Showing posts with label APPSC. Show all posts
Showing posts with label APPSC. Show all posts
PANCHAYAT SECRERATIES RESULTS 2014- Know Your Hallticket Details
Tags:PANCHAYAT SECRETARIES RESULTS 2014- Know Your Hall ticket Details
Click Here for Notification and Online application
District Wise vacancies list:
- Mahaboobnagar - 350
- Medak - 182
- Adilabad - 241
- Krishna - 8
- Prakasam - 95
- Chittor - 104
- Anantapur - 202
- Karimnagar - 88
- Khammam - 83
- Vijayanagaram - 201
- East Godavari - 70
- Rangareddy - 57
- Nizamabad - 66
- Srikakulam - 209
- Guntur - 26
- Nellore - 86
- Kadapa - 26
- Kurnool - 164
- Warangal - 106
- Nalgonda - 133
- Vishakapatnam - 155
- West Godavari - 25
Click Here for Notification and Online application
Tags:PANCHAYAT SECRERATIES RESULTS 2014- Know Your Hallticket Details
ఎపిపిఎస్సి ఎగ్జామ్స్కు ఏ పుస్తకాలు చదవాలి?
ఎపిపిఎస్సి వివిధ రిక్రూట్మెంట్లకు ప్రశ్నపత్రాలను రూపొందిం చేటప్పుడు ఏ పుస్తకాలను ప్రామాణికంగా తీసుకుంటుంది? ఎన్సిఇఆర్టి పుస్తకాలు వంటివి రిఫరెన్స్గా తీసుకుంటుందా? ఎపిపిఎస్సి పరీక్షలకు ఏ పుస్తకాలు చదవడం మంచింది?- ఆర్. రమణ, నిజామాబాద్. జ : ఎపిపిఎస్సి నిర్వహించే పోటీపరీక్షలకు సంబంధించిన ప్రశ్న పత్రాల రూపకల్పనలో చాలా జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. సాధారణంగా ప్రతి పరీక్షకు సంబంధించి విడుదల చేసిన సిలబస్, ఆధారంగానే ప్రశ్నపత్రాలు రూపొందుతాయి. అయితే సిలబస్ రూపకల్పన సందర్భంలో మాత్రమే ఎపిపిఎస్సి పాత్ర ఉంటుంది. అదీ కూడా ఒక నిపుణులు కమిటీ సూచించిన విధంగానే సిలబస్ను ఫైనల్ చేయడం జరుగుతుంది. ప్రశ్న పత్రాల రూపకల్పన అంతా కూడా సంబందిత సబ్జెక్టు ఎక్స్ఫర్ట్స్తో జరుగుతుంది. ఇందులో ఎపిపిఎస్సి పాత్ర ఎంత మాత్రం ఉండదు. అయితే ఆయా సబ్జెక్టు ఎక్స్పర్ట్స్ను ఎంపిక చేయడంలో మాత్రం జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. ఈ ఎంపికలో సాధారణంగా సీనియర్ వెూస్ట్ ప్రొఫెసర్, సంబంధిత సబ్జెక్టుకు సంబంధించిన వర్తమాన అంశాలను నిరంతరం ఫాలో అవుతున్న వారికి మొదటి ప్రాధాన్యతను ఇవ్వడం జరుగుతుంది. ప్రశ్న పత్రాల రూపకల్పన సమయంలో ఎపిపిఎస్సి కేవలం సిలబస్ను మాత్రమే ఎక్ప్పర్ట్కు ఇవ్వడం జరుగుతుంది. ప్రశ్నల స్థాయి, తీరు ఎక్స్పర్ట్ విచక్షణకే వదిలివేయడం జరుగుతుంది. ఎక్స్పర్ట్స్ సాధారణంగా ఆయా సిలబస్లోని అంశాలు గల స్టాండర్డ్ రిఫరెన్స్ బుక్స్ నుండే ప్రశ్నలను రూపొందించడం జరుగుతుంది. పబ్లికేషన్ డివిజన్, సమాచార మంత్రిత్వశాఖ ప్రచురించిన పుస్తకాలను, ఎన్సిఇఆర్టి, ప్రభుత్వ విభాగాలు రూపొందించిన పుస్తకాలు (తెలుగు అకాడమి లాంటివి) రిఫర్ చేసి ప్రశ్నలను రూపొందిస్తారు. అయితే పుస్తకాలలోని సమాచారాన్ని యథాతదంగా మాత్రం ఇవ్వడం జరగదు. అందువల్ల వీటిని చదివి అర్థం చేసుకోగలిగితేనే ఆ ప్రశ్నలకు సరైన సమాధానాలను గుర్తించడం సాధ్యం అవుతుంది. కాబట్టి చదివిన సమాచారాన్ని వివిధ కొణాలలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. వ్యాసం ఎన్ని పేజీలు రాయాలి? ప్ర : గ్రూప్-1 మెయిన్స్లో ఎస్సే పేపర్లో రాయవలసిన మూడు వ్యాసాలలో ప్రతివ్యాసం మాములుగా ఎన్ని పేజీలు రాయాలి? కొంతమంది అభ్యర్థులు సగటున మూడు వ్యాసాలకు కలిపి 20 పేజీలు రాస్తుండగా, మరికొంతమంది అభ్యర్థులు చాలా ఎక్కువ పేజీలు రాయడం జరుగుతుంది. వీటిలో ఏది సరైన పద్ధతి?- కె. సుదీర్, కరీనంగర్. జ : గ్రూప్-1 జనరల్ ఎస్సే పేపర్లో మూడు గంటల సమయంలో మూడు వ్యాసాలు రాయాల్సి ఉంటుంది. అయితే మీరు అడిగిన ప్రశ్నలో సమాధానం ఎన్ని పేజీలలో రాయాలన్న విషయం కేవలం అపోహ మాత్రమే. గతంలో ఒకే వ్యాసం రాసే పద్ధతి ఉండేది. మారిన నూతన విధానంలో ఇదే సమయంలో మూడు వ్యాసాలను రాయాల్సి ఉంటుంది. అంతే కాకుండా ప్రశ్న చాలా సుదీర్ఘంగా విభిన్న భాగాలుగా విభజింపబడి ఉంటుంది. ఇది ఒక రకంగా గతంలోని ఆప్షనల్స్ పేపర్లలో వ్యాసరూప ప్రశ్నల కన్నా కొంచెం ఎక్కువ సమాధానాన్ని రాసే విధంగా ఉంటున్నాయి.జనరల్ ఎస్సే రాసేటప్పుడు పేజీల సంఖ్య కన్నా అందు బాటులో వున్న సమయంలో ప్రశ్నలో అడిగిన అన్ని అంశాలను సృశిస్తూ, మిగతా అభ్యర్థుల కన్నా నాణ్యమైన, ఖచ్చితమైన, నిర్థిష్ఠమైన , తక్కువ పదాలలో ఎక్కువ అర్థం వచ్చే విధంగా , సరళమైన భాషలో సులువుగా అర్థమయ్యే విధంగా వేగంగా రాయగలడం పై ప్రధానంగా దృష్టి సారించాలి.పేజీల సంఖ్య అనేది ముఖ్యంకాదు , సమాధానంలోని సమాచారం అత్యంత కీలకమని గుర్తించాలి. అయితే ఒక గంట సమయంలో, అక్షరాల సైజు సాధారణంగా రాయగల అభ్యర్థి అర్థమయ్యే రీతిలో కనిష్టంగా 8 పేజీలు, గరిష్టంగా 12 పేజీల వరకు రాయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో ఇతరులను అనుకరించకుండా రైటింగ్లో వేగాన్ని పెంచుకోవడం, భాషపైన పట్టు సాధించడం, ఎక్కువ సమాచారాన్ని కలిగి ఉండటం వంటి అంశాలకు అధిక ప్రాధాన్యతనివ్వడం మంచిది. గ్రూప్-2 ఎకానమీ చదివేదెలా? ప్ర : నాది గ్రామీణ నేపథ్యం, కోచింగ్ తీసుకునే ఆర్థిక స్థోమత లేదు. సొంతంగా ప్రిపేర్ అవుతున్నాను. డిగ్రీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో పూర్తి చేశాను. గ్రూప్-2లో మొదటి, రెండవ పేపర్లకు భాగానే ప్రిపేరవుతున్నాను. కానీ ఎకానమి పేపర్ గందరగోళంగా ఉంది. ఎకానమీకి అకాడమీ పుస్తకాలు చదువుతున్నాను. కానీ అవి గ్రూప్-2 సిలబస్కు అనుగుణంగా లేకపోవడం వలన ఏవి చదవాలో, ఏవి వదిలేయాలో తెలియడం లేదు. ఎకానమీలో నేను గట్టెక్కడానికి పరిష్కారం చూపగలరు? - అప్పాన సూర్య, కొత్తకోట. జ : ముందుగా మీరు మానసికంగా ప్రిపేర్కావాలి. గ్రామీణ నేపథ్యం, డిస్టెన్స్ ఎడ్యుకేషన్తో ఐ.ఎస్ సాధించిన ఉదహరణలు కూడా ఉన్నాయి. అందువల్ల ఆత్మవిశ్వాసంతో ఆశావాద దృక్పథంతో ప్రిపేర్ కాగలిగితే అంతిమ విజయం మీదేనని బలంగా నమ్మాలి. వేలాది మంది అభ్యర్థులు ఉద్యోగాలను పొందుతున్నప్పుడు అది మనెందుకు సాధ్యం కాదన్న ప్రశ్న వేసుకోవాలి. గ్రూప్-2లో ఉద్యోగం పొందాలంటే డిగ్రీలు, కోచింగ్లు, ఆర్థిక స్థోమత, అదృష్టం వంటి అంశాలకన్నా కఠోర దీక్షతో, పట్టుదలతో నిరంతరం తెలుసుకోవాలన్న తపనతో, సాధించాలన్న కసితో ఒక యజ్ఞంలాగా సరైన గైడెన్స్తో శాస్త్రీయ పద్ధతిలో ప్రిపేర్ కావడానికే అధిక ప్రాధాన్యనివ్వాలన్న విషయాన్ని ప్రధానంగా గుర్తుంచుకోవాలి. ఇక గ్రూప్-2 ఎకానమి పేపర్లో అత్యదిక మార్కులు పొందాలంటే కొంచెం ఎక్కువ సమయం కేటాయించి, ఎక్కువగా కష్టపడటం తప్పనిసరి. ఎకానమికి సంబంధించిన మౌలికమైన అంశాలను తెలుసుకోవడానికి తెలుగు అకాడమి ఇంటర్ స్థాయి పుస్తకాలను చదవాల్సి ఉంటుంది. అదే విధంగా గ్రూప్స్ పరీక్షల కోసం ప్రత్యేకంగా రూపొందించిన అకాడమి పుస్తకాలను చదివేటప్పుడు, సిలబస్ను ముందు పెట్టుకొని అందులోని అంశాలకు సంబంధించిన సమాచారాన్ని పాయింట్ల రూపంలో నోట్ చేసుకోవాలి. అదే విధంగా రోజూ పేపర్లలో వస్తున్న ఎకానమీ సంబంధిత అంశాలను, పోటీపరీక్షల మ్యాగ్జైన్లలో వున్న అంశాలను నిరంతరం అనుసంధానించు కుంటూ చదవగలిగితే గరిష్ట మార్కులు పొందవచ్చు.
