ఎట్టకేలకు 'బాహుబలి' ట్రైలర్ విడుదలైంది. హిందీలో కరణజోహార్ సోమవారం
సాయంత్రం విడుదల చేశారు. తెలుగులో ఉదయమే అన్ని థియేటర్లలో ట్రైలర్స్
వెళ్ళాయి. కాగా, విలేకరులకు ప్రత్యేకంగా ప్రసాద్మల్టీప్లెక్స్లో
సోమవారంనాడు 4గంటలకు ట్రైలర్ చూపించారు.
హాలీవుడ్ సినిమాను చూసిన రేంజ్లో ఆ ట్రైలర్ వుంది. డాల్బీ సౌండ్లో
ఎఫెక్ట్గా అనిపించిన ఆ ట్రైలర్లో.. బాహుబలి పాత్రధారి ప్రభాస్ను ఓ
సన్నివేశంలో కొండిపాంతంవారు చూసి గౌరవంగా నమస్కారం చేస్తుంటారు.. వీరంతా
నాకెందుకు నమస్కారంపెడుతున్నారు.. అసలు నేనెవర్ని' అంటూ ప్రశ్నిస్తాడు.
అమరేంద్రబాహుబలి వంశీయుడువు అంటూ వాయిస్ ఓవర్ వినిపిస్తుంది. ఇది ఓ
రాజవంశానికి చెందిన చరిత్రగా చెప్పేశాడు. అప్పటి కాలంనాటి రాజవంశీయులు
బానిన వ్యవస్థలు వంటి నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుందని తెలిసింది.
తన వంశాన్ని నమ్ముకున్న ప్రజలకు బాహుబలి ఏంచేశాడనేది మొదటిపార్ట్గా
కన్పిస్తుంది. కాగా, ఈచిత్రం జులై 12న విడదులచేయడానికి యుద్ధ ప్రాతిపదికన
సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.