Showing posts with label News. Show all posts
Showing posts with label News. Show all posts

Reliance JIO DTH Plans 2017 | Cheap Price Set Top Box Launched in India

IO Basic / Starting Plan Start from 185 Rupees | Reliance JIO DTH Plans 2017 | JIO DTH Cheap Price Set Top Box Launched in India,  JIO DTH Basic Plans, My Plans, Sports Plans, Value Pack, Gold Plan, Platinum, Silver Plans, JIO DTH Starting Plans.





Now the DISH images Comes Out, and Now its time to Check out the Plans of JIO DTH. The basic plans are very simple. So guys the price are very cheap as compered to other Dish Services. In the SET Of BOX of JIO DTH You will Get a Set TOP Box, One Remote Control, One DISH, Wire, and User Manual. The JIO Dish is come in Market with Welcome Offer. So Guys we will come back again this the Daily Tech News Updates.

JIO DTH Plans Type

  • JIO DTH Basic Home Pack
  • JIO DTH Gold Pack
  • JIO Silver DTH Plans
  • JIO Platinum Pack for DTH
  • JIO DTH My Plans (Customize Channels according to you)

JIO DTH

As now the Reliance Jio DTH is completes its all formality and very soon they are going to provided you the better service  and also going to the set top box for the installations.  As we know that after the installation of the Set top box of the reliance Jio DTH will provided you the better service as others gives you. As we already know that the reliance Jio DTH is work to that how to satisfied their customer. As they will always tried to gives you the better service as usual. So they are going to be installing the set top box in the month of April 2017.  Very soon they launched these schemes. And we also update our post with the latest and new news provided by them.  So now the Jio are planning to the date on which they launched the Set Top Box DTH service. As the month is already choose by them so they now very soon launched their scheme. as it is expected news that they Launched their Jio Broadband service and Jio DTH together.

వనితా.. శతకోటి వందనం!


వనితా.. శతకోటి వందనం! 

 


ఎన్నెన్ని ఆశలో.. ఎన్నెన్ని అంచనాలో.. ఆ ఆశలు, అంచనాలు కుప్పకూలిపోతున్న వేళ.. ఎంత నైరాశ్యమో.. ఎన్ని నిట్టూర్పులో! అంచనాలు 'పతకాల' స్థాయి నుంచి 'పతకం' వరకు పడిపోయి.. అసలు రియోలో భారత్‌ ఖాతా అయినా తెరుస్తుందా అని సందేహంగా చూస్తున్న సమయంలో.. పతక కరవు తీర్చేదెవరని ఆశగా చూస్తున్న తరుణంలో.. ఒకరికి ఇద్దరు వచ్చారు.. ధీర వనితలు! ఒకరు దేశం గాఢ నిద్రలో ఉన్న సమయంలో అసాధారణ పోరాట పఠిమను ప్రదర్శిస్తూ భారత్‌ను పతకాల పట్టిక ఎక్కిస్తే.. ఇంకొకరు దేశమంతా కళ్లు విచ్చుకుని చూస్తుండగా ఉర్రూతలూగించే ఆటతో పతకానందాన్ని రెట్టింపు చేశారు. ఒక్క పతకం.. ఒక్క పతకం..
అంటూ పన్నెండు రోజుల పాటు నిట్టూర్చిన భారతావని.. ఒక్క రోజు వ్యవధిలోనే రెండు పతక ప్రదర్శనలతో మురిసిపోయింది. 'పతక' ఆకలితో నకనకలాడుతున్న భారత క్రీడాభిమానులకు ఆమె దాహం తీరిస్తే.. ఈమె విందే చేయించింది.

హరియాణా కుస్తీ నారి సాక్షి మలిక్‌ అసామాన్యమైన 'పట్టు'దల.. హైదరాబాదీ బ్యాడ్మింటన్‌ తార పూసర్ల వెంకట సింధు అసాధారణ 'రాకెట్‌' వేగం.. రియో ఒలింపిక్స్‌లో భారత్‌ను పతక సంబరంలో ముంచెత్తాయి. సాక్షి అద్భుత పోరాటంతో కాంస్యం గెలిస్తే..

మన తెలుగు తేజం సింధు మరింత గొప్ప ప్రదర్శనతో కనీసం రజతం ఖాయం చేసింది. ఒలింపిక్స్‌లో 'కంచు'ను మించిన ప్రదర్శన చేసిన తొలి భారత మహిళగా చరిత్ర సృష్టించిన సింధును స్వర్ణమూ వూరిస్తోంది. ఆమె ప్రదర్శన ఇంకా అయిపోలేదు. శుక్రవారమే పసిడి పోరు.

గురువారం మైదానంలో సింధు కసి.. ఆమె ఆధిపత్యం చూస్తే.. పసిడి అత్యాశేమీ కాదనిపిస్తోంది. మరి మన సింధు మరో అద్భుతం చేస్తుందా..

భారత క్రీడా చరిత్రలో సువర్ణాధ్యాయాన్ని లిఖిస్తుందా?


పెన్‍డ్రైవ్‌కు పాస్‍వర్డ్ సెట్ చేయటం ఎలా..?


కంప్యూటర్ పరిజ్ఞానం పై అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికి పెన్డ్రైవ్ సుపరిచితమే. పోర్టబుల్ డేటా స్టోరేజ్ డివైజ్గా గుర్తింపుతెచ్చుకున్న ఈ రీరైటబుల్ పరికరం కీలక సమాచారాన్ని స్టోర్ చేయటంలో ప్రముఖ పాత్రపోషిస్తుంది. సులువుగా ఎక్కడికైన క్యారీ చేయవచ్చు. 2జీబి, 4జీబి, 8జీబి, 16జీబి,32జీబి, 64 జీబి.. ఇలా అనేక మెమరీ వర్షన్లలో ఈ యూఎస్బీ డ్రైవ్లు లభ్యమవుతున్నాయి.
పెన్డ్రైవ్లను ముఖ్యంగా డేటా ట్రాన్స్ఫర్కు ఉపయోగిస్తాం. ఏ విధమైన ప్రొటెక్షన్ లేకపోయినట్లయితే మన పెన్డ్రైవ్లోని సమాచారాన్ని ఇతరులు సులువుగా యాక్సెస్ చేసుకునే వీలుంటుంది. పాస్వర్డ్ ప్రొటెక్షన్ను ఏర్పాటు చేసుకోవటం ద్వారా పెన్డ్రైవ్లోని డేటాను ఎవ్వరు యాక్సెస్ చేసుకోలేరు.
పెన్డ్రైవ్కు పాస్వర్డ్ ప్రొటెక్షన్ను ఏర్పాటు చేసుకోగలిగే తీరైన మార్గాలను ఇక్కడ సూచించటం జరుగుతోంది....
మొదటి పద్ధతి BitLock Encryption ద్వారా
పీసీలోని యూఎస్బీ డ్రైవ్లను ప్రొటెక్ట్ చేసేందకు విండోస్ అధికారికంగా అందిస్తోన్న మాన్యువల్ పద్ధతే BitLock Encryption. ఈ ప్రొటెక్షన్ను ఎంపిక చేసుకోవటం ద్వారా పెన్డ్రైవ్ను యూఎస్బీకి కనెక్ట్ చేసే ప్రతిసారి బిట్లాక్ కోడ్ను ఎంటర్ చేసి డ్రైవ్లోని డేటాను యాక్సెస్ చేసుకోవల్సి ఉంటుంది.
ఓవర్హీట్ అవుతోన్న ల్యాప్టాప్ను చల్లబరచటం ఎలా..?
పెన్డ్రైవ్కు బిట్లాక్ ఎన్క్రిప్షన్ను ఏర్పాటు చేయటం ఎలా..?
స్టెప్ 1: మీ పెన్డ్రైవ్ను ముందుగా కంప్యూటర్కు కనెక్ట్ చేయండి.
స్టెప్ 2: పెన్డ్రైవ్ కనెక్ట్ అయిన వెంటనే మైకంప్యూటర్స్లోకి వెళ్లి యూఎస్బీ డ్రైవ్ పై మౌస్తో రైట్ క్లిక్ ఇవ్వండి.
స్టెప్ 3: ఇప్పుడు కనిపించే ఆప్షన్స్ మెనూలో Turn on BitLockrను సెలక్ట్ చేసుకోండి.
స్టెప్ 4: ఇప్పుడు BitLock Encryption డ్రైవ్కు సంబంధించిన ప్రత్యేకమైన మెనూ ఓపెన్ అవుతుంది. ఆ మెనూ బాక్సులో 'use a password to unlock the drive' ఆప్షన్ను టిక్ చేయండి.
స్టెప్ 5: ఆ మెనూలో కనిపించే ఖాళీల్లో మీకు నచ్చిన పాస్వర్డ్ను ఎంటర్ చేసి next బటన్ పై క్లిక్ చేయండి.
స్టెప్ 6: తరువాత కనిపించే మెనూలో save the recovery key to file అనే ఆప్షన్ సెలక్ట్ చేసుకోవటం ద్వారా మీ పాస్‍వర్డ్ను కంప్యూటర్లో ఎక్కడైనా సేవ్ చేసుకొని మరచి పోయినపుడు పొందవచ్చు.
స్టెప్ 7: next బటన్ పై క్లిక్ చేయటం ద్వారా మీ పెన్డ్రైవ్లోని పైల్స్ అన్నీ encrypt చేయబడుతాయి.
స్టెప్ 8: ఎన్క్రిప్సన్ పూర్తయ్యాక close బటన్ పై క్లిక్ చేయండి. పెన్‍డ్రైవ్ను తీసి మరలా పీసీకి కనెక్ట్ చెయ్యండి. ఇక పై మీరు, మీ పెన్డ్రైవ్ను ఎప్పుడు ఏ పీసీకి కనెక్టు చేసినా Password ఎంటర్ చేస్తేనే డ్రైవ్ ఓపెన్ అవుతుంది.
రెండవ పద్ధతి Wondershare USB Drive Encryption ద్వారా..
వండర్షేర్ యూఎస్బీ డ్రైవ్ ఎన్క్రిప్షన్ అనే ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ను ఉపయోగించుకుని మీ పెన్డ్రైవ్కు పటిష్టమైన పాస్వర్డ్ను ఏర్పాటు చేసుకోవచ్చు.
పెన్డ్రైవ్కు వండర్షేర్ యూఎస్బీ ఎన్క్రిప్షన్ను ఏర్పాటు చేయటం ఎలా..?
స్టెప్ 1 : ముందుగా వండర్షేర్ యూఎస్బీ ఎన్క్రిప్సన్ సాఫ్ట్వేర్ను మీ కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసుకోండి.
స్టెప్ 2 : పీసీలో ప్రోగ్రామ్ ఇన్స్టాల్ అయిన వెంటనే ఓపెన్ చేయండి.
స్టెప్ 3 : యూఎస్బీ పెన్డ్రైవ్ను కంప్యూటర్కు కనెక్ట్ చేయండి.
స్టెప్ 4 : వండర్షేర్ యూఎస్బీ డ్రైవ్ ఎన్క్రిప్సన్ మెనూలో మీరు ఎన్క్రిప్ట్ చేయదలచిన డ్రైవ్ను సెలక్ట్ చేసుకోండి.
స్టెప్ 5 : మీరు ఎంత డేటాను ఎన్క్రిప్ట్ చేయాలనుకుంటున్నారో అంతే వాల్యుమ్ను సెలక్ట్ చేసుకుని Install Button పై క్లిక్ చేయండి.
యూట్యూబ్ వీడియోలను తక్కువ డేటా ఖర్చుతో డౌన్లోడ్ చేసుకోవటం ఎలా..?
స్టెప్ 6 : ఇప్పుడు ఓపెన్ అయ్యే Account Information మెనూలో యూజర్ నేమ్, పాస్వర్డ్లను సెట్ చేసుకోండి.
స్టెప్ 7 : సెక్యూర్ ఏరియాను క్రియేట్ చేసేందుకు OK బటన్ పై క్లిక్ చేయండి.

