ఇగ్నోలో ఇక ఆన్‌లైన్ అడ్మిషన్లు


విద్యార్థులకు మరింత సౌకర్యవంతంగా ఉండేందుకు గాను ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం(ఇగ్నో) ఆన్‌లైన్ అడ్మిషన్ వ్యవస్థ(ఓఏఎస్)ను ప్రారంభించింది. ఈ ఆన్‌లైన్ వ్యవస్థను గురువారం ఇగ్నో తాత్కాలిక ఉప కులపతి ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇగ్నోలో వివిధ కోర్సుల్లో చేరాలనుకునే అభ్యర్థులు ఈ వ్యవస్థ ద్వారా ఇక ఆన్‌లైన్‌లోనూ దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఇగ్నోలోని 148 కోర్సులకు జూలై 2015 అడ్మిషన్ సెషన్‌లో ప్రవేశాలకు ఈ వ్యవస్థ అందుబాటులో ఉంటుందన్నారు. ఇగ్నో వెబ్‌సైట్ (www.ignou.ac.in) ద్వారా ఆన్‌లైన్ ప్రవేశాలు పొందవచ్చని, పీజీ కోర్సులకు జూన్ 15 ఆఖరు తేదీ అని, ఆలస్య రుసుముతో జూన్ 30 వరకూ గడువుందని తెలిపారు.


పోస్టల్ ఖాతాదారులకు ఎటిఎం సదుపాయాలు


ఎ.పి. తెలంగాణ రాష్ట్రాలలో పోస్టల్ ఖాతాదారులకు సరికొత్త విధానంతో ఎటిఎం సదుపాయం కల్పిస్తున్నట్లు పోస్టల్ డైరెక్టర్ రాధిక చక్రవర్తి తెలిపారు. బుధవారం సికిందరాబాద్ ప్యాట్నీ పోస్టల్ కార్యాలయంలో ఎటిఎం బ్రాంచ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోస్టల్ ఖాతాదారులకోసం మెరుగైన సేవలు అందించేందుకు పోస్టల్‌శాఖ ముందున్నట్లు ఆమె తెలిపారు. తమ శాఖలో ఎస్‌బి అకౌంట్స్, పెన్షన్ ఖాతాదారులు నేరుగా ఎటిఎం ద్వారా నగదు డ్రాచేసుకునే విధానాన్ని ప్రవేశపెట్టినట్లు ఆమె తెలిపారు. ప్రధాన పోస్టల్ కార్యాలయం ఆబిడ్స్‌లో ఎటిఎం మొదటి కేంద్రాన్ని ప్రారంభించినట్లు వారు తెలిపారు. తదనంతరం విజయవాడ, సికిందరాబాద్ల్‌లో పోస్టల్ ఖాతాదారులకోసం ఎటిఎం కేంద్రాలు ఏర్పాటైనట్లు ఆమె వెల్లడించారు. ప్రధాన పోస్టల్ కేంద్రాలలో 95 త్వరలోనే ఎటిఎం కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సికిందరాబాద్ సీనియర్ పోస్టల్ అధికారి బి.వి.రమణ తదితరులు పాల్గొన్నారు. గంటకో ఆపరేషన్! హైదరాబాద్, మే 6: సాధారణంగా ఓ డాక్టర్ రోగి పరిస్థితిని బట్టి రోజుకు నాలుగైదుకు మించి ఆపరేషన్లు చేయలేరు. అందులో తర్వాత
చేయవచ్చునని వాయిదా వేసేందుకు వీల్లేని ఫ్య్రాక్చర్ కేసులకు సంబంధించి గంటకు ఒకటి చొప్పున అరుదైన ఆపరేషన్లను విజయవంతంగా పూర్తి చేసిన కిమ్స్ వైద్యుడు డా. ఉదయ్ కృష్ణ అరుదైన గుర్తింపును దక్కించుకున్నారు. పధ్నాలుగు గంటల్లో 14 అరుదైన ఆపరేషన్లను నిర్వహించిన సందర్భంగా ఆయన కేసులకు సంబంధించిన వివరాలను ఎస్‌ఎంఎస్ మీడియా సెంటర్ ద్వారా వివరాలను వెల్లడించారు. గత నెల 25వ తేదీన గుంటూరు జిల్లా వినుకొండలో రామలింగేశ్వర్ రావు, సుబ్బలక్ష్మి అనే దంపతులు కారు ప్రమాదంలో గాయపడ్డారు. అదే రోజు నల్గోండ జిల్లా యాదగిరిగుట్ట దగ్గర లారీ ప్రమాదంలో సత్యనారాయణ అనే వ్యక్తి తన కాలును పొగొట్టుకున్నాడు. ఈ రకంగా వివిధ రోడ్డు ప్రమాదాల్లో గాయపడి ఫ్య్రాక్చర్‌కు గురైన పలువురు రోగులకు డాక్టర్ ఉదయ్ కృష్ణ అతి తక్కువ సమయంలోనే 14 అరుదైన ఆపరేషన్లను నిర్వహించి తన సత్తాను చాటుకున్నాడు. సాధారణంగా ఫ్య్రాక్చర్ కేసులకు సంబంధించి ఒక్కో శస్తచ్రికిత్సకు గంటన్నర సమయం పడుతుందని, కొన్ని క్లిష్టమైన ఆపరేషన్లకు మూడు నుంచి నాలుగుగంటల సమయం కూడా పడుతుందని ఆయన వివరించారు. కానీ పద్నాలుకు ఫ్య్రాక్చర్ కేసులను సవాలుగా తీసుకున్న తాను కేవలం 14 గంటల వ్యవధిలోనే గంటకు ఒకటి చొప్పున ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసినట్లు డా.ఉదయ్ తెలిపారు. ఈ అరుదైన ఆపరేషన్లు నిర్వహించేందుకు తన నైపుణ్యత ఎంత కారణమో, కిమ్స్ ఆస్పత్రిలో ఉన్న ఆధునిక ఆపరేషన్ ధియేటర్, వైద్య పరికరాలు, సిబ్బంది అంకితాభావం కూడా కారణమని డాక్టర్ ఉదయ్ కృష్ణ తెలిపారు. తక్కువ సమయంలో తమకు విజయవంతంగా ఆపరేషన్ నిర్వహించిన డా. ఉదయ్‌కి రోగులు కూడా కృతజ్ఞతలు తెలిపినట్లు ఎస్‌ఎంఎస్ మీడియా సెంటర్ ప్రకటనలో వెల్లడించింది. ఈ శస్తచ్రికిత్సల నిర్వహణలో అనేస్థేషియ విభాగాధిపతి డా. నరేష్‌కుమార్, డా. భారతితో పాటు కిమ్స్ సిబ్బంది తనకు సహకరించారని డా. ఉదయ్ తెలిపారు.
 



Followers