయ రాజ్య నిర్మాణం వరకు అవిచ్ఛిన్నంగా వర్ధిల్లింది.


పరిశ్రమలు


-పాల్కురికి సోమనాథుడు పండితారాధ్య చరిత్రలో 20కి మించి వస్ర్తాలను గురించి పేర్కొన్నాడు. ఓరుగల్లులో చిత్తరువులు రాసే 1500 ఇండ్లు ఉన్నాయని. ఏకామ్రనాథుడు రాశాడు. పాల్కురికి బసవపురాణంలో 50 రకాల వస్ర్తాల పేర్లును పేర్కొన్నాడు. కొన్ని ముఖ్యమైన పరిశ్రమల పేర్లు...
1. నిర్మల్ - కత్తుల పరిశ్రమ -ఇక్కడి కత్తులు సిరియా దేశానికి ఎగుమతి అయ్యేవి.
2. గోల్కొండ - వజ్రాల పరిశ్రమ - ప్రపంచంలోనే అగ్రస్థానం - తర్వాత గొల్కొండ రాజ్యానికి మార్పు
3. ఓరుగల్లు - రత్నకంబళ్లు తివాచీలు, సువాసనలు ఇచ్చే బియ్యం
4. చండూరు - కంచు గంటలు, పాత్రలు, పల్లాలు (పల్లెములు)
5. నర్సాపురం - నౌకాపరిశ్రమ. ఏకైక నౌకానిర్మాణపరిశ్రమ

-ఇంకనూ పారిశ్రామిక రంగంలో ఆనాడు తెలంగాణ రాష్ట్రం ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. అనేక విధాల వస్ర్తాలు వాడుకలో ఉన్నాయి. సన్నని నూలు వస్ర్తాలు, అద్దకపు వస్ర్తాలు విదేశాలకు ఎగుమతి అయ్యేవి. ఈ ఎగుమతులతో ఆసియాలోనే భారతదేశానికి, కాకతీయ రాజ్యానికి విదేశీ ఆదాయం ఎక్కువగా వచ్చేది. దీంతో తుర్కష్కులకు కంటగింపు అయ్యెను.

-కాకతీయుల సముద్రవ్యాపారం విశేషంగా వృద్ధిచెందుట వల్ల నౌకా పరిశ్రమ చాలా అభివృద్ధి చెందింది. కాకతీయుల ముఖ్యమైన నౌకా కేంద్రం మోటుపల్లి. నేడు అది ప్రకాశం జిల్లాలో ఉంది. (క్రీడాభిరామంలో దేశీ, విదేశీ వస్త్ర వ్యాపారం గురించిన వివరాలు ఉన్నాయి)
కృష్ణపట్నం,మోటుపల్లి, మైసోలియా, ఘంటసాల నాటి ప్రధాన ఓడరేవులు. సుగంధ ద్రవ్యాలు, దంతవస్తువులు, విదేశాలకు ఎగుమతి అయ్యేవి. ఈ ప్రాం తంలో గణపతి దేవుడు అభయ శాసనం వేయించాడు. సముద్రపు దొంగలను అణిచివేసెను.

ముఖ్యమైన అధికారులు


-అష్టాదశ తీర్థులు - 18 మంది అధికారులు (మడికి సింగన గ్రంథంలో వివరాలు కలవు)
-మౌర్యుల కాలంలో ప్రజా అధికారులను తీర్థులు అనేవారు.
-నగరి శ్రీకావళి: అంతఃపురాన్ని ఎల్లవేళలా కాపాడే రక్షకుడు.
-భహత్తర నియోగాధిపతి: 72 శాఖలకు పై అధికారిగా పనిచేసేవారు.
-ఆయంగార్లు: 12 మంది. వీరినే పన్నిద్దరు ఆయంగార్లు అంటారు.