కంప్యూటర్లు దండగ..లక్ష కోళ్లు ఇస్తా పెంచుకోండి



చిప్‌ల వ్యవస్థ కంటే చికెన్ అత్యుత్తమ పరిష్కారం
మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్స్ కంప్యూటర్లకంటే కోళ్ల పెంపకం ఉత్తమమని తేల్చిచెప్తున్నారు. చిప్ల వ్యవస్థ కంటే చికెన్ అత్యుత్తమ పరిష్కారం అనే అభిప్రాయాన్ని గేట్స్ వ్యక్తం చేశారు.
చికెన్ అంటే ఏదో ఓ సాఫ్ట్వేర్ అనుకుంటే పప్పులో కాలేసినట్టే.. పేదరిక నిర్మూలన కోసం బిల్గేట్స్ చూపిస్తున్న కొత్త పరిష్కారం.
పేదవాళ్ల జీవితం మెరుగుపడాలంటేకంప్యూటర్లు, ఇంటర్నెట్ సౌలభ్యం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పేదరికాన్ని రూపుమాపలేవని, పేదవాళ్ల జీవితం మెరుగుపడాలంటే కోళ్ల పెంపకమే సరైన మార్గమని సాఫ్ట్వేర్ దిగ్గజం బిల్గేట్స్ కొత్త భాష్యాన్ని చెప్పారు.
కోళ్ల సంపద ఉంటేకోళ్ల సంపద ఉంటే పేదరికాన్ని సులువుగా పారదోలవచ్చని గేట్స్నోట్స్.కామ్ అనే వెబ్సైట్లో ఆయన పేర్కొన్నారు. పేదరిక నిర్మూలన కోసం తన బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్తో కలిసి హీఫర్ అనే సంస్థతో జతకట్టారు.
లక్ష కోడిపిల్లలను దానంఇందులో భాగంగా సబ్ సహారా ఆఫ్రికాలో రెండు డాలర్లు కన్నా తక్కువ రోజువారీ ఆదాయం కలిగిన కుటుంబాలకు ఒక లక్ష కోడిపిల్లలను మా సంస్థ తరఫున పంపిణీ చేస్తున్నామని బిల్ గేట్స్ చెబుతున్నారు.
పన్నెండు దేశాలలోపేద దేశాలుగా ఉన్న బోలివియా నుంచి ఆప్రికాలోని బుర్కిన్ పాసా లాంటి పన్నెండు దేశాలలో పేదలను ఆదుకోవడానికి ఈ లక్ష కోళ్లను వినియోగిస్తామని ఆయన చెప్పారు.
దాదాపు 30 శాతం వృద్ధి సాధించడం ఆఫ్రికా ప్రాంతంలోని గ్రామీణ ప్రజలు కోళ్ల పెంపకంలో మెరుగైన ఫలితాలను సాధిస్తున్నారని.. దాదాపు 30 శాతం వృద్ధి సాధించడం దృష్టికి వచ్చింది అని గేట్స్ తెలిపారు. ఇతర వనరుల కంటే రాబడి కోళ్ల పెంపకంలోనే ఉందన్నారు.
మేకలు, పశువులతో పోల్చుకుంటేచికెన్, గుడ్ల ద్వారా ఆ ప్రాంత ప్రజలకు పోషక విలువలున్న ఆహారం లభ్యమవుతుందని పేర్కొన్నారు. మేకలు, పశువులతో పోల్చుకుంటే కోళ్లు చాలా చిన్నవి.. అవి తక్కువ ప్రదేశంలో పెంపకానికి అనువుగా ఉంటాయన్నారు. తక్కువ సమయంలో ఆదాయం లభించడం ద్వారా మళ్లీ పెట్టుబడి పెట్టడానికి వీలుంటుందని వెల్లడించారు.
ఒక రైతు 250 కోళ్లు పెంచితే ఏడాదికి 1250 డాలర్లుప్రపంచంలోని పేదల జీవితాల్లో మార్పు తీసుకువచ్చేందుకు కంప్యూటర్లు, ఇంటర్నెట్తో పనిలేదని.. కొందరు కోళ్లు పెంచుకుంటే సరిపోతుందని.. గ్రామీణ ప్రాంతంలో ఒక రైతు 250 కోళ్లు పెంచితే ఏడాదికి 1250 డాలర్లు సంపాదించగలుగుతారని గేట్స్నోట్స్.కామ్లో ఆయన పేర్కొన్నారు.
గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి టెక్నాలజీ గురించి మీరు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి


వైవిధ్యపూరిత జీవనం మన నాగరికతా విలువల్లో భాగం


vaividhyapurita jivanam mana naagarikata viluvallo bhaagam

వైవిధ్యపూ రిత జీవనం, భిన్నత్వంలో ఏకత్వాన్ని కనుగొనే ఆచరణ మన దేశంలో శతాబ్దాలుగా కొనసాగుతున్నాయని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ అన్నారు. ఇవి మన దేశంలో ఒక పరిపాలన కింద, ఒక రాజ్యాంగం కింద, ఒకే విధమైన న్యాయవ్యవస్థ కింద అమలు కావడం పలువురికి ఆశ్చర్యంగా ఉందని ఆయన చెప్పారు. బృందావనంలో శ్రీచైతన్య మహాప్రభు ఆగమనానికి 500 ఏండ్లు పూర్తయిన సందర్భంగా ఆయన ప్రసంగించారు. శ్రీచైతన్యకు మధ్యయుగాల నాటి భారతదేశంలో సంస్కర్తగా, గౌరవనీయుడైన సాధువుగా పేరు గాంచారు. 'మన నాగరికత విలువల వల్లనే దేశంలో 128 కోట్ల మంది ప్రజలు, దాదాపు అన్ని ప్రధాన మతాలకు చెందిన వాళ్లం నివసించగలుగుతున్నాం' అని ప్రణబ్‌ అన్నారు. మన దేశం ప్రజలు ఏడు ప్రధాన మతాలను ఆచరిస్తున్నారని, 100కు పైగా భాషలను, 1,600 మాండలికాలను మాట్లాడుతు న్నారని ఆయన చెప్పారు. మూడు ప్రధాన మానవ జాతి సమూహాలు - ద్రావిడులు, కాకేషియన్లు, మంగోలా యిడ్‌లు ఇక్కడ నివసిస్తున్నారని ఆయన తెలిపారు. ఈశాన్య ప్రాంతంలో మంగోలాయిడ్‌లు, దక్షిణ భారతంలో ద్రావిడులు, దేశ ఉత్తర, వాయువ్య ప్రాంతాల్లో కాకేషియన్‌ జాతికి చెందిన వారు ఎక్కువగా నివసిస్తున్నారని, ఇలాంటి వైవిధ్యం మన దేశంలోనే కనిపిస్తుందని ఆయన చెప్పారు. మన సాంస్కృతిక, నాగరికతా విలువల కారణంగానే ఇలా ఉండగలుగుతున్నా మనీ, వాటిని మనం మన జీవనంలో భాగంగా వృద్ధి చేశామనీ ఆయన అన్నారు. దాద్రీ సంఘటన తర్వాత రాష్ట్రపతి ప్రతి సందర్భంలోనూ సహనం, తదితర విలువల గురించి తన ప్రసంగాల్లో చెబుతున్నారనేది తెలిసిందే.


అణు ఆయుధాలతో పాక్ పన్నాగం

అణు ఆయుధాలు ఉండేది పండగ చేసుకోవడానికి కాదు ఇది ఆనాటి మాట..ప్రపంచాన్నే వణికించిన ఆల్ కాయిదా ఉగ్రవాదులు మా హీరోలు ఇది నేటి మాట..ఇంతకీ ఈ మాటలు అన్నది ఎవరో తెలుసా..పాకిస్తాన్ అనే సామ్రాజ్యాన్ని ఒకప్పుడు ఏలిన అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్. పాకిస్తాన్ బలహీన దేశం కాదని..మా దగ్గర అత్యాధునిక ఆయుధాలు ఉన్నాయని దాడికి ఎప్పుడైనా మేము సిధ్ధమని నాడు చెప్పిన ముషారఫ్ నేడు ఉగ్రవాదమనే పాముకు పాలు పోసి పెంచింది మేమేనని వాస్తవాలను వెల్లడించారు. ఉగ్రవాదులే మా హీరోలని ప్రపంచాన్ని నాశనం చేయడానికే వారిని తయారు చేశామని చెబుతున్నారు. ప్రపంచానికే షాక్ నిస్తున్న ముషారప్ మాటల కథనం స్లైడర్ లో....   అమెరికా ఉగ్ర దాహానికి లక్షల మంది బలి ఉగ్రవాదానికి పాక్ ప్రభుత్వం అందించిన అండదండల బండారం .. పాక్‌కు చెందిన దునియా న్యూస్ చానల్‌కు మాజీ అధ్యక్షుడు జనరల్ ముషారఫ్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉగ్రవాదానికి పాక్ ప్రభుత్వం అందించిన అండదండల బండారం బయటపెట్టారు. 1990లో కశ్మీర్ వేర్పాటువాద ఉద్యమం మొదలైనప్పుడు.. లష్కరేతాయిబా సహా 11 లేదా 12 ఉగ్రవాద సంస్థలు ఏర్పడ్డాయి. వాటికి పాక్ ప్రభుత్వం, సైన్యం పూర్తిగా సహకరించింది. ఆ సంస్థల్లో చేరిన యువకులకు శిక్షణ ఇచ్చాం.. వారు సరిహద్దులు దాటేందుకు సహకరించాం అని పేర్కొన్నారు. పాక్ ప్రభుత్వం సర్వ సౌకర్యాలు సమకూర్చుతున్నది ... 2008 ముంబై ఉగ్రదాడి మాస్టర్‌మైండ్స్ సయీద్, లఖ్వీపై పాక్ చర్యలు తీసుకుంటుందా..? అని ప్రశ్నించగా భారత్‌కు సయీద్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ కానీ, పాక్‌లో యథేచ్ఛగా తిరుగడమే కాకుండా.. విద్వేష ప్రసంగాలు చేస్తున్నాడు. ఇందుకు పాక్ ప్రభుత్వం సర్వ సౌకర్యాలు సమకూర్చుతున్నది అని ముషారఫ్ వెల్లడించారు. హఫీజ్ సయీద్, లఖ్వీలను హీరోలుగా ఆరాధించామని.. కశ్మీర్ స్వేచ్ఛకోసం పోరాడిన హఫీజ్ సయీద్, లఖ్వీలను హీరోలుగా ఆరాధించామని, ఆ తర్వాత మత పోరాటం (జిహాద్) ఉగ్రవాదంగా మారిందని చెప్పారు. ఇప్పుడు వాళ్లు (పాక్‌లోని ఉగ్ర మూకలు) సొంత ప్రజలనే చంపుతుండటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.సయీద్, లఖ్వీని కూడా పాక్ నియంత్రిస్తుందా..? అని మీడియా అడిగిన ప్రశ్నకు ముషారఫ్ సమాధానం చెప్పేందుకు నిరాకరించారు. ఆఫ్ఘన్‌లో సోవియట్ రష్యా సైనిక దళాలను ఎదుర్కొనేందుకు పన్నిన వ్యూహం.. మత పోరాటం (జిహాద్).. 1979లో ఆఫ్ఘన్‌లో సోవియట్ రష్యా సైనిక దళాలను ఎదుర్కొనేందుకు పన్నిన వ్యూహం.. నేడు ప్రపంచాన్నే వణికిస్తున్న ఉగ్రవాదంగా మారింది అని చెప్పారు. రష్యా దళాలపై పోరాటానికి తాలిబన్లకు మేమే సైనిక శిక్షణ ఇచ్చాం. తాలిబన్, హక్కానీ, ఒసామా బిన్ లాడెన్, అల్ జవహరి మాకు హీరోలు. ఆ తర్వాత విలన్లుగా మారారు అని తెలిపారు. 1990ల్లో కశ్మీర్‌లో కల్లోలం సృష్టించేందుకు ఉగ్రవాద సంస్థలను సృష్టించి.. కశ్మీర్‌లో మత తీవ్రవాదాన్ని రెచ్చగొట్టేందుకు లష్కరే తోయిబాతో పాటు పలు ఉగ్రవాద సంస్థలకు శిక్షణతోపాటు పూర్తి మద్దతిచ్చినట్లు పాక్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ తెలిపారు. పాక్ మాజీ మిలటరీ చీఫ్ కూడా అయిన ముషార్రఫ్ 1990ల్లో కశ్మీర్‌లో కల్లోలం సృష్టించేందుకు ఉగ్రవాద సంస్థలను సృష్టించి, శిక్షణ ఇచ్చినట్లు ఓ టీవీ చానల్‌తో అన్నారు. హఫీజ్ సయీద్, లఖ్వీ తదితరులను పాక్ ప్రజలు హీరోలుగా ఉగ్రవాద నాయకులైన లాడెన్, హక్కానీ, అల్ జవహరీ, లష్కరే నాయకులు హఫీజ్ సయీద్, లఖ్వీ తదితరులను పాక్ ప్రజలు హీరోలుగా గుర్తించారన్నారు.'1990ల్లో 'స్వతంత్ర కశ్మీర్' ఉద్యమం మొదలైనప్పుడు లష్కరేతోపాటు 11, 12 చిన్న చిన్న తీవ్రవాద సంస్థలు పుట్టుకొచ్చాయి. ప్రాణాలకు తెగించి పోరాడేలా వారికి శిక్షణతో పాటు పూర్తి మద్దతిచ్చాం. మతతీవ్రవాదం కోసం వారిని పుట్టిస్తే.. అదే ఇప్పుడు ఉగ్రవాదమై మన వారినే చంపుతోంది. అందుకే దీన్ని నియంత్రించాల్సిన అవసరం ఉంది' అన్న ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. భారత్‌ చేస్తున్న వాదనకు ముషారఫ్‌ వ్యాఖ్యలు .. అయితే పాకిస్థాన్‌ మాజీ అధ్యక్షుడు జనరల్‌ పర్వేజ్‌ ముషారఫ్‌ చేసినవ్యాఖ్యలు భారత్‌ కంటే ఆయన దేశానికే ఎక్కువ ఆశ్చర్యం కలిగించి వుంటాయి. భారత్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాకిస్థాన్‌ అండదండలున్నాయనీ, భారత్‌ చేస్తున్న వాదనకు ముషారఫ్‌ వ్యాఖ్యలు కొండంత బలాన్నిచ్చాయి. నిరాధారమైన ఆరోపణలంటూ అంతర్జాతీయ వేదికలమీద ఇంతకాలమూ బుకాయిస్తూ వస్తున్న పాకిస్థాన్‌ను ఆయన వ్యాఖ్యలు ఇరకాటంలో పడేశాయి. ఒసామా బిన్‌ లాడెన్‌ తమ దేశంలో ఆశ్రయం పొందుతున్నట్టు .. ఒసామా బిన్‌ లాడెన్‌ తమ దేశంలో ఆశ్రయం పొందుతున్నట్టు తమ పాలకులకూ, నిఘా వ్యవస్థలకు మొదటినుంచీ తెలుసునంటూ ఇటీవలే భారత్‌కు చెందిన చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాకిస్థాన్‌ మాజీ రక్షణమంత్రి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన వారిలో ముషారఫ్‌ కూడా ఉన్నారు. స్పష్టమైన వివరణ ఇచ్చుకోవాలంటూ పాకిస్థాన్‌ ప్రభుత్వం .. ఆయన తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలనీ, లేదా స్పష్టమైన వివరణ ఇచ్చుకోవాలంటూ పాకిస్థాన్‌ ప్రభుత్వం కూడా ఆగ్రహించింది. ఇప్పుడు సాక్షాత్తూ ఆ దేశ మాజీ అధ్యక్షుడు తాలిబాన్‌ ఆవిర్భావం నుంచి నేటివరకూ పాకిస్థాన్‌ నిర్వహించిన ఉగ్రవాద పాత్రను విప్పిచెప్పడం ద్వారా తన దేశానికి కాకున్నా తనకు మేలు చేసుకోవాలని ఆయన భావిస్తున్నట్టు కనిపిస్తున్నది. ముషారఫ్‌ ప్రస్తుతం అనేక కేసుల్లో.. ముషారఫ్‌ ప్రస్తుతం అనేక కేసుల్లో ఇరుక్కుని ఉన్నారు. బెనజీర్‌ భుట్టో హత్యకేసు ఆయనను వెంటాడుతున్నది. కొద్దిరోజుల క్రితమే అమెరికన్‌ పాత్రికేయుడు సీగల్‌ ఈ కేసు విచారిస్తున్న రావల్పిండి కోర్టుకు బేనజీర్‌ భుట్టోను ముషారఫ్‌ బెదిరించిన ఫోన్‌కాల్‌ వీడియో లింకేజ్‌ను పంపడంతో ముషారప్ మరింత ఇరకాటంలో పడ్డారు. లాల్‌ మసీదుపై జరిగిన దాడి.. భుట్టో హత్యకు సూత్రధారి ముషారఫ్‌ మాత్రమేనని ఆయన కుండబద్దలు కొట్టారు. దీనితోపాటుగా, లాల్‌ మసీదుపై జరిగిన దాడి, ఒక ముస్లిం మతపెద్ద హత్య కేసులోనూ ముషారఫ్‌ ఇరుక్కున్నారు. ఈ నేపథ్యంలో, డెబ్పైరెండేళ్ళ వయసులో ఒక కొత్త రాజకీయపార్టీతో మరోప్రస్థానం ఆరంభించాలనుకుంటున్న ముషార్‌ఫకు ప్రజలతో పాటు, పాకిస్థాన్‌లోని వివిధవర్గాల వారిని ఆకట్టుకోవలసిన అవసరం ఉండవచ్చు. బాల్‌ థాకరేమీద కూడా కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు .. పాకిస్థాన్‌ నాయకులను, కళాకారులను అవమానిస్తూ, భారత్‌లోని మైనారిటీ ముస్లింలపై తీవ్ర వ్యతిరేకత కనబరుస్తున్నదంటూ శివసేన వ్యవహారశైలిపై అంతర్జాతీయస్థాయిలో ప్రచారం చేయాలని పాకిస్థాన్‌ ప్రభుత్వం సంకల్పిస్తున్న నేపథ్యంలో ముషారఫ్‌ బాల్‌ థాకరేమీద కూడా కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముంబై దాడుల సూత్రధారి హఫీజ్‌ సయీద్‌ని వెనకేసుకొస్తూ, బాల్‌ థాకరే పేరు ప్రస్తావించారు. వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయడం ముషార్‌ఫకు .. వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయడం ముషార్‌ఫకు కొత్తకాదు కానీ, భారత్‌ వ్యతిరేక ఉగ్రవాద కార్యకలాపాలకు పాకిస్థాన్‌ ఆదినుంచీ అండగా ఉన్నదని అంగీకరించడం మాత్రం ఇదే ప్రధమం. ఇటువంటి వ్యాఖ్యలు ఎవరో సాదాసీదా వ్యక్తుల నుంచి వచ్చివుంటే వాటికి ప్రాధాన్యం ఉండివుండేది కాదు. పదేళ్ళపాటు పాకిస్థాన్‌ను ఏలిన వ్యక్తి .. కానీ, అత్యంత కీలకమైన సందర్భంలో పదేళ్ళపాటు పాకిస్థాన్‌ను ఏలిన వ్యక్తి ఆయన. సైనిక నియంతగా పాకిస్థాన్‌లోని సర్వ వ్యవస్థలనూ తన నియంత్రణలో ఉంచుకున్న వ్యక్తి. అధికారంలోకి రాకముందు కూడా భారత్‌తో వ్యవహరించే విషయంలో పాకిస్థాన్‌ పాలకులను పూర్తిగా నియంత్రించిన వ్యక్తి. పాకిస్థాన్‌ ఉగ్రవాద సంస్థలకు నెలవుగా.. పాకిస్థాన్‌ ఉగ్రవాద సంస్థలకు నెలవుగా, శిక్షణాకేంద్రంగా పనిచేసిందని ఆయన ఒప్పుకోలు ఇంతకాలమూ పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదంపై భారత్‌ చేస్తున్న వాదనకు ఎనలేని బలాన్ని చేకూర్చింది. ముషారఫ్‌ వ్యాఖ్యలు అంతర్జాతీయ వేదికలమీద పాకిస్థాన్‌ వ్యవహారశైలిని బలంగా ఎండగట్టడానికే కాదు, దావూద్‌ వంటివారి విషయంలో కఠినంగా వ్యవహరించాలనుకుంటున్న భారత్‌కు అనూహ్యంగా అందివచ్చిన ఆయుధంగానూ ఉపకరిస్తాయి. పాకిస్తాన్ తో పెట్టుకోవద్దని భారత్ కు సవాల్.. అయితే ఆయన ఇంతకు ముందు సైతం పాకిస్తాన్ తో పెట్టుకోవద్దని భారత్ కు సవాల్ విసిరాడు. పాకిస్తాన్ భూభాగంలోకి భారత్ ప్రవేశించాలని చూస్తే పాకిస్తాన్ చూస్తూ ఊరుకోదు..మేము చిన్న పిల్లలం కాదంటూ కుండబద్దలు కొట్టారు. పాక్ బలహీన దేశం కాదని .. పాకిస్తాన్ తో దాడికి దిగొద్దని పాక్ బలహీన దేశం కాదని అత్యాధునిక ఆయుధాలు ఉన్నాయని మయన్మార్ లాంటిది కాదని మా దగ్గర దాదాపు అణు ఆయుధాలు ఉన్నాయని మన దేశానికి వార్నింగ్ ఇచ్చినంత పని చేశారు. 2020 కల్లా వీటిని 200లకు పెంచడమే తమ లక్ష్యమని... 2020 కల్లా వీటిని 200లకు పెంచడమే తమ లక్ష్యమని కాబట్టి మాతో గేమ్స్ ఆడేందుకు ట్రై చేయవద్దని ఆయన అన్నారు. మరి ఇప్పుడు ఉగ్రవాదంపై కూడా తనదైన శైలిలో చెప్పారు...దీనిపై ప్రపంచదేశాలు ఎలా స్పందిస్తాయో చూడాలి. ముఖ్యంగా భారత్ ఈ విషయంలో ఎలా స్పందిస్తుందో చూడాలి.

CM KCR Full Speech In Amaravathi Foundation

KCR & Chandra Babu Meeting about AP Capital City CM KCR Full Speech In Amaravathi Foundation Chandrababu Invites KCR To Amaravati KCR Fires on Chandrababu over meeting with Modi









KCR & Chandra Babu Meeting about AP Capital City CM KCR Full Speech In Amaravathi Foundation Chandrababu Invites KCR To Amaravati KCR Fires on Chandrababu over meeting with Modi

పాక్‌లో బాంబు పేలుడు: 11 మంది దుర్మరణం

పాకిస్థాన్‌లో ఓ ప్రయివేటు బస్సులో బాంబు పేలి ఇద్దరు చిన్నారులతో సహ 11 మంది దుర్మరణం చెందారు. 22 మందికి తీవ్రగాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో 8 మంది పరిస్థితి విషమంగా ఉందని పోలీసు అధికారులు తెలిపారు. పాకిస్థాన్‌లోని బెలూచిస్థాన్ లోని ప్రావెన్స్ లో సోమవారం అర్దరాత్రి ఈ దారుణ సంఘటన జరిగింది. బెలూచిస్థాన్ ప్రావెన్స్ పోలీసు ఉన్నతాధికారి అల్మీష్ ఖాన్ కథనం మేరకు వివరాలు ఆ విధంగా ఉన్నాయి. దినసరి కూలీలు వారివారి స్వస్థలాలకు వెళ్లేందుకు ప్రతి రోజు అర్దరాత్రి ఓ ప్రయివేటు బస్సు బస్ స్టాండ్ లో ఉంటుంది. ఎప్పటిలాగే సోమవారం అర్దరాత్రి ఆ బస్సు బస్ స్టాండ్ లో ఉంది. దినసరి కూలీలు బస్సులో ఎక్కారు. బస్సు బస్ స్టాండ్ నుంచి బయలుదేరడానికి చిన్నగా కదులుతున్నది. ఆ సమయంలో బస్ స్టాండ్ లోనే ఒక్క సారిగా బస్సు మీద అమర్చిన శక్తివంతమైన బాంబు పేలిపోయింది. 11 మంది సంఘటనా స్థలంలోనే దుర్మరణం చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులను ఆసుపత్రికి తరలించారు. అయితే శక్తివంతమైన బాంబు అమర్చింది ఎవరనేది ఇంకా తెలియడం లేదని మంగళవారం పోలీసు అధికారి అల్మీష్ ఖాన్ చెప్పారు. ఉగ్రవాదులు ఈ దారుణానికి పాల్పడి ఉంటారని, దర్యాప్తు చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు. Source: telugu.oneindia.com



ఆ సర్టిఫికెట్ ఉండాల్సిందే


aa sartifiket undaalsinde


ఓ ట్రైనింగ్ ప్రోగ్రాం కోసం థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్ వెళ్ళగోరే అధికారులు తమకు ఎయిడ్స్ గానీ, ఇతర జబ్బులు గానీ లేవని రుజువు చేసే మెడికల్ సర్టిఫికెట్లను సమర్పించాలని కేంద్రం ఆదేశించింది. దేశ సంపద- ఆర్థికాభివృద్ది అనే అంశంపై ఆ దేశంలో నెలరోజులపాటు (నవంబర్ 2నుంచి 30వ తేదీ వరకు) శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నారు. దీనికి అటెండ్ అయ్యే సీనియర్ అధికారులు ఇలాంటి మెడికల్ సర్టిఫికెట్లను తప్పనిసరిగా సమర్పించాలని సిబ్బంది శాఖ తన తాజా సర్క్యులర్‌లో ఆదేశించింది. వాళ్ళు తమ దరఖాస్తులతో బాటు వీటిని కూడా జత చేయాలట.. ఓ పరాయి దేశంలో శిక్షణకు హాజరయ్యేందుకు మానసికంగా, శారీరకంగా తాము అన్ని విధాలా అర్హులమని డాక్టర్ల నుంచి ధ్రువ పత్రాలు తేవాలని, పైగా ఇంగ్లీష్ పై కమాండ్, వాగ్ధాటి, మంచి ఆరోగ్యం ఉండాలని ఆ సర్క్యులర్ లో పీర్కొన్నారు. ఇలాంటి వారికి విమానంలో ఎకానమీ క్లాస్ లో ప్రయాణించే వెసులుబాటు, హెల్త్ ఇన్సూరెన్స్, డైలీ అలవెన్స్ తదితర ప్రయోజనాలన్నీ కల్పిస్తున్నారు.

కేసీఅర్ ని అడ్డుకుంటారా..?


kesiar ni addukuntaara..?


ఏపీ కొత్త రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి తెలంగాణా సీఎం కేసీఆర్ వెళ్ళాలనే నిర్ణయించుకున్నారు. అయితే ఆయన రోడ్డు మార్గాన వెళ్లాలని అనుకున్నా ఆ తరువాత ఈ నిర్ణయం మారిపోయింది. సూర్యాపేట వరకు రోడ్డు మార్గంలో వెళ్లి ఈ నెల 21 వ తేదీ రాత్రి అక్కడే బస చేసి ఆ మరుసటి రోజున అమరావతికి వెళ్లాలని తొలుత భావించారు. కానీ ఆ తరువాత సీన్ మారిపోయింది. కేసీ ఆర్ హెలికాప్టర్ లోనే అమరావతి వెళ్ళే కార్యక్రమం ఖరారైంది. రాష్ట్ర విభజనకు కారకుడైన కేసీఆర్ ను ఏపీలో అడ్డుకోవచ్చన్న అనుమానాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే స్వయంగా ఏపీ సీఎం చంద్రబాబు హైదరాబాద్ వచ్చి సీఎం క్యాంప్ కార్యాలయంలో కేసీఆర్ ను కలిసి ఆహ్వాన పత్రిక అందజేయడం, ఆయనను కేసీఅర్ సాదరంగా ఆహ్వానించడం వంటి పరిణామాలతో రెండు రాష్ట్రాల మధ్య సుహృద్భావ సంబంధాలు నెలకొంటున్నాయని భావిస్తున్నారు. అందువల్ల కేసీఆర్ ను ఏపీలో అడ్డుకునే పరిస్థితి లేదని అంటున్నారు.

