127,42,39,769.. ఇది ప్రస్తుత భారత జనాభా


ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకొని నేషనల్‌ పాపులేషన్‌ స్టెబిలైజేషన్‌ ఫండ్‌(ఎన్‌పీఎస్‌ఎఫ్‌) భారత జనాభా నివేదికను విడుదల చేసింది. ఎన్‌పీఎస్‌ఎఫ్‌ నివేదిక ప్రకారం జులై 11 సాయంత్రం 5 గంటలకు భారత జనాభా 127,42,39,769కు చేరింది. ఇది ప్రపంచ జనాభాలో 17.25 శాతం.* ఏడాదికి 1.6శాతం చొప్పున మనదేశంలో జనాభా పెరుగుతోంది.* ఈ పెరుగుదల ఇలాగే కొనసాగితే 2050 నాటికి భారత్‌ జనాభా 163కోట్లను దాటి అత్యధిక జనాభాతో ప్రపంచంలోనే మొదటిస్థానంలో నిలవనుంది.* ప్రస్తుతం చైనా 137 కోట్లకుపైగా జనాభాతో మొదటిస్థానంలో ఉంది.* 2011 జనాభా లెక్కల ప్రకారం భారత జనాభా 121కోట్లు. అమెరికా, ఇండోనేషియా, బ్రెజిల్‌, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, జపాన్‌లాంటి దేశాల జనాభా అంతా కలిపితే భారత జనాభాకు సరిసమానం

Followers