పెళ్ళిరోజే ప్రాణాలు కోల్పోయిన సిద్ధయ్య

   
 
 


నల్లగొండ జిల్లా జానకిపురంలో తీవ్రవాదులతో పోరాడి తీవ్రంగా గాయపడిన ఆత్మకూర్ (ఎం) ఎస్‌ఐ జూలూరి సిద్ధయ్య మంగళవారం సాయంత్రం కన్నుమూసిన విషయం తెలిసిందే. మంగళవారం నాడే ఆయన పెళ్ళి రోజు. జీవితంలో ఆనందించిన రోజునే అత్యంత విషాదకరమైన ఘటన జరిగిన రోజుగా ఆయన జీవితంలో మిగిలిపోయింది. ఆయన భార్య ధరణి కన్నీరు మున్నీరవుతున్నారు. సిద్ధయ్య మరణించిన హైదరాబాద్‌లోని కామినేని ఆస్పత్రిలోనే ఆమె రెండు రోజుల క్రితం మగశిశువుకు జన్మనిచ్చారు. తాను తండ్రిని అయిన విషయం కూడా తెలుసుకోకుండానే సిద్ధయ్య కన్నుమూశారు. ఎంతో సంతోషంతో సాగిపోతున్న ఈ కుటుంబం అకస్మాత్తుగా విషాదంలో మునిగిపోయింది.
 

Followers