5 వ్యాసరూప నైపుణ్యాలకు పంచసూత్రాలు
డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్ రాయడం చాలా కష్టమని, వాటిలో ఆశించిన మార్కులు సాధించడం అంత సలభం కాదని అభ్యర్థులు భావిస్తుంటారు. అయితే ఇందులో కొంత వాస్తవం ఉన్నా ఈ పరీక్షలకు అవసరమైన నైపుణ్యాలు పెంచుకుంటే వీటిలో కూడా విజయం సాధించవచ్చు. ఆ నైపుణ్యాలు ఏమిటో వివరంగా పరిశీలిద్దాం...పోటీపరీక్షలు రెండు రకాలుగా జరుగుతుంటాయి. అవి. 1. ఆబ్జెక్టివ్ పరీక్షలు, 2. డిస్క్రిప్టివ్ పరీక్షలు.పోటీపరీక్షల్లో ఎక్కువభాగం అబ్జెక్టివ్ తరహా పరీక్షలే ఉంటాయి. కానీ, కొన్ని ముఖ్యమైన పోస్టుల భర్తీకి నిర్వహించే పరీక్షల్లో ఈ రెండూ కలిపి ఉంటాయి. ఉదాహరణకు జాతీయస్థాయిలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షలు, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్-1 పరీక్షల్లో రెండవ దశ అయిన మెయిన్స్లో భాగంగా ఈ తరహా డిస్క్రిప్టివ్ పరీక్షలు ఉంటాయి. మౌలిక ఉద్దేశ్యం ఏమిటి? సివిల్ సర్వీసెస్, గ్రూప్-1 వంటి పోస్టులకు డిస్క్రిప్టివ్ పరీక్షలు నిర్వహించడం వెనుక ఉన్న మౌలిక ఉద్దేశ్యం ఏమిటో తెలుసుకుంటే ఈ తరహా పరీక్షలు రాయడానికి ఎటువంటి నైపుణ్యాలు అవసరవెూ అర్థమవుతుంది. సాధారణంగా ఆబ్జెక్టివ్ తరహా పరీక్షల్లో అభ్యర్థి ప్రశ్న క్రింద ఇచ్చే నాలుగు సమాధానాలలో సరైన దానిని గుర్తించాల్సి ఉంటుంది. దీని వలన అభ్యర్థి నాలెడ్జ్, అభ్యర్థి జ్ఞాపకశక్తి పరీక్షించినట్లవుతుందే తప్ప అంతకుమించి ఇతర ఏ నైపుణ్యాలు పరీక్షించడం వీలు కాదు. కానీ, వ్యాస రూప పరీక్షలలో (డిస్కిస్టివ్ పరీక్షలలో) అభ్యర్థి నాలెడ్జ్, జ్ఞాపకశక్తితో పాటు ఇంకా ఇతర నైపుణ్యాలు కూడా అంచనా వేయడానికి వీలవుతుంది. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థి వ్యక్తిత్వాన్ని ఎలా అంచనావేస్తారో అదే విధంగా డిస్కిప్టివ్ పరీక్షల ద్వారా కూడా అభ్యర్థి ఆలోచనా విధానం, సమస్యలను విశ్లేషించి పరిష్కారం చూపగల సామర్థ్యం , అతని అవగాహనా స్థాయితో పాటు అతని రైటింగ్ స్కిల్స్ను అంచనా వేయడానికి వీలవుతుంది.ఫలితంగా ఆయా పోస్టులకు సరైన అభ్యర్థులను ఎంపిక చేయడానికి వీలు కలుగుతుంది. గ్రూప్-1, సివిల్ సర్వీసెస్ వంటి పోస్టులకు నిర్వహించే మెయిన్స్ పరీక్షల్లో ఆప్షనల్ సబ్జెక్టులతో పాటు జనరల్ స్టడీస్, జనరల్ ఎస్సే పేపర్లు ఉంటాయి. అయితే గ్రూప్-1, సివిల్ సర్వీసెస్ వంటి పోస్టులకు అప్షనల్ సబ్జెక్టుల్లో ప్రావీణ్యం వలన ప్రయోజనం ఉండదని గ్రహించి వాటి ప్రాధాన్యం తగ్గించి, కామన్ పేపర్లు ప్రవేశపెట్టారు. గ్రూప్-1లో ఆప్షనల్ పేపర్లు పూర్తిగా తొలగించగా సివిల్స్ మెయిన్స్లో రెండు ఆప్షనల్స్ బదులు ఒక ఆప్షనల్ ప్రవేశపెట్టారు. అయితే డిస్క్రిప్టివ్ పేపర్లు ఏవైనప్పటికీ ఆ పరీక్షల్లో రాణించాలంటే కొన్ని ప్రధానమైన నైపుణ్యాలు పెంపొందించుకోవాలి. ముఖ్యంగా మెయిన్స్లో ఎస్సే ప్రిపేర్కు ఇవి చాలా అవసరం. 1. స్పష్టమైన భావవ్యక్తీరణ డిస్కిప్టివ్ పరీక్షల్లో రాస్తున్న అంశానికి సంబంధించిన సమాచారం సులభంగా అర్థం అయ్యేలా భావ వ్యక్తీకరణ సూటిగా ఉండాలి. ఒక అంశాన్ని సమర్థిస్తూ రాసినా, వ్యతిరేకిస్తూ రాసినా వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు చదవగానే అర్థం అయ్యేలా ఉండాలి. ప్రశ్న ఒక కోణంలో అడిగితే, సమాధానం మరో కోణంలో రాయడం, అనవసర విషయాలు ప్రస్తావించడం వలన స్పష్టత లోపించి గందరగోళం ఏర్పడుతుంది. అడిగిన ప్రశ్నను సరిగ్గా అర్థం చేసుకొని అడిగినంత మేరకు నిర్థిష్టంగా రాయడం అలవాటు చేసుకోవాలి. ఇలా స్పష్టంగా, నిర్ధిష్టంగా రాయగల గాలంటే రాస్తున్న అంశంపై సమగ్రమైన అవగాహన, సంపూర్ణమైన సమాచారం ఉండాలి. అప్పుడే ప్రశ్నకు తగిన విధంగా సమాధానం రూపొందుతుంది. వ్యాసరూప పరీక్షల్లో రాసే సమాధానాలు అభ్యర్థికి ఉన్న పరిజ్ఞానాన్ని, అవగాహనను తెలియజేస్తాయి కాబట్టి సమాధానం అన్ని అంశాలతో సమగ్రంగా, స్పష్టంగా, సూటిగా ఉండేలా రాయడం అలవర్చుకోవాలి. 2. విశ్లేషణా సామర్థ్యం డిస్క్రిప్టివ్ పరీక్షలలో ముఖ్యంగా ఎస్సే పేపర్లో విశ్లేషణ ఒక ప్రధానమైన లక్షణం. అడిగిన అంశాన్ని అన్ని కోణాల్లో మంచి, చెడులను సృ్పశిస్తూ విశ్లేషిస్తూ రాయడం అవసరం. ఉదాహరణకు ఇటీవల సుప్రీంకోర్టు ఎన్నికలలో పోటీచేసే అభ్యర్థులలో ఎవరూ నచ్చనప్పుడు వారినందరిని తిరస్కరించే హక్కు ఓటర్లకు కల్పించాలి అని తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుకు అనుగుణంగా మొదటిసారి ఓటింగ్ యంత్రాలలో త్వరలో 5 రాష్ట్రాలలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలో 'ఎవరూ కాదు' అనే కొత్త మీటను ప్రవేశపెడుతున్నారు. ఈ సంస్కరణ నిజంగా భారత ఎన్నికల వ్యవస్థలో ఒక విప్లవాత్మక సంస్కరణే. అయితే ఈ సంస్కరణ వలన కలిగే ప్రయోజనాలు, ప్రభావాలను కూడా తెలుసుకొని వాటిని రాయగలిగితేనే సమాధానం విశ్లేషణాత్మకం అనిపించు కుంటుంది. అదే సమయంలో లోపాలు ఏవైనా ఉంటే వాటికి పరిష్కారాలు, సూచనలు కూడా అందించగలగాలి. ఈ విధమైన విశ్లేషణతో కూడిన సమాచారం వార్తాపత్రికలలో సంపాదకీ యాలు వంటి వాటిలో లభిస్తుంది. కాబట్టి వాటిని చదవడం ద్వారా విశ్లేషణాత్మకంగా రాసే సామర్థ్యం పెంపొందించుకోవచ్చు. 3. సృజనాత్మకత వ్యాసరూప పరీక్షల్లో మిగతా వాటికంటే ఎక్కువ మార్కులు సాధించాలంటే రాసే సమాధానాలు మిగిలిన వాటితో పోలిస్తే ప్రత్యేకంగా కనపడాలి. సమాధానాలు మూసపద్ధతిలో సాదా సీదాగా ఉంటే ఆ సమాధానాలు ఎగ్జామినర్ను ఆకర్షించడంలో వెనుకబడతాయి. సమాధానాలు నూతనంగా, విభిన్నంగా ఉంటే సహజంగానే వాటికి మంచి మార్కులు లభిస్తాయి. ఇతరులు రాసే పాయింట్లతో పాటు మరికొన్ని ప్రత్యేకమైన పాయింట్లు రాయడానికి ప్రయత్నించడం, సమాధానాలలో సమకాలీన అంశాలను జత చేయడం ద్వారా సమాధానాలలో నూతనత్వం ప్రతిఫలించేటట్లు చేయవచ్చు. దీనికి విస్రృ్తత అధ్యయనం చాలా అవసరం. వినూ త్నంగా సమాధానాలు రాసే నైపుణ్యాన్ని పెంపొందించుకోవడానికి ఒక అంశం గురించి ప్రిపేరయ్యేటప్పుడే ఆ అంశంపై ప్రశ్న వస్తే ఏ విధంగా విభిన్నంగా రాయవచ్చో ఆలోచించా లి. ఈ నైపుణ్యం అలవర్చుకోవడం అంత సులభం కాదు. కానీ, ప్రయత్నిస్తే త ప్పక సాధ్యమవుతుంది. 