ఉద్యోగాలకు వయోపరిమితి పదేళ్లు పెంపు

మన తెలంగాణ/హైదరాబాద్: నిరుద్యోగులు ఎంత గానో ఎదురు చూస్తున్న నోటిఫికేషన్లకు మరో నెల రోజుల వరకు ఆగాల్సిందే. నోటిఫికేషన్ల విడుదల ముందుకు చేయాల్సిన ప్రక్రియ మరికొంత జరగాల్సి ఉంది. దీంతో పాటుగా మొదటి సారి ఉద్యోగాల భర్తీకి శ్రీ కారం చుడుతున్నందున ఈ సారి కొంత జాప్యం తప్పదని సూచిస్తున్నారు. అధికారిక ప్రక్రియలో ఏమైనా లోపాలు జరిగితే కోర్టుకు వేళ్లితే మొదటికే మోసం వస్తుందని… అందుకు కొద్దిగా అలస్యమైనా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాకే నోటిఫికేషన్ విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ప్రభుత్వం వైపు నుంచి ఉద్యోగా భర్తీకి కొంత వరకు లైన్ క్లియర్ చేసింది. అయితే అంతర్గతంగా ఇంక కొంత ప్రక్రియ జరగాల్సి ఉందని చేబుతున్నారు.
సర్వీస్ కమిషన్ విడుదల చేసే ఉద్యోగాలకు స్కీమ్ ఎగ్జామినేషన్ ను ఖరారు చేస్తూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వయో పరిమితిని పదేళ్లకు పెంచుతూ జీవో కూడా విడుదల చేశారు. ఇక పబ్లిక్ సర్వీస్ కమిషన్ సిలబస్‌ను ప్రకటిం చాల్సి ఉంటుంది. సిలబస్‌ను ప్రకటించడానికి కమిషన్ అధికారులు ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది. ఒక్కో సబ్జెక్టులో నిపుణులైన వారిచే సంప్రదింపులు జరుపుతు న్నారు. అయితే ఈ కసరత్తు కొలిక్కి రావడానికి మరికొంత సమయం పడుతుందని సమాచారం. సిలబస్ కొలిక్కి వచ్చినా ముందుగా ఏ పోస్టులను భర్తీ చేయనున్నారో ఆ పోస్టులకు సంబంధించిన సిలబస్ ను మాత్రమే ప్రకటించాలని గతంలోనే టిఎస్‌పిఎస్‌సి నిర్ణయించింది. దీని వల్ల కోచింగ్ సెంటర్ల దోపిడికి, నిరుద్యోగులను మభ్యపెట్టే సంస్థలకు అడ్డుకట్టవే యగలుగుతామని అంచనాతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
దీని వల్ల పట్టణ ప్రాంత విద్యార్థులతో పాటు గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కూడా సమాన అవకాశాలు కల్పించవాళ్లం అవుతామనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. సిలబస్ ప్రకటన తరువాత విద్యార్థులు ప్రిపేర్ కావడానికి కొంత సమయం ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఈ సారి తెలంగాణ కోణంలో స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ రూపొందించినందున కొత్త సిలబస్ ఎక్కువగా ఉంటుందని.. దాని కోసం సమ యం ఇవ్వాలని సూచిస్తున్నారు. ఈ వినతిని అంగాకరిం చాల్సిందేనని నిపుణులు సైతం సూచిస్తున్నారు. సిలబస్ ప్రకటన తరువాత పేపర్ సెట్టింగ్ కోసం నిపుణులు సంప్ర దింపులతో అధిక సమయం పడుతుందని చేబుతున్నారు.