ముఖ్య ఉద్యోగులు


- తలారి - గ్రామ రక్షకుడు
--కరణం - గ్రామ లేఖకుడు
-బోయ - గ్రామ సేవకుడు
- సంధి విగ్రహీ - విదేశాంగ మంత్రి



ముఖ్యమైన పన్నులు


1. తోటపై తోంఘ్ట పన్ను
2. పచ్చిక బీళ్లపై పుల్లరి పన్ను వసూలు చేసేవారు. పన్ను వసూలు చేయు అధికారాలను కాలకాండు అంటారు.
3. దశబంద ఇనాము: 1/10 వంతు చెరువుల కింద వ్యవసాయం చేసే రైతులు చెల్లించాలి
4. ఇల్లరి: గృహాలపై విధించే పన్ను దక్షిణ భారతదేశంలోనే కాకతీయుల కాలంనాడు ఎక్కువ పన్నులు విధించబడెను.
5. పుట్టిపహండి: ధనరూపంలో చెల్లించే పన్ను
6. పుట్టి కొలుచు: ధాన్య రూపంలో చెల్లించే పన్ను
7. మగము: వర్తకుల నుంచి భూయజమానులు వసూలు చేయు పన్ను
8. సింగినాదం- హెచ్చరికలు చేసేవార్కి చెల్లించు పన్ను

ముఖ్యమైన రవాణా మార్గాలు


1. ఓరుగల్లు నుంచి మంథెన వరకు
2. బళ్లారి నుంచి చిత్తూరు వరకు
3. రాయచూర్ నుంచి కొలనుపాక వరకు
4. బీదర్ -కొలనుపాక, కళ్యాణి - కొలనుపాక వరకు
5. బీదర్ - పటాన్‌చెరు - గోల్కండ వరకు
6. వరంగల్ నుంచి వాడపల్లి వరకు ప్రధానమార్గాలుగా చెప్పవచ్చును.


ముఖ్యమైన నాణేలు


-గద్వాణం : బంగారు నాణెం
-రూకము: వెండి నాణెం
- అన్నెము : రాగి నాణెం
-తార : వెండినాణెం
-నాణెల గురించి బాపట్ల శాసనంలో వివరించబడెను. తర్వాత 18వ శతాబ్దం నాటికి దక్షిణ భారతదేశంలో పోర్చుగీసులు క్రుజుడో నాణెం ప్రవేశపెట్టిరి. దాంతో గద్వాణం ప్రస్తుతం డాలర్ ముందు రూపాయిలా బక్కచిక్కి పోయింది.

భూమి విభజన


1. వెలిమ చేను: మెట్టభూమి, వర్షాధార భూమి, (పన్నులు తక్కువ)
2. నీరు భూమి: పల్లపు ప్రాంతం, మాగాణి భూమి (పన్నుల భారం ఎక్కువ)
3. తోట భూమి : ఉద్యానవనాలు, తోటల భూములు (2 లేదా 3 సంవత్సరాల కొకసారి పన్నుల విధింపు)
కోల/గడ: 1. భూమిని కొలుచు సాధనం. అంటే ఇది 32 జానలు కలిగి ఉండును.
2. మర్తురు : 50 నుంచి 100 సెంట్ల
భూమిని మర్తురు అనేవారు



సైన్య విధానం:


కాకతీయ రాజులు అపారమైన సైన్యాన్ని పోషించారు. వీరు చతురంగ బలాలను కలిగిఉన్నప్పటికీ రథ బలానికి ఎక్కువగా ప్రాముఖ్యతనివ్వలేదు.
1. అత్యధిక సంఖ్యలో కాల్బలం (సైనికులు) -
9 లక్షలు
2. అశ్వబలం (గుర్రాలు) - 20 వేలు
3. గజబలం (ఏనుగులు) - 100




సైన్యాధిపతులు:


1. జాయపసేనాని - గజసేనాని - గణపతిదేవునికి
2. మారయ - అశ్వసేనాని - ప్రతాపరుద్రునికి

బిరుదులు పొంది ఉన్నారు. నాయంకరుల సైన్యం కంటే చక్రవర్తుల సైన్యం ఎక్కువగా ఉండేది. కాకతీయ వీరులు కత్తిసాములో జగత్ ప్రసిద్ధులు. రాజులు ధైర్యసాహసాలు ప్రదర్శించిన సైనికులకు గ్రామాలను బహుమానంగా ఇచ్చుటయే గాక...
1. కోట గెల్పట్టు
2. ద్వీపల ముంతక
3. వెలనాటి ధూషక వంటి బిరుదులు ఇచ్చి గౌరవించేవారు.
Dr.Murali