4. సరళమైన భాష ఇక వ్యాసరూప పరీక్షల్లో మరో ముఖ్యమైన అంశం. సరళమైన, భాషను ఉపయోగించడం. ఆడంబరమైన భాష, గ్రాంధికభాష ఉపయోగించకుండా సరళంగా రాయడం నేర్చుకోవాలి. కొంతమంది అభ్యర్థులు సమాధానాలలో వ్యవహరికం, గ్రాంథికం రెండింటిని కలిపి మిశ్రమ భాషగా రాస్తుంటారు. ఇవి సరైన పద్ధతి కాదు. భాష సహజంగా, చదువుతుంటే ఏ విధమైన ఇబ్బంది కలుగకుండా, ఆహ్లదం కలిగించే విధంగా ఉండాలి. డిస్క్రిప్టివ్ పరీక్షల్లో భాషా నైపుణ్యాలకు కూడా చాలా ప్రాముఖ్యం ఉంటుంది. చెప్పదలుచుకున్న విషయాన్ని చక్కగా సూటిగా, మనసుకు హత్తుకునేటట్లు రాయడం ఒక కళ. కేవలం భావానికి, అర్థానికి ప్రాధాన్యత ఇచ్చి భాషకు ప్రాధాన్యత ఇవ్వకపోతే సమాధానాలు కృతకంగా ఉంటాయి. సమాధానాలు ఎంత సమగ్రంగా ఉన్నా, ఎంత విశ్లేషణతో కూడి ఉన్నా, అవి తెలిపేది భాష ద్వారానే కాబట్టి భాష అందంగా, సరళంగా, సహజంగా ఉండటం తప్పనిసరి. సమగ్రంగా ఉన్న సమాధానా లకు సహజమైన భాషతో పరిపూర్ణత చేకూరుతుంది. 5. సంక్షిప్తీకరించి రాయడం ఇక చివరగా వ్యాసరూప ప్రశ్నల్లో ఉండవలసిన నైపుణ్యం విషయాన్ని సంక్షిప్తంగా రాయడం, గ్రూప్-1, సివిల్స్ వంటి పరీక్షల్లో సమాధానాలకు పదనిబంధన ఉంటుంది. అందువలన అడిగిన ప్రశ్నకు అనుగుణంగా అన్ని అంశాలు కవర్ అయ్యే విధంగా తక్కువ పదాలలో ఎక్కువ అర్థం వచ్చే విధంగా రాయగలగాలి. గ్రూప్-1 మెయిన్స్లో ఎస్సే పేపర్ కాకుండా మిగతా పేపర్లలో ప్రతి ప్రశ్నకు కేవలం 12 నిమిషాలలోనే సమాధానం రాయవలసి ఉంటుంది.కాబట్టి ఆ తక్కువ సమయంలోనే ప్రశ్నను అర్థం చేసుకొని ఏం రాయాలో నిర్ణయించుకొని ఆ సమాధానం సమగ్రంగా ఉండేలా చూసుకోవాలి. అంటే తక్కువ సమయంలో, తక్కువ పదాలతో ప్రశ్నకు తగిన సమాధానాన్ని రాసే నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి. ఈ నైపుణ్యం అభివృద్ధి చేసుకుంటే నిర్దిష్ట సమయంలో అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయడం వీలవుతుంది. ఫలితంగా మిగతా వారికంటే ఎక్కువ మార్కులు లభిస్తాయి.ఈ డిస్క్రిప్టివ్ రైటింగ్ స్కిల్స్ అన్నీ ఒక రోజులో నేర్చుకోవడం వీలుకాదు. ఇవి నిరంతర ప్రాక్టీస్ ద్వారానే అలవ డతాయి. అందువలన ముందునుంచే వెూడల్ సమాధానాలు రాయడం అలవాటు చేసుకొని వాటిని నిపుణులకు చూపించి వారి సల హాలు, సూచనలు పాటిస్తే మరింత ప్రయోజనం కలు గుతుంది.
ఏ పోస్టుకు ఏం చదవాలి?
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వివిధ కేటగిరీ పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల చేసి పరీక్షలు నిర్వహిస్తుంటుంది.కానీ, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పాటించే విధంగా ఎపిపియస్సికి క్యాలండర్ విధానం లేకపోవడంతో నోటిఫికేషన్లు ఎప్పుడెప్పుడు వస్తాయన్నది ఖచ్చితంగా చెప్పలేం. అయితే త్వరలోనే ఎపిపియస్సి నుంచి పలు పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల అయ్యే అవకాశం ఉంది. వాటిలో కొన్ని ముఖ్యమైన పోస్టులు, వాటి అర్హతలు, పరీక్షా విధానం ఎలా ఉంటుందో పరిశీలిద్దాం. గ్రూప్-2 ఎపిపియస్సి నిర్వహించే రిక్రూట్మెంట్లలో అన్నింటి కన్నా ఎక్కువగా అభ్యర్థులు పోటీపడేది గ్రూప్-2 పోస్టులే. ఇందులో రెండురకాల కేటగిరీ పోస్టులు ఉంటాయి. అవి 1. ఎగ్జిక్యూటివ్ పోస్టులు, 2. నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఎగ్జిక్యూటివ్ పోస్టుల్లో డిప్యూటీ తహసిల్దార్, అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్సెస్ ఆఫీసర్, సబ్ రిజిస్ట్రార్ వంటి పోస్టులు ఉంటే నాన్ ఎగ్జిక్యూటివ్ కేటగిరీలో సీనియర్ అకౌంటెంట్, జూనియర్ అకౌంటెంట్, జూనియర్ అసిస్టెంట్ వంటి పోస్టులు ఉంటాయి. వీటిలో ఎగ్జిక్యూటివ్ పోస్టులకు , నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఇప్పటి వరకు మూడు పేపర్లతో ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష నిర్వహించి ఆపై ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఇంటర్వ్యూ కూడా నిర్వహించేవారు. నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులకు కేవలం రాతపరీక్ష ఆధారంగా నియామకాలు జరిపేవారు. అయితే ఎపిపియస్సి సంస్కరణల్లో భాగంగా ఎగ్జిక్యూటివ్ పోస్టులను గ్రూప్-1లో కలిపి గ్రూప్-1బి గా పేర్కొని ఇక నుండి వాటికి కూడా గ్రూప్-1లో మెయిన్స్ పరీక్షలు రాయాలని నిర్ణయించారు. అయితే అభ్యర్థుల కోరిక మేరకు రాబోయే నోటిఫికేషన్కు మాత్రమే పాత పద్ధతిలో ఆబ్జెక్టివ్ పరీక్ష నిర్వహిస్తారు.ఇంటర్వ్యూ ఉండదు.ఆ తర్వాత రిక్రూట్మెంట్లకు ఎగ్జిక్యూటివ్ పోస్టులకు గ్రూప్-1 మాదిరిగా ప్రిలిమ్స్ మెయిన్స్, ఇంటర్వ్యూ మూడు దశల ఎంపిక విధానం ఉంటుంది. నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులకు కేవలం ఆబ్జెక్టివ్ విధానంలో రాతపరీక్ష ఉంటుంది.అర్హతలు : ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ పొంది ఉండాలి. కొన్ని పోస్టులకు కామర్స్, ఎకనామిక్స్, మేథమెటిక్స్, లా సబ్జెక్టుల్లో డిగ్రీ, కంప్యూటర్స్లో సర్టిఫికెట్ కోర్సు చేసి ఉండాలి. ఎంపిక విధానం : ఎంపిక రాతపరీక్ష ఆధారంగా జరుగుతుంది. మొత్తం 3 పేపర్లు - ఆబ్జెక్టివ్ విధానం 1. జనరల్ స్టడీస్ - 150 మార్కులు 2. ఆంధ్రప్రదేశ్ సామాజిక, చరిత్ర, రాజ్యాంగ అవలోకనం - 150 మార్కులు 3. భారత ఆర్థికవ్యవస్థ, ఆంధ్రప్రదేశ్ ఆర్థికవ్యవస్థ - 150 మార్కులు మొత్తం - 450 మార్కులు జూనియర్ లెక్చరర్లు ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఇంటర్ విద్యార్థులకు పాఠాలు బోధించే జూనియర్ లెక్చరర్ పోస్టులు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన అభ్యర్థులకు మంచి అవకాశం. అర్హతలు : సంబంధిత సబ్జెక్టులో కనీసం 50శాతం మార్కులతో పోస్ట్గ్రాడ్యుయేషన్ పాసై ఉండాలి. ఎంపిక విధానం : ఎంపిక విధానం రాతపరీక్ష ఆధారంగా జరుగుతుంది. రాతపరీక్షలో 2 పేపర్లు ఉంటాయి. మొదటి దశ - రాతపరీక్ష - ఆబ్జెక్టివ్ విధానం. మొత్తం 2 పేపర్లు. 