'నేనెవరిని' అంటున్న 'బాహుబలి'


'nenevarini' antunna 'baahubali'



ఎట్టకేలకు 'బాహుబలి' ట్రైలర్‌ విడుదలైంది. హిందీలో కరణజోహార్‌ సోమవారం సాయంత్రం విడుదల చేశారు. తెలుగులో ఉదయమే అన్ని థియేటర్లలో ట్రైలర్స్‌ వెళ్ళాయి. కాగా, విలేకరులకు ప్రత్యేకంగా ప్రసాద్‌మల్టీప్లెక్స్‌లో సోమవారంనాడు 4గంటలకు ట్రైలర్‌ చూపించారు. హాలీవుడ్‌ సినిమాను చూసిన రేంజ్‌లో ఆ ట్రైలర్‌ వుంది. డాల్బీ సౌండ్‌లో ఎఫెక్ట్‌గా అనిపించిన ఆ ట్రైలర్‌లో.. బాహుబలి పాత్రధారి ప్రభాస్‌ను ఓ సన్నివేశంలో కొండిపాంతంవారు చూసి గౌరవంగా నమస్కారం చేస్తుంటారు.. వీరంతా నాకెందుకు నమస్కారంపెడుతున్నారు.. అసలు నేనెవర్ని' అంటూ ప్రశ్నిస్తాడు. అమరేంద్రబాహుబలి వంశీయుడువు అంటూ వాయిస్‌ ఓవర్‌ వినిపిస్తుంది. ఇది ఓ రాజవంశానికి చెందిన చరిత్రగా చెప్పేశాడు. అప్పటి కాలంనాటి రాజవంశీయులు బానిన వ్యవస్థలు వంటి నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుందని తెలిసింది. తన వంశాన్ని నమ్ముకున్న ప్రజలకు బాహుబలి ఏంచేశాడనేది మొదటిపార్ట్‌గా కన్పిస్తుంది. కాగా, ఈచిత్రం జులై 12న విడదులచేయడానికి యుద్ధ ప్రాతిపదికన సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.


Followers