Central Government Second Year Civics in Telugu

central government second year civics in Telugu,second year civics in Telugu
యూనిట్ -3   కేంద్ర ప్రభుత్వం


1      1.     రాష్ట్రపతి ఎన్నిక:      పార్లమెంట్ లో ఎన్నికయిన సభ్యులు, రాష్టాలలోని విధాన సభలోని ఎన్నికైన సభ్యులు మరియు  డిల్లీ, పాండిచ్చేరి శాసన సభలలోని ఎన్నికైన సభ్యులు కలసి ఎన్నికల గణంగా ఏర్పడి రాష్ట్రపతిని నైష్పత్తిక ప్రాతిపదికన ఓటు బదిలీ సూత్రం అనుసరించి ఎన్నుకోంటారు.
         2.  రాష్ట్రపతి అర్హతలు:   
                      I.        భారతదేశ పౌరుడై ఉండాలి
                    II.        35 సం, వయస్సు నిండినవారై ఉండాలి
                   III.        లోకసభకు ఎన్నికయై సభ్యుడికి ఉండె అర్హతలు కలిగి ఉండాలి
                  IV.        ప్రభుత్వ ఉద్యోగాలలోను, లాభసాటి పదవిలో ఉండకూడదు.
     3.  మహాభియోగ తీర్మాణం / రాష్ట్రపతిని తోలిగించే పద్దతి(IMP):        రాష్ట్రపతిని తోలిగించే ప్రక్రియను మహాభియోగ తీర్మాణం అంటారు. రాష్ట్రపతి రాజ్యాంగ విర్ధుంగా,అవినీతికి పాలిపడినట్లయితే, పార్లమెంట్ లోని      ఏ సభలోనైన ఈ తీర్మాణాన్ని ప్రవేశపెట్టవచ్చు. అయితే 14 రోజుల ముందు రాష్ట్రపతికి తెలియజేయాలి.  పార్లమెంట్ ఉభయ సభలు 2/3 వంతు మోజారిటితో దినిన్ని అమోదించితే  రాష్ట్రపతి పదివి నుంచి తోలిగిపోతారు.
    4.  356 వ అదికరణ / రాష్ట్రపతి పాలన (IMP) :           ఏదైనా రాష్ట్రంలో రాజ్యాంగ బద్ధపరిపాలనకు అవరోధం ఏర్పడినట్లయితే రాష్ట్రపతి 356 వ అధికరణ ప్రకారం అ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విదిస్తారు ఆ సమయంలో రాష్ట్రంలో  రాష్ట్రప్రభుత్వం రద్ధు అయి రాష్ట్రంనికి కావలసిన శాసనాలు పార్లమెంట్ తయారుచేస్తుంది.
    5.    352 వ అధికరణ / జాతీయ అత్యవసర పరిస్థితి:   జాతీయ అత్యవసర పరిస్థితిని 352 అధికరణ ప్రకారం రాష్ట్రపతి విదిస్తాడు. విదేశి దండయాత్రలు యుద్ధం, సాయుధ తిరుగుబాటు వంటి పరిస్థితులు ఉత్పన్నమైనప్పుడు భారతదేశ సార్వభౌమత్వానికి ముప్పు వాటిల్లిందని భావిస్తే రాష్ట్రపతి అత్యవసర అధికారాన్ని వినియోగిస్తాడు అయితే పార్లమెంట్ 2/3 వంతు మోజారిటితో ఆమోదించాలి. ఈ ప్రకటన 6 నెలల పాటు ఉంటుంది.
    6.  360 వ అధికరణ / ఆర్ధిక అత్యవసర పరిస్థితి:       భారతదేశంలో ఆర్థిక సిర్థత్వానికి లెదా పరపతికి ముప్పు వాటిల్లిన పరిస్థితి ఏర్పడినట్లయితే 360 అధికరణ ప్రకారం రాష్ట్రపతి  ఆర్థిక అత్యవసర పరిస్థితిని విదిస్తాడు. ఈ సమయంలో ప్రముఖుల వేతనాలు కూడా తగ్గించవచ్చు. ఇప్పటి వరకు ఈ పరిస్థితిని విధించలేదు.  

      7.    భారత రాష్ట్రపతులుగా వ్యవహారించిన నలుగురి పేర్లు (IMP):
1)    డా. బాబు రాజేంద్రప్రసాద్
2)   సర్వేపల్లి రాధాకృష్ణన్
3)   వెంకట రామన్
4)   అబ్ధుల్ కలాం
5)   శ్రీమతి ప్రతిభా పాటిల్
    8.  ప్రదానమంత్రి నియామకం (IMP) :      75(1) అధికరణ ప్రకారం ప్రధానమంత్రిని రాష్ట్రపతి నియమిస్తాడు.     లోక్సభకు ఎన్నికలు జరిగిన తరువాత, లోక్సభలో మెజారిటి పార్టీ నాయకుని ప్రధానమంత్రిగా రాష్ట్రపతి నియమిస్తాడు. ఒకవేళ లోక్సభలో ఏ ఒకపార్టీకీ మెజారిటి రాకపోతే అప్పుడు రాష్ట్రపతి తన విచ్చక్షణాధికారం ప్రధానమంత్రిని నియమించవచ్చు,తర్వాత అతను లోక్సభలో విశ్వాసం పోందాలి.
    9.  కేంద్రమంత్రుల రకాలు:
1)    కెబినేట్ మంత్రులు
2)   డిప్యూటి మంత్రులు
3)   స్టెట్ మంత్రులు


10.      సమిష్టి బాధ్యత (IMP):        75(3) అధికరణ ప్రకారం కేంద్ర మంత్రి మండలి లోక్సభకు సమిష్టింగా బాధ్యత వహించును. ఒకమంత్రి ప్రవేశపేట్టిన బిల్లు లోకసభ చేత తిరస్కరించబడినట్లయితే ఆ మంత్రితో పాటు అందరు మంత్రులు రాజీనామా చేయవలసి ఉంటుంది. కీర్తినైన – అపకీర్తినైనా మంత్రులందరూ కలసి పంచుకుంటారు.
11.      భారత ఉపరాష్ట్రపతి ఎన్నిక:  ఉపరాష్ట్రపతిని పార్లమెంట్ ఉభయసభలలోని ఎన్నికైన మరియు నామినేటిడ్ సభ్యులు నైష్పత్తిక ప్రాతినిధ్య పద్థతి ప్రకారం ఒక ఓటు బదిలీ సూత్రాన్ని అనుసరించి ఉపరాష్ట్రపతిని ఎన్నుకూంటారు. ఈ ఎన్నిక భారత ఎన్నికల సంఘం పర్యవేక్షిస్తుంది.
12.      భారత ప్రధానమంత్రిగా వ్యవహరించిన నలుగురి పేర్లు:
1)    జవహార్ లాల్ నెహూ                        4.  రాజీవ్ గాంధీ
2)   లాల్ బహుదూర్ శాస్త్రి                       5.   A.B  వాజ్  పాయి
3)   ఇందిరా గాంధీ                                6.   డా. మన్మోహన్ సింగ్

Nobel Prizes

వైద్యశాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతి

వైద్యశాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతిని పంచుకున్న బ్యూట్లర్, హాఫ్మన్, స్టీన్మన్ రోగనిరోధక వ్యవస్థలో పరిశోధనలకు దక్కిన గౌరవం


