ఓటుహక్కు వినియోగించుకున్న 118 మంది ఎమ్మెల్యేలు

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో...హైదరాబాద్‌: తెలంగాణలో శాసనమండలి ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. తెలంగాణ అసెంబ్లీలో నామినేటెడ్‌ సభ్యుడితో కలిసి 120 మంది ఎమ్మెల్యేలు ఉండగా వారిలో మధ్నాహ్యం వరకు 118 మంది శాసనసభ్యులు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మధ్యాహ్నం 2 గంటల సమయంలో అసెంబ్లీకి వచ్చి తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. మరోవైపు ఇద్దరు వామపక్ష సభ్యులు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. సాయంత్రం ఐదు గంటల నుంచి కౌంటింగ్‌ నిర్వహించనున్నారు.



రేవంత్‌ పాలమూరు పరువు తీశారు : మంత్రి జూపల్లి, ఎమ్మెల్యే శ్రీనివాసగౌడ్‌

మ్మెల్యే రేవంత్‌రెడ్డి పాలమూరు పరువు తీశారని మంత్రి జూపలి, ఎమ్మెల్యే శ్రీనివాసగౌడ్‌లు ఆరోపించారు. టీటీడీపీ నేతలకు ఇప్పటికైనా బుద్ధి రావాలన్నారు. చంద్రబాబు, రేవంత్‌రెడ్డిలు రాజీనామా చేయాలని ఆయన డిమాండు చేశారు. మీసాలు తిప్పడం గొప్ప కాదని, రొయ్యకు కూడా మీసాలు ఉంటాయన్నారు.

Followers