యూజీసీనెట్ - జూన్ 2015 UGC NET 2015


దేశవ్యాప్తంగా నిర్వహించే యూజీసీ - నేషనల్ ఎలిజిబిలిటి టెస్ట్(నెట్) నోటిఫికేషన్‌ను సీబీఎస్‌ఈ విడుదల చేసింది. ప్రతి ఏడాది నెట్ పరీక్షను రెండుసార్లు నిర్వహిస్తారు. జూన్, డిసెంబర్ నెలల్లో పరీక్షలు ఉంటాయి. అయితే ఈ ఏడాది 2015 జూన్‌కు సంబంధించిన ప్రకటన వెలువడింది. నెట్ పరీక్షలు జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్(జేఆర్‌ఎఫ్), అసిస్టెంట్ ప్రొఫెసర్ (లెక్చరర్‌షిప్) కోసం నిర్వహిస్తారు.



నోటిఫికేషన్ విడుదల..


- యూజీసీనెట్ పరీక్షను గత ఏడాది డిసెంబర్-2014 నుంచి సీబీఎస్‌ఈ నిర్వహిస్తోంది. ఈ పరీక్షను దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు. 84 విభాగాలకు పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్షలకు సుమారు 7 నుంచి 8 లక్షల మంది హాజరవుతారు. తెలంగాణలో 22-26 వేల మంది అభ్యర్థులు పరీక్షలు రాస్తారు.

- అర్హతలు: పీజీలో సంబంధిత అంశంలో కనీసం 55 శాతం మార్కులు ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులకు 50 శాతం మార్కులు ఉంటే చాలు. పీజీ చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తులు చేయవచ్చు.

-వయస్సు: జేఆర్‌ఎఫ్‌కు జూన్ 1, నాటికి జనరల్ అభ్యర్థులకు 28 సంవత్సరాలు, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యు అభ్యర్థులకు 5 సంవత్సరాల వయోపరిమితి సడలింపు ఉంటుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్ (లెక్చరర్‌షిప్) కోసం వయోపరిమితి లేదు.

దరఖాస్తు చేయడం ఎలా ?


పరీక్షకుదరఖాస్తులు చేసేవారు www.cbsenet.nic.in లాగిన్ కావాలి. ఇందులో దరఖాస్తులు నింపడానికి అభ్యర్థి మెయిల్ ఐడీ ద్వారా లాగిన్ కావాలి. ఒక పాస్‌వర్డ్‌ను మనం ఎంపిక చేసుకోవాలి. వాటి ద్వారా ఫాంను పూర్తిచేయాలి. పూర్తిచేసిన దరఖాస్తు అనంతరం చలాన్ వస్తుంది. చలాన్‌ను సిండికేట్ బ్యాంకు /కెనరా/ ఐసీఐసీఐ బ్యాంకుల్లో చెల్లించాలి. లేదా ఆన్‌లైన్‌లో క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా ఫీజులు చెల్లించవచ్చు. దీనికి సర్వీస్ ట్యాక్స్ చెల్లించాలి. ఫీజులు చెల్లించిన తర్వాత దరఖాస్తులలో ఫొటో, సంతకం అప్‌లోడ్ చేయాలి. తర్వాత దరఖాస్తును సమర్పించాలి. అనంతరం ఒక కాపీని ప్రింట్ తీసుకోవాలి.

పరీక్షా కేంద్రాలు..


