మార్చి 12, 1993న 13 వరుస పేలుళ్లు సంభవించాయి.
* తొలి బాంబు మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో బొంబాయి స్టాక్ ఎక్సే్చంజ్
భవంతి బేస్ మెంటులో పేలింది. ఆపై 3:40 వరకూ వివిధ ప్రాంతాల్లో పేలుళ్లు
జరిగాయి.
* మాహింలోని మత్స్యకారుల కాలనీ, ప్లాజా సినిమాస్, జవేరీ బజార్, కఠా
బజార్, హోటల్ సీ రాక్, హోటల్ జుహూ సెంటార్, ఎయిర్ ఇండియా బిల్డింగ్,
సహారా ఎయిర్ పోర్టు, వర్లి, పాస్ పోర్టు ఆఫీస్ ప్రాంతాల్లో బాంబులు
పేలాయి.
* వీటిల్లో ఎక్కువ బాంబులు స్కూటర్లలో పెట్టారు. హోటళ్లలో పేలిన బాం బులను
బ్రీఫ్ కేసుల్లో ఉంచారు.
* ఈ పేలుళ్లలో 250 మందికి పైగా మరణించగా, 700 మంది గాయ పడ్డారు. వీరిలో
వందల మంది వివిధ అవయవాలను కోల్పోయారు.
* ఈ పేలుళ్ల వెనుక పాకిస్థాన్ ఐఎస్ఐ హస్తముందని, అండర్ వరల్డ డాన్
దావూద్ ఇబ్రహీం సూచనల మేరకు ఆయన సహచరులు టైగర్ మెమన్, ఆయూబ్ మెమన్,
యాకూబ్ మెమన్లు ప్రణాళికలు రూపొందించారని విచారణ సంఘాలు గుర్తించాయి.
* స్మగ్లర్లు హాజీ అహ్మద్, హాజీ ఉమర్, తౌఫిక్ జలివాలా, అస్లామ్ం భట్టి,
దూవోద్ జాట్ లు ఆర్థిక సహాయం అందించారు.
* గ్రౌండ్ లెవల్లో పేలుళ్లకు సహకరించి
వారంతా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నవారే.
* బాబ్రీ మసీదు కూల్చివేతకు ప్రతీకారంగా ఈ పేలుళ్లు జరిగాయన్న ఆరో పణలు
ఉన్నాయి.
* పేలుళ్లు జరిపేందుకు నియమించుకున్న వారికి పాకిస్థాన్, దుబాయ్లలో
శిక్షణ ఇచ్చారు. వీరికి బాంబులను ఎలా పేల్చాలో నేర్పారు. పేలుడు పదార్థాలను
పాకిస్థాన్ సమకూర్చింది.
* పేలుళ్లను ముందుగా పసిగట్టడంలో నిఘా విభాగం, కోస్ట గార్డ విఫల మైందని
సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.
* ఇదే కేసులో అక్రమంగా ఆయుధాలను కలిగివున్నాడని, సాక్ష్యాలను నాశ నం
చేసేందుకు ప్రయత్నించాడని బాలీవుడ్ నటుడు సంజయ్దత్పై వచ్చిన అభి యోగాలు
నిజమేనని కోర్టు తేల్చి శిక్ష విధించింది. అయితే, బాంబులు పేల్చాలన్న
ప్లాన్ వెనుక ఆయన ప్రమేయం లేదని తేలింది.
* పేలుళ్ల సమయంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శరద్ పవార్ ఉన్నారు.
* మొత్తం 100 మందిని ఈ కేసులో నిందితులుగా తేల్చారు.
* కేసులో ప్రధాన నిందితులు దావూద్ ఇబ్రహీం, టైగర్ మెమన్, ఆయూబ్
మెమన్లు ఇప్పటికీ తప్పించుకు తిరుగుతున్నారు.
* ఈ పేలుళ్లు ముంబై అండర్ వరల్డలో చీలికలు తెచ్చింది.
* అప్పటివరకూ దావూద్ అనుచరులుగా ఉన్న చోటా షకీల్, సాధూ షెట్టి వంటి వారు
దావూద్ను వీడి బయటకు వచ్చారు.
తెలంగాణలో కొత్తగా గ్రూప్-3 పోస్టులు
రాష్ర్ట ప్రభుత్వం ఆమోదం తెలిపిన 15,222 ఉద్యోగుల భర్తీకి చురుగ్గా
సన్నాహాలు జరుగుతున్నాయి. టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేసే పోస్టుల విభజన,
విధివిధానాలతో కూడిన ఉత్తర్వులు జారీ అయ్యాయి. గ్రూప్-1 కేటగిరీలో
డిప్యూటీ కలెక్టర్ నుంచి ఎంపీడీవో వరకు 20 రకాల పోస్టులను భర్తీ చేస్తారు.
గ్రూప్-1కు 1000 మార్కులతో మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్నారు. మెయిన్స్
లో కొత్తగా పేపర్ -6ని ప్రవేశపెడుతున్నారు. ఇందులో తెలంగాణ ఉద్యమం,
రాష్ట్ర ఏర్పాటు సిలబస్ ఉంటుందని టీఎస్పీఎస్సీ ప్రకటించింది. గ్రూప్-2 లో
మున్సిపల్ కమిషనర్, డిప్యూటీ తహశీల్దార్ సహా 12 రకాల పోస్టులుంటాయని
పేర్కొంది. ఈ పరీక్షను 675 మార్కులకు నిర్వహిస్తుంది. మరో 17 రకాల
పోస్టులతో గ్రూప్-3 ని కొత్తగా ఏర్పాటు చేసింది.
Subscribe to:
Comments (Atom)