కొందరు జీవోలు విడుదల కాగానే అంత అయి పొయినట్లుగా భావిస్తున్నారని… ఆ జీవోలు ఆర్ధిక శాఖ ఆమోదం పొందడం .. ఆ తరువాత శాఖాధిపతుల నుంచి అనేక వివరాలతో లేఖ సర్వీస్ కమిషన్ కు చేరడానికే ఎక్కు వ సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. కోర్టుల్లో సమస్యలు రాకుండా అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉం టుందని.. దీని కోసమే అధిక సమయం పడుతుందం టున్నారు. ఇలా పలు రకాల అధికారిక ప్రక్రియలు పూర్తి అయి నియామక నోటఫికేషన్‌లు రావడదానికి నిరుద్యో గులు ఉహించినంత తొందరగా సాధ్యం కాదని చేబుతున్నారు. దీంతో ఆగస్టు చివరి వరకు మొదటి నోటిఫికేషన్‌కు ఎదురుచూడక తప్పదు.
54 సంవత్సరాలకు ఉద్యోగమా…!
ఉద్యోగ నియామకాల్లో వయో పరిమితిని సడలిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతమున్న వయో పరిమతిని 10 సంవత్సరాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ జీవో రాబోయే ఒక సంవత్సరం పాటు మాత్రమే అమల్లో ఉంటుంది. ఆ తరువాత పాత వయో పరిమితి అమల్లోకి వస్తుంది. ప్రస్తుతం జనరల్ కేటగిరి వారికి 34 సంవత్సరాల వయస్సున్న వారు సైతం దరఖాస్తు చేసుకోవచ్చు. బిసి, ఎస్‌సి, ఎస్‌టి, వారికున్న 39 సంవత్సరాలను 49కి, వికలాంగులకు 54 సంవత్సరాల వయస్సు వారికి అవకాశం రానుంది. అయితే వయో పరిమితి పెంపుతో 54 సంవత్సరాల వారికి అవకాశం ఇస్తే వారికి ఉద్యోగం వచ్చినా… నాలుగు సంవత్సరాల పాటు మాత్రమే ఉద్యోగం చేసే అవకాశం ఉంటుంది.
బీసీ, ఎస్‌సి, ఎస్‌టి 49 సంవత్సరాలకు ఉద్యోగం వచ్చినా మరో 9 సంవత్సరాలు మాత్రమే ఉద్యోగం చేయనున్నారు. ఇలా అతి తక్కువ కాలం ఉద్యోగంలో ఉండటం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదని.. కనీసం 20 సంవత్సరాలు ఉద్యోగంలో ఉన్న వారికే పెన్షన్ వస్తుందని గుర్తుచేస్తున్నారు. ఆ వయస్సు వారు ఇప్పటికే జీవితంలో స్థిరపడి ఉంటారని.. వారి పిల్లలు కూడా ఉద్యోగాల కోసం దరఖాస్తు చేయడానికి అర్హత సాధించి ఉంటారని… ఈ సమయంలో అవకాశం రావడంతో పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చంటున్నారు

మహేష్‌బాబు జెంటిల్‌మెన్ - శృతిహాసన్

గబ్బర్ సింగ్ చిత్రం సూపర్ హిట్‌తో శృతిహాసన్‌కు తెలుగులో డిమాండ్ పెరిగింది. అప్పటి వరకు చిన్న హీరోల సరసన నటించిన శృతి. ఒక్కసారిగా స్టార్ హీరోయిన్‌గా మారింది. రవితేజ, ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఇప్పుడు శ్రీమంతుడు చిత్రంలో మహేష్‌బాబుతో జోడి కట్టింది. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకుడు. ఈ చిత్రం ఆగస్ట్ 7న విడుదలకు సిద్దమైంది. ఈ సందర్బంగా శృతి హాసన్ చిత్ర విశేషాల గుర్చి ముచ్చటించారు. మహేష్‌బాబుతో నటించిన అనుభూతి? మహేష్‌బాబుతో కలసి పని చెయాలని ఎప్పటి నుండో ఉంది. శ్రీమంతుడి చిత్రంతో కలసి పని చేస్తున్నాం. పెద్ద స్టార్ అయినా మహేష్ చాల సింపుల్‌గా ఉంటారు. అందరితో కలసి పోయి అందరికి ఎనర్జీని పెంచుతాడు. సరదాగా ఉంటారు. శ్రీమంతుడు చిత్రం మీకు ఎలా వచ్చింది? దర్శకుడు కొరటాల శివ కథ చెప్పారు. నచ్చింది. కాలేజి స్టూడెంట్ పాత్ర నాది. దర్శకుడు నా పాత్రను తీర్చిదిద్దిన తీరు అద్బుతం. శ్రీమంతుడు లో నా పాత్ర ఎంత బాగుంటుందో చిత్రం చూశాక తెలుస్తుంది. చారుశీల పాత్ర ? చారుశీల పాత్ర చాల సహజంగా ఉంటుంది. చారుశీల పాత్ర డిఫెరెంట్‌గా ఉంటుంది. ఈ పాత్రలో కామెడి ఉండదు. ఆలోచనాత్మకంగా, సున్నిత బావోద్వేగాలతో సాగే పాత్ర ఇది. ఈ చిత్రంలో సొంతంగా పాడలేదే ? సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌ను అడగాలి. తమిళ్‌లో అవకాశం ఇస్తే పాడాను. శ్రీమంతుడు పాటలు బాగున్నాయి. సూపర్ హిట్ అయ్యాయి. ఆడియో సక్సెస్ అయినందుకు చాల హ్యాపిగా ఉంది. దర్శకుడు కొరటాల శివ గుర్చి చెప్పాండి? దర్శకుడు శివ వ్యక్తిగతంగా చాల కామ్‌గా ఉంటారు. ఆయన చిత్రీకరణ చాల అద్బుతంగా ఉంటుంది. పాత్రల్లో మాత్రం మంచి భావోద్వేగాలు పలికిస్తారు. తనకి కావాలసిన ఔట్ ఫుట్‌ను చాలా చక్కగా రాబట్టుకుంటారు. జగపతిబాబు తో నటించినప్పుడు ఎలా ఉంది? జగపతిబాబు గారు ప్రేండ్లీగా ఉంటారు. ఒక సీనియర్ ఆర్టిస్ట్‌తో పని చెయడం చాల హ్యాపిగా ఉంది. చాల సరదాగా ఉంటారు. ఖాళీ టైమ్‌లో ఏమి చెస్తారు? ఖాళీ సమయంలో టివి చూస్తాను. ఎక్కువగా పుస్తకాలు చదువుతాను, ఫ్రెండ్స్‌తో కాలక్షేపం చేస్తాను. లేడి ఓరియేంటేడ్ చిత్రాలు చేస్తారా? అలాంటిది ఏమి ఉండదు. క్యారెక్టర్ బట్టి పాత్ర ఉంటుంది. ప్రతి సినిమాలో అని మంచి పాత్రలు ఉంటాయి. సినిమా బట్టి ప్రధాన పాత్ర ఉంటుంది తప్ప లేడి ఓరియేంటేడ్ అంటు సినిమాలు ఉండవు. మీ చెల్లితో కలసి నటించే అవకాశం ఉందా? తప్పకుండా ఉంటుంది. ఇద్దరికి సరిపడ మంచి సబ్జెట్ దొరికితే తప్ప కుండా కలసి పని చేస్తాం. నెస్ట్ చిత్రాలు? తెలుగు, తమిళ్, హింది భాషల్లో ప్రస్తుతం బిజిగా ఉన్నాను. మంచి చిత్రం ఏ భాషలో వచ్చినా వదలను.


రాజకీయాల్లో ఉన్నది చాలు, ఇక వైదొలగుతా

సింగపూర్‌లో ఎన్‌ఆర్‌ఐ ఎంపీ 55 ఏళ్ల వయసుకే రాజకీయాల నుంచి వైదొలగుతున్నట్టు ప్రక టించారు. పంజాబ్‌కు చెందిన ఇంద్రజిత్‌ సింగ్‌ (55) బతుకుదెరువు కోసం సింగపూర్‌ వెళ్లారు. అక్కడే స్థిరప డిపోయారు. మంచి వాగ్ధాటి కలిగిన ఆయన అక్కడివా రికి చేరువై 1997 నుంచి ఎంపీగా బాధ్యతలు నిర్వర్తి స్తున్నారు. అయితే ఇప్పుడు రాజకీయాల నుంచి వైదొల గుతున్నానని, త్వరలో జరగనున్న ఎన్నికల్లో పోటీ చేయడంలేదని ఆయన ఫేస్‌ బుక్‌ ద్వారా తెలిపారు. ఆయన వ్యాపారవేత్తగా కూడా రాణించడం విశేషం.

1993 నాటి పేలుళ్లపై మరిన్ని ఆసక్తికర విషయాలు !