1. జనరల్స్టడీస్ - 150 మార్కులు 2. సంబంధిత సబ్జెక్టు - 300 మార్కులు మొత్తం - 450 మార్కులు. రెండవదశ ఇంటర్వ్యూ - 50 మార్కులు. డిగ్రీ కాలేజీ లెక్చరర్లు డిగ్రీ కాలేజీలో వివిధ సబ్జెక్టులకు సంబంధించిన లెక్చరర్ పోస్టులు. అర్హతలు : సంబంధిత సబ్జెక్టులో 55 శాతం మార్కులతో పోస్ట్గ్రాడ్యుయేషన్ పాసై ఉండాలి. ఇంకా నెట్ లేదా స్లెట్ పరీక్ష పాసై ఉండాలి. పి.హెచ్.డి పాసైన అభ్యర్థులకు నెట్/ స్లెట్ అర్హత నుంచి మినహాయింపు ఇస్తారు. ఎంపిక విధానం : ఎంపిక విధానం 2దశల్లో ఉంటుంది. -మొదటిదశ రాతపరీక్ష - ఆబ్జెక్టివ్ విధానం -మొదటి పేపర్ - జనరల్స్టడీస్ - 150 మార్కులు -ండవ పేపర్ - సంబంధిత సబ్జెక్టు - 300 మార్కులు -మొత్తం - 450 మార్కులు -ండవదశ - ఇంటర్వ్యూ - 50 మార్కులు గ్రూప్-4 పోస్టులు గ్రూప్-4 కింద వివిధ డిపార్ట్మెంట్లలో జూనియర్ అసి స్టెంట్ పోస్టులు, మరికొన్ని డిపార్ట్మెంట్లలో సూపర్వైజర్ వంటి అదే కేటగిరికి చెందిన పోస్టులు భర్తీ చేస్తారు. అర్హతలు : జూనియర్ అసిస్టెంట్లకు ఇంటర్, సూపర్వైజర్లకు ,ఎస్ఎస్.సి, లేదా తత్సమాన అర్హత. ఎంపిక విధానం : ఎంపిక విధానం రాత పరీక్ష ద్వారా జరుగుతుంది. - రెండు పేపర్లు - ఆబ్జెక్టివ్ విధానం - పేపర్-1 జనరల్ స్టడీస్ - 150 మార్కులు - పేపర్-2 సెక్రటేరియల్ ఎబిలిటీస్ - 150 మార్కులు - మొత్తం - 300 మార్కులు విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ (వి.ఆర్.ఓ) గ్రామాలలో ప్రభుత్వ అధికారిగా శాంతిభద్రతల నుంచి అభివృద్థి పథకాల అమలు వరకు కీలక బాధ్యతలు నిర్వహించే విలేజ్రెవెన్యూ ఆఫీసర్ తహసిల్దార్ పర్యవేక్షణలో పనిచేస్తారు. విద్యార్హత : ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత ఎంపిక విధానం : ఎంపిక విధానం రాతపరీక్ష ద్వారా జరుగుతుంది. - రాత పరీక్షలో 100 మార్కులకు జనరల్స్టడీస్ పేపర్ ఉంటుంది. పంచాయతీ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మొదటిసారిగా పంచాయతీ సెక్రటరీ పోస్టుల భర్తీని చేపడుతోంది. గ్రామీణా భివృద్ధిలో కీలక పాత్ర పోషించే గ్రామపంచాయితీకి సెక్రటరీగా ముఖ్యమైన విధులు, బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది. రాష్ర్టంలో 21,809 గ్రామాలు ఉన్నాయి. వీటికి పంచాయతీ సెక్రటరీని నియమించాల్సి ఉండగా కొన్ని చోట్ల కాంట్రాక్టు పద్ధతిలో పంచాయతి సెక్రటరీలను నియమించగా మరికొన్నిచోట్ల డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా వీరిని నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పోస్టులకు సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్ వెలువడగా ఆన్లైన్ - దరఖాస్తుల పక్రియ ప్రారంభం కావాల్సిన దశలో వాయిదా పడింది. త్వరలో సెక్రటరీ పోస్టుల దరఖాస్తుల పక్రియ ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. విద్యార్హత : ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ పాసై ఉండాలి. ఎంపిక విధానం : ఎంపిక విధానం రాతపరీక్ష ద్వారా ఉంటుంది. రాత పరీక్షలో 2 పేపర్లు ఉంటాయి. 1. జనరల్స్టడీస్ - 150 మార్కులు 2. గ్రామీణాభివృద్ధికి సంబంధించిన పేపర్ - 150 మార్కులు మొత్తం - 300 మార్కులు.
సూక్ష్మ జీవులు- వ్యాధులు
సూక్ష్మ జీవులు- వ్యాధులు
- లూయీ పాశ్చర్ ను Father of Microbiology గా పిలుస్తారు.
- సూక్ష్మ జీవుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని " మైక్రోబయాలజీ" లేదా సూక్ష్మ జీవశాస్త్రం అంటారు.
- సూక్ష్మ జీవులను 1674 లో తొలిసారిగా "ఆంటోనీవాన్ లీవెన్ హుక్ " కనుక్కున్నాడు.
- సూక్ష్మ జీవులు - రకాలు: 1. వైరస్ 2. బాక్టీరియా 3. ప్రోటోజోవా 4. శైవలాలు 5.శీలీంధ్రాలు .
వైరస్:
- మొదట వైరస్ లను కనుక్కున్న శాస్త్రవేత్త "ఐవనోవిస్కి"
- వైరస్ అంటే లాటిన్ భాషలో "విషం" అని అర్థం.
- వైరస్ అని పేరు పెట్టిన వ్యక్తి - బైజరింక్.
- వైరస్ లను గురించి చేసే అధ్యయనాన్ని "వైరాలజీ" అంటారు.
- రినోవైరస్ ద్వారా జలుబు
- గాలి, ప్రత్యక్ష స్పర్శ ద్వారా సోకును.
- ఎంటిరోవైరస్ / పోలియో వైరస్ వల్ల .
- కలుషితాహారం నీరు ద్వారా వ్యాపిస్తుంది.
- పోలియో వ్యాధిలో చిన్న పిల్లల్లో చాలకనాడులు దెబ్బతింటాయి.
- డెంగ్యు వైరస్ (అర్బో వైరస్)
- ఏడిస్ ఈజిప్టు దోమ ద్వార వ్యాపించింది.
- ఈ వ్యాధి వల్ల రక్తఫలకికలు/ప్లేట్ లెట్స్ సంఖ్య తగ్గిపోతుంది.
- రాబిస్ వైరస్ (రాబ్డోవైరస్)
- రేబిస్ వ్యాధి కేంద్ర నాడీవ్యవస్థను బలహీనం చేయడం వల్ల నీటిని చూస్తే భయం కలుగును (హైడ్రోఫోబియా)
- పిచ్చికుక్కకాటు ద్వారా వ్యాపిస్తుంది.
- అక్వైర్డ్ ఇమ్యునో డెఫిసియన్సీ సిండ్రోమ్
- రక్తం, లైంగిక సమ్బంధం, సూదులు, ద్రవాలు ద్వారా వ్యాపిస్తుంది.
- H.I.V వైరస్ ని కనుగొన్న శాస్త్రవేత్త - ల్యూక్ మాంటెగ్నియర్ (పారిస్) ,రాబర్ట్ గాలో (అమెరికా).
- ప్రపంచంలో తొలి ఎయిడ్స్ కేసు: 1981 వ సం. అమెరికాలో... భారత్ లో 1986 May లో చైన్నెలో(మద్రాస్)
- H.I.V ని గుర్తించడానికి ఉపయోగించి రక్త పరీక్షలు: ఎలీసా, P.C.R, వెస్ట్రన్ బ్లాట్
- ELISA : Enzyme Linked Immuno Sarbent Assay
- ఎలీసా ను ఎంగ్వల్ & ప్లర్ మన్ లు 1970 లో కనుగొన్నారు.
- NACO - నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్.
