తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాలు- కలెక్టర్లు- ఎస్పీలు, కమీషనర్లు, డీసీపీలు


కొత్త జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీలను, కొత్త కమిషనరేట్లకు కమిషనర్లు, డీసీపీలను ప్రభుత్వం ఖారారు చేసింది. విజయదశమి సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడుతున్న 21 జిల్లాలకు కలెక్టర్లను నియమిస్తూ, పాత జిల్లాల కలెక్టర్లను కూడా బదిలీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. రేపు ఉదయం 11:13 గంటలకు మంత్రులతొ పాటు కలెక్టర్లు కొత్త జిల్లాల ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. ఇంకా కొన్ని జిల్లాలకు ఎస్పీలు ఖరాలు కావాల్సి ఉంది.

జిల్లా కలెక్టర్లు
ఆదిలాబాద్- జ్యోతి బుధ్ద ప్రసాద్
మంచిర్యాల - ఆర్వీ కర్నన్
నిర్మల్ - ఇలంబర్తి
ఆసిఫాబాద్( కొమరం భీం) - చంపాలాల్

నిజామాబాద్- యోగితా రాణా
కామారెడ్డి - సత్యనారాయణ

కరీంనగర్- సర్పరాజ్ అహ్మద్
పెద్దపల్లి - అలుగు వర్షిణి
జగిత్యాల - శరత్
సిరిసిల్ల (రాజన్న) - కృష్ణ భాస్కర్

వరంగల్ అర్భన్- అమ్రపాలి
వరంగల్ (రూరల్)- పాటిల్ ప్రశాంత్ జీవన్
మహబూబాబాద్ - ప్రీతి మీనన్
జనగామ - దేవసేన
జయశంకర్ - మురళి

ఖమ్మం- లోకేశ్ కుమార్
కొత్తగూడెం (భద్రాద్రి) - రాజీవ్ జీ హన్మంతు

నల్లగొండ- గౌరవ్ ఉప్పల్
సూర్యాపేట - సురేంద్ర మోహన్
యాదాద్రి - అనిత రామచంద్రన్

మెదక్ - భారతి
సంగారెడ్డి-మాణిక్ రాజ్
సిద్దిపేట్- వెంకట్రామరెడ్డి

హైదరాబాద్- రాహుల్ బొజ్జా
రంగారెడ్డి- రఘునందన్ రావు
మేడ్చల్ (మల్కాజిగిరి) - ఎంవీరెడ్డి
వికారాబాద్ - దివ్య

మహబూబ్ నగర్- రోనాల్డ్ రోస్
నాగర్ కర్నూలు - శ్రీధర్
జోగులాంబ - రజత్ కుమార్ షైనీ
వనపర్తి - శ్వేతామహంతి

కమీషనర్లు, డీసీపీలు
వరంగల్ కమిషనర్- అకున్ సబర్వాల్
కరీంనగర్ కమిషనర్- కమలహాసన్ రెడ్డి
సెంట్రల్ జోన్ డీసీపీ- జ్యోయల్ డెవిస్
సిద్దిపేట్ కమిషనర్- శివకుమార్
నిజామాబాద్ కమిషనర్ -కార్తీకేయ
మాదాపూర్ డీసీపీ- విస్సా ప్రసాద్
రామగుండం కమిషనర్- విక్రజిత్ దుగ్గల్
ఖమ్మం కమిషనర్-షానవాజ్ ఖాసీం
శంషాబాద్ డీసీపీ- పద్మజారెడ్డి


