మిషన్‌ కాకతీయలో 154 పనులు ప్రారంభం

మేజర్‌న్యూస్‌ ప్రతినిధి: మిషన్‌కాకతీయ పనులకు ప్రజా ప్రతి నిధుల నుండి కాంట్రాక్టర్ల నుండి విశేష స్పందన వస్తుంది. ఏకంగా కాంట్రా క్టర్లయితే సమరోత్సహంతో ముందుకు కదులుతున్నారు. 2015-16 సంవత్సరానికి గాను జిల్లాలో మొత్తం 1869చెరువులు, కుంటలు పనులు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. అయితే దీంట్లో మెదక్‌ డివిజన్‌లో 383కు గాను 32చెరువులు కుంటలకు ప్రారంభోత్సవాలు జరిగాయి. సిద్దిపేటలో 1042చెరువులు కుంటలకు గాను 80చెరువులు ప్రారంభోత్స వాలు జరిగాయి. సంగారెడ్డిలో 444కు గాను 42ప్రారంభోత్సవాలు జరి గాయి. జిల్లాలో మిషన్‌కాకతీయ పనులు సిద్దిపేట డివిజన్‌లో ఎక్కువగా ముం దుకు సాగుతున్నాయి. జిల్లాలో దాదాపు 300కోట్లకు పైగా పనులు ఇప్పటి వరకు ప్రారంభమైనట్లు తెలుస్తుంది. జిల్లా వ్యాప్తంగా మిషన్‌కాకతీయ పనులు చురుగ్గా సాగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో అందోల్‌ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాబుమోహన్‌ ప్రతిపక్ష నేతలకు కాంట్రాక్టర్లు దక్కవద్దని చెబుతున్నారని దాని కారణంగా నియోజకవర్గంలోని అల్లాదుర్గానికి చెందిన బ్రహ్మం అనే వ్యక్తి అందోల్‌కు చెందిన లక్ష్మినారాయణ అనే వ్యక్తులు ఎమ్మెల్యే తమపై మేజర్‌న్యూస్‌ ప్రతినిధి: మిషన్‌కాకతీయ పనులకు ప్రజా ప్రతి నిధుల నుండి కాంట్రాక్టర్ల నుండి విశేష స్పందన వస్తుంది. ఏకంగా కాంట్రా క్టర్లయితే సమరోత్సహంతో ముందుకు కదులుతున్నారు. 2015-16 సంవత్సరానికి గాను జిల్లాలో మొత్తం 1869చెరువులు, కుంటలు పనులు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. అయితే దీంట్లో మెదక్‌ డివిజన్‌లో 383కు గాను 32చెరువులు కుంటలకు ప్రారంభోత్సవాలు జరిగాయి. సిద్దిపేటలో 1042చెరువులు కుంటలకు గాను 80చెరువులు ప్రారంభోత్స వాలు జరిగాయి. సంగారెడ్డిలో 444కు గాను 42ప్రారంభోత్సవాలు జరి గాయి. జిల్లాలో మిషన్‌కాకతీయ పనులు సిద్దిపేట డివిజన్‌లో ఎక్కువగా ముం దుకు సాగుతున్నాయి. జిల్లాలో దాదాపు 300కోట్లకు పైగా పనులు ఇప్పటి వరకు ప్రారంభమైనట్లు తెలుస్తుంది. జిల్లా వ్యాప్తంగా మిషన్‌కాకతీయ పనులు చురుగ్గా సాగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో అందోల్‌ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాబుమోహన్‌ ప్రతిపక్ష నేతలకు కాంట్రాక్టర్లు దక్కవద్దని చెబుతున్నారని దాని కారణంగా నియోజకవర్గంలోని అల్లాదుర్గానికి చెందిన బ్రహ్మం అనే వ్యక్తి అందోల్‌కు చెందిన లక్ష్మినారాయణ అనే వ్యక్తులు ఎమ్మెల్యే తమపై గుర్రుగా ఉన్నారని ఇ ప్రిక్యూర్‌మెంట్‌ ద్వారా వచ్చిన టెండర్లు తమకే ఇవ్వాలని చెబుతున్నారు. ఇ ప్రిక్యూర్‌మెంట్‌ ద్వారా పని నోట్‌ అయినా ఐదు రోజుల లోపు అగ్రిమెంట్‌ చేయకపోతే ఆ కాంట్రాక్టర్‌కు తరువాత వచ్చి అడిగే అర్హత ఉండదని దీనికి సంబంధిత ఈఈ నచ్చజెప్పినప్పటికి కాంట్రా క్టర్‌లు ఎమ్మెల్యే మా వైపు లేడని మాకు కాంట్రాక్ట్‌ దక్కకుండా చూస్తున్నారని వారు పేర్కొంటున్నారు. అందోల్‌ నియోజకవర్గంలో కాంట్రాక్టర్ల మద్య సమన్వ యం లేదనే చెప్పాలి. జిల్లా వ్యాప్తంగా మొదలైన దాదాపు 154పనులలో సిద్దిపేటలో మినహా మిగిలిన చోట్ల పనులు మందకొడిగా సాగడం దీంతో అధి కారులు కాంట్రాక్టర్లకు మద్య ఇబ్బందికర పరిస్థితులు రావడం మొదలైంది. ఇప్రొక్యూర్‌మెంట్‌ ద్వారా టెండర్‌ దక్కించుకున్న కాంట్రాక్టర్‌ మంత్రి లేక ఎమ్మెల్యే లేక జడ్‌పి చేర్మేన్‌ లేక ఆ మండలంకు సంబందించిన యంపిపి లేదా జడ్‌పిటిసిల చేత పనులు ప్రారంభించుకొని పూర్తి చేస్తున్నారు. సిద్దిపేట డివి జన్‌లో దుబ్బాక నియోజకవర్గంలో మొత్తం 18పనులు ఎమ్మెల్యేచే ప్రారంభిం చబడి ప్రారంభం అయిన తరువాత పనులు ముందుకు సాగకపోవడం అలాగే సిద్దిపేట నియోజకవర్గంలో మొత్తం 36పనులకు గాను 33పనులు జడ్‌పిటిసి, యంపిపిలు ప్రారంభించగా 3 పనులు మాత్రం మంత్రి ప్రారంభించడం జరిగింది. ఈ పనులు చురుగ్గా సాగుతున్నట్లు సమాచారం. గజ్వేల్‌ నియోజక వర్గంలో మొత్తం 25పనులకు గాను 7పనులు యంపి, ఐదు పనులు మంత్రి మిగిలినవి ఆ నియోజకర్గానికి చెందిన యంపిపిలు, జడ్‌పిటిసిలు ప్రారంభిం చడం జరిగింది. ముఖ్యమంత్రి నియోజకవర్గం కావడం వల్ల అక్కడ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో 1869పనులు మిషన్‌కాకతీయ కింద చేపడితే ఇప్పటివరకు 154 పనులు ఆయా ప్రజా ప్రతినిదులు ప్రారంభించడం జరిగింది. కానీ వీటిలో దాదాపు సగానికి పైగా పనులు గాడిలో పడలేదు. ఈ పనులు గాడిలో పడాలంటే అధికారులకు, కాంట్రాక్టర్లకు మద్య సమన్వయం ఉండాలి. కొన్ని పనులకు కాంట్రాక్టర్‌కు రైతులకు సమన్వయం కుదురాలి. వీరి మధ్య సమన్వయం లేకపోవడం వల్ల పనులు ముందుకు సాగడం లేదనేది తెలుస్తుంది.

Followers