మ్మెల్సీ ఎన్నికల్లో తమ అభ్యర్థికి ఓటు వేయాలని నామినేటెడ్ ఎమ్మెల్యేను
ప్రలోభపెట్టిన కేసులో అరెస్టయిన తెదేపా నేత రేవంత్రెడ్డికి న్యాయమూర్తి 14
రోజుల రిమాండ్ విధించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు
అనుమతించాల్సిందిగా రేవంత్రెడ్డి చేసిన విజ్ఞప్తిని న్యాయమూర్తి
అంగీకరించారు. రేవంత్రెడ్డితో పాటు సెబాస్టియన్, ఉదయ్సింహలకు కూడా 14
రోజుల రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీచేశారు.ఓటుహక్కు
వినియోగించుకున్న రేవంత్రెడ్డితెదేపా ఎమ్మెల్యే రేవంత్రెడ్డి ఎమ్మెల్సీ
ఎన్నికల్లో తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. పోలీసులు రేవంత్ను
అసెంబ్లీకి తీసుకువచ్చిన వెంటనే తెదేపా, భాజపా ఎమ్మెల్యేలు ఆయన్ని
పలకరించారు. అనంతరం వారితో కలిసి లోనికి వెళ్లి ఓటు వేశారు.చంచల్గూడ
జైలుకు తరలింపుఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకున్న అనంతరం
పోలీసులు రేవంత్రెడ్డిని అసెంబ్లీ నుంచి చంచల్గూడ జైలుకు తరలించారు.
దీంతో జైలు వద్ద పోలీసులు భారీ భద్రతను ఏర్పాటుచేశారు. రేవంత్తో పాటు సహ
నిందితులు సెబాస్టియన్, ఉదయసింహాను కూడా చంచల్గూడ కేంద్ర కారాగానికి
తరలించారు. రేవంత్రెడ్డికి చంచల్గూడజైలు అధికారులు హైసెక్యూరిటీ బ్యారక్ను కేటాయించారు.బెయిల్ పిటిషన్
దాఖలు చేసిన న్యాయవాదులురేవంత్రెడ్డి బెయిల్ కోసం ఆయన తరపు న్యాయవాదులు
సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన తరపు
న్యాయవాది మాట్లాడుతూ రేవంత్రెడ్డి నిర్దోషని స్పష్టంచేశారు.
రేవంత్రెడ్డి అరెస్టును రాజకీయకుట్రగా అభిప్రాయపడ్డారు. ఆయన బయట
ఉన్నప్పుడు ఏసీబీ అధికారులు అరెస్టు చేశారన్నారు.
ఓటుహక్కు వినియోగించుకున్న 118 మంది ఎమ్మెల్యేలు
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో...హైదరాబాద్: తెలంగాణలో శాసనమండలి ఎన్నికల
పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. తెలంగాణ అసెంబ్లీలో నామినేటెడ్
సభ్యుడితో కలిసి 120 మంది ఎమ్మెల్యేలు ఉండగా వారిలో మధ్నాహ్యం వరకు 118
మంది శాసనసభ్యులు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి
కేసీఆర్ మధ్యాహ్నం 2 గంటల సమయంలో అసెంబ్లీకి వచ్చి తన ఓటుహక్కును
వినియోగించుకున్నారు. మరోవైపు ఇద్దరు వామపక్ష సభ్యులు ఓటింగ్కు దూరంగా
ఉన్నారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు
కొనసాగనుంది. సాయంత్రం ఐదు గంటల నుంచి కౌంటింగ్ నిర్వహించనున్నారు.
Subscribe to:
Posts (Atom)