బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్శిటీ డిగ్రీ ప్రోగ్రాంలో ప్రవేశానికి నిర్వహించే అర్హత పరీక్ష -2015

హైదరాబాద్‌లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్శిటీ డిగ్రీ ప్రోగ్రాంలో ప్రవేశానికి నిర్వహించే అర్హత పరీక్ష -2015కు దరఖాస్తులు కోరుతోంది. - కోర్సులు : బీఏ, బీకాం, బీఎస్సీ - అర్హతలు : (ఇంటర్‌ ఉత్తీర్ణులైన వారికి నేరుగా ప్రవేశం లభిస్తుంది.) ఎటువంటి విద్యార్హత లేకపోయినా 2015, జులై 1 నాటికి 18 ఏళ్లు నిండిన వాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు. - ఎంపిక : అర్హత పరీక్ష ఆధారంగా. - దరఖాస్తులు : ఆన్‌లైన్‌లో... - అర్హత పరీక్ష తేదీ : 12. ఏప్రిల్‌ వెబ్‌సైట్‌ : www.braouonline.in ఎన్‌సీహెచ్‌ఎం జెఈఈ -2015 నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ క్యాటరింగ్‌ టెక్నాలజీ జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (ఎన్‌సీహెచ్‌ఎం జెఈఈ) 2015 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. - కోర్సు : బీఎస్సీ (హాస్పిటాలిటీ అండ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌) - అర్హతలు : ఇంటర్‌ ఉత్తీర్ణత. - దరఖాస్తులకు చివరి తేదీ : ఏప్రిల్‌ 6 వెబ్‌సైట్‌ : www.applyadmission.com ఎన్బీసీసీఎల్‌ నేషనల్‌ బిల్డింగ్‌ కన్‌స్ట్రక్షన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎన్‌బీసీసీఎల్‌) కింది పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. - మేనేజ్‌మెంట్‌ ఏదైనా డిగ్రీ, మేనేజ్‌మెంట్‌లో పీజీ డిప్లొమా / ఎంబీఏ (మార్కెటింగ్‌) ఉండాలి. - వయసు : 29 ఏళ్లకు మించకూడదు. - డిప్యూటీ మేనేజర్‌ (మార్కెటింగ్‌) : 1 - అర్హత : ఏదైనా డిగ్రీ, మేనేజ్‌మెంట్‌లో పీజీ డిప్లొమా / ఎంబీఏ (మార్కెటింగ్‌)తోపాటు సంబంధింత విభాగంలో మూడేళ్ల అనుభవం ఉండాలి. - ఎంపిక : రాత పరీక్ష, గ్రూప్‌ డిస్కషన్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా. - ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ : ఫిబ్రవరి 10 - వెబ్‌సైట్‌ : www. nbccindia.gov.in

డ్రాగన్‌తో పటిష్ఠ బంధం ( చైనా పటిష్ఠ బంధం)

 చైనా అధ్యక్షుడు షీ చిన్‌ఫింగ్‌ను భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ కలుసుకున్నారు. ఈ సందర్భంగా షీ చిన్‌ ఫింగ్‌ మాట్లాడు తూ త్వరలో చైనా - భారత్‌ సంబం దాల్లో కొత్త దశ రూప దాల్చనుందని అన్నారు. బీజింగ్‌లోని గ్రేట్‌ హాల్‌ ఆఫ్‌ ది పీపుల్‌లో భారత విదేశాంగశాఖ మం త్రి సుష్మాస్వరాజ్‌కు చైనా అధ్యక్షుడు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భం గా ఆయన తన భారత పర్యటన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ గతంలో తాను భారత్‌ వచ్చిన సందర్భంలో అం దిన స్వాగతం అపూర్వమన్నారు. గుజరాత్‌ రాష్ట్రంలో ప్రధాని నరేంద్రమోడీ తనను ఆహ్వానించిన తీరును ఇప్పటికీ మరువలేనిదని అన్నారు. గత సెప్టెంబరులో ప్రధాని నరేంద్రమోడీని కలుసుకున్నానని పేర్కొన్నారు. భారత రాష్టప్రతి ప్రణబ్‌ ముఖర్జీకి, ప్రధానికి తన అభినందనలు తెలియజేయాలని కోరారు. మోడీ పర్యటన అనంతరం ఇరు దేశాల మధ్య మరింత సుహృద్భావం వెల్లివిరిసిందని, ఇరు దేశాల అనుబంధంలో కొత్త దశ మొదలైందని అన్నారు. మున్నుందు ఈ బంధం మరింత దృఢపడి ఇరు దేశాల అభివృద్ధికి దోహదపడాలన్నారు. అలాగే త్వరలో జరగబోయే ఇరు దేశాల దె్వైపాక్షిక సమావేశాలు మరింత ప్రగతిని ప్రతిబింబించాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. కాగా ఈ నెల చివరిలో జరగనున్న చైనా నూతన సంవత్సరం సందర్భంగా ప్రధాని చైనావాసులకు శుభాకాంక్షలు తెలిపారని సుష్మా పేర్కొన్నారు. ఈ కొత్త సంవత్సరంలో ఇరు దేశాల మధ్య జరగబోయే సమావేశాలు ఫలప్రదం కావాలని కోరుకుంటున్నానని సుష్మా అన్నారు.

Followers