తెలంగాణ డాక్టర్లకు జీతాలివ్వం


Health-card



తెలంగాణలోని ఆంధ్ర ఉద్యోగుల మీద ఈగ వాలినా గగ్గోలు పెట్టే ఏపీ తన వద్ద పనిచేసే తెలంగాణ ఉద్యోగులకు మాత్రం దిక్కు దివాణం లేకుండా చేస్తున్నది. అన్ని నిబంధనలు కాలరాస్తున్నది. తాజాగా తమకు కేటాయించిన 120 మంది తెలంగాణ పీజీ డాక్టర్లకు జీతాలివ్వబోమని తేల్చి చెప్పింది. మీరు స్థానికేతరులు కాబట్టి జీతాలిచ్చేది లేదు అంటూ తేల్చి చెప్పింది. ఏపీ చర్యతో ఆ డాక్టర్లు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వివరాలివి.. రాష్ట్ర ఆవిర్భావానికి ముందు 2013 ఆగస్టులో 600 మంది వైద్య విద్యార్థులు పీజీ (ఇన్‌సర్వీస్)ల్లో చేరారు. ఇందులో డిప్లొమాకు 250 మంది, డిగ్రీ (ఎండీ) చదివేవారు 350 మంది ఉన్నారు.

వీరందరికీ స్టేట్ హెల్త్ ఎడ్యుకేషన్ బ్యూరో (షెబ్) ద్వారా జీతభత్యాలు అందించేవారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుతో రాష్ట్ర విభజన చట్టం ప్రకారం 58 : 42 నిష్పత్తిలో వీరిని కూడా జీవోఎంఎస్ నం.241, తేదీ 1.6.2014 ప్రకారం విభజించి ఇరు రాష్ర్టాలకు కేటాయించారు. మొత్తం 600 పీజీ వైద్యుల్లో పీజీ, డిప్లొమా కలిపి ఏపీకి 350 మంది, తెలంగాణకు 250 మంది వచ్చారు. వాస్తవానికి వీరందరూ మెరిట్ ప్రకారం పీజీ కోర్సుల్లో చేరారు. ఇలా 58ః42 నిష్పత్తిలో జరిగిన పంపకాల్లో ఏపీకి వెళ్ళిన 350 మంది పీజీ డాక్టర్లలో 120 మంది తెలంగాణవారున్నారు.

ఇదిలాఉంటే 2015 జులై 10న ఏపీ ప్రభుత్వం (వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ) జీవోఎంఎస్ నం. 67ను జారీ చేసింది. ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పూనం మాలకొండయ్య పేరిట ఈ ఉత్తర్వులు విడుదలయ్యాయి. దీని ప్రకారం ఏపీలో పీజీ డాక్టర్లుగా కోర్సు చేస్తున్న 120 మంది తెలంగాణ స్థానికులుగా గుర్తించామని, వారికి ఏపీ ప్రభుత్వం జీతాలు చెల్లించదని అందులో స్పష్టం చేశారు. ఇంతటితో ఆగకుండా పీజీ వైద్యుల పునర్విభజన జరగాలని ఏపీ కొర్రీ పెట్టింది. ఇపుడు ఏపీలో ఉన్న 120 మందిని తెలంగాణకే కేటాయించాలంది. ఈ ఆదేశంతో గడిచిన జులై నుంచి 120 మంది పీజీ డాక్టర్లకు జీతభత్యాలు అందటం లేదు.

కక్ష సాధింపు చర్యే..: రాష్ట్రం ఏర్పడి సంవత్సరం అయిన తరువాత ఇపుడు అకస్మాత్తుగా జీతాలివ్వడం ఆపివేయటం వెనుక కక్ష సాధింపు ధోరణి ఉందని పీజీ వైద్యులు ఆరోపిస్తున్నారు. తెలంగాణ విద్యుత్‌శాఖలో ఏపీ స్థానికులను ఏపీకి కేటాయించిన విషయంలో ఎదురవుతున్న ఓటమికి ఇది ప్రతీకార చర్యగా వారు భావిస్తున్నారు.

అనేక సమస్యలు..: ఏపీ చర్యవల్ల జీతభత్యాలకే కాకుండా ఇతర సమస్యలు కూడా ఎదురవుతున్నాయి. తెలంగాణ స్థానికులని గుర్తించిన 120 మందిలో 40 మంది డిప్లొమా చేస్తున్నవారు ఉన్నారు. వీరి కోర్సు అయిపోయింది. ఆగస్టులో తెలంగాణ ప్రభుత్వం వీరికి పోస్టింగులు ఇచ్చింది. నిబంధనల ప్రకారం పోస్టులో జాయిన్ అయి జీతభత్యాలు తీసుకోవాలంటే ఎల్‌పీసీ (లాస్ట్ పే సర్టిఫికెట్) దాఖలుపర్చాల్సి ఉంటుంది. జులై నుంచి వారికి జీతభత్యాలే ఇవ్వకపోవడంతో ఎల్‌పీసీ ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వాలో వారికి తెలియడం లేదు. అలాగే 120 మంది పీజీ కోర్సు చేస్తున్నవారికి ఇటు తెలంగాణ సర్కారు ప్రకటించిన తెలంగాణ ఇంక్రిమెంట్, పీఆర్సీ బకాయిలు అందడం లేదు. ఏపీలో పనిచేస్తున్నప్పుడు ఎమర్జెన్సీ అలవెన్సు కింద ఇచ్చే రూ. 3 వేలకు కోత వేశారు.

దీనికితోడు సమైక్య రాష్ట్రంలో దరఖాస్తు చేసుకున్న ఉద్యోగుల హెల్త్ కార్డులను అక్కడ పనిచేస్తున్న కాలంలో ఏపీ ప్రభుత్వం జారీ చేసింది. జులైకి ముందు వారి జీతభత్యాల నుంచి ప్రీమియం కట్ చేసుకుంది. ఇప్పుడు ఆ కార్డులు తెలంగాణలో చెల్లవు. ఇంకా పీజీ కోర్సు చేస్తున్న సుమారు 80 మంది వైద్యులు (ఎండీ) వారి కోర్సు పూర్తిచేయడంపై ఈ ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ సమస్యను మొగ్గలోనే పరిష్కరించాలంటే ముఖ్యమంత్రి స్థాయిలో దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని విద్యార్థులు కోరుతున్నారు.


