ఉద్యోగులకు కేసిఆర్‌ నజరానా


తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు సర్కార్‌ తీపికబురు అందించింది. ఉద్యోగులకు 43 ఫిట్‌మెంట్‌ను ప్రకటిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసు కుంది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గురువారం సచివాల యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రభుత్వం తొలిసారిగా ప్రకటించిన వేతన సవరణ ఇదే. ఈ సందర్భంగా సీఎం కేసీ ఆర్‌ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించిన ఫిట్‌మెంట్‌ 2014 జూన్‌ 2 నుంచి అమలవు తుందని చెప్పారు. ఆ రోజు తెలంగాణ రాష్ట్ర అవ తరణ దినోత్సవం కావడంతో అదే రోజు నుంచి పీఆర్సీని అమలు చేయా లని నిర్ణయించినట్లు చెప్పారు. దీనికి సంబంధించిన ఉత్త ర్వులను ప్రభు త్వం శుక్రవారం విడుదల చేస్తుందన్నారు. పీఆర్సీ సిఫార్సు చేసిన దాని కం టే ఎక్కువగానే జీతాలు పెంచినట్లు సీఎం వివరించారు. పెరిగిన జీతాలు మార్చి నుంచి అ మలులోకి వస్తాయని తెలిపారు. వేతన సవరణ బకా యిలను జీపీఎఫ్‌లో జమ చేస్తామని అన్నారు. జూన్‌లో నెలలో రిటైర్డైన ఉద్యోగులకు సైతం ఈ వేతన సవరణ వర్తిస్తుందని సీఎం చెప్పారు. ఉద్యోగుల నియామకాలను కేడా సరళీకరణం చేయనున్నట్లు తెలిపారు. ఉ ద్యోగుల జీతభత్యాలతో పాటు ఇతర అంశాలకు సంబంధించి పలు రకాల వ్యతాసాలు కొన సాగుతున్నాయని వాటిని సవరించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా సర్వీస్‌ రూల్స్‌ను కూడా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రభుత్వం ప్రేండ్లీ సర్కార్‌ నినాదంతో ముందుకు సాగాలని కోరుకుంటుందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఉద్యోగుల సర్వీస్‌ రూల్స్‌లోనూ పెద్ద ఎత్తున మార్పులు చేయాలనిభావిస్తున్నట్లు చెప్పారు. ఇందులో ప్రధానంగా ఉద్యోగుల నిబం ధనలు అత్యంత కఠినంగా వున్నాయని వీటిని సడలించి సులభ ంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా విధులు నిర్వహించేలా మార్పు లు చేర్పులు చేయాల ని భావిస్తున్నట్లు సీఎం తెలిపారు. ఇక ప్రదీప్‌చంద్ర నేతృ త్వంతో కొనసాగుతున్న పీఆర్సీ క మిటీ రాష్ట్రంలో కొనసాగుతుందని అన్నారు. అంతకుముందు ముఖ్యమంత్రి కేసీఆర్‌ పీఆ ర్సీ కమిటీతో భేటి అయ్యారు. పలు అంశాలపై కూలం కుషంగా చర్చించిన సీఎం కేసీఆర్‌ అన్ని విధాలుగా ఉద్యోగులకు మంచి జరగాలనే వుద్దేశ్యంతో ఇంత పెద్ద మొత్తంగా వేతన సవరణకు అంగీకారం తెలిపారు. గతంలో నాలుగైదు పర్యయాలు ప్రదీప్‌చంద్ర కమిటీ ఉద్యోగ సంఘాల నేతలతో జరిపిన సంప్రదిం పులు వారి సమావే శంలోని అంశాలను కమిటీ ఛైర్మన్‌ ప్రదీప్‌చంద్ర ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ వివరించారు. కమిటీ సూచిం చిన దానితో పాటు ఉద్యోగుల ఆశించిన దానికంటే ఎక్కువగానే ఫిట ్‌మెంట్‌ను ప్రకటించినట్లు సీఎం కేసీఆర్‌ చెప్పారు. తెలంగాణ ఉద్య మంలో ఉద్యోగులు చేసిన పాత్ర అనిర్వచనీయమైనదని అన్నారు. ఈ నేపథ్యంలో ఉద్యో గులకు ఎంత చేసిన తక్కువేనని సీఎం ఈ సందర్భంగా అభిప్రా యపడ్డారు. రాష్ట్ర సాధనలో ఉద్యోగులు అగ్రభాగాన నిలిచి పోరాడిన పరిస్థితిని సీఎం కేసీఆ ర్‌ గుర్తు చేశారు. ఉద్యోగులుగా వారిపై ఎన్ని నిర్భంధాలు పెట్టినా... చివరకు పలు రకాల కేసులు నమోదు చేసినా.. ఎలాంటి భయాం దోళనలకు గురి కాకుండా సకల జనుల సమ్మె లో పాల్గొన్నారని తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఉద్యోగుల భారీస్థాయిలో నజరానాగా 43 శా తం ఫీట్‌మెంట్‌ను ప్రకటించామని తెలిపారు. ఈ సందర్భంగా సచివాలయం లోని ఉద్యోగు లు ఆనందంలో మునిగి తేలారు. సీఎం కేసీఆర్‌ మీడియా సమావేశంలో పాల్గొన్న ఉద్యోగ సంఘాల నేతలు శ్రీనివాస్‌గౌడ్‌, దేవిప్రసాద్‌, మమతతో పాటు పలు వురు నేతలు ఈ సం దర్భంగా సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అంతేకా కుండా ఆయనకు స్వీట్లు సీఎం పం చారు. పీఆర్‌సీ ప్రకటించిన విషయం తెలుసుకున్న ఉద్యోగులంతా ఒకచోట గుమికూడి అరుపులు, కేకలతో పాటు తన ఆనందోత్సవాలను తెలిపారు. సచివాలయ ఉద్యోగుల సం ఘం అధ్యక్షుడు నరేందర్‌రావు ఆధ్వర్యంలో సచివాలయ ఉద్యోగులు మిఠాయిలు పంచు కుంటూ పటా కులు కాలుస్తూ సంబురాలు జరుపుకున్నారు. ఒకరికొకరు మిఠా యిలు తి నిపించుకున్నారు. పెద్ద మొత్తం బాణసంచా కాలుస్తూ నృత్యాలు చేశారు. జై తెలంగాణ సీ ఎం కేసీఆర్‌ జిందాబాద్‌ అంటూ నినాదాలు చేస్తూ సచివాలయం ప్రాగంణాన్ని హోరెత్తించారు. ఉద్యోగులకు అధిక నష్టం: శ్రీనివాస్‌గౌడ్‌ సమైక్య పాలనలో మొదటగా నష్టపోయింది ఎవరైనా ఉన్నారంటే అది తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులేనని పార్లమెంటరీ కార్యదర్శి శ్రీనివాస్‌గౌడ్‌ స్పష్టం చేశారు. ఏపీ ఏర్పడక ముందు తెలంగాణలో ఉద్యోగుల జీతాలు ఎక్కువగా వున్న విష యాన్ని గుర్తు చేశారు. హైదరాబాద్‌ రాష్ట్రం ఆంధ్రాతో విలీనమయ్యాక ఇక్కడి ఉద్యోగుల జీతాలను తగ్గించారని అన్నారు. అక్కడి నుంచి వలస వచ్చిన వారికి ఉద్యోగాలు ఇచ్చారని తెలిపారు. సీఎం కేసీఆర్‌ ఉద్యోగులకు 4 3 శాతం ఫిట్‌మెంట్‌ ప్రకటించిన తర్వాత ఉద్యోగ సంఘాల నేతలతో కలిసి ఆయన మాట్లా డారు. తాము కోరిన వెంటనే ఒక్కమా ట కూడా మాట్లాడకుండా ఫిట్‌మెంట్‌ను పెంచేందు కు సీఎం అంగీకరించారని అన్నారు. ఈ ప్రకటనతో కేసీఆర్‌ ఉద్యోగు ల ముఖ్యమంత్రని తే లిపోయిందని పేర్కొన్నారు. కేసీఆర్‌ కోరిక మేరకు మనమంతా కలిసికట్టుగా పనిచేద్ధామ ని రాష్ట్ర అభివృద్ధికి పాటుపడదామని పిలుపునిచ్చారు. కేసీఆర్‌కు ధన్యవాదాలు: దేవిప్రసాద్‌ ఆర్థికశాఖ భారమని చెప్పినా ఉద్యోగులు రాష్ట్రాభివృద్ధికి కోసం అదనంగా గంటపాటు పనిచే స్తారని పీఆర్సీని పెంచారని తెలిపారు. పీఆర్సీతో ప్రకటనతో ప్రభుత్వానికి ఉద్యోగుల పట్ల ప్రేమ ఎంత ఉందో అర్ధమవుతుందని తెలిపారు. 42 రోజుల పాటు ఉద్యోగులు చేసిన సకల జనుల సమ్మె కాలాన్ని సెలవు రోజులుగా మంజూరు చేయాలని అధికా రులకు సీఎం ఆదేశించినట్లు తెలిపారు. ఉద్యోగులకు పీఆర్సీని ఇప్పించేలా కృషి చేసిన పార్లమెంటరీ కార్యదర్శి శ్రీనివాస్‌గౌడ్‌, మండలి ఛైర్మన్‌ స్వామి గౌడ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం కేసీఆర్‌ అభినందనలు తెలిపారు.






Followers