- నేషనల్ ఎయిడ్స్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ పూణెలో కలదు.
- ఎయిడ్స్ సమాచారం కోసం Toll Free No: 1097
- ఎయిడ్స్ నివారణకు వాడే ఔషదాలు: AZT, DDI, DDC
APPSC Guidance దృష్టి సారించాల్సిన అంశాలు
ఫిజికల్ సైన్స్: ధ్వని, కాంతి, అయస్కాంతత్వం, విద్యు త్, ఉష్ణం, యాంత్రికశాస్త్రం, ఆధునిక బౌతిక శాస్త్రం.
బయలాజికల్ సైన్స్: జీవుల వర్గీకరణ, మానవ శరీరం- వ్యవస్థలు, వ్యాధులు-వ్యాక్సీన్లు-ఆవిష్కరణలు.
మెంటల్ ఎబిలిటీ: నంబర్ సిరీస్, కోడింగ్-డీకోడింగ్, సీటింగ్ అరేంజ్మెంట్, ర్యాంకులు, శాతాలు, సగటులు, అక్షరక్రమం, వర్గాలు, వర్గమూలాలు, వెన్ డయాగ్రమ్స్.
జాగ్రఫీ: ఖనిజాలు, సహజ వనరులు, అతిపెద్ద- అతి చిన్న భౌగోళిక స్వరూపాలు. నీటిపారుదల అంశాలు
హిస్టరీ: పరిమితంగా ఉండే సిలబస్లో ఆయా రాజులు, రాజ వంశాలు- వారి కాలంలో సాంస్కృతిక చరిత్ర.
పాలిటీ: రాజ్యాంగం- లక్షణాలు, ప్రవేశిక, ప్రాథమిక హక్కులు-విధులు, ఆదేశిక సూత్రాలు, భారత సమాఖ్య విశిష్ట లక్షణాలు, కేంద్ర రాష్ట్ర సంబంధాలు, అధికార విభజన, శాసన,కార్య నిర్వహణ వ్యవస్థ, సుప్రీంకోర్టు- ముఖ్యమైన తీర్పులు. ఆయా కమిటీలు-సిఫార్సులు
ఎకానమీ: ప్రణాళికలు, లక్ష్యాలు-విజయాలు, వైఫల్యాలు-కారణాలు, సంస్కరణల ముందు-తర్వాత కాలంలో ఆర్థిక రంగం, తాజా ఎకనామిక్ సర్వేలు, బడ్జెట్లు-గణాంకాలు. సంక్షేమ పథకాలు-లక్ష్యాలు-ప్రగతి. కోర్ టాపిక్గా భావించే జీఎన్పీ, జీడీపీ, ఎన్ఎన్పీ వంటి సూచీల గురించి సంపూర్ణ అవగాహన పొందాలి.
Integrated Rural Development Programme - IRDP
Vision
IRDP envisions a socially empowered and economically strong society, which ensures equal rights for every human being.Mission
The existing environment (Social,
Political and Economic) deters the poor to grow and empower in power to
have access on their lives. IRDP continue to work as mobilization
force to empower the poor enabling them to develop and recognize
themselves at every level by alleviating poverty at the gross roots
level.
Goal
Integrated human development in the specific context of the assessment and management of sustainable livelihoods.
Child friendly school for street children;
In our area we are improving
education starting simply by providing a teacher and a place to study or
piece of chalk and a board on which to write.IRDP is running a child
friendly school named Yousaf Bawa foundation in Iben –e- Merriam
Colony St #6 Faisalabad. The target group have comprised of children
belonging to socio-economic deprived groups, most disadvantage and from
underserved community, street children, orphan, living in poverty,
rural and minority children.
READ MORE
జనరల్ సైన్స్
Tags: DSC in telugu, APPSC in Telugu, APPSC Study Metrical in Telugu
జనరల్ సైన్స్-1
1) మానవ శరీరంలోని అతి పెద్ద గ్రంథి?
ఎ) కాలేయము బి) క్లోమము సి) జఠర గ్రంథి డి) లాలాజల గ్రంథి
ఎ) కాలేయము బి) క్లోమము సి) జఠర గ్రంథి డి) లాలాజల గ్రంథి
2) ప్రొటీన్లను పెస్టోన్లుగా మార్చే ఎంజైమ్?
ఎ) ట్రిప్సిన్ బి) పెప్సిన్ సి) సుక్రోజ్ డి) ఎమలైజ్
3) మొక్కల నుండి వచ్చే ఆహారంలో ఈ విటమిన్ వుండదు...
ఎ) బి-విటమిన్ బి) ఎ-విటమిన్ సి) డి-విటమిన్ డి) సి-విటమిన్
4) అమీబా చలనాంగాలు?
ఎ) మిధ్యాపాదములు బి) సీలియంలు సి) కశాబాలు డి) నీటములు
5) ఈ క్రింది వాటిలో వైరస్ ద్వారా సంభవించే అంటువ్యాధి?
ఎ) కలరా బి) మశూచి సి) టైఫాయిడ్ డి) క్షయ
6) ఈ క్రింది వానిలో వినాళ గ్రంథి?
ఎ) కాలేయము బి) థైరాయిడ్ సి) క్లోమము డి) ఏదీ కాదు
7) రక్తము గడ్డ కట్టుటకు అవసరమయ్యే విటమిన్ ?
ఎ) విటమిన్-ఎ బి) విటమిన్- బి సి) విటమిన్-కె డి) విటమిన్-సి
8) థయామిన్ లోపం వలన ఈ వ్యాధి వస్తుంది...
ఎ) బెరిబెరి బి) పెల్లాగ్రా సి) రికెట్స్ డి) రక్తహీనత
9) రక్తం గడ్డకట్టిన తర్వాత ఏర్పడే ద్రవము?
ఎ) ప్లాస్మా బి) ఆక్సిజన్ రహిత రక్తం సి) ఆక్సిజన్ సహిత రక్తం డి) సీరం
10) దీనిని ఎర్ర రక్తకణాల స్మశాన వాటిక అంటారు...
ఎ) కాలేయం బి) ప్లీహం సి) లింఫ్ డి) కిడ్నీలు
11) రక్తనాళాల్లోని రక్తం గడ్డకట్టకుండా ఇది కాపాడుతుంది...
ఎ) హిమోగ్లోబిన్ బి) పెప్సిన్ సి)్థరాక్సిన్ డి) హిపారిన్
12) మానవునిలో క్రోమోజోముల సంఖ్య?
ఎ) 46 బి) 45 సి) 27 డి) 24
13) లాలాజలంలోని ఎంజైము?
ఎ) ఎమలైజ్ బి) పెప్టిన్ సి) ట్రిప్సిన్ డి) క్లోమం
14) కిరణజన్య సంయోగక్రియలో వెలువడే వాయువు?
ఎ) కార్బన్డై యాక్సైడ్ బి) ఆక్సిజన్ సి) హైడ్రోజన్ డి) నైట్రోజన్
15) ఐరన్ లోపం వలన కలిగే వ్యాధి?
ఎ) డయాబిటీస్ బి) బెరిబెరి సి) ఎనీమియా డి) రికెట్స్
16) దీనిలోపం వలన గాయిటర్ కలుగుతుంది...
ఎ) కాల్షియం బి) సిలీనియం సి) అయోడిన్ డి) జింక్
17) రక్తంలో ఇన్సులిన్ తగ్గితే వచ్చే వ్యాధి?
ఎ) బెరిబెరి బి) కీళ్ళ వ్యాధి సి) ఎయిడ్స్ డి) మధుమేహం
18) హెచ్.ఐ.వి. వైరస్ కలగజేసే వ్యాధి...
ఎ) ప్లేగు బి) ఎయిడ్స్ సి) మధుమేహం డి) క్షయ
19) హెపటైటిస్ వైరస్ వలన వచ్చే వ్యాధి...
ఎ) కామెర్లు బి) కలరా సి) మలేరియా డి) టైఫాయిడ్
20) మానవునిలో సాధారణ రక్తపీడనము...
ఎ) 80/120 బి) 120/80 సి) 80/110 డి) 90/120
21) 13 గదుల హృదయం గల జీవి?
ఎ) నత్త బి) వానపాము సి) బొద్దింక డి) జలగ
22) అమీబాలో శ్వాసక్రియ జరిగే విధానము?
ఎ) భాష్పీభవనము బి) ఉచ్ఛ్వాసము సి) విసరణము డి) అస్మాసిస్
23) రక్తపీడనాన్ని కొలిచే సాధనము ఏది?
ఎ) స్పిగ్మో మానోమీటర్ బి) ధర్మామీటర్ సి) లాక్టోమీటర్ డి) బారోమీటర్
24) ఇవి కేంద్రకం లేని రక్త కణాలు...
ఎ) లింఫోసైట్లు బి) రక్త్ఫలకికలు సి) మోనోసైట్లు డి) ఇస్నోఫిల్స్
25) ఈ క్రింది వానిలో గజ్జిని కలుగజేసేది...
ఎ) ఈగ బి) దోమ సి) బొద్దింక డి) ఎకారస్
26) చర్మంలో నిర్జీవ కణాలు గల పొర?
ఎ) కెరాటిన్ బి) కార్నియం సి) సెబేషియన్ డి) ప్రొటీన్
27) చర్మానికి రంగు దీని వలన వస్తుంది...
ఎ) ప్రొటీన్ బి) కెరాటిన్ సి) మెలానిన్ డి) సెబేషియన్
28) ఈ క్రింది దానిని పరిక్షించేందుకు అయోడిన్ను ఉపయోగిస్తారు...
