పాక్‌ అణు క్షిపణి పరీక్ష విజయవంతం

ఇస్లామాబాద్‌, నవంబర్‌ 13: భారత్‌లోని పలు నగరాలను లక్ష్యంగా చేసుకోగల అణుక్షిపణిని పాకిస్థాన్‌ గురువారం విజయవంతంగా పరీక్షించింది. 1500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను అవలీలగా ఛేదించగల ఈ క్షిపణికి అణు, సంప్రదాయ వార్‌హెడ్లను మోసుకెళ్లగల సామర్థ్యముంది. హతాఫ్‌-6గా కూడా పిలిచే ఈ మధ్యశ్రేణి షహీన్‌-2 మిస్సైల్‌ను అరేబి యా సముద్రం నుంచి పరీక్షించినట్టు పాక్‌ సైన్యం తెలిపింది.

Followers