భారత ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి
ష్టాత్మకప్రతిష్ఠాత్మక 'పద్మ' అవార్డుల జాబితాను కేంద్రం సిద్ధం చేసింది.
వివిధ రంగాలలో ప్రతిభను కనపరిచిన కనబరిచిన 148 మందికి ఈ అవార్డును
రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా అందుకోనున్నట్టు సమాచారం. బీజేపీ
నేత అద్వానీతో పాటు అమితాబ్, అమితాబ్, సూపర్ స్టార్ రజనీకాంత్,
ఆధ్యాత్మిక గురు శ్రీశ్రీ రవిశంకర్, యోగా గురు బాబారాందేవ్ రాందేవ్లకు
పద్మవిభూషణ్ పురస్కారాలు దక్కను న్నాయని తెలుస్తోంది. దిలీప్ కుమార్,
ఎన్.గోపాలస్వామిలను పద్మభూ షణ్ అవార్డులకు కేంద్రం ఎంపికచేసినట్లు
వార్తలు వెలువడుతున్నాయి. వీరితోపాటు సూపర్ స్టార్ రజనీకాంత్,
పి.వి.సింధు, సర్దార్ సింగ్, సింగ్, ప్రకాశ్ సింగ్ బాదల్ తదితరులకు
కూడా 'పద్మ' అవార్డులను అందుకోనుననట్లు తెలుస్తోంది.
వీరితో పాటు 'పద్మ' పురస్కారాలను అందుకోనున్నవారిలో దర్శకుడు సంజయ్
లీలాభన్సలి,భన్సాలి, సల్మాన్ ఖాన్ తండ్రి సలీం ఖాన్, భారత హాకీ జట్టు
కెప్టెన్సర్దారా సింగ్, చెస్ గ్రాండ్ మాస్టర్ శశికిరణ్ కృష్ణన్,
కుస్తీ వీరుడు సుషీల్ కుమార్, ఆయన కోచ్ సత్పాల్,
ఎవరెస్ట్ ఎక్కిన తొలి వికలాంగురాలు అరుణి మా సిన్హా, దివంగత నటుడు
ప్రాన్, చీఫ్ ఎలక్షన్ కమీషనర్ ఎన్ గోపాలస్వా మి, సీనియర్ లాయర్
హరీష్ సాల్వే, హెచ్ సీఎల్ చీఫ్ శివ నాడార్, సంగీత దర్శకుడు అను
మాలిక్లు అవార్డులు అందుకోనున్నారని విశ్వసనీయంగా తెలుస్తోంది.
చంద్రయాన్ను విజయవంతం చేసిన ఎస్.కే.శివకుమార్, తుం కూర్ సిద్ధగంగా మఠం
హెడ్ శివ కుమారస్వామి, జగద్గురు రామణానందాచా ర్య, స్వామి రమభదచ్రార్య,
స్వామి సత్యమిత్రా నంద గిరి తదితరులు కూడా అవార్డులను అందుకోనున్నట్లు
తెలుస్తోంది. అవార్డుల విషయంలో కేంద్రం నేడు అధికారిక ప్రకటన వెలువరించే
అవకాశాలు వున్నాయి.
పాపులేషన్ క్లాక్ : ఈ రోజుకి భారత దేశ జనాభా 128,76,92,601. ఎలా చెప్పగలం ?
పాపులేషన్ క్లాక్... 16.01.2015 నాటికి భారత దేశం జనాభా 128,76,92,601.
అరె.. ఇది భళే ఉందే. సాధారణంగా క్లాక్ అంటే టైం చెప్పేది కానీ, ఇలా జనాభా
చెప్పే క్లాక్ ఉందా.. అవును ఈ క్లాక్ ఉంది. వారు ఏ రోజుకారోజు జనాభా ప్రతీ
రోజు చెబుతారా... అరే ఇది భళే ఉంది. దాదాపు 5 వేల కిలో మీటర్ల పరిధి ఉన్న
భారత దేశంలో ఏ మూలన ఎవరు పుడుతున్నారు..? ఎంత మంది పుడుతున్నారు.? ఎంత మంది
చనిపోతున్నారు.. ? ఇవన్నీ లెక్కేసి జనాభా చెప్పేయడం అంత సులభమా..? ఎలా
చెబుతారు.? రండి తెలుసుకుందాం.
దేశంలోని చాలా విశ్వ విద్యాలయాలలో పాపులేషన్ స్టడీస్ అని ఒక విభాగం
ఉంటుంది. దీని పనే అది. జనాభా మీద స్టడీస్ చేయడమే. పురుషులెందరున్నారు..?
స్త్రీలు ఎంతమంది ఉన్నారు.? వారిలో యువతులెంత మంది.? యువకులెంత మంది.?
వితంతవులెంత మంది ? ఎంత మంది చనిపోతున్నారు? ఎంత మంది పుడుతున్నారు? మనిషి
సగటు జీవిత కాలమెంత? ఇలాంటి ఎన్నో అంశాలపై పరిశోధనలు చేస్తూనే ఉంటారు.
ఆ విభాగం ఏ రోజుకారోజు జనాభాను ఇట్టే లెక్కగడుతుంది. అది ఇప్పటి నుంచి
కాదు. 1982 నుంచి చేస్తూనే ఉన్నారు. సాధారణంగా అయితే పదేళ్ళకొకమారు
ప్రభుత్వం జనాభా లెక్కలను గణిస్తారు. ఇది మనకు తెలిసిందే..
ముంబయిలోని పాపులేషన్ విభాగం దినసరి లెక్కలను చెబుతుంది. ఇలా చెప్పడాన్నే
'పాపులేషన్ క్లాక్' అంటారు.
పాత జనాభాను లెక్కేసుకుని జనాభా పెరుగుదల శాతం, పుట్టుక శాతం, మరణించే
శాతం, అలాగే జీవన ప్రమాణాలను లెక్క గట్టి జనాభాను లెక్కిస్తారు. ఏ
రోజుకారోజు ' పాపులేషన్ క్లాక్ ' ద్వారా జనాభాను ప్రకటిస్తారు. ఈ లెక్కల్లో
0.12 నుంచి 0.5 శాతం తేడాతో ఇట్టే చెప్పేస్తారు. 2011లో జనాభా లెక్కలకు
పాపులేషన్ క్లాక్ కు కేవలం 12 లక్షల జనాభానే తేడా వచ్చింది.
Subscribe to:
Posts (Atom)