ఎ) గ్లూకోజ్ బి) పిండి పదార్థం సి) కాంతి డి) కార్బన్ డైయాక్సైడ్
29) ఈ జీవి యందు ఎర్రరక్త కణాలు వుండవు...
ఎ) వానపాము బి) కప్ప సి) పాము డి) నెమలి
30) ఈ గ్రంథి వాయునాళానికి దగ్గరగా ఉంటుంది...
ఎ) కాలేయము బి) అవటు గ్రంథి సి) అధిపృక్క గ్రంథి డి) క్లోమ గ్రంథి
31) కంఠమిలం మీద మూతలా పనిచేసే నిర్మాణము...
ఎ) నాలుక బి) మొప్ప పటలిక సి) ఉప జిహ్విక డి) ఉపరికుల
32) శరీరంలో రసాయన సమన్వయం జరిపే పదార్థాలు?
ఎ) రక్తం బి) లింఫ్ సి) ఎంజైములు డి) హార్మోనులు
33) నిస్సల్ కణికలు గల కణాలు...
ఎ) నాడీ కణాలు బి) ఇస్ నోఫిల్స్ సి) లింఫోసైట్స్ డి) గ్లియల్ కణాలు
34) అసంకల్పిత ప్రతీకార చర్యలు నాడీ మండలంలోని దీని ఆధీనంలో ఉంటాయి...
ఎ) మజ్జాముఖము బి) వెన్నుపాము సి) అను మస్త్కిము డి) హైపొథలామస్
35) మస్తిష్కము యొక్క ఉపరితల వైశాల్యమును వృద్ధిచేయునవి...
ఎ) గైరీ బి) డెండ్రైట్లు సి) ఎక్సానులు డి) మైలీన్ తొడుగులు
36) ఈ క్రింది దానిలో బాహ్య ఫలదీకరణం జరుగుతుంది...
ఎ) కాకి బి) పాము సి) కప్ప డి) ఎలుక
37) తల్లి యొక్క గర్భాశయ కుడ్యానికి, భ్రూణాన్ని కలిపే నిర్మాణము...
ఎ) జరాయువు బి) ఫెలోపియన్ నాళము సి) నాభి రజ్జవు డి) ఎపిడిడిమస్
38) గ్రాఫియన్ పుటికలు దీని నిర్మాణంలో ఉంటాయి...
ఎ) స్ర్తి బీజకోశము బి) శుక్ర కణము సి) అండము డి) ఫెలోపియన్ నాళము
39) సమ్యోగము అనునది ఒక రకమైన...
ఎ) ద్విధావిచ్ఛిత్తి బి) శాఖీయోత్పత్తి సి) లైంగిక ప్రత్యుత్పత్తి డి) అలైంగిక ప్రత్యుత్పత్తి
40) సెల్యులోజ్ అనునది ఒక...
ఎ) ప్రొటీన్ బి) కార్బోహైడ్రేట్ సి) కొవ్వు డి) మినరల్
సమాధానాలు:
------------------------------
------------------------------
1) ఎ, 2) బి, 3) సి 4) ఎ, 5) ఎ, 6) బి, 7) సి, 8) ఎ, 9) డి, 10) బి, 11) డి, 12) సి, 13) ఎ, 14) బి, 15) సి, 16) సి, 17) డి, 18) బి, 19) ఎ, 20) బి, 21) ఎ, 22) సి, 23) ఎ, 24) బి, 25) డి, 26) బి, 27) సి, 28) బి, 29) ఎ, 30) బి, 31) సి, 32) డి, 33) ఎ, 34) బి, 35) ఎ, 36) సి, 37) సి, 38) ఎ, 39) సి, 40) బి.
Junior Lecturers Syllabus of APPSC
Tags: APPSC junior lecturers Junior Lecturers Syllabus of APPSC,JUNIOR LECTURER Notification 2008,UNIOR LECTURERS IN GOVT. JR. COLLEGES (General & Limited Recruitment). NOTIFICATION NO. 19/2012 & 05/2012,RESULT NOTIFICATION FOR JUNIOR LECTURERS IN GOVERNMENT JUNIOR COLLEGES NOTIFICATION NO
Junior Lecturers Syllabus of APPSC
GROUP-II SERVICES, GENERAL RECRUITMENT Halltickets Download
GROUP-I SERVICES SCREENING TEST RESULTS
Tags: GROUP-I SERVICES SCREENING TEST RESULTS, Group -I Results, Group -I Screening Results, GROUP-I SERVICES SCREENING TEST RESULTS, Group -I Results, Group -I Screening Results
Release of list of provisionally qualified candidates for appearing for Main Examination.
It is hereby notified that, on the basis of the Screening test held on 27/05/2012 (Sunday) from 10-30 AM to 1-00 PM for the posts falling under Group-I Services which were notified in Notification No.15/2011 (Limited) and 18/2011 (General), the candidates whose Register Numbers are given below have provisionally qualified for appearing to the Main Examination which will be held from 3rd September 2012 at 5 centers Viz. Hyderabad, Visakahpatnam, Vijayawada, Tirupathi and Warangal only.
The dates for the Main examination are already kept in Commission’s website by giving required time to candidates to prepare for the main examination. The Hall Tickets for Main Examination to the qualified candidates will be kept in the Commission’s website separately in due course.
The dates for the Main examination are already kept in Commission’s website by giving required time to candidates to prepare for the main examination. The Hall Tickets for Main Examination to the qualified candidates will be kept in the Commission’s website separately in due course.
Junior Lecturers in Government Junior Colleges General and Limited Recruitment Interview List
Interview
List for Notification No. 5/2008 & 19/2008 , Junior Lecturers in
Government Junior Colleges General and Limited Recruitment
Tags: Junior Lecturers Results,JL Results,Junior Lecturers in Government Junior CollegesInterview List for Notification No.5/2008 , 19/2008,Junior Lecturers in Government Junior Colleges General and Limited Recruitment,JUNIOR LECTURERS IN GOVERNMENT JUNIOR COLLEGES NOTIFICATION NO. 19/2008 AND 5/2008 (General & LimitedRecruitment). RESULT,
జనరల్ స్టడీస్ మార్కులకు జీవం పోసే జనరల్ సైన్స్
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసు కమిషన్ నిర్వహిస్తున్న అన్ని రకాల పోటీ
పరీక్షలలో జనరల్ స్టడీస్ తప్పనిసరి సబ్జెక్ట్గా ఉంటున్నది. అదే విధంగా
పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్, విద్యా శాఖ, ఇంజనీరింగ్ తదితర
డిపార్ట్మెంట్స్ నిర్వహించే పోటీ పరీక్షలలో కూడా జనరల్ స్టడీస్ ఒక
సబ్జెక్ట్గా ఉండడం వల్ల పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్ధులు జనరల్
స్టడీస్ను శాస్త్రీయ పద్దతిలో ప్రణాళికాబద్ధంగా అధ్యయనం చేయాలి. నిజానికి
జనరల్ స్టడీస్ సిలబస్ పరంగా పరిమితంగా ఉన్నప్పటికి పరిధి మాత్రం అపరిమితం.
అందువల్ల ఎన్ని సం॥ పాటు ఎంత చదివినా ఇంకా తెలియని విషయాలు చాలా ఉంటాయి.
అందువల్ల పరీక్ష కోణంలో ముఖ్యమైన అంశాలను గుర్తించడం, ప్రశ్నల సరళిని
పరిశీలించడం, నిపుణుల సలహాలు తీసుకోవడంతో (అవకాశం ఉంటే కోచింగ్ తీసుకోవడం),
పాటు ప్రామాణికమైన పుస్తకాలను ఎంపిక చేసుకొని సమగ్రంగా ప్రిపేర్ అయితే
జనరల్ స్టడీస్పై పట్టు సాధించడం వీలవుతుంది.
జనరల్ స్టడీస్ ఒక సముద్రం లాంటిది ఎంత చదివినా ఉపయోగం తక్కువనే అపోహ ఉంది.
కాని సముద్రంలో మనకు కావలసిన చేపలను మాత్రమే (ముఖ్యమైన అంశాల ను)
గుర్తించగలిగే స్మార్ట్ వర్క్ అవసరం. జనరల్ స్టడీస్ జీవి తంలో మనకు తెలియని అనేక విషయాలను వివరిస్తుంది కాబట్టి దీనిని ఇష్టంతో, సృజనాత్మక
దృష్టితో చూడగలిగితే ఎక్కువ మార్కులు పొందవచ్చు.జనరల్ స్టడీస్లో
జనరల్సైన్స్ అత్యంత కీలకమైన విభాగం. ఈ విభాగం నుండి సుమారు 30 నుండి 35
ప్రశ్నలు రావడానికి అవకాశముంది. పోటీపరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్ధులలో
ఎక్కువ మంది ఈ విభాగం గురించి భయపడ తారు. నిజానికి ఈ విభాగంలో అంశాలను
భావనాత్మకంగా, తార్కికంగా హేతుబద్దంగా ఒకసారి అర్ధం చేసుకోగలిగితే ఎక్కువ
కాలం పాటు గుర్తుంటాయి. అదే విధంగా పరోక్షంగా వచ్చే ప్రశ్నలకు కూడా
సమాధానాలను సులభంగా గుర్తించ వచ్చు. అందువల్ల సైన్స్ నేపథ్యం లేని
అభ్యర్ధులు జనరల్ సైన్స్ను జనరల్గా చదివినా కూడా అర్ధమవుతుందని గుర్తుంచు
కోవాలి. (సిలబస్లో కూడా జనరల్గా పేర్కొన్నారు).
