ఏ పోస్టుకు ఏం చదవాలి?


ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వివిధ కేటగిరీ పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల చేసి పరీక్షలు నిర్వహిస్తుంటుంది.కానీ, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పాటించే విధంగా ఎపిపియస్‌సికి క్యాలండర్ విధానం లేకపోవడంతో నోటిఫికేషన్లు ఎప్పుడెప్పుడు వస్తాయన్నది ఖచ్చితంగా చెప్పలేం. అయితే త్వరలోనే ఎపిపియస్‌సి నుంచి పలు పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల అయ్యే అవకాశం ఉంది. వాటిలో కొన్ని ముఖ్యమైన పోస్టులు, వాటి అర్హతలు, పరీక్షా విధానం ఎలా ఉంటుందో పరిశీలిద్దాం. గ్రూప్-2 ఎపిపియస్‌సి నిర్వహించే రిక్రూట్‌మెంట్లలో అన్నింటి కన్నా ఎక్కువగా అభ్యర్థులు పోటీపడేది గ్రూప్-2 పోస్టులే. ఇందులో రెండురకాల కేటగిరీ పోస్టులు ఉంటాయి. అవి 1. ఎగ్జిక్యూటివ్ పోస్టులు, 2. నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఎగ్జిక్యూటివ్ పోస్టుల్లో డిప్యూటీ తహసిల్దార్, అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్సెస్ ఆఫీసర్, సబ్ రిజిస్ట్రార్ వంటి పోస్టులు ఉంటే నాన్ ఎగ్జిక్యూటివ్ కేటగిరీలో సీనియర్ అకౌంటెంట్, జూనియర్ అకౌంటెంట్, జూనియర్ అసిస్టెంట్ వంటి పోస్టులు ఉంటాయి. వీటిలో ఎగ్జిక్యూటివ్ పోస్టులకు , నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఇప్పటి వరకు మూడు పేపర్లతో ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష నిర్వహించి ఆపై ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఇంటర్వ్యూ కూడా నిర్వహించేవారు. నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులకు కేవలం రాతపరీక్ష ఆధారంగా నియామకాలు జరిపేవారు. అయితే ఎపిపియస్‌సి సంస్కరణల్లో భాగంగా ఎగ్జిక్యూటివ్ పోస్టులను గ్రూప్-1లో కలిపి గ్రూప్-1బి గా పేర్కొని ఇక నుండి వాటికి కూడా గ్రూప్-1లో మెయిన్స్ పరీక్షలు రాయాలని నిర్ణయించారు. అయితే అభ్యర్థుల కోరిక మేరకు రాబోయే నోటిఫికేషన్‌కు మాత్రమే పాత పద్ధతిలో ఆబ్జెక్టివ్ పరీక్ష నిర్వహిస్తారు.ఇంటర్వ్యూ ఉండదు.ఆ తర్వాత రిక్రూట్‌మెంట్లకు ఎగ్జిక్యూటివ్ పోస్టులకు గ్రూప్-1 మాదిరిగా ప్రిలిమ్స్ మెయిన్స్, ఇంటర్వ్యూ మూడు దశల ఎంపిక విధానం ఉంటుంది. నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులకు కేవలం ఆబ్జెక్టివ్ విధానంలో రాతపరీక్ష ఉంటుంది.