యూజీసీనెట్ పరీక్షను 84 విభాగాలకు నిర్వహిస్తారు. 89 నగరాలలో పరీక్షా కేంద్రాలు ఉంటాయి. ఇందులో హైదరాబాద్ కేంద్రం నుంచి 22 నుంచి 26 వేల మంది పరీక్షలు రాస్తారు. హైదరాబాద్‌లో 31 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. గత ఏడాది హైదరాబాద్‌లో 22474 మంది అభ్యర్థులు దరఖాస్తులు చేశారు. ఇందులో 16141 మంది పరీక్షలు రాయగా 572 మంది అర్హత సాధించారు.


మార్పులు.. చేర్పులు..


యూజీసీనెట్ పరీక్ష 2015 జూన్‌కు సంబంధించి పలు మార్పులు చేశారు. దరఖాస్తుల ఫీజులు పెంచారు. ఈ పరీక్షకు సంబంధించి ప్రింట్ దరఖాస్తులు సంబంధిత కో ఆర్డినేటర్ సెంటర్‌లో సమర్పించాల్సిన అవసరం లేదు. గతం లో అడ్మిట్‌కార్డు ఆధారంగా పరీక్ష హాల్‌టికెట్ అందించేవారు. కానీ నేడు హాల్‌టికెట్స్, పరీక్షా కేంద్రాల వివరాలు పరీక్షకు 15 రోజుల మందు వెబ్‌సైట్‌లో ఉంచుతారు.

పరీక్ష సమయాలు.. విధానం


మొదటి పేపర్ జనరల్ స్టడీస్ ఉంటుంది. ఈ పేపర్ ఉదయం 9.30 నిమిషాల నుంచి 10.45 వరకు నిర్వహిస్తారు. అనంతరం పేపర్-2లో 10.45 నుంచి 12 గంటల వరకు ఉంటుంది. మూడో పేపర్ 1.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉంటుంది. ఓఎంఆర్ షీట్‌లో బాల్ పాయింట్ పెన్‌తో పరీక్షలు రాయాలి. ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్షలు ఉంటాయి. ఏ, బీ, సీ, డీలుగా ఉంటాయి. వాటిలో ఒకటి సమాధానంగా గుర్తించాలి.

పరీక్షలు.... ఫలితాలు


జూన్-2015 పరీక్షను జూన్ 28న నిర్వహిస్తారు. నెట్ పరీక్షలు ముగిసిన వెంటనే అక్టోబర్ చివరివారంలో ఫలితాలు విడుదల చేస్తారు. ఆయా విభాగాలు, కేటగిరిల వారీ గా ఫలితాలు ఉంటాయి.

ఎంపిక ఎలా చేస్తారు ?


ug-cet-list

యూజీసీ నెట్ పరీక్ష నిబంధనల ప్రకారం మూడు పేపర్లలో అర్హత సాధించాలి. మొదటి పేపర్ (జనరల్)లో అర్హత సాధిస్తేనే మిగత రెండు పేపర్లు మూల్యాంకనం చేస్తారు. మొత్తం మూడు పేపర్లలో టాప్ 15 శాతం మందిని అర్హత సాధించినట్లుగా గుర్తిస్తారు. ఇందులో 5 శాతం టాపర్స్‌ను జేఆర్‌ఎఫ్‌కు ఎంపిక చేస్తారు.


ఎంపిక ఎలా చేస్తారు ?

యూజీసీ నెట్ పరీక్షకు అర్హత మార్కులు సంబంధిత పేపర్లలో క్వాలిఫై కావాలి. అనంతరం టాప్‌లో నిలిచిన 15 శాతం మందిని ఎంపిక చేసి, విభాగాలు, కేటగిరీలు (బీసీ, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్) వారీగా 6 నుంచి 7 శాతం మంది అభ్యర్థులు అర్హత సాధించినట్లు ప్రకటిస్తారు.
పోటీ అధికంగా ఉన్న విభాగాలు
యూజీసీ నెట్ పరీక్షకు కొన్ని విభాగాలలో పోటీ అధికంగా ఉంది. వీటిలో ఆర్థికశాస్త్రం, ఎంబీఏ, ఇంగ్లీష్, కంప్యూటర్‌సైన్స్, కామర్స్, తెలుగులో పోటీ అధికంగా ఉంటుంది. ఇతర భాషల వారు జపనీస్, అస్సాం లాంటి కోర్సులకు తక్కువగా పోటీ ఉంటుంది.
 ఫెలోషిప్‌లు..
యూజీసీ నెట్ అర్హత సాధించడం ద్వారా అభ్యర్థులు పలు ఫెలోషిప్‌లు పొందవచ్చు. వాటిలో జేఆర్‌ఎఫ్ సాధించినవారికి రూ.25 వేలు అందిస్తున్నారు. సీనియర్ జేఆర్‌ఎఫ్ రూ.30వేలు అందిస్తున్నారు. కంటిజెన్సీల రూపంలో రూ.50వేలు అదనంగా పొందవచ్చు. ఇతర ఫెలోషిప్‌లలో కూడా నెట్‌కు ప్రాధాన్యత ఉంటుంది. పలు రకాల ఫెలోషిప్‌లకు అర్హతలలో ఒకటిగా ఉంటుంది.
నెట్‌తో ఉపయోగాలు
నెట్‌తో పలు ఉపయోగాలు ఉన్నాయి. జేఆర్‌ఎఫ్ పొందడంతో పాటు, అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హత, డిగ్రీ కళాశాలలో లెక్చరర్ పోస్టులకు అర్హత పొందవచ్చు. పీహెచ్‌డీ ప్రవేశాలలో ప్రాధాన్యత ఉంది. అదేవిధంగా పలు ఫెలోషిప్‌లలో కూడా వీటికి అధిక ప్రాధాన్యత, మార్కులు ఉన్నాయి. అంతేకాకుండా జూనియర్ లెక్చరర్స్‌కు పదోన్నతులకు అవకాశం ఉంది. ప్రిన్సిపల్ పోస్టులలో కూడాదీనికి ప్రాధాన్యత ఇస్తారు.
ఫిర్యాదులు.. సమస్యల నివేదన
 యూజీసీ నెట్ పరీక్షకు సంబంధించిన వివరాలు www.cbseugcnet.nic.inలో గాని, ఫిర్యాదుల కోసం net@cbse.gov.inలోగాని, ఫ్యాక్స్ నెం 0120-2427 772లోగాని, ఫోన్ నంబర్లు 70423 99524, 70423 99525 నెంబర్లు పనిచేస్తాయి.
ముఖ్యమైన తేదీలు:

-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో, చివరితేదీ: మే 15
-పరీక్షతేదీ: జూన్ 28
-వెబ్‌సైట్: www.cbsenet.nic.in
-పరీక్ష ఫీజు: జనరల్ రూ. 600/, బీసీ అభ్యర్థులకు రూ.300/-. ఎస్సీ/ఎస్టీ/ పీహెచ్ అభ్యర్థులకు రూ.150.
పారదర్శకంగా పరీక్షలు
 నెట్ అర్హతతో విద్యార్థులు పలు రకాల ఉపయోగాలు ఉన్నాయి. విద్యార్థులు నెట్ పరీక్ష ద్వారా ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు. పరీక్షలను హైదరాబాద్ కేంద్రంలో ఎక్కువగా రాస్తుంటారు. పరీక్ష రాసే అభ్యర్థులను బట్టి కేంద్రాలు నిర్ణయిస్తాం. నెట్‌కు దరఖాస్తులు చేసిన అభ్యర్థులు తప్పనిసరిగా తప్పులు చూసుకోవాలి. ఫొటో ఆప్‌లోడ్‌లో జాగ్రత్తలు అవసరం. దరఖాస్తులు చేసేటప్పుడు అభ్యర్థి తప్పనిసరిగా ఉం డాలి. లాగవౌట్ చేయకపోతే ఫొటోలో మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. ఫొటో, సంతకంలో ఏదైనా తప్పులు దొర్లితో వెబ్‌సైట్‌లో ఆప్షన్ ద్వారా సరిచేసుకోవచ్చు.