సిలబస్ శాస్త్ర, సాంకేతిక రంగాల్లో సమకాలీన అభివృద్ధి వాటి ప్రభావం,
ప్రత్యేకంగా సైన్స్ను ఒక అంశంగా చదవకపోయినా విద్యావంతుడైన అభ్యర్ధికి
తెలిసి ఉండాల్సిన అనుదిన విజ్ఞాన పరిశీలన, అనుభవ పూర్వక విషయాలపై అవగాహన.
జనరల్ సైన్స్ సిలబస్ స్వభావం? జనరల్ సైన్స్ సిలబస్లో సమకాలీన
విజ్ఞానానికి సంబంధించిన అంశాలను పేర్కొన్నారు. అయితే ఏదైనా ఒక అంశం యొక్క
సమకాలీన విషయం. అనువర్తనం అర్ధం కావాలంటే మొదట ఆ అంశానికి సంబంధించిన మౌలిక
విషయాలు తెలియాలి కాబట్టి శాస్త్ర సాంకేతిక రంగాలలో సమకాలిన అభివృద్ధిని
అర్ధం చేసుకోవాలంటే సైన్స్ మౌలికాం శాలను అధ్యయనం చేయాలి. తరువాత వాటి
అనువర్తనాలపై ప్రధానంగా దృష్టి సారించాలి. పరీక్షల్లో కూడా దాదాపు 50శాతం
మౌలికాంశాలు. 50శాతం అనువర్త నాంశాలను ప్రత్యక్షంగా, పరోక్షంగా అడగటం
జరుగుతుంది. అందువల్ల మౌలికాంశాలకు, అనువర్తనాలకు సమాన ప్రాధాన్యమివ్వాలి.
ఏయే విభాగాలకు ఎక్కువ ప్రాముఖ్యం ఇవ్వాలి? జనరల్ సైన్స్లో ప్రధానంగా
జంతుశాస్త్రం, వృక్షశాస్త్రం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, సైన్స్ అండ్
టెక్నాలజీ మొదలగు విభాగాలు ఉంటాయి. వీటిలో జంతుశాస్త్రం మరియు భౌతిక
శాస్త్రం నుండి ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి. వీటితోపాటు పర్యావరణ
శాస్త్రం, అనువర్తన జీవశాస్త్రం వంటి శాస్త్రాల గురించి కూడా తెలుసుకోవాలి.
ఈ విభాగం నుండి వచ్చే మొత్తం 30/35 ప్రశ్నలలో ఈ కింది విధంగా ప్రశ్నలు
రావడానికి అవకాశముంది.
జంతుశాస్త్రంలో మౌలికమైన అంశాలు? జీవశాస్త్రంలో ముఖ్యమైన విభాగం
జంతుశాస్త్రం. ఇందు లో ఏకకణ సరళ జీవి అయిన అమిబా మొదలు మానవుని వరకు అనేక
కోట్ల జీవరాశులు ఉంటాయి. జంతు రాజ్యంలో వున్న ప్రధాన శాఖలైన అకశేరుకాలు,
సకశేరుకాలు, వాటిలోని ఉపశాఖల ముఖ్యమైన లక్షణాలను తెలుసుకోవాలి. అకశేరుకాలలో
ప్రోటోజోవా, పోరిఫెరా, సిలెంటి రేటా, ప్లాటి హెల్మింథిస్, నిమాటి
హెల్మింథిస్, అనెలిడా, ఆర్దోపొడ, మలస్కా, ఇకైనో డెర్మెటాల మౌలిక లక్షణాలను
అదే విధంగా జీవులు యొక్క ఆర్థిక ప్రాముఖ్యతను, ముఖ్యమైన జీవుల పేర్లను
తెలుసుకోవాలి. గతంలో వీటి నుండి సులభమైన ప్రశ్నలను ఎక్కువగా అడగటం
జరిగింది.
ప్రశ్నల స్వభావం 1. అమీబియాసిస్ ను కలిగించే ప్రోటోజోవా పరాన్న జీవి?
జ. ఎంటమిబా హిస్టాలైటికా
2. బాత్ స్పాంజ్లు ఏ విభాగంలో ఉంటాయి?
జ. పొలిఫెరా
3. పగడపు దిబ్బలు, ప్రవాళ బిత్తికలు ఏ విభాగంలో ఉంటాయి?
జ. సిలెంటిరేటా
అకశేరుకాల నుండి ప్రధానంగా వర్గం యొక్క ముఖ్య లక్షణం, ముఖ్యమైన జీవి.
ఆర్థిక ప్రాముఖ్యం గల జీవి గురించి ఎక్కువగా ప్రశ్నలు రావడానికి
అవకాశముంది. సకశేరుకాలలో చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు
ఉంటాయి. వీటిలో కూడా వర్గం యొక్క ముఖ్యమైన లక్షణా లు, ఆర్థిక ప్రాముఖ్యంగల
జీవుల గురించి తెలుసుకోవాలి. మానవుడు క్షీరదాల వర్గానికి చెందినందున
క్షీరదాల గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఇక మానవుని శరీర ధర్మశాస్త్రం
పరీక్ష కోణంలో కీలకమైన అంశం. ఇందులో జీర్ణవ్యవస్థ (పోషణ), రక్తప్రసరణ
వ్యవస్థ. శ్వాసవ్యవస్థ, నాడీవ్యవస్థ, అస్థిపంజర వ్యవస్థ, హార్మోన్లు,
జ్ఞానేంద్రియాలకు సంబంధించిన అంశాల నుండి గత ప్రశ్నాపత్రాలలో ఎక్కువగా
ప్రశ్నలు రావడం జరిగింది. ముఖ్యంగా రక్తవర్గాలు, విటమిన్లు, హృదయ సం బంధ
వ్యాధులు, కన్ను, చెవి, నిర్మాణం. హార్మోన్ల లోపం వల్ల తలెత్తే సమస్యల
గురించి ఎక్కువగా ప్రశ్నలు రావచ్చు.
1. మలేరియా నిర్మూలన కార్యక్రమంలో సాధారణంగా ఉపయోగపడు చేప?
జ. గాంబుషియా యఫినిస్ (గూప్-1, 200)
2. చెవి ఎముకల మొత్తం?
జ. 6 నగూప్-2, 200)
3. శరీరంలో వార్తలను గ్రహించి, విశ్లేషించి సమన్వయ పరిచే కేంద్రం?
జ. మెదడు (జూనియర్ లెక్చరర్స్ - 2007)
జంతు శాస్త్రం సిలబస్ విస్తృతంగా ఉన్నప్పటికి గత ప్రశ్నాపత్రాల విశ్లేషణ
ఆధారంగా చూస్తే పరీక్ష కోణంలో ముఖ్యమైన అంశాల నుండే ప్రశ్నలు పునరావృత
మవుతు న్నాయి. అందువల్ల అభ్యర్ధులు శాస్త్రీయ పద్ధ్దతిలో అధ్యయనం చేయాలి.
జంతుశాస్త్రంకు అనుబంధంగా కణజీవ శాస్త్రం, జన్యుశాస్త్రం, ఆవరణ శాస్త్రం
లాంటి విభాగాలను కూడా అధ్యయనం చేయడం తప్పనిసరి.
వృక్షశాస్త్రంలో ముఖ్యమైన అంశాలు? పరీక్ష కోణంలో వృక్షశాస్త్రం పాత్ర
తక్కువగా ఉన్నప్పటికీ జీవుల మనుగడ విషయంలో మాత్రం ఈ శాస్త్రం అత్యంత
కీలకమైనది. సమస్త జీవరా శులు జీవించి ఉండటానికి అవసరమైన ఆక్సిజన్ను
అందించడంతో పాటు జీవులు విడుదల చేసిన కార్బన్ డై అక్సైడ్ను మొక్కలు
పీల్చుకొని వాతావ రణ సమతుల్యతను కాపాడుతున్నాయి.
వృక్ష రాజ్యంలో ప్రధానంగా శైవలాలు శిలీం ధ్రాలు, బ్రయోఫైటా, టెరిడోఫైటా,
వివృత బీజాలు, ఆవృత బీజాలు అనే విభాగాలు ఉంటాయి. ఈ విభాగాల ముఖ్యమైన
లక్షణాలను అదే విధంగా మొక్కల ఆర్థిక ప్రాముఖ్యతను ఎక్కువగా అడగటం
జరుగుతున్నది. వృక్ష రాజ్యంలో అతి చిన్న మొక్కలు శైవలాలు. ఇవి నాచు రూపంలో
ఉంటాయి. సముద్రంలో ఉండే గోధుమ రంగు శైవలాలు అయోడిన్ను ఉత్పత్తి చేయగా,
నాస్తాక్, అనాబినా వంటి నీలి ఆకుపచ్చ, శైవలాలు నత్రజని స్థాపనలో పాల్గొంటా
యి. ఇలా ప్రతి విభాగంలో మానవునికి ఉపయోగపడే ముఖ్యమైన మొక్కల గురించి
తెలుసుకోవాలి. చాలా మంది అభ్యర్ధులు మొక్కల శాస్త్రీయ నామాలు కూడా
గుర్తించుకో వడానికి ఎక్కువ సమయం కేటాయిస్తారు. కాని పరీక్ష కోణంలో అతి
ముఖ్యమైన మొక్కల శాస్త్రీయ నామాలు గుర్తుంచుకుంటే సరిపోతుంది. (ఉదా॥ వేప -
అజాడిరక్టా ఇండికా, వరి-ఒరైజ సటైవా)
ఏయే అంశాలకు ప్రాధాన్యతనివ్వాలి? వృక్ష రాజ్యంలోని వివిధ విభాగాల
ముఖ్యమైన లక్షణాలు, ప్రధానంగా వృక్ష శరీర ధర్మశాస్త్రం, ఆర్థిక వృక్ష
శాస్త్రం, ఆవరణ శాస్త్రం, కణజీవ శాస్త్రం, జన్యుశాస్త్రం నుండి ఎక్కువ
ప్రశ్నలు రావడానికి అవకాశముంది. వృక్ష శరీర ధర్మ శాస్త్రంలో కిరణజన్య
సెంెూగక్రియ, మొక్కల పోషణ, శ్వాసక్రియ, జలరవాణా, భాష్పోత్సకం, వృక్ష
హర్మోన్ల పాత్ర, ప్రత్యుత్పత్తి వ్యవస్థ నిర్మాణం తదితర అంశాల నుండి గతంలో
ప్రశ్నలు ఎక్కువగా పునరావృత మయ్యాయి. ఈ మధ్యకాలంలో జరిగిన పోటీ పరీక్షలలో
ఆర్థిక వృక్షశాస్త్రం, పర్యా వరణ శాస్త్రం, అడవులు, కాలుష్య నివారణ, జీవ
వైవిధ్య సంరక్షణ వంటి అంశాల గురించి ఎక్కువగా ప్రశ్నలడు గుతున్నారు.
ఎలా చదవాలి? వృక్ష శాస్త్రం అనగానే చాలామంది ఇది డ్రై సబ్జెక్ట్ అని,
బోర్ సబ్జెక్ట్ అని ఫీలవుతారు. వాస్తవానికి ఇది చాలా ఇంట్రెస్ట్ సబ్జెక్ట్.
మానవుని జననం మొదలు మరణం వరకు ప్రతి సంఘటనను మొక్కలు ప్రత్యక్షంగానో, లేదా
పరోక్షంగానో ప్రభావితం చేస్తాయి. అందువల్ల మొక్కలు మానవునికి ఉపయోగపడు
తున్న తీరును తెలుసుకోగలిగితే వృక్షశాస్త్రం అర్థమయినట్లే. ప్రశ్నలు కూడా
ఎక్కువగా డైరెక్ట్గా ఉంటాయి. కొన్ని సందర్భాలలో మాత్రం అనువర్తనాలను అడగటం
జరుగుతుంది. కాబట్టి మొదట మౌలికాంశాలను అధ్యయనం చేసి మొక్కల ఉపయోగాలను
తెలుసుకుంటే వృక్షశాస్త్రంలో దాదాపు అన్ని ప్రశ్నలకు సమాధానాలను
గుర్తించవచ్చు.
ప్రశ్నల సరళి ఎలా ఉంటుంది? వృక్షశాస్త్రం నుండి వచ్చే 4-6 ప్రశ్నలలో 3
ప్రశ్నలు చాలా సరళంగా ఉంటాయి. మిగతావి అనువర్తన కోణంలో ఉండటానికి
అవకాశముంది. అంతే కాకుండా ముఖ్యమైన అంశాల నుండే ప్రశ్నలు ఎక్కువగా
పునరావృతమ వుతున్నాయి. కాబట్టి మొదట ఈ అంశాలను క్షుణ్ణంగా అద్యయనం చేయాలి.
1. మొక్కలు నీటిని పోగొట్టుకొను ప్రక్రియ?
జ. బాష్పోత్సేకం గ్రూప్-1, 200)
2. మొక్కలోని ఏ భాగం నుంచి మార్ఫిన్ వస్తుంది?
జ. పుష్పం నగూప్-2, 2003)
3. భారత కేంద్రీయ వరి పరిశోధనా సంస్థ ఎక్కడ ఉంది?
జ. కటక్ (జె.ఎల్. - 2004)
వృక్ష శాస్త్రంలో ఆధునిక ధోరణులు గత దశాబ్ద కాలంలో వృక్షశాస్త్రంలో
ఆర్థిక వృక్షశాస్త్రం, ఔషధ మొక్కల పాత్ర గణనీయంగా పెరిగింది. అందువల్ల ఈ
విభాగం నుండి కనీసం 2 ప్రశ్నలను తప్పనిసరిగా అడుగుతున్నారు. అయితే
మానవునికి ఎక్కువగా ఉపయోగపడుతున్న మొక్కల గురించి తెలుసుకుంటే సరిపోతుంది.
వేప, ఉసిరి, కలబంద, రావుల్పియా వంటి ఔషధ మొక్కల ఉత్పన్నాలు ఎక్కువగా
మార్కెట్లోకి వస్తున్నాయి. అందువల్ల వీటి ఉత్పన్నాలు వాటి ఉపయోగాలను
తెలుసుకోవాలి. ఇక కూరగాయలు వాటి భాగాలు గురించి తెలుసుకోవాలి.
ఉదా : ఉల్లిలో మనం తినే భాగం, రసవంతమైన పత్రపీఠాలు, ఆలుగడ్డలో కాండం,
క్యారెట్లో వేరు తినదగిన భాగాలు. ఇలా ముఖ్యమైన వాటి గురించి తెలుసుకోవాలి.
జీవశాస్త్రంలో ఇతర అంశాలు జీవ శాస్త్రంలో జంతుశాస్త్రం,
వృక్షశాస్త్రంతో పాటు సూక్ష్మజీవశాస్త్రం, జీవ రసాయన శాస్త్రం, బయో
ఇన్ఫర్మేటిక్స్ వంటి ఇతర శాఖలు కూడా ఉన్నాయి. సూక్ష్మజీవ శాస్త్రంలో
బాక్టీరియా వైరస్ల గురించి ముఖ్యంగా ఇవి కలిగించే వ్యాధుల గురించి
తెలుసుకోవాలి. వ్యాధి శాస్త్రంలో జంతువులు, మొక్కలకు కలిగే వివిధ రకాల
వ్యాధులు గురించిన సమాచారం ఉంటుంది. వీటి నుండి కూడా ప్రశ్నలు వస్తాయి.
ఎలాంటి పుస్తకాలు చదవాలి? జీవశాస్త్రం గురించి సంపూర్ణ అవగాహన రావాలంటే
అభ్యర్ధులు స్టేట్ సిలబస్ 6 నుండి 10వ తరగతి వరకు గల సైన్స్ పుస్తకాలను
చదవాలి. వీటితోపాటు పోటీపరీక్షల కొరకు రూపొందించిన ప్రామాణిక పుస్తకాలను
కూడా చదవడం మంచిది. చదివిన విషయాలను ముఖ్యంగా పరీక్ష కోణంలో ముఖ్యమైన
అంశాలను పాయింట్ల రూపంలో, పట్టికల రూపంలో రాసుకొని ఎక్కువసార్లు రివిజన్
చేయాలి. గత ప్రశ్నాపత్రాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి సైన్స్కు సంబంధించిన
వర్తమాన విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. కరెంట్ అఫైర్స్లో
సైన్స్కు సంబంధించిన విషయాలను కూడా సంబంధిత అంశానికి అనుబంధంగా రాసుకుంటే
మౌలికాంశాలు, అనువర్తనాలు ఒకే దగ్గర ఉండి, ప్రశ్న ఏ విధంగా అడిగినా సమాధానం
గుర్తించడం సులభమవుతుంది. నిరంతర సాధన ఎప్పటికప్పుడు నూతన విషయాలను
తెలుసుకోవాలన్న తపన ఉంటే సైన్స్లో ఎక్కువ మార్కులు పొందవచ్చు
Tags:APPSC, appsc study material free download,appsc study circle,appsc study material for industrial promotion officer,appsc study material
Scores : Namaste Telangana
Tags:APPSC, appsc study material free download,appsc study circle,appsc study material for industrial promotion officer,appsc study material
ASSISTANT DIRECTOR IN A.P. ECONOMICS AND STATISTICAL SERVICE. Dated:28/12/2011
ASSISTANT DIRECTOR IN A.P. ECONOMICS AND STATISTICAL SERVICE.
Dated:28/12/2011
Click Here for Detailed
NOTIFICATION NO. 33/2011
Last Date for Payment of fees
Last Date for Payment of fees 10/04/2012
Get Challan
Submit Application
APPSC Exam time table 2012.APPSC Group-I Time Table 2012 in Telugu
APPSC Exam time table 2012.APPSC Group-I Time Table 2012,APPSC Exam time table 2012,APPSC Group-II Time Table 2012 in telugu, APPSC Time table 2012 in Telugu
Andhra Pradesh Public Service Commission Interviews Time Table
Andhra Pradesh Public Service Commission
INTERVIEWS TIME TABLE
Sl.No | NAME OF THE POST | Notification No. | VACANCIES | DATES PROPOSED |
1 | Group – I | 39/08 & 10/09 | 210 | 4th January to 10th February |
2 | Polytechnic Lecturers 1st Notification | 21/06 & 16/08 | 118 | 13th, 14th, and 15th February |
3 | AMVI | 45/08 | 219 | 16th February to 23rd February |
4 | Polytechnic Lecturers 2nd Notification | 18/08 | 287 | 24,25,27,28,29th February, 1st & 2nd March |
5 | Group – II | 38/08 & 11/09 | 649 | 3rd March to 31st March |
6 | Polytechnic Lecturers 3rd Notification | 47/08 | 81 | 2nd & 3rd April. |
7 | A.E.E | 36/08 & 17/10 | 1227 | 16th April to 18th May. |
8 | Junior Lecturers | 5/08 & 19/08 | 1108 | 19th May to 22nd June. |
9 | ATO’s | 07/10 | 256 | 23rd June to 28th June |
Subscribe to:
Posts (Atom)