అర్హతలు : ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ పొంది ఉండాలి. కొన్ని పోస్టులకు కామర్స్, ఎకనామిక్స్, మేథమెటిక్స్, లా సబ్జెక్టుల్లో డిగ్రీ, కంప్యూటర్స్‌లో సర్టిఫికెట్ కోర్సు చేసి ఉండాలి. ఎంపిక విధానం : ఎంపిక రాతపరీక్ష ఆధారంగా జరుగుతుంది. మొత్తం 3 పేపర్లు - ఆబ్జెక్టివ్ విధానం 1. జనరల్ స్టడీస్ - 150 మార్కులు 2. ఆంధ్రప్రదేశ్ సామాజిక, చరిత్ర, రాజ్యాంగ అవలోకనం - 150 మార్కులు 3. భారత ఆర్థికవ్యవస్థ, ఆంధ్రప్రదేశ్ ఆర్థికవ్యవస్థ - 150 మార్కులు మొత్తం - 450 మార్కులు జూనియర్ లెక్చరర్లు ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఇంటర్ విద్యార్థులకు పాఠాలు బోధించే జూనియర్ లెక్చరర్ పోస్టులు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన అభ్యర్థులకు మంచి అవకాశం. అర్హతలు : సంబంధిత సబ్జెక్టులో కనీసం 50శాతం మార్కులతో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ పాసై ఉండాలి. ఎంపిక విధానం : ఎంపిక విధానం రాతపరీక్ష ఆధారంగా జరుగుతుంది. రాతపరీక్షలో 2 పేపర్లు ఉంటాయి. మొదటి దశ - రాతపరీక్ష - ఆబ్జెక్టివ్ విధానం. మొత్తం 2 పేపర్లు. 1. జనరల్‌స్టడీస్ - 150 మార్కులు 2. సంబంధిత సబ్జెక్టు - 300 మార్కులు మొత్తం - 450 మార్కులు. రెండవదశ ఇంటర్వ్యూ - 50 మార్కులు. డిగ్రీ కాలేజీ లెక్చరర్లు డిగ్రీ కాలేజీలో వివిధ సబ్జెక్టులకు సంబంధించిన లెక్చరర్ పోస్టులు. అర్హతలు : సంబంధిత సబ్జెక్టులో 55 శాతం మార్కులతో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ పాసై ఉండాలి. ఇంకా నెట్ లేదా స్లెట్ పరీక్ష పాసై ఉండాలి. పి.హెచ్.డి పాసైన అభ్యర్థులకు నెట్/ స్లెట్ అర్హత నుంచి మినహాయింపు ఇస్తారు. ఎంపిక విధానం : ఎంపిక విధానం 2దశల్లో ఉంటుంది. -మొదటిదశ రాతపరీక్ష - ఆబ్జెక్టివ్ విధానం -మొదటి పేపర్ - జనరల్‌స్టడీస్ - 150 మార్కులు -ండవ పేపర్ - సంబంధిత సబ్జెక్టు - 300 మార్కులు -మొత్తం - 450 మార్కులు -ండవదశ - ఇంటర్వ్యూ - 50 మార్కులు గ్రూప్-4 పోస్టులు గ్రూప్-4 కింద వివిధ డిపార్ట్‌మెంట్లలో జూనియర్ అసి స్టెంట్ పోస్టులు, మరికొన్ని డిపార్ట్‌మెంట్లలో సూపర్‌వైజర్ వంటి అదే కేటగిరికి చెందిన పోస్టులు భర్తీ చేస్తారు. అర్హతలు : జూనియర్ అసిస్టెంట్లకు ఇంటర్, సూపర్‌వైజర్లకు ,ఎస్‌ఎస్.సి, లేదా తత్సమాన అర్హత. ఎంపిక విధానం : ఎంపిక విధానం రాత పరీక్ష ద్వారా జరుగుతుంది. - రెండు పేపర్లు - ఆబ్జెక్టివ్ విధానం - పేపర్-1 జనరల్ స్టడీస్ - 150 మార్కులు - పేపర్-2 సెక్రటేరియల్ ఎబిలిటీస్ - 150 మార్కులు - మొత్తం - 300 మార్కులు విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ (వి.ఆర్.