మార్చి 12, 1993న 13 వరుస పేలుళ్లు సంభవించాయి. * తొలి బాంబు మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో బొంబాయి స్టాక్‌ ఎక్సే్చంజ్‌ భవంతి బేస్‌ మెంటులో పేలింది. ఆపై 3:40 వరకూ వివిధ ప్రాంతాల్లో పేలుళ్లు జరిగాయి. * మాహింలోని మత్స్యకారుల కాలనీ, ప్లాజా సినిమాస్‌, జవేరీ బజార్‌, కఠా బజార్‌, హోటల్‌ సీ రాక్‌, హోటల్‌ జుహూ సెంటార్‌, ఎయిర్‌ ఇండియా బిల్డింగ్‌, సహారా ఎయిర్‌ పోర్టు, వర్లి, పాస్‌ పోర్టు ఆఫీస్‌ ప్రాంతాల్లో బాంబులు పేలాయి. * వీటిల్లో ఎక్కువ బాంబులు స్కూటర్లలో పెట్టారు. హోటళ్లలో పేలిన బాం బులను బ్రీఫ్‌ కేసుల్లో ఉంచారు. * ఈ పేలుళ్లలో 250 మందికి పైగా మరణించగా, 700 మంది గాయ పడ్డారు. వీరిలో వందల మంది వివిధ అవయవాలను కోల్పోయారు. * ఈ పేలుళ్ల వెనుక పాకిస్థాన్‌ ఐఎస్‌ఐ హస్తముందని, అండర్‌ వరల్‌డ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం సూచనల మేరకు ఆయన సహచరులు టైగర్‌ మెమన్‌, ఆయూబ్‌ మెమన్‌, యాకూబ్‌ మెమన్‌లు ప్రణాళికలు రూపొందించారని విచారణ సంఘాలు గుర్తించాయి. * స్మగ్లర్లు హాజీ అహ్మద్‌, హాజీ ఉమర్‌, తౌఫిక్‌ జలివాలా, అస్లామ్‌ం భట్టి, దూవోద్‌ జాట్‌ లు ఆర్థిక సహాయం అందించారు. * గ్రౌండ్‌ లెవల్‌లో పేలుళ్లకు సహకరించి వారంతా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నవారే. * బాబ్రీ మసీదు కూల్చివేతకు ప్రతీకారంగా ఈ పేలుళ్లు జరిగాయన్న ఆరో పణలు ఉన్నాయి. * పేలుళ్లు జరిపేందుకు నియమించుకున్న వారికి పాకిస్థాన్‌, దుబాయ్‌లలో శిక్షణ ఇచ్చారు. వీరికి బాంబులను ఎలా పేల్చాలో నేర్పారు. పేలుడు పదార్థాలను పాకిస్థాన్‌ సమకూర్చింది. * పేలుళ్లను ముందుగా పసిగట్టడంలో నిఘా విభాగం, కోస్‌ట గార్‌డ విఫల మైందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. * ఇదే కేసులో అక్రమంగా ఆయుధాలను కలిగివున్నాడని, సాక్ష్యాలను నాశ నం చేసేందుకు ప్రయత్నించాడని బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌పై వచ్చిన అభి యోగాలు నిజమేనని కోర్టు తేల్చి శిక్ష విధించింది. అయితే, బాంబులు పేల్చాలన్న ప్లాన్‌ వెనుక ఆయన ప్రమేయం లేదని తేలింది. * పేలుళ్ల సమయంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శరద్‌ పవార్‌ ఉన్నారు. * మొత్తం 100 మందిని ఈ కేసులో నిందితులుగా తేల్చారు. * కేసులో ప్రధాన నిందితులు దావూద్‌ ఇబ్రహీం, టైగర్‌ మెమన్‌, ఆయూబ్‌ మెమన్‌లు ఇప్పటికీ తప్పించుకు తిరుగుతున్నారు. * ఈ పేలుళ్లు ముంబై అండర్‌ వరల్‌డలో చీలికలు తెచ్చింది. * అప్పటివరకూ దావూద్‌ అనుచరులుగా ఉన్న చోటా షకీల్‌, సాధూ షెట్టి వంటి వారు దావూద్‌ను వీడి బయటకు వచ్చారు.


Followers