ఆస్తుల స్వాధీనానికి ప్రత్యేక కోర్టులు

అవినీతి అంతంతోనే సుపరిపాలన సాధ్యం అన్న సదవ గాహనతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అవినీతి, అక్రమార్కుల భరతం పట్టేందుకు ఆస్తుల సత్వర స్వాధీనం ప్రత్యేక కోర్టుల ఏర్పాటు బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టి ఆమోదించడం శుభ పరిణామం. కొరగాని చట్టాలు తమను ఏమీ చెయ్యలేవన్న ధిలాసాతో అవినీతిపరులు చెలరేగిపోతున్న వేళ అటవీ, కస్టమ్స్‌, స్మగ్లింగ్‌ వంటి చట్టాల తరహాలో అక్రమాస్తుల సత్వర స్వాధీనానికి నూతన బిల్లులో ఏపీ ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. అవినీతి కేసుల సత్వర విచారణకు ప్రత్యేక న్యాయ స్థానాన్ని ప్రతిపాదిస్తూ అనవసర వాయిదాలు, కాలహరణ లేకుండా ఏడాదిలోగా విచారణ ముగించాలని ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం. అవినీతిని కట్టడి చేస్తే అభివృద్ధికి పునాదులు ఎలా పడతాయో సింగపూర్‌ అనుభవం మనకు సోదాహరణంగా చాటుతుంది. అవినీతి నిరోధక చట్టం కింద కేసుల విచారణ పూర్తయ్యేందుకు ఇప్పుడు 8 ఏళ్ళకు పైగా సమయం పడుతుంది. ఇకపై రెండేళ్ళలో విచారణ ముగించాలంటూ కేంద్ర ప్రభుత్వం చేసిన చట్ట సవరణ ప్రతిపాదన కంటే ఏపీ ప్రభుత్వం శాసన సభలో ప్రతిపాదించిన ఆస్తుల సత్వర స్వాధీన బిల్లే మెరుగ్గా వుంది. చట్ట పరిధిలో ప్రభుత్వ ఉద్యోగులతో పాటు, ప్రజా ప్రతినిధులు వుండటం కొత్త చట్టంపై ఆశలు మెండుగా కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ ఆర్ధిక సంస్థల మదుపుదారుల పరిరక్షణ 1999కి సవరణలు చేస్తూ ప్రవేశపెట్టిన బిల్లుకు ఏపీ శాసనసభ ఆమోదించడం అభినందనీయం. అవినీతికి పాల్పడి అక్రమాస్తులు కూడబెట్టే అధికారులు, ప్రజా ప్రతినిధుల గుండెల్లో గుబులు పుట్టించే 2 కఠిన చట్టాలు శాసనసభలో ఊపిరి పోసుకున్నాయి. ఈ చట్టాలు అమలులోకి వస్తే రాష్ట్రంలో కొత్తగా ఆర్ధిక సంస్థలు ఏర్పాటు చేసేవారు వారంలో తమ సంస్థ చేయబోయే వ్యాపార వివరాలు సంబంధిత జిల్లా కలెక్టర్‌, ఎస్పీకి పూర్తిస్థాయి నివేదిక అందించాలి. ప్రతి మూడు నెలలకొకసారి వారి వ్యాపార కార్యకలాపాల నివేదికలను ఉన్నతాధికారులకు అందించాలి. నిర్దేశిత గడువు లోపు త్రైమాసిక నివేదికలు అందించని సంస్థలకి రూ.50 వేల జరిమానా విధిస్తారు. దరావత్‌ తిరిగి చెల్లించకపోయినా, చెప్పినట్లు వడ్డీ ఇవ్వకపోయినా ప్రమోటర్‌ భాగస్వామి, డైరెక్టర్‌, మేనేజర్‌తో పాటు ఆ వ్యవహారాల్లో పాలు పంచుకున్న ఉద్యోగులు అందరూ బాధ్యత వహించాల్సి వుంటుంది. అలాంటివారికి గరిష్ఠంగా పదేళ్ల జైలు శిక్ష, 5 లక్షల జరిమానా విధిస్తారు. నిందితులపై నాన్‌-బెయిలబుల్‌ కేసు నమోదు చేస్తారు. ఎవరైనా బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకుంటే దానిపై పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ వాదనలు విన్నాకే న్యాయస్థానం వాదనలు వినాల్సి వుంటుంది. ఏ ఆర్ధిక సంస్థ అయినా ప్రజల డిపాజిట్లు తిరిగి చెల్లించలేని స్థితిలో ఉందని ప్రభుత్వం భావిస్తే ఆ సంస్థ ఆస్తులతో పాటు, లబ్ధి పొందినవారు, లేదంటే అప్పులు తీసుకొని తిరిగి చెల్లించని వారి వ్యక్తిగత ఆస్తులను స్వాధీనం చేసుకునే అధికారాన్ని ప్రత్యేక న్యాయస్థానాలకు కట్టబెట్టారు. ఇలా జప్తు చేసిన ఆస్తులను న్యాయస్థానం ఏడాది లోపు విక్రయించి బాధితులకు డబ్బు తిరిగి చెల్లించే విధంగా బిల్లు రూపొందించారు. అవినీతి, అక్రమార్జనతో కూడబెట్టిన ఆస్తులను సత్వరం స్వాధీనం చేసుకొని ఆ కేసులను సత్వరమే విచారించేందుకు ప్రత్యేక న్యాయ స్థానాలను ఏర్పాటు చేయబోతున్నారు. ప్రజా సేవకుల పరిధిలోకి వచ్చే ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు అవినీతి చర్యలు ద్వారా ఆస్తుల సంపాదించిన వారిపై వున్న కేసుల్లో నిర్ధారణ జరిగిన తర్వాతే వాటిని జప్తు చేసే అధికారం ప్రభుత్వానికి వుంది. కానీ ప్రభుత్వం శాసనసభలో ఆమోదించిన బిల్లులో ప్రత్యేక న్యాయస్థాన చట్టం ద్వారా అవినీతిపరుల ఆస్తుల జప్తు ప్రక్రియ వేగవంతం కానుంది. ఇటువంటి కేసుల కోసం నియమించే చట్టబద్ధ అధికారి ఆధ్వర్యంలోనే ఈ ప్రక్రియ సాగుతుంది. అవినీతి ద్వారా సంపా దించిన ఆస్తులను గుర్తించి నేరారోపణకు గురైన వ్యక్తికి చట్టబద్ధ అధికారి నోటీసు జారీ చేస్తారు. 30 రోజుల్లోగా అవి అవినీతి ద్వారా వచ్చిన ఆస్తులు కాదని నిరూపించుకోవాల్సి వుంటుంది. నిరూపించు కోలేని పక్షంలో వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకునే అధికారం వుంటుంది. నోటీసు జారీ చేసిన తరువాత ఆ ఆస్తులను మరొకరికి బదలాయించడం కానీ, విక్రయించటం కానీ చెల్లదని ప్రత్యేక న్యాయ స్థానాల చట్టం స్పష్టం చేస్తుంది. గుర్తించిన ఆస్తుల్లో కొంత మేరకే అవినీతి ద్వారా కూడబెట్టినవి అని తేలితే ఆ ఆస్తులను ఆమేరకే స్వాధీనం చేసుకుంటారు. ఈ కేసులను విచారించేందుకు ప్రత్యేక న్యాయస్థానాలను సెషన్స్‌ జడ్జి అధ్యక్షతన ఏర్పాటు చేయనున్నారు. స్వాధీనం చేసుకున్నా ఆస్తులను రాష్ట్ర, ప్రజా సంక్షేమం కోసం వినియోగించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం శాసనసభకు తెలిపింది. 2006లో బీహార్‌, 2007లో ఒడిశా ప్రభుత్వాలు తెచ్చినట్లు గానే ఏపీ ప్రభుత్వం అవినీతి కేసుల సత్వర విచారణకు కఠిన నిబంధనలతో అక్రమార్కులు జైలుకు వెళ్లడంతో పాటు వారు సంపాదించిన ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకునే విధంగా చట్టం తేవడం అభినందనీయం. ఈపాటికే పదేళ్ల పరిపాలనలో జరిగిన మొత్తం అవినీతి బాగోతాలపై దర్యాప్తు మొదలు అయ్యి వుంటే అవినీతి చెర నుంచి రాష్ట్రం కొంతవరకు అయినా బయట పడగలిగేది. అట్లాగే అక్రమ సంపాదనలని జప్తు చేసేందుకు వీలు కల్పించే 61, 62 సెక్షన్లు భారత శిక్షాస్మృతిలో వుండేవి. వాటికి తిరిగి ప్రాణ ప్రతిష్ఠ కల్పిస్తే అవినీతి నియంత్రణ కొంతైనా సాధ్యపడుతుంది. అభివృద్ధి చెందిన దేశాల్లో క్రమంగా అవినీతి తగ్గుతుంది అభివృద్ధి చెందుతున్న దేశాల్లో, రాష్ర్టాల్లో అది పెరుగుతుంది. ఈ నేపథ్యంలో అభివృద్ధికి పెద్దపీట వేసి అవినీతికి అడ్డుకట్ట వేసి జాతి ఔన్నత్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన వుంది. అవినీతి ప్రజా జీవనాన్ని, ఆర్థిక వ్యవస్థను కకావికలం చేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో మార్పు అత్యావశ్యకం. అవినీతి వల్ల సగటు జీవి బ్రతుకు దుర్భరం అవుతుంటే ఏటా సంపన్నుల ఆస్తులు వందల రేట్లు పెరిగి పోతున్నాయి. కాంగ్రెస్‌ పదేళ్ళ పరిపాలనలో పెట్రేగిన అవినీతి దేశానికి, రాష్ర్టానికి ఎంత చేటు చేసిందో ప్రజలందరికీ తెలుసు. అవినీతిని అంతమొందించడం అందరి ప్రథమ లక్ష్యం కావాలి. -నీరుకొండ ప్రసాద్



ఉద్యోగాలకు వయోపరిమితి పదేళ్లు పెంపు

మన తెలంగాణ/హైదరాబాద్: నిరుద్యోగులు ఎంత గానో ఎదురు చూస్తున్న నోటిఫికేషన్లకు మరో నెల రోజుల వరకు ఆగాల్సిందే. నోటిఫికేషన్ల విడుదల ముందుకు చేయాల్సిన ప్రక్రియ మరికొంత జరగాల్సి ఉంది. దీంతో పాటుగా మొదటి సారి ఉద్యోగాల భర్తీకి శ్రీ కారం చుడుతున్నందున ఈ సారి కొంత జాప్యం తప్పదని సూచిస్తున్నారు. అధికారిక ప్రక్రియలో ఏమైనా లోపాలు జరిగితే కోర్టుకు వేళ్లితే మొదటికే మోసం వస్తుందని… అందుకు కొద్దిగా అలస్యమైనా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాకే నోటిఫికేషన్ విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ప్రభుత్వం వైపు నుంచి ఉద్యోగా భర్తీకి కొంత వరకు లైన్ క్లియర్ చేసింది. అయితే అంతర్గతంగా ఇంక కొంత ప్రక్రియ జరగాల్సి ఉందని చేబుతున్నారు.
సర్వీస్ కమిషన్ విడుదల చేసే ఉద్యోగాలకు స్కీమ్ ఎగ్జామినేషన్ ను ఖరారు చేస్తూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వయో పరిమితిని పదేళ్లకు పెంచుతూ జీవో కూడా విడుదల చేశారు. ఇక పబ్లిక్ సర్వీస్ కమిషన్ సిలబస్‌ను ప్రకటిం చాల్సి ఉంటుంది. సిలబస్‌ను ప్రకటించడానికి కమిషన్ అధికారులు ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది. ఒక్కో సబ్జెక్టులో నిపుణులైన వారిచే సంప్రదింపులు జరుపుతు న్నారు. అయితే ఈ కసరత్తు కొలిక్కి రావడానికి మరికొంత సమయం పడుతుందని సమాచారం. సిలబస్ కొలిక్కి వచ్చినా ముందుగా ఏ పోస్టులను భర్తీ చేయనున్నారో ఆ పోస్టులకు సంబంధించిన సిలబస్ ను మాత్రమే ప్రకటించాలని గతంలోనే టిఎస్‌పిఎస్‌సి నిర్ణయించింది. దీని వల్ల కోచింగ్ సెంటర్ల దోపిడికి, నిరుద్యోగులను మభ్యపెట్టే సంస్థలకు అడ్డుకట్టవే యగలుగుతామని అంచనాతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
దీని వల్ల పట్టణ ప్రాంత విద్యార్థులతో పాటు గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కూడా సమాన అవకాశాలు కల్పించవాళ్లం అవుతామనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. సిలబస్ ప్రకటన తరువాత విద్యార్థులు ప్రిపేర్ కావడానికి కొంత సమయం ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఈ సారి తెలంగాణ కోణంలో స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ రూపొందించినందున కొత్త సిలబస్ ఎక్కువగా ఉంటుందని.. దాని కోసం సమ యం ఇవ్వాలని సూచిస్తున్నారు. ఈ వినతిని అంగాకరిం చాల్సిందేనని నిపుణులు సైతం సూచిస్తున్నారు. సిలబస్ ప్రకటన తరువాత పేపర్ సెట్టింగ్ కోసం నిపుణులు సంప్ర దింపులతో అధిక సమయం పడుతుందని చేబుతున్నారు.
కొందరు జీవోలు విడుదల కాగానే అంత అయి పొయినట్లుగా భావిస్తున్నారని… ఆ జీవోలు ఆర్ధిక శాఖ ఆమోదం పొందడం .. ఆ తరువాత శాఖాధిపతుల నుంచి అనేక వివరాలతో లేఖ సర్వీస్ కమిషన్ కు చేరడానికే ఎక్కు వ సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. కోర్టుల్లో సమస్యలు రాకుండా అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉం టుందని.. దీని కోసమే అధిక సమయం పడుతుందం టున్నారు. ఇలా పలు రకాల అధికారిక ప్రక్రియలు పూర్తి అయి నియామక నోటఫికేషన్‌లు రావడదానికి నిరుద్యో గులు ఉహించినంత తొందరగా సాధ్యం కాదని చేబుతున్నారు. దీంతో ఆగస్టు చివరి వరకు మొదటి నోటిఫికేషన్‌కు ఎదురుచూడక తప్పదు.
54 సంవత్సరాలకు ఉద్యోగమా…!
ఉద్యోగ నియామకాల్లో వయో పరిమితిని సడలిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతమున్న వయో పరిమతిని 10 సంవత్సరాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ జీవో రాబోయే ఒక సంవత్సరం పాటు మాత్రమే అమల్లో ఉంటుంది. ఆ తరువాత పాత వయో పరిమితి అమల్లోకి వస్తుంది. ప్రస్తుతం జనరల్ కేటగిరి వారికి 34 సంవత్సరాల వయస్సున్న వారు సైతం దరఖాస్తు చేసుకోవచ్చు. బిసి, ఎస్‌సి, ఎస్‌టి, వారికున్న 39 సంవత్సరాలను 49కి, వికలాంగులకు 54 సంవత్సరాల వయస్సు వారికి అవకాశం రానుంది. అయితే వయో పరిమితి పెంపుతో 54 సంవత్సరాల వారికి అవకాశం ఇస్తే వారికి ఉద్యోగం వచ్చినా… నాలుగు సంవత్సరాల పాటు మాత్రమే ఉద్యోగం చేసే అవకాశం ఉంటుంది.
బీసీ, ఎస్‌సి, ఎస్‌టి 49 సంవత్సరాలకు ఉద్యోగం వచ్చినా మరో 9 సంవత్సరాలు మాత్రమే ఉద్యోగం చేయనున్నారు. ఇలా అతి తక్కువ కాలం ఉద్యోగంలో ఉండటం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదని.. కనీసం 20 సంవత్సరాలు ఉద్యోగంలో ఉన్న వారికే పెన్షన్ వస్తుందని గుర్తుచేస్తున్నారు. ఆ వయస్సు వారు ఇప్పటికే జీవితంలో స్థిరపడి ఉంటారని.. వారి పిల్లలు కూడా ఉద్యోగాల కోసం దరఖాస్తు చేయడానికి అర్హత సాధించి ఉంటారని… ఈ సమయంలో అవకాశం రావడంతో పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చంటున్నారు

1993 నాటి పేలుళ్లపై మరిన్ని ఆసక్తికర విషయాలు !


