ఎవ్వరి ఆచారాన్ని కించపరిచినట్లు కాదు, సుప్రీం


పరిక్ష వ్రాసే రోజు బురఖా వేసుకోకుంటే మీ ధర్మానికి, ఆచారాన్ని కించపరిచినట్లు కాదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. పరిక్షా కేంద్రాలకు బురఖా వేసుకుని వెళ్లి పరిక్ష వ్రాయడానికి అనుమతి ఇవ్వాలని విద్యార్థి సంఘం సమర్పించిన అర్జీని సుప్రీం కోర్టు కొట్టి వేసింది. ఆల్ ఇండియా ఫ్రీ మెడికల్, డెంటల్ టెస్ట్ (ఏఐపీఎంటీ) పరిక్షలు శనివారం మళ్లి నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఈ పరిక్షలకు హాజరు అయ్యే అమ్మాయిలు బురఖాలు వేసుకుని రావచ్చని కేరళ హై కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. పరిక్ష కేంద్రాలను పర్యవేక్షించే అధికారులకు అనుమానం వస్తే బురఖాలు తీసి పరిశీలించాలని కేరళ హై కోర్టు సూచించింది. అయితే ఈ కేసు వివాదం సుప్రీం కోర్టులోకి వెళ్లింది. బురఖాలు వేసుకుని పరిక్షలు వ్రాయడానికి అనుమతి ఇవ్వాలని ఇస్లామిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ (ఎస్ఐఒ) సుప్రీంలో అర్జీ సమర్పించింది. శుక్రవారం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి హెచ్.ఎల్. దత్తు నేతృత్వంలోని ధర్మాసనం అర్జీ విచారణకు స్వీకరించారు. పరిక్షా కేంద్రాలకు ఒక్క రోజు బురఖా వేసుకుని వెల్లకపోతే మీ మతాన్ని, ధర్మాన్ని, ఆచారాన్ని కించపరిచినట్లు కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు


హైకోర్టు విభజన కుదరదు..


రాష్ట్ర విడిపోయిన తరువాత తెలంగాణ ప్రభుత్వానికి, ఆంధ్రా ప్రభుత్వానికి ఏదో విషయంపైన వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాద్ లో అన్ని శాఖలలో దాదాపు విభజన జరిగిన కొన్ని అంశాలమీద ఇంకా ఇరు రాష్ట్రాలు గొడవ పడుతూనే ఉన్నారు. ఇందులో ముఖ్యంగా హైకోర్టు విభజన వివాదం. ఇటు తెలంగాణ రాష్ట్రానికి, అటు ఆంధ్రా రాష్టానికి ఉమ్మడిగా హైకోర్టు విభజనపై ఎప్పటినుంచో మల్లగుల్లాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ విషయంపై తెలంగాణ ప్రభుత్వం కూడా హైకోర్టును విభజించి తీరాల్సిందే అని పట్టుబడుతుంది. దీనికి అప్పట్లో హైకోర్టు కూడా తెలంగాణ వాదులకు ఘాటుగానే సమాధానమిచ్చింది. ఏపీలో హైకోర్టు ఏర్పాటయ్యేంత వరకు విభజించేది లేదని.. ఈ హైకోర్టు బాధ్యతను కేంద్రం పై పెడుతూ.. హైకోర్టు నిర్మాణానికి కావలసిన అనువైన స్థలాన్ని కేంద్రమే చూడాలని.. దానికి అయ్యే వ్యయాన్ని కూడా కేంద్రమే పెట్టుకోవాలని ఆదేశించింది. అయితే ఇప్పుడు మళ్లీ ఈ విషయంపై ఉమ్మడి హైకోర్టులో వాదనలు జరిగాయి. రాష్ట్ర విభజన జరిగి సంవత్సరం గడిచినా న్యాయస్థాన విభజన ఇంకా జరగలేదని.. కింది స్థాయి న్యాయాధికారులను, కోర్టు సిబ్బందిని విభజించాలని కోరుతూ పిటిషన్ దాఖలైన నేపథ్యంలో దానిపై విచారణ జరిపిన హైకోర్టు ఇరు రాష్ట్రాలకు ఉమ్మడిగా ఉన్న హైకోర్టును విభజించడం ఇప్పుడు కుదరదు చెప్పింది. 'ఉమ్మడి హైకోర్టును విభజించడం కాదు... ఆంధ్రప్రదేశ్‌కు హైకోర్టు ఏర్పాటు చేయాలి' అని తేల్చిచెప్పింది. హైకోర్టు విభజన జరగకుండా కింది స్థాయి న్యాయాధికారులను విభజించడం సరికాదని.. ముందు చట్ట ప్రకారం హైకోర్టు విభజన జరగాలని.. ఆ తరువాత న్యాయాధికారులను విభజించడం జరుగుతుందని సూచించారు. ముఖ్యంగా ఏపీ హైకోర్టు నిర్మాణంపై కేంద్రం చొరవ తీసుకోవాలని.. గతంలో సూచించినట్టు ఏపీ హైకోర్టు భవన నిర్మాణానికి ఇంతవరకు ఎన్ని నిధులు కేటాయించారు, ఎప్పుడు కేటాయించారో చెప్పాలని.. దీనికి సంబంధించి కౌంటర్ ను ఈ నెల 30లోగా దాఖలు చేయాలని ఆదేశించింది


Followers