నెట్ ప్రిపరేషన్ విధానం


నెట్... ఏటేటా క్రేజ్ పెరుగుతున్న జాతీయస్థాయి పరీక్ష. రీసెర్చ్ కోసం కొందరు, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం కోసం మరికొందరు దీన్ని రాస్తారు. 84 విభాగాల్లో నిర్వహించే ఈ పరీక్షలో మొత్తం మూడు పేపర్లు ఉంటాయి.
పేపర్ -1:

-దీనిలో మొత్తం 60 ప్రశ్నలు ఉంటాయి. వీటిలో 50 ప్రశ్నలకు జవాబు గుర్తిస్తే సరిపోతుంది.

-అన్ని ప్రశ్నలకు సమాధానాలు గుర్తిస్తే మొదటి 50 ప్రశ్నలను మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు.
-ప్రతి ప్రశ్నకు రెండు మార్కుల చొప్పున మొత్తం 100 మార్కులు.

ఏ ప్రశ్నలు ఇస్తారు?


ఈ పేపర్‌లో మొత్తం 10 విభాగాలు ఉన్నాయి. అవి టీచింగ్ ఆప్టిట్యూడ్, రీసెర్చ్ ఆప్టిట్యూడ్, కమ్యూనికేషన్, రీడింగ్ కాంప్రెహన్షన్, రీజనింగ్, లాజికల్ రీజనింగ్, డేటా ఇంటర్‌ప్రిటేషన్, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, పీపుల్ అండ్ ఎన్విరాన్‌మెంట్, హయ్యర్ ఎడ్యుకేషన్ సిస్టమ్, గవర్నెన్స్, పాలిటీ అండ్ అడ్మినిస్ట్రేషన్ విభాగాలు ఉంటాయి.

- బోధనలో ఉపయోగపడే పద్ధతులు, టెక్నాలజీలను ఎంత ప్రతిభావంతంగా ఉపయోగించుకోగలరు? ఆలోచన ప్రక్రియలో అభ్యర్థి సామర్థ్యం ఎలా ఉంది? తదితర అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. విద్యావ్యవస్థపై, పర్యావరణంపై ప్రశ్నలు ఉంటాయి.

-మనోవిజ్ఞానశాస్త్రంలోని నూతన సిద్ధాంతాలు, బోధనాభ్యసన ప్రక్రియలో మార్పులు, నిర్మాణాత్మక సిద్ధాంతం, బోధనలో ఉపాధ్యాయ, విద్యార్థి పాత్రలపై, శిశుకేంద్రిత విద్య, నిరంతర సమగ్ర మూ ల్యాంకనం వంటి అంశాలపై అవగాహన చాలా ముఖ్యం. వీటిపై అనువర్తిత ప్రశ్నలు వస్తాయి. పరిశోధన పద్ధతుల ప్రశ్నలు మౌలిక భావనలనే అడుగుతున్నారు
-ఆధునిక సమాచార సాధనాలు, ప్రసార సాధనాలు, కంప్యూటర్, నెట్, సోషల్‌నెట్‌వర్కింగ్‌ల ప్రభావం బోధనాభ్యసన పరిశోధన ప్రక్రియలో ఎలా ఉపయోగపడగలవో కూడా తెలుసుకోవాలి.

-5, 6, 7 యూనిట్లు అభ్యర్థి అర్థమెటిక్, రీజనింగ్ సామర్థ్యానికి సంబంధించినవి. వీటి గురించి ఆందోళన పడాల్సిన పనిలేదు. ఇవి పదోతరగతి స్థాయిలోనే ఉంటాయి. వీటిపై పట్టుసాధిస్తే కచ్చితంగా 15 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించవచ్చు. అంటే 30 మార్కులు మీకు వచ్చినట్లే.

-మరో ముఖ్యాంశం గత ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్ చేయాలి. వీటి నుంచి లేదా వీటిలో వచ్చిన ప్రశ్నల మాదిరి ప్రశ్నలు కనీసం 20 శాతం రావడానికి ఆస్కారం ఉంది. గత మూడేళ్ల ప్రశ్నపత్రాలు, జవాబులు యూజీసీ సైట్‌లోఉంటాయి.

