మొబైల్ బ్యాంకింగ్ వల్ల లాభాలు.. నష్టాలు?


mobail byaanking valla laabhaalu.. nashtaalu?


మొబైల్ బ్యాంకింగ్ అంటే ఏ సమయంలోనైనా సురక్షితంగా బ్యాంక్ ఖాతాను నిర్వహించుకునే వెసులుబాటు. రెండేళ్ల క్రితమే మొబైల్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి వచ్చినా, ఈ సదుపాయం వినియోగిస్తున్న వారు ఇప్పుడిప్పుడే పెరుగుతున్నారు. 81 కోట్ల మొబైల్‌ కనెక్షన్లు ఉన్న దేశంలో, భవిష్యత్తులో మొబైల్‌ బ్యాంకింగ్‌ వినియోగదార్ల సంఖ్య అనూహ్యంగా పెరుగుతుందని బ్యాంకర్లు భావిస్తున్నారు. మొబైల్‌ బ్యాంకింగ్‌ వినియోగానికి ఏ విధమైన రుసుమును బ్యాంకులు వసూలు చేయడం లేదు. సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో ప్రతి ఒక్కటీ మన ముంగిటకే వస్తున్నాయి. అలాగే ఇప్పుడు బ్యాంక్ లావాదేవీల్లో కూడా విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అందుకే ఉదాహారణే ఈ మొబైల్ బ్యాంకింగ్. మనం ఎక్కడ ఉంటే అక్కడినుంచే మొబైల్ ఫోన్ ద్వారా కేవలం ఒక్క ఎస్‌ఎంఎస్ పంపిస్తే మనకు కావాల్సిన సేవలపై బ్యాంకు ఆదేశాలు ఇవ్వడమే మొబైల్ బ్యాంకింగ్. ఈ మొబైల్ బ్యాంకింగ్ వల్ల కొన్ని ప్రయోజనాలుంటే మరికొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. 
మొబైల్ బ్యాంకింగ్ వల్ల ప్రయోజనాలు: 
 * ఎప్పుడైనా బ్యాంకింగ్: మొబైల్ బ్యాంకింగ్ సహాయంతో ఎప్పుడైనా, ఎక్కడనుంచైనా బ్యాంకు లావాదేవీలను నిర్వహించవచ్చు. ముఖ్యంగా నాన్ బ్యాంకింగ్ అవర్స్‌లో ఇది ఎంతగానో ఉపయోగం. మీరు ఇంట్లో నుంచే మీ డెస్కటాప్, ల్యాప్ టాప్‌ల సాయంతో బ్యాంకింగ్ లావాదేవీలు చేయవచ్చు. 
 * మొబైల్ బ్యాంకింగ్ ఉచితం: మొబైల్ బ్యాంకింగ్ అనేది ఉచితం. దీనికి బ్యాంకులు ఎలాంటి రుసుము వసూలు చేయవు. దీనికల్లా మీరు చేయాల్సింది మీ మొబైల్ నెంబర్‌ను రిజిస్టర్ చేసుకోవడమే. 
* సెక్యూర్ బ్యాంకింగ్: బ్యాంకులు మొబైల్ అప్లికేషన్‌ని ప్రారంభిస్తాయి. వాటిని మనం గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకుంటాం. బ్యాంకు లావాదేవీలు అన్నీ కూడా బ్యాంకు సర్వర్‌లోనే నిక్షిప్తం అవుతాయి. మీ ఫోన్ లేదా సిమ్ కార్డులో స్టోర్ అవ్వవు. మొబైల్ బ్యాంకింగ్ వల్ల నష్టాలు: 
 * స్మార్ట్ ఫోన్ లేని వారు మొబైల్ బ్యాంకింగ్ లావా దేవీలను నిర్వహించ లేరు. * మీ స్మార్ట్ ఫోన్‌లో వైరస్ ఉన్నట్లైతే మొబైల్ బ్యాంకింగ్ కన్నా, ఇంటర్నెట్ బ్యాంకింగే అత్యంత ఉత్తమం అని నమ్మేవాళ్లు చాలా మంది ఉన్నారు. 
* మార్కెట్లో స్మార్ట్ ఫోన్‌లకు తక్కువ యాంటీ వైరస్ సాప్ట్ వేర్లు ఉండటం మరో కారణం. మొబైల్ బ్యాంకింగ్ సేఫ్‌గా నిర్వహించాలంటే స్మార్ట్ ఫోన్‌లో యాంటీ వైరస్ తప్పనిసరి. మొబైల్ బ్యాంకింగ్‌లో పేరు ఎలా నమోదు చేసుకోవాలి: 
* మొబైల్ బ్యాంకింగ్ సదుపాయం పొందాలనుకునే వారు ఆ సదుపాయం అందిస్తున్న ఏదైనా ఒక బ్యాంకులో ఖాతాదారులైవుండాలి. 
* దేశంలోని మొబైల్ సర్వీసులు అందిస్తున్న సంస్థల్లో ఏదో ఒక సంస్థ చందాదారులై ఉండాలి. ఆ మొబైల్ సంస్థకు, బ్యాంకుకు మధ్య మొబైల్ బ్యాంకింగ్ సేవలందించే విషయంలో భాగస్వామ్య ఒప్పందం కలిగివుండాలి. మీ మొబైల్ నెంబరును బ్యాంక్‌కు తెలియజేయాలి. 
* మొబైల్ బ్యాంకింగ్ సేవలు పొందాలనుకునే వారు సంబంధిత బ్యాంకులో నిర్దిష్ట దరఖాస్తు ఫారం పూర్తి చేయడం ద్వారా ఆ సేవలను తమకు విస్తరింపజేయాలంటూ బ్యాంకును అభ్కర్ధించాలి. ఏ ఖాతా ద్వారా మొబైల్ బ్యాంకింగ్ సేవలు అందుకోవాలనుకుంటున్నారో ఆ ఖాతాను మీ ఖాతా ఐడీని అనుసంధానం చేయాలి. ఒక ఖాతాదారుడు ఒకే ఐడీతో గరిష్టంగా అయిదు ఖాతాలతో అనుసంధానం కావచ్చు. 
 * సంబంధిత బ్యాంకు మీకు మొబైల్ బ్యాంకింగ్ పిన్ ఇస్తుంది. ఆ పిన్ ఆధారంగా లావాదేవీలు నిర్వహించుకోవాలి. మీకు ఇచ్చిన పిన్ నెంబరు చాలా జాగ్రత్తగా టైప్ చేయాలి. పొరపాటున తప్పుడు నెంబరు టైప్ చేయకూడదు. ఒకవేళ పొరపాటున టైప్ చేసినా మూడుసార్లు వరుసగా తప్పుడు నెంబరు టైప్ చేస్తే ఖాతా స్తంభించిపోతుంది.
 మొబైల్ బ్యాంకింగ్ ద్వారా ఎలాంటి సేవలు పొందవచ్చు: 
1. ఖాతాలోని బ్యాలెన్స్ వివరాలు 
2. గతంలో చేసిన మూడు లావాదావీల వివరాలు 
3. చెక్ బుక్ 
 4. చెక్ పేమెంట్ నిలిపివేతకు ఆదేశం జారీచేసే అవకాశంవుంది 
 5. ఫిక్స్‌డ్ డిపాజిట్ వివరాలు 
6. విద్యుత్, మొబైల్ ఫోన్, బేసిక్ ఫోన్ బిల్లుల చెల్లింపులు
 తదితర సేవలను వినియోగించుకోవచ్చు


బ్యాంకు మిత్ర ఎవరు? ప్రధానమంత్రి జన్ ధన్ యోజనకు ఎలా సాయం చేస్తారు?


byaanku mitra evaru? pradhaanamantri jan dhan

ప్రధాని నరేంద్రమోడీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జన్ ధన్ యోజన పథకం విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు 'బ్యాంకు మిత్ర' పనిచేస్తున్నారు. బ్యాంకు సేవలు లేని గ్రామాల్లో బ్యాంకుల గురించి ప్రజలకు తెలియజేసే ఏజెంటే 'బ్యాంకు మిత్ర'. బ్యాంకులు, ఏటీఎమ్‌లు లేని ప్రాంతాల్లో వీరి చేస్తున్న కృషి అభినందనీయం. జన్ ధన్ యోజన పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలను చేర్చించడంలో వీరి కృషి అమోఘం. బ్యాంకుల్లో ఖాతాలు తెరిచేందుకు గాను ప్రజల వద్ద నుంచి డాక్యుమెంట్స్ తీసుకుని వాటిని సరైనవిగా ధృవీకరించుకుని బ్యాంకుల్లో ఇస్తుంటారు. బ్యాంకుల్లో అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలో, అప్లికేషన్స్ ఎలా నింపాలో కస్టమర్లకు తెలియపరుస్తుంటారు. ప్రజలకు బ్యాంకు ఖాతాల్లో నగదు ఏవిధంగా డిపాజిట్ చేయాలి, ఏవిధంగా నగదు విత్ డ్రా తీసుకోవాలి లాంటి విషయాలు చెప్తుంటారు. వీటితో పాటు భారత్‌లో బ్యాంకింగ్ అనుభవం లేనటువంటి ప్రజలకు, బ్యాంకులకు మధ్య అనుసంధాన కర్తగా ఈ బ్యాంక్ మిత్ర పనిచేస్తుంటారు. బ్యాంకుకు సంబంధించిన విషయాలు, నియమాలు ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్తుంటారు. 'బ్యాంకు మిత్ర' గా ఎవరు కాగలరు? బ్యాంకు లావాదేవీల గురించి తెలిసిన వారిని బ్యాంకు మిత్రగా తీసుకుంటారు. సాధారణంగా పదవీ విరమణ పొందిన ఉద్యోగులు, టీచర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, మాజీ సైనిక ఉద్యోగులు, చిన్న మొత్తాల పొదుపు సంస్ధలకు చెందిన ఉద్యోగులు బ్యాంకు మిత్రగా ఉండేందుకు అర్హులు. ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పథకం గురించి: భారతదేశంలోని పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు బ్యాంకింగ్ రంగం సేవలు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రధాని నరేంద్రమోడీ "ప్రధానమంత్రి జన్ ధన్ యోజన" (పీఎంజేడీవై) పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా బ్యాంకు ఖాతా తెరవడం వల్ల రుణాలు, కాల పరిమితి డిపాజిట్ల వంటి సౌకర్యాలు పొందవచ్చు. ఈ పథకం ద్వారా కనీస మొత్తం డిపాజిట్ చేయనవసరం లేకుండానే ఖాతాలను తెరవచ్చు. ఖాతా తెరిచిన ఆరు నెలల పాటు సక్రమంగా నడిపితే బ్యాంకు ఒక వెయ్యి రూపాయల పరిమితితో ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం కల్పించడం తోపాటు రుణ పరిమితిని రూ. 5వేల వరకు పెంచుతారు. ఖాతాను తెరిచిన 42 రోజుల నుంచి లక్ష రూపా యల బీమా సౌకర్యం కల్పించనున్నారు. బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్ అనుసంధానం చేస్తారు. తద్వారా లబ్ధిదారులకు వంటగ్యాస్, వృద్ధాప్య పింఛన్, మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ, ఇతర సంక్షేమ పథకాల ప్రయోజనాలు నేరుగా బ్యాంకు ఖాతాలో జమ అవుతాయి.

Followers