స్టాక్హోమ్, 2011 అక్టోబర్ 3: నోబెల్ బహుమతుల సందడి మొదలైంది. కేన్సర్ సహా పలు రకాల వ్యాధుల చికిత్సలో సరికొత్త అవకాశాలను కనుగొన్న ముగ్గురు శాస్త్రవేత్తలకు ఉమ్మడిగా వైద్యరంగంలో నోబెల్ బహుమతిని ప్రకటించారు. అమెరికాకు చెందిన బ్రూస్ బ్యూట్లర్, లగ్జెంబర్గ్కు చెందిన జూల్స్ హాఫ్మన్, కెనడాకు చెందిన రాల్ఫ్ స్టీన్మన్లు గౌరవాన్ని దక్కించుకున్నారు. రోగ నిరోధక వ్యవస్థకు సంబంధించిన కీలక సిద్ధాంతాలను కనిపెట్టడం ద్వారా వీరు ముగ్గురూ విప్లవాత్మక కృషి చేశారని జ్యూరీ ప్రకటనలో తెలిపింది. బహుమతి గ్రహీతలలో ఒకరైన స్టీన్మన్ (68) గతనెల 30 పాంక్రియాటిక్ కేన్సర్తో మరణించారు. అయితే.. బహుమతి ప్రకటించిన కొద్ది గంటల తర్వాత గానీ, విషయం జ్యూరీకి తెలియలేదు. నిబంధనల ప్రకారం బహుమతిని మరణానంతరం ప్రకటించేందుకు వీల్లేదు. కానీ, బహుమతి ప్రకటించి తర్వాతే తమకు స్టీన్మన్ మృతి విషయం తెలిసిందని జ్యూరీకి నేతృత్వం వహించిన గెరాన్ హాన్సన్ తెలిపారు. కొత్తగా మరో విజేతను ప్రకటించేది లేదని, బహుమతి ఎలా ఇవ్వాలన్న విషయంలో నిబంధనలను పరిశీలిస్తామని అన్నారు. రోగనిరోధక శక్తి తగ్గడం వల్ల వచ్చే ఆస్థమా, రుమటాయిడ్ ఆర్థరైటిస్, క్రాన్స్డిసీజ్ లాంటి వ్యాధులకు సరికొత్త మందులు కనిపెట్టేందుకు వీరి పరిశోధనలు ఉపయుక్తంగా ఉంటాయని జ్యూరీ వివరించింది. మొత్తం రూ. 7.1 కోట్ల బహుమతిలో సగం మొత్తాన్ని బ్యూట్లర్, హాఫ్మన్లు పంచుకుంటా రు. మిగిలిన సగం స్టీన్మన్కు వెళ్తుంది. ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి డిసెంబర్ 10 స్టాక్హోమ్లో జరిగే కార్యక్రమంలో వీరు బహుమతులను అందుకుంటారు. కాగా.. ఆర్థిక, భౌతిక, రసాయన శాస్త్రాలు, సాహిత్యం, శాంతి విభాగాలలో నోబెల్ బహుమతులను త్వరలో ప్రకటించనున్నారు. అందులో భాగంగా నోబెల్ శాంతి బహుమతిని వచ్చే శుక్రవారం 7 తేదీన ఓస్లోలో ప్రకటిస్తారు. ఈసారి విభాగానికి రికార్డు స్థాయిలో 241 నామినేషన్లు వచ్చాయి. ఈసారి ట్యునీషియా, ఈజిప్ట్, లిబి యా, సిరియా, యెమెన్, బహ్రెయిన్ లాంటి ప్రాంతాల్లో వచ్చిన ప్రజాస్వామ్య విప్లవాన్ని ముందుండి నడిపించిన యోధులలో ఎవ రో ఒకరికి బహుమతి రావచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. వీరిలో ట్యునీషియాకు చెందిన బ్లాగర్ లీనా బెన్ మెన్నీకి దక్కే అవకాశం ఉందని కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇంటర్నెట్లో విప్లవాన్ని వ్యాప్తి చేయడంలో ఈమె కీలకపాత్ర పోషించారు. ఈజిప్టుకు చెందిన ఇస్రా అబ్దెల్ ఫతా, ఏప్రిల్ 6 నాటి ఉద్యమాలకు కూడా రావచ్చని అంచనా ఉంది. కైరోలోని తెహ్రీర్ స్క్వేర్ ఉద్యమానికి స్ఫూర్తిగా నిలిచిన అహింసా ఉద్యమకర్త, గూగుల్ అధికారి వేల్ ఘోనిమ్ కూడా అవార్డు అందుకోడానికి అవకాశాలు ఉన్నాయంటున్నారు. గత సంవత్సరం జైల్లో న్న చైనా ఉద్యమకారుడు లియు జియబావోకు శాంతి హుమతి దక్కింది. నోబెల్ సాహిత్య బహుమతికి వినపడుతున్న పేర్లలో మన దేశానికి చెందిన విజయదాన్ డెతా పేరు కూడా ఉంది. పరిశోధనలు ఇవే శరీరంలోని రోగనిరోధక స్పందన వ్యవస్థలోని తొలి అంకా న్ని ప్రేరేపించే రిసెప్టర్ ప్రోటీన్లను బ్యూట్లర్, హాఫ్మన్ కనుగొన్నారు. శరీరంలోనే ఉండి ప్రమాదకరంగా పరిణమించే సూక్ష్మ జీవులను గుర్తించి వాటిపై దాడి చేయడంలో రోగనిరోధక వ్య వస్థకు సాయపడే డెండ్రిటిక్ కణాలను స్టీన్మన్ కనుగొన్నారు.


Tags:Nobel Prizes,nobel prize winners ,Nobal prize ceremony, obama nobel prize, nobal prize ceremony

Followers