జిల్లాల ఎస్పీలు
సూర్యాపేట ఎస్పీ - పరిమళ నూతన్
నల్లగొండ- ప్రకాశ్ రెడ్డి
యాదాద్రి- యాదగిరి
సిరిసిల్ల - విశ్వజిత్
నిర్మల్- విష్ణు వరియార్
మెదక్- చందన దీప్తి
కొత్తగూడెం- అంబర్ కిషోర్ ఝా
కామారెడ్డి-
జగిత్యాల- అనంత్ శర్మ
ఆదిలాబాద్- శ్రీనివాస్
వనపర్తీ జిల్లా ఎస్పీ- రోహిణి
నాగర్ కర్నూల్- సింగన్ వార్
ఆసిషాబాద్- సన్ ప్రీత్ సింగ్
ఆచార్య జయశంకర్ జిల్లా- భాస్కర్
గద్వాల జిల్లా ఎస్పీగా- విజయ్ కుమార్






కొత్త జిల్లాలకు ఇంటర్ విద్యాధికారులు


హైదరాబాద్: కొత్తగా ఏర్పడిన జిల్లాలకు ఇంటర్ విద్యాధికారులను నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
కరీంనగర్, జగిత్యాల- ఎల్ సుహాసిని
మంచిర్యాల, పెద్దపల్లి- ప్రభాకర్ దాసు
సిరిసిల్ల-రామచందర్
ఆదిలాబాద్, నిర్మల్, ఆసీఫాబాద్- బి. నాగేందర్
నిజామాబాద్, కామారెడ్డి-ఓదెన్న
వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్- కేవీ ఆనంద్
మహబూబాబాద్, భూపాలపల్లి-ఎస్ కే అహ్మద్
జనగామ-వై. శ్రీనివాస్
ఖమ్మం, కొత్తగూడెం- ఆండ్రూస్
సూర్యపేట- ప్రకాష్ బాబు
నల్లగొండ, యాదాద్రి- హన్మంతరావు
హైదరాబాద్-కాదీనాథ్
శంషాబాద్-మహమూద్ అలీ
మహబూబ్‌నగర్, వికారాబాద్- విజయలక్ష్మీ
మల్కాజ్‌గిరి- ప్రభాకర్
వనపర్తి, నాగర్ కర్నూల్- సుధాకర్
సంగారెడ్డి- కిషన్
సిద్ధిపేట, మెదక్- నాగమునికుమార్


అణు సామర్థ్యం కలిగిన పృథ్వి-II క్షిపణి ప్రయోగం విజయవంతం

భారత్ పూర్తీ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన అణు ఆయుధాలను మోసుకుపోగల సామర్ధ్యం గల పృథ్వి-II క్షిపణిని రక్షణశాఖ 26 నవంబర్ 2015న ఒడిషా తీరంలోని చాందీపూర్ విజయవంతంగా పరీక్షించింది.
భూతలం నుంచి భూతల లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం కలిగిన ఈ క్షిపణిని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటిఆర్)లోని మూడవ లాంచ్ కాంప్లెక్స్‌ నుంచి మొబైల్ లాంచర్ పైనుంచి ఉదయం 12 గంటల 10 నిమిషాలకు సైన్యంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ ఈ పరీక్షను నిర్వహించింది.
350 కిలో మీటర్ల దూరంలో లక్ష్యాన్ని చేధించగల సామర్ధ్యం ఉన్న పృథ్వి-2 క్షిపణి 1000 కిలోల బరువు ఉన్న అణు ఆయుధాలను మోసుకోనిపోగల సామర్ధ్యం కలిగి ఉంది.
2003లో సైన్యం అమ్ముల పొదిలో చేరిన పృథ్వి క్షిపణ మన దేశం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇంటిగ్రేటెడ్ క్షిపణి అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా రూపొందించిన తొలి క్షిపణి.
2014లో కూడా ఈ క్షిపణిని ఒడిషా తీరంలోని చాందీపూర్ పరీక్షించారు.

మాతృ మూర్తి కి క్రొత్త నిర్వచనం..



