ఉస్మానియా విశ్వవిద్యాలయం భూముల్లో పేదలకు ఇళ్లు కట్టిస్తామన్న తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా ఓయూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల నుంచి లా కళాశాల వరకు భారీ ర్యాలీ నిర్వహించి రహదారిపై బైఠాయించారు.
ఓయూలో విద్యార్థుల ఆందోళన OU
ఉస్మానియా విశ్వవిద్యాలయం భూముల్లో పేదలకు ఇళ్లు కట్టిస్తామన్న తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా ఓయూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల నుంచి లా కళాశాల వరకు భారీ ర్యాలీ నిర్వహించి రహదారిపై బైఠాయించారు.
నేడు తెలంగాణ లాసెట్-2015
తెలంగాణ రాష్ట్రంలోని న్యాయ కళాశాలల్లో మూడు, ఐదు సంవత్సరాల న్యాయశాస్త్ర కోర్సులతో ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎంలో ప్రవేశాలకు మంగళవారం లాసెట్-2015ను నిర్వహించనున్నట్లు లాసెట్ కన్వీనర్, కేయూ ఇన్ఛార్జి రిజిస్ట్రార్ ఆచార్య ఎంవీ.రంగారావు తెలిపారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్, కేయూ విశ్రాంత ఆచార్యులు టి.పాపిరెడ్డి మంగళవారం ఉదయం ప్రశ్నపత్రాల సెట్లను విడుదల చేస్తారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 19,291 మంది అభ్యర్థులకు 30 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. జూన్ మొదటి వారంలో ఫలితాలను వెల్లడించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.
Subscribe to:
Posts (Atom)