పేపర్ 2,3 ప్రిపరేషన్


-ఇవి అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్టుకు సంబంధించినవి.

-పేపర్ 2లో 100 మార్కులు (50 ప్రశ్నలు, 2 మార్కులు చొప్పున)

-పేపర్ 3లో 150 మార్కులు (75 ప్రశ్నలు, రెండు మార్కుల చొప్పున)

-ప్రస్తుతం మూడు పేపర్లలో వచ్చిన మార్కుల ఆధారంగా ఉత్తీర్ణతను నిర్ణయిస్తున్నారు. కాబట్టి తప్పనిసరిగా మూడు పేపర్లను ముఖ్యమైనవిగానే భావించాలి.

-పేపర్ 2,3లో పీజీ స్థాయిలో సిలబస్ నుంచి ప్రశ్నలు ఇస్తారు.

-పేపర్ -2 కంటే పేపర్ 3లో ప్రశ్నల కఠినత్వ స్థాయి ఎక్కువగా ఉంటుంది.

-పేపర్ 2లో కేవలం ప్రాథమిక భావనలు, వాస్తవాలు,వాటి మధ్య సంబంధాలపైనే ఉంటాయి.

-రెండుపేపర్ల సిలబస్ ఒకటే అయినా పేపర్ 3లో అంశాలు పేపర్ 2లోని అంశాలకు విస్తరింపుగా ఉంటాయి.
-సిలబస్‌లోని ప్రతి అంశాన్ని లోతైన అవగాహనతో చదివితే నెట్‌లో విజయం తథ్యం.

అర్హత మార్కులు


జనరల్ అభ్యర్థులు మొదటి పేపర్‌లో 40 శాతం, రెండో పేపర్‌లో 40 శాతం, మూడో పేపర్‌లో 50 శాతం మార్కులు అర్హత మార్కులుగా నిర్ణయించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులకు వరుసగా 35, 35, 40 శాతం మార్కులుగా అర్హతగా నిర్ధారించారు. మొత్తం మూడు పేపర్లకు గాను 350 మార్కులు ఉంటాయి.


Tags:UGC NET- JUNE 2015 - National Eligibility Test (NET)UGC NET 2015 Notification, Online Application Form, Exam UGC NET 2015 Exam dates, Syllabus, Application Form UGC NET June 2015 Notification, Latest Updates, Exam Alerts UGC NET 2015 Searches related to UGC NET  june 2015  ugc net 2015  csir  ugc net 2015 notification  ugc net june 2015  ugc net answer key  ugc net syllabus  ugc net admit card 2015 ugc net result, UGC NET- JUNE 2015 - National Eligibility Test (NET)UGC NET 2015 Notification, Online Application Form, Exam UGC NET 2015 Exam dates, Syllabus, Application Form UGC NET June 2015 Notification, Latest Updates, Exam Alerts UGC NET 2015 Searches related to UGC NET  june 2015  ugc net 2015  csir  ugc net 2015 notification  ugc net june 2015  ugc net answer key  ugc net syllabus  ugc net admit card 2015 ugc net result, UGC NET- JUNE 2015 - National Eligibility Test (NET)UGC NET 2015 Notification, Online Application Form, Exam UGC NET 2015 Exam dates, Syllabus, Application Form UGC NET June 2015 Notification, Latest Updates, Exam Alerts UGC NET 2015 Searches related to UGC NET  june 2015  ugc net 2015  csir  ugc net 2015 notification  ugc net june 2015  ugc net answer key  ugc net syllabus  ugc net admit card 2015 ugc net result, UGC NET- JUNE 2015 - National Eligibility Test (NET)UGC NET 2015 Notification, Online Application Form, Exam UGC NET 2015 Exam dates, Syllabus, Application Form UGC NET June 2015 Notification, Latest Updates, Exam Alerts UGC NET 2015 Searches related to UGC NET  june 2015  ugc net 2015  csir  ugc net 2015 notification  ugc net june 2015  ugc net answer key  ugc net syllabus  ugc net admit card 2015 ugc net result

Followers