కడుపుతో ...ఆమె
..................................
తాళికట్టిన మరునిముషంలోనే
కట్టిన తాళితో అమె మీద..
సర్వ హక్కులూ..నాకు వచ్చేశాయి.
ఆమె నా భార్య
పెళ్ళి పేరుతోనో..ప్రేమ పేరుతోనో..
ఆమె మీద..
పగబట్టిన నేను...
పూర్తి మగజంతువుగా మారిపోయి
చీకటిలో.. నాలుగు గోడల మధ్య చేసిన..
రహస్య యుద్ధ జ్వాల
పరుగెత్తుకుంటూ వెళ్ళి..ఆమె లోపలెక్కడో దాగున్న
మాత్రుబిందువును..తాకగానే..
ఆమె ఓ కొత్త రక్త చరిత్రగా..ఆమె ఓ కొత్త స్రుస్టి ధరిత్రిగా మారిపోతుంది.
నన్ను.. స్పర్శించిన చేతులు అవే..
నన్ను.. ప్రేమించిన స్పర్శ అదే..
కానీ ఆమె నన్ను తాకగానే ..
అమె కాక కొత్త గా మరెవ్వరో నన్ను
తాకుతున్న అనుభూతి మొదలవుతుంది.
ఆమె వయిపు నేను చూడగానే
ఆమెలో దాక్కుని
నన్నెవ్వరో కొత్త గా
చూస్తున్న అనుభూతి కలుగుతుంది..
స్రుష్టి అనేది దిగ్బ్రాంతంగా..విభ్రాంతంగా
నా కళ్ళ ఎదుటే
ఓ రూపాన్ని సంతరించుకుంటూంది
మనిషి రూపంలో..ఓ దీపాన్ని వెలిగించటానికి
మరో మనిషి ..స్త్రీ మూర్తి.. దీపంలా
నిలువునా కాలుతుండటాన్ని
నా ఎదురుగానే..నేను చూస్తాను..
కర్తను నేనయినా..
క్రియ మొత్తం ఆమెదే..
కత్తిని నేనయినా
గాయం మాత్రం ఆమెదే
2
కస్టానికి..సుఖానికి మధ్య
ఎండిపోయిన ఓ చెలమ బావిని తవ్వి..
అందులో చిరునవ్వుతో స్నానం చేస్తున్నట్లు
ఆమె కస్టాన్ని అనుభవిస్తూనే
సుఖాన్ని అనుభూతిస్తున్నట్లు
చుట్టూ ప్రపంచాన్ని ఎంతగా భ్రాంతీకరిస్తుందో..
సుఖం పేరుతో ఆమె కష్టాన్ని తలకెత్తుకున్న విషయాన్ని
ఆమే కాదు.. చుట్టూఎవరూ కూడా గ్రహింఛరు
ఓ అసంకల్పిత మరణమో..ఓ సంకల్పిత కొత్త జీవమో తెలీకుండా
ఆమె ఓ నవ్వుకో ..ఓ దుహ్ఖానికో అంతిమ ద్వారంగా
నిల్చుందన్న విషయాన్ని కూడా ఎవరూ గ్రహించరు.
గుక్కెడు నీళ్ళు కూడా కడుపులో ఇమడవు
తీరని దాహంతో పైకి నవ్వుతూ
లోపల్లోపల విలవిలాడుతూ ఉండాలి.
పిడికెడు మెతుకులు కూడా కడుపులో ఆగవు.
తీరని ఆకలితో పైకి నవ్వుతూ
లోపల్లోపల గిలగిల లాడుతూ ఉండాలి.
సుఖించటమంటే... దుహ్ఖించటానికే అన్న
మాటలకు కొత్త రెక్కలొస్తాయి.
ఎడారి బావిలో ఎక్కడో నీళ్ళూరుతున్నట్లు
ఆమె సరీరం లో మరో శరీరం ఏదగటం
స్పస్టంగా పైకే తెలుస్తూనే ఉంటుంది
తనకు తానుగా ఓ దైవరూపంగా
మారిన ఆ స్త్రీ దివ్యత్వంలో ఇమిడిపోయిన
ప్రాణ ప్రవాహాన్ని స్పర్శించటానికి ..ఎంతటి మహాయోధుడయినా
తనకు తానుగా..ఓ నక్షత్ర హారతిలా మారి
ఆమె ముందు సాస్టాంగ పడ వలసిందే.
3
స్త్రీ కడుపుతో ఉండటమంటే
నిముష నిముషానికి రూపాన్ని మార్చుకునే
మండుతున్న నిప్పురవ్వని రహస్యంగా
సమూహంలో కడుపులో దాచుకోని..