మార్చి 12, 1993న 13 వరుస పేలుళ్లు సంభవించాయి. * తొలి బాంబు మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో బొంబాయి స్టాక్‌ ఎక్సే్చంజ్‌ భవంతి బేస్‌ మెంటులో పేలింది. ఆపై 3:40 వరకూ వివిధ ప్రాంతాల్లో పేలుళ్లు జరిగాయి. * మాహింలోని మత్స్యకారుల కాలనీ, ప్లాజా సినిమాస్‌, జవేరీ బజార్‌, కఠా బజార్‌, హోటల్‌ సీ రాక్‌, హోటల్‌ జుహూ సెంటార్‌, ఎయిర్‌ ఇండియా బిల్డింగ్‌, సహారా ఎయిర్‌ పోర్టు, వర్లి, పాస్‌ పోర్టు ఆఫీస్‌ ప్రాంతాల్లో బాంబులు పేలాయి. * వీటిల్లో ఎక్కువ బాంబులు స్కూటర్లలో పెట్టారు. హోటళ్లలో పేలిన బాం బులను బ్రీఫ్‌ కేసుల్లో ఉంచారు. * ఈ పేలుళ్లలో 250 మందికి పైగా మరణించగా, 700 మంది గాయ పడ్డారు. వీరిలో వందల మంది వివిధ అవయవాలను కోల్పోయారు. * ఈ పేలుళ్ల వెనుక పాకిస్థాన్‌ ఐఎస్‌ఐ హస్తముందని, అండర్‌ వరల్‌డ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం సూచనల మేరకు ఆయన సహచరులు టైగర్‌ మెమన్‌, ఆయూబ్‌ మెమన్‌, యాకూబ్‌ మెమన్‌లు ప్రణాళికలు రూపొందించారని విచారణ సంఘాలు గుర్తించాయి. * స్మగ్లర్లు హాజీ అహ్మద్‌, హాజీ ఉమర్‌, తౌఫిక్‌ జలివాలా, అస్లామ్‌ం భట్టి, దూవోద్‌ జాట్‌ లు ఆర్థిక సహాయం అందించారు. * గ్రౌండ్‌ లెవల్‌లో పేలుళ్లకు సహకరించి వారంతా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నవారే. * బాబ్రీ మసీదు కూల్చివేతకు ప్రతీకారంగా ఈ పేలుళ్లు జరిగాయన్న ఆరో పణలు ఉన్నాయి. * పేలుళ్లు జరిపేందుకు నియమించుకున్న వారికి పాకిస్థాన్‌, దుబాయ్‌లలో శిక్షణ ఇచ్చారు. వీరికి బాంబులను ఎలా పేల్చాలో నేర్పారు. పేలుడు పదార్థాలను పాకిస్థాన్‌ సమకూర్చింది. * పేలుళ్లను ముందుగా పసిగట్టడంలో నిఘా విభాగం, కోస్‌ట గార్‌డ విఫల మైందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. * ఇదే కేసులో అక్రమంగా ఆయుధాలను కలిగివున్నాడని, సాక్ష్యాలను నాశ నం చేసేందుకు ప్రయత్నించాడని బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌పై వచ్చిన అభి యోగాలు నిజమేనని కోర్టు తేల్చి శిక్ష విధించింది. అయితే, బాంబులు పేల్చాలన్న ప్లాన్‌ వెనుక ఆయన ప్రమేయం లేదని తేలింది. * పేలుళ్ల సమయంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శరద్‌ పవార్‌ ఉన్నారు. * మొత్తం 100 మందిని ఈ కేసులో నిందితులుగా తేల్చారు. * కేసులో ప్రధాన నిందితులు దావూద్‌ ఇబ్రహీం, టైగర్‌ మెమన్‌, ఆయూబ్‌ మెమన్‌లు ఇప్పటికీ తప్పించుకు తిరుగుతున్నారు. * ఈ పేలుళ్లు ముంబై అండర్‌ వరల్‌డలో చీలికలు తెచ్చింది. * అప్పటివరకూ దావూద్‌ అనుచరులుగా ఉన్న చోటా షకీల్‌, సాధూ షెట్టి వంటి వారు దావూద్‌ను వీడి బయటకు వచ్చారు.


తెలంగాణలో కొత్తగా గ్రూప్-3 పోస్టులు

రాష్ర్ట ప్రభుత్వం ఆమోదం తెలిపిన 15,222 ఉద్యోగుల భర్తీకి చురుగ్గా సన్నాహాలు జరుగుతున్నాయి. టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేసే పోస్టుల విభజన, విధివిధానాలతో కూడిన ఉత్తర్వులు జారీ అయ్యాయి. గ్రూప్‌-1 కేటగిరీలో డిప్యూటీ కలెక్టర్‌ నుంచి ఎంపీడీవో వరకు 20 రకాల పోస్టులను భర్తీ చేస్తారు. గ్రూప్‌-1కు 1000 మార్కులతో మెయిన్స్‌ పరీక్ష నిర్వహించనున్నారు. మెయిన్స్ లో కొత్తగా పేపర్‌ -6ని ప్రవేశపెడుతున్నారు. ఇందులో తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటు సిలబస్‌ ఉంటుందని టీఎస్పీఎస్సీ ప్రకటించింది. గ్రూప్‌-2 లో మున్సిపల్ కమిషనర్, డిప్యూటీ తహశీల్దార్ సహా 12 రకాల పోస్టులుంటాయని పేర్కొంది. ఈ పరీక్షను 675 మార్కులకు నిర్వహిస్తుంది. మరో 17 రకాల పోస్టులతో గ్రూప్‌-3 ని కొత్తగా ఏర్పాటు చేసింది.

పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ అనుమతి


44 సంవత్సరాలు ఉన్న వారంతా అర్హులే.. ఈ అవకాశం సంవత్సరం మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో పలు శాఖల్లో 15,522 ఖాళీల భర్తీకి ఆర్థికశాఖ అనుమతి ఇచ్చింది. టీఎస్‌పీఎస్సీ ద్వారా 3,783, పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ద్వారా 9058, విద్యుత్‌శాఖ ద్వారా 2681 పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ప్రభుత్వ కార్యదర్శి ఎన్‌. శివశంకర్‌ ఉత్తర్వులు విడుదల చేశారు. నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని టీఎస్‌పీఎస్సీని ఆదేశించారు. అన్ని శాఖలు తమ శాఖల పరిధిలో అనుమతి ఇచ్చిన ఖాళీలు, రోస్టర్‌ పాయింట్లు వివరాలను త్వరగా టీఎస్‌పీఎస్సీకి పంపించాలని ఆదేశించారు. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం జిల్లా, జోనల్‌ పోస్టులను గుర్తించాలని పేర్కొన్నారు. హోంశాఖలో.. డీజీ స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ విభాగంలో సబ్‌-ఇన్‌స్పెక్టర్లు 12 ఖాళీలు. కానిస్టేబుళ్లు 174, డైరెక్టర్‌ జనరల్‌ అండ్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ విభాగంలో ఆర్మ్‌డ్‌ రిజర్వు పోలీస్‌ కానిస్టేబుల్‌ 2760, పోలీస్‌ కానిస్టేబుల్‌ (స్టేట్‌ ఆర్మ్‌డ్‌ రిజర్వు సెంట్రల్‌ పోలీస్‌ లైన్స్‌) 56, పోలీస్‌ కానిస్టేబుల్‌ 1810, పోలీస్‌ కానిస్టేబుల్‌ (టీఎస్‌ ఎస్పీ-15 బెటాలియన్‌) 349 ఖాళీలు, పోలీస్‌ కానిస్టేబుల్‌ (టీఎస్‌ ఎస్పీ-15 బెటాలియన్‌ కాకుండా)2860, సబ్‌ ఇన్‌స్పెక్టర్లు(సివిల్‌) 107, (ఏఆర్‌) 91 మంది, టీఎస్‌ఎస్‌పీ ఆర్‌ఎస్‌ఐ 288, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(కమ్యూనికేషన్స్‌) 35, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (పీటీవో) ఆరు, డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ స్టేట్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ ఫైర్‌ సర్వీసులో ఫైర్‌మెన్‌ 416, డ్రైవర్‌ ఆపరేటర్లు 85, స్టేషన్‌ ఫైర్‌ అధికారులు 9 ఖాళీల భర్తీకి అనుమతి లభించింది. కాగా, టీఎస్‌ జెన్‌కో అసిస్టెంట్‌ ఇంజనీర్లు 988, సబ్‌ ఇంజనీర్లు 92, టీఎస్‌ ఎన్‌పీడీసీఎల్‌లో అసిస్టెంట్‌ ఇంజనీర్లు 309, సబ్‌ ఇంజనీర్లు 314, టీఎస్‌ ఎస్పీడీసీఎల్‌లో అసిస్టెంట్‌ ఇంజనీర్లు 427, సబ్‌ ఇంజనీర్లు 153 , టీఎస్‌ ట్రాన్స్‌కో అసిస్టెంట్‌ ఇంజనీర్లు 224, సబ్‌ ఇంజనీర్లు 174 ఖాళీల భర్తీకి అనుమతి లభించింది. విద్యుత్‌ శాఖలో మొత్తం 2681 ఖాళీలకు అనుమతి లభించింది.


