మహిళా టీచర్ ను చితకబాదిన హెడ్ మాస్టర్..


విద్యార్థులకు బుద్ధిమాటలు చెప్పి స్కూల్ లో అందరికి ఆదర్శంగా ఉండవలసిన హెడ్ మాస్టర్ సహనం కొల్పోయి సాటి మహిళా టీచర్ ను పట్టుకుని అందరి ముందు చితకబాదాడు. చివరికి విద్యార్థులు ఆందోళనకు దిగడంతో పోలీసులు హెడ్ మాస్టర్ ను అరెస్టు చేశారు. పశ్చిమ బెంగాల్ లోని 24 పార్గనాస్ జిల్లా జాయ్ నగరలో శ్రీకృష్ణ నగర్ హై స్కూల్ లో అశోక్ నస్కర్ హెడ్ మాస్టర్ గా పని చేస్తున్నాడు. ఇదే స్కూల్ లో సస్వతి కుందు అనే మహిళ లెక్కలు టీచర్ గా పని చేస్తున్నారు. కొంత కాలం నుండి స్పెషల్ క్లాస్ లు తీసుకునే విషయంలో టీచర్ల మధ్య విభేదాలు వచ్చాయి. గురువారం స్పెషల్ క్లాస్ లు తీసుకోవాలని హెడ్ మాస్టర్ అశోక్ నస్కర్ మహిళా టీచర్ సస్వతి కుందుకు చెప్పారు. అందుకు ఆమె నిరాకరించారు. సహనం కొల్పోయిన అశోక్ నస్కర్ స్టాఫ్ రూంలో సస్వతి కుందు చెంప చెల్లుమనిపించాడు. అంతటితో శాంతించకుండ ఆమె జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లాడు. తరువాత ఆమె మొబైల్ తీసుకుని నేలకేసికొట్టాడు. విషయం తెలుసుకున్న విద్యార్థులు ఆందోళన చేపట్టారు. సస్వతి కుందు ఫిర్యాదు చెయ్యంతో పోలీసులు అశోక్ నస్కర్ ను అరెస్టు చేశారు. సస్వతికి ఆసుపత్రిలో చికిత్స చేయించామని పోలీసులు తెలిపారు.


రెజ్లింగ్‌ టోర్నీలో భారత మహిళల టీమ్‌ రెండో స్థానంలో నిలిచింది

సీనియర్‌ అంతర్జాతీయ రెజ్లింగ్‌ టోర్నీలో భారత మహిళల టీమ్‌ రెండో స్థానంలో నిలిచింది. యువ రెజ్లర్లు వినీష్‌ (48 కిలోలు), లలిత (55), అనిత (63) అన్ని బౌట్లలో గెలిచారు. అయితే సాక్షి మాలిక్‌ (58) ఓటమిపాలైంది. దీంతో భారత్‌ రజతంతో సరిపెట్టుకుంది. ఆతిథ్య కజకిస్థాన్‌ అగ్రస్థానంలో నిలిచి స్వర్ణం సాధించగా.. మంగోలియా కాంస్యంతో టోర్నీని ముగించింది.

Followers