మంత్రించిన మంత్రజలాన్ని తాగినట్టు
కొత్త జీవితానికి..నాందీ వాక్యంగా మారటమే.
ఆమె జీవితంలో పగళ్ళన్నీ మండిపొతున్న
మంచుముక్కలవుతాయి.
ఆమె జీవితంలో రాత్రుళ్ళన్నీ మేల్కోని మండుతున్న
చలిమంటలుగా మిగులుతాయి.
తన శరీరం బరువుకి తనే కుంగిపోతుంటే
నిలువెత్తు అద్దంలో ..తన ప్రతిబింబమే తనకు
భయంగొల్పేలా మారిపోయి ....
ఆమె అద్దాన్ని చూసుకోవటాన్ని మర్చిపోయినప్పుడు
అయ్యో అంటూ ఆ..పుణ్యం నాదే అనిపిస్తుంది..
అయ్యో అంటూ ఆ.. పాపం కూడా నాదే అనిపిస్తుంది.
అది కామమో ..అది మోహమో ..
మొగవాడి మూడు నిముషాల పోరాటానికి
తన శరీరాన్ని స్వరాలుగా మార్చుకున్నందుకు
కనిపించకుండా సహస్ర జననాలు ఒక్కచోటే అయినట్టు
రహస్యంగా సహస్ర మరణాలు ఒక్క చోట పోగుపడ్డట్టు
ఊపిరికి ..ఊపిరికి కిమధ్య
ఒక్క చోటే...సత్యాన్ని..అసత్యాన్ని చూసినట్లు..
ఆమె శరీరం మొత్తం గగుర్పాట్లతో
ఆమె శరీరం మొత్తం అదిరిపాట్లతో..
ఎప్పుడూ లేని కొత్త ఉలికిపాట్లకు లోనవుతూ ఉంటుంది
4
ఓ హత్యానంతర ద్రుశ్యాన్ని..
హత్యకు ముందుగానే చూస్తూ..చూపిస్తూ
దేహంతో మొదలయిన ప్రయాణం
తొమ్మిది నెలలతో దేహంతోనే అంత్యాంకానికి జేరుతుంది
అది జననమో.. మరణమో...తెలీని
అవ్యక్త నిరామయ అయోమయంలో నమ్రతగా నిలబడినచోట
ప్రతినిముషం కళ్ళముందు ఏవో దెయ్యాలు తిరుగుతున్నట్టనిపిస్తుంది.
తను బతుకుతుందో ..తను చచ్చిపోతుందో తెలీని సందిగ్ధంలో
అమానుష ఏకాంతంలో ఆమెనే ముణిగిపొతూ ఉంటుంది
కడుపులో ఉన్న శిశువు అటూ ఇటూ తిరిగినఫ్ఫుడు
కాల్లతో లోపల్నించే తన్నినప్పుడు ..
కళ్ళవెంట తెలియకుండానే నీళ్ళు తిరుగుతుంటాయి.,
నెలలు నిండిన అమెని చూసినప్పుడు
ఎలుగెత్తి మరీ ""నన్ను క్షమించు""అని ఆమెకి చెప్పాలనిపిస్తుంది.
ఏదో తెలియని పస్చాత్తాపం
నన్ను నిలువునా కోస్తున్నట్టనిపిస్తుంది.
గుంభనంగా దాచుకున్నదాచుకున్న భయం
బయటకు తన్నుకొస్తూండగా ..బేలగా ..జాలిగా నా వైపు చూస్తూ
ఆమె ఆసుపత్రి లోపలకు వెళ్ళిపోతుంది.
తన రక్తాన్ని తన ప్రాణాలని ధారబోసి
పురుడు అవగానే ఆమె నా వైపు చూసిన చూసిన మొదటిచూపులో
మ్రుత్యువును జయించిన అనుభూతి...
నన్ను స్త్రీత్వం ముందు చేతులు మోడ్చి
శిలగా మిగిల్చిన నిజత్వంలో..నన్ను తండ్రిగా మిగిల్చిన
ఆమె కరుణత్వాన్ని తల్లిపేరుతో కొలవాలా
భార్య పేరుతో నిర్వచించాలా..?
................................................
త్వరలో విడుదల అవుతున్న
""మీరొకప్పుడు బ్రతికుండే వారు""
కొత్త కవితాసంపుటి లోనుంచి
.................................. కొనకంచి లక్ష్మి నరసింహా రావు: facebook link