తెలంగాణ – ఆంధ్రకు తేడా అదే



ss
తెలంగాణకు ఆంధ్రకు తేడా ఏంటి ? తెలంగాణలో ప్రజలు ఎలా వ్యవహరిస్తారు ? తమ ఇంటికి వచ్చిన వ్యక్తిని .. తమ ఊరికి వచ్చిన వ్యక్తిని ఎలా ఆదరిస్తారు ? అన్నది సాక్షాత్తు ఆంద్రాకు చెందిన ప్రముఖ సినీ రచయిత, ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో స్పష్టంగా తేల్చిచెప్పాడు. ఆయన తన సునిశిత పరిశీలన తెలంగాణ గొప్పదనాన్ని చాటి చెప్పారు.
“తెలంగాణలో ఎక్కడికి వెళ్లినా .. ఏ ఇంటికి వెళ్లినా బాబు ఛాయ తాగుతావా ? అన్నం తింటావా ? అని అడుగుతారు. ఎదుటి వ్యక్తి సోషల్ స్టేటస్ గురించి .. అతను ఎంత సంపాదిస్తాడు ? అతడు ఎవరు ? అన్నది పట్టించుకోరు. ఇది నాకు ఎంతో బాగా నచ్చుతుంది. అదే ఆంధ్రాలో ఎక్కడికి వెళ్లినా ముందు నువ్వు ఏం చేస్తావు బాబు ? మీ నాన్నగారు ఏం చేస్తారు ? అంటూ సోషల్ స్టేటస్ కనుక్కుంటారు. దాన్ని బట్టే మర్యాద ఇస్తారు” అని విజయేంద్రప్రసాద్ స్పష్టం చేశారు.
ఆంధ్రలో మనుషుల మధ్య సంబంధాలు ఆర్థిక సంబంధాలుగానే ఉంటాయి. మనిషి ఆర్థిక స్థితిని బట్టి అతనికి గౌరవం ఉంటుంది. కానీ తెలంగాణలో డబ్బుకు ప్రాధాన్యం చాలా తక్కువ. మానవత్వానికి ఎక్కువ విలువ ఇస్తారు. ఎదుటి వ్యక్తి ఇబ్బందుల్లో ఉంటే వీలయినంతవరకు అతనిని ఆదుకోవడానికి ప్రయత్నిస్తారు.

రిశికేశ్వరి చనిపోలేదు మనమే చంపేసాం


రిశికేశ్వరి చనిపోలేదు మనమే చంపేసాం
అయ్యా నన్ను లైంగికంగా వేదిస్తుండు అని ప్రిన్సిపాల్ కు
మోర పెట్టుకుంటే , నువ్వే వాడిని కదిలిస్తున్నావ్ అని
తిరిగిబెదిరించి పంపించిన ఆచార్యులును ఏమనాలి.
అర్ధనగ్నంగా నడిపించిన ఆ వ్యక్తులను ఏమనాలి ?ఆ వీడియో
తీసిన వాడిని ఏమనాలి ?ప్రేమించకపోతే ఆ వీడియో ని యు ట్యూబ్ లో పెడతాను అన్నా వాడిని ఏమనాలి .?
తన బవిష్యత్తు పాడుచేయవద్దు అని కాళ్ళ వెల్ల పడ్డ
కనికరించని వార్డెన్ ,ప్రిన్సిపాల్ ,ఇంకో ఉన్మాది తదితరులను
వీళ్ళందరిని ఏమి చెయ్యాలి (వాస్తవం :మా కులపోడుకదా వాడిమీద
action తీసుకొను).
అగ్రకుల అహంకారంతో చదువుకోడానికి వచ్చిన ఒక అమ్మాయిని అర్ధ్గనగ్నంగా నడిపించిన కమ్మటి రాక్షసులను ఏమనాలి ,దాన్ని
వీడియో తీసి అందరకి షేర్ చేసిన కుల పిశాచాలను ఏమిచెయ్యాలి .?
రిశికేశ్వరి చనిపోయి ఇన్నిరొజులైనా కనీసం ఒక్కడి మీదకూడా పోలీసు
కేసు పెట్టలేదు ఒక్క fir file అవ్వలేదు ,కనీసం ఆడపిల్ల చావుని
అర్ధం చేసుకొనే మీడియా కూడా సపోర్ట్ చెయ్యట్లేదు
.ఎందుకంటే నేరం చేసింది మనకులంవాడు కాబట్టి . ఇప్పుడు యునివర్సిటీ కాంపస్ లో 15 రోజులు ఆకస్మిక సెలవులు
,బలవంతంగా ఖాలీ చేయిస్తున్న హాస్టళ్ళు ,రిశికేశ్వరి ని సపోర్ట్
చేస్తున్నవారిపై విరుగుతున్న లాటీలు , కాంపస్ లో పోలీసుల
,పారామిలటరీ బలగాల మోహరింపు ,విద్యార్ధి సంఘాలకు కులపు
సంఘాలని పేరు పెట్టి నిషేధాజ్ఞలు, ఉద్యమాన్ని నీరుగార్చడానికి
రాష్ట్ర మంత్రే స్వయంగా వచ్చాడు . ఒక విద్యార్ధి ఆత్మహత్య చేసుకొని చనిపోతే
న్యాయంచేయ్యకపోగా న్యాయం చెయ్యమని అడిగేవారిని
పోలీసులతో బెదురింపులు.ఇదేమి రాజ్యం ?
కులపు ఉన్మాదంతో పెట్రెగిపోయిన వారికి ఒక ప్రశ్న ,రేపు మీ అక్కో
,మీ చేల్లో,మీ కూతురో ఇలాంటి మా కులమే కదా అని వోదిలేసేవారా ?
డైరెక్టుగా రాష్ట్ర ముక్యమంత్రే కేసుని పక్కద్రోవ పట్టిస్తుంటే ఇంకా రిశికేశ్వరికి న్యాయం ఎలా జరుగుతుంది .అందుకే
అంటున్న రిశికేశ్వరి చనిపోలేదు మనమే చంపేసాం అని .దయచేసి ఈ
విషయన్ని రాజకీయకోణం లో కాకుండా ఒక మనిషిగా ఆలోచించాలి అని నా
మనవి.

by:
తెజావతు రవి తెలంగాణా



కార్గిల్ విజయానికి పదహారేండ్లు


kaargil vijayaaniki padahaarendlu


వీర సైనికులకు రక్షణమంత్రి పారికర్,త్రివిధ దళాధిపతుల నివాళులు -అమర్‌జవాన్ జ్యోతి వద్ద ఘనంగా విజయ్‌దివస్ -దేశవ్యాప్తంగా, సైనిక కేంద్రాల్లో విజయోత్సవాలు -నివాళులు అర్పించిన సినీ ప్రముఖులు కార్గిల్ విజయానికి పదహారేండ్లు.. సరిహద్దుల్లోని ఎత్తైన మంచు పర్వతాలను రక్షణగా చేసుకుని దాడికి దిగిన శత్రువులతో వీరోచితంగా పోరాడి సరిహద్దుల అవతలికి తరమికొట్టిన సైనికుల త్యాగాలను తలుచుకుంటూ దేశం ఘనంగా విజయదివస్ జరుపుకొన్నది. దేశ రాజధాని ఢిల్లీలోని అమర్‌జవాన్ జ్యోతి వద్ద రక్షణ మంత్రి మనోహర్ పారికర్, ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్ సింగ్ సుహాగ్, ఎయిర్ చీఫ్ మార్షల్ అరూప్ రాహా, నేవీ వైస్ చీఫ్ పీ మురుగేశన్ వీర సైనికులకు నివాళులు అర్పించారు. ఈ విజయాన్మి స్మరించుకుంటూ దేశవ్యాప్తంగా వేడుకలు జరిగాయి. ముఖ్యంగా అన్ని సైనిక కేంద్రాల్లో కార్గిల్ యుద్ధం లో మృతిచెందిన 490మందికిపైగా వీర సైనికులకు నివాళులు అర్పించారు. మన్‌కీ బాత్‌లో ప్రధాని నరేంద్రమోదీ కార్గిల్ వీర సైనికుల త్యాగం వెలకట్టలేనిదని కొనియాడారు. వారి సేవలకు దేశం సెల్యూట్ చేస్తున్నదన్నారు. శనివారం ఆర్మీ చీఫ్ జనరల్ సుహాగ్ కశ్మీర్‌లోని ద్రాస్ సెక్టార్‌లో ఏర్పాటుచేసిన కార్గిల్ వార్ మెమోరియల్‌ను సందర్శించారు. మరోసారి కార్గిల్ తరహా ఘటనలు పునరావృతం కాకుండా సైనిక, పారామిలిటరీ దళాలు పకడ్బందీ చర్యలు చేపట్టాయని స్పష్టం చేశారు. ఈ నెల 20న మొదలైన విజయ్‌దివస్ కార్యక్రమాలు ఆదివారంతో ముగిశాయి. కార్గిల్ వీర సైనికులను స్మరించుకుంటూ ఢిల్లీ స్ట్రీట్ ఆర్ట్ గ్రాఫిటీ కళాకారులు.. ఆర్మీకి చెందిన పాత వాహనాలను కళాఖండలుగా మార్చారు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, హృతిక్ రోషన్, అనుష్కాశర్మ తదితరులు కార్గిల్ వీరులకు నివాళులు అర్పించారు.





పార్లమెంట్ ఉభయ సభలు ప్రారంభం


పార్లమెంట్ ఉభయ సభలు ఈ ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. గత వారం ఉభయ సభల్లో వాయిదా పర్వం కొనసాగిన విషయం విదితమే. లలిత్‌గేట్, వ్యాపం స్కాంకు సంబంధించి సుష్మాస్వరాజ్, వసుంధర రాజే, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ తమ పదవులకు రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్ చేసిన విషయం విదితమే. ఈ వ్యవహారంపై ఉభయ సభలు వాయిదా పడుతూ వచ్చాయి.


Followers