కేసీఅర్ ని అడ్డుకుంటారా..?


kesiar ni addukuntaara..?


ఏపీ కొత్త రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి తెలంగాణా సీఎం కేసీఆర్ వెళ్ళాలనే నిర్ణయించుకున్నారు. అయితే ఆయన రోడ్డు మార్గాన వెళ్లాలని అనుకున్నా ఆ తరువాత ఈ నిర్ణయం మారిపోయింది. సూర్యాపేట వరకు రోడ్డు మార్గంలో వెళ్లి ఈ నెల 21 వ తేదీ రాత్రి అక్కడే బస చేసి ఆ మరుసటి రోజున అమరావతికి వెళ్లాలని తొలుత భావించారు. కానీ ఆ తరువాత సీన్ మారిపోయింది. కేసీ ఆర్ హెలికాప్టర్ లోనే అమరావతి వెళ్ళే కార్యక్రమం ఖరారైంది. రాష్ట్ర విభజనకు కారకుడైన కేసీఆర్ ను ఏపీలో అడ్డుకోవచ్చన్న అనుమానాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే స్వయంగా ఏపీ సీఎం చంద్రబాబు హైదరాబాద్ వచ్చి సీఎం క్యాంప్ కార్యాలయంలో కేసీఆర్ ను కలిసి ఆహ్వాన పత్రిక అందజేయడం, ఆయనను కేసీఅర్ సాదరంగా ఆహ్వానించడం వంటి పరిణామాలతో రెండు రాష్ట్రాల మధ్య సుహృద్భావ సంబంధాలు నెలకొంటున్నాయని భావిస్తున్నారు. అందువల్ల కేసీఆర్ ను ఏపీలో అడ్డుకునే పరిస్థితి లేదని అంటున్నారు.

Followers