telangana history books in telugu pdf


Click here for Telangana History in Telugu PDF

Click here for Telangana History Important Dates PDF

For More Telangana History Book Click Here


    TAGS
    telangana history books in english pdf, telangana history books in telugu pdf, telangana history reference books, telangana history text books in English, telangana history text books in telugu


తెలంగాణ : కొత్తగా 2200 పోస్టులు?

జిల్లాల పునర్వ్యవస్థీకరణ నేపధ్యంలో మరిన్ని పోస్టులకు ప్రభుత్వం ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తోంది. ఇటీవలే రెవెన్యూ శాఖలో 2వేలకు పైగా పోస్టులకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన ప్రభుత్వం.. మరో 2200 పోస్టులు భర్తీ చేయాలని యోచిస్తోంది. పలు శాఖలలో ఖాళీగా ఉన్న పోస్టులకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తోంది. జిల్లాల పునర్వ్వస్థీకరణతో కొత్తగా 120 మండలాలు, 21 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటవుతున్న విషయం విదితమే. ఇప్పటి లెక్క ప్రకారం ప్రతి జిల్లా కలెక్టరేట్‌కు 89 పోస్టులు అవసరమవుతాయి. అది కూడా 1977నాటి లెక్కల ప్రకారం చూస్తే అన్ని పోస్టులు కావాలి. కాగా, ఇప్పుడు జిల్లాల పునర్‌వ్యవస్థీకరణతో వాటి జనాభా మరింత పెరిగే వీలున్నందున, పాలన సజావుగా సాగాలంటే కొత్త పోస్టుల మంజూరు తప్పనిసరి అని ప్రభుత్వం భావిస్తోంది. వివిధ శాఖల్లో 2200 పోస్టులు భర్తీ చేసే అంశాన్ని చురుకుగా పరిశీలిస్తోంది. కాగా, జిల్లా, డివిజన, మండలాల పునర్‌వ్యవస్థీరణతో ఇటీవలే రెవెన్యూశాఖకు కొత్తగా 2109 పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. వీటిలో చాలా పోస్టులను పదోన్నతుల ప్రాతిపదికన, మరికొన్ని డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా భర్తీ చేయనున్నారు. జేసీ అధికారాలపై నేడే నివేదిక
జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ నేపథ్యంలో కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌, జిల్లా రెవెన్యూ అధికారుల అధికారాలకు సంబంధించి సాధారణ పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శి అధర్‌సిన్హా నేతృత్వంలోని కమిటీ సోమవారం ప్రభుత్వానికి నివేదిక అందించనుంది. నివేదిక ఆధారంగా కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు, డీఆర్వోల అధికారాలను వర్గీకరిస్తూ జీవోనెం.77ను(ఉమ్మడి రాష్ట్రంలో కలెక్టర్‌, జేసీ అధికారాల జీవో) సవరిస్తూ ఉత్తర్వులు ఇవ్వనుంది.

Followers