ఓ) గ్రామాలలో ప్రభుత్వ అధికారిగా శాంతిభద్రతల నుంచి అభివృద్థి పథకాల అమలు వరకు కీలక బాధ్యతలు నిర్వహించే విలేజ్‌రెవెన్యూ ఆఫీసర్ తహసిల్దార్ పర్యవేక్షణలో పనిచేస్తారు. విద్యార్హత : ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత ఎంపిక విధానం : ఎంపిక విధానం రాతపరీక్ష ద్వారా జరుగుతుంది. - రాత పరీక్షలో 100 మార్కులకు జనరల్‌స్టడీస్ పేపర్ ఉంటుంది. పంచాయతీ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మొదటిసారిగా పంచాయతీ సెక్రటరీ పోస్టుల భర్తీని చేపడుతోంది. గ్రామీణా భివృద్ధిలో కీలక పాత్ర పోషించే గ్రామపంచాయితీకి సెక్రటరీగా ముఖ్యమైన విధులు, బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది. రాష్ర్టంలో 21,809 గ్రామాలు ఉన్నాయి. వీటికి పంచాయతీ సెక్రటరీని నియమించాల్సి ఉండగా కొన్ని చోట్ల కాంట్రాక్టు పద్ధతిలో పంచాయతి సెక్రటరీలను నియమించగా మరికొన్నిచోట్ల డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా వీరిని నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పోస్టులకు సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్ వెలువడగా ఆన్‌లైన్ - దరఖాస్తుల పక్రియ ప్రారంభం కావాల్సిన దశలో వాయిదా పడింది. త్వరలో సెక్రటరీ పోస్టుల దరఖాస్తుల పక్రియ ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. విద్యార్హత : ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ పాసై ఉండాలి. ఎంపిక విధానం : ఎంపిక విధానం రాతపరీక్ష ద్వారా ఉంటుంది. రాత పరీక్షలో 2 పేపర్లు ఉంటాయి. 1. జనరల్‌స్టడీస్ - 150 మార్కులు 2. గ్రామీణాభివృద్ధికి సంబంధించిన పేపర్ - 150 మార్కులు మొత్తం - 300 మార్కులు.


ఎంబిఎలో రిటైల్ మేనేజ్‌మెంట్ చేస్తే కెరీర్ ఎలా ఉంటుంది?


ఎంబిఎలో రిటైల్ మేనేజ్‌మెంట్ చేస్తే కెరీర్ ఎలా ఉంటుంది. ఈ కోర్సును ఏ ఇనిస్టిట్యూట్‌లు అందిస్తున్నాయి? -ఎస్.సాయిప్రమోద్, మిర్యాలగూడ. జ ః రిటైల్ మార్కెట్ మనదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతోంది. షాపర్స్ స్టాప్, వెస్ట్‌సైడ్, పాంటలూన్స్, లైఫ్‌స్టైల్, ఆర్.పి.జి. రిటైల్, క్రాస్‌వర్డ్, గ్లోబస్, రిలయన్స్ మోర్, బిగ్‌బజార్, హెరిటేజ్‌లాంటి మాల్స్ చిన్న చిన్న పట్టణాలలో కూడా వెలుస్తున్నాయి. ఈ సంస్థలలో సేల్స్, లాజిస్టిక్స్, మార్కెటింగ్, ప్రొక్యూర్‌మెంట్, హెచ్.ఆర్. కస్టమర్ కేర్ లాంటి రంగాలలో నిపుణుల నియామకం జరుగుతుంది. ఇందులో రిటైల్ మేనేజిమెంట్ స్పెషలైజేషన్‌లో ఎం.బి.ఎ పూర్తి చేసిన వారికి మంచి అవకాశాలు ఉంటాయి. వాల్‌మార్ట్‌లాంటి రిటైల్ దిగ్గజాల ప్రవేశంతో అవకాశాలు మరింత పెరుగుతాయి. ఎం.బి.ఎ.లో రిటైల్ మేనేజ్‌మెంట్ కోర్సును చాలా విద్యాలయాలు ఆఫర్ చేస్తున్నాయి. మన రాష్ట్రంలోని ఎం.బి.ఎ కళాశాలలు కూడా ఆఫర్ చేస్తున్నాయి. Pune నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్‌లో ఏయే కోర్సులు అందుబాటులో ఉంటాయి? ఈ సంస్థ బ్రాంచ్ హైదరాబాద్‌లో ఉందా? ఈ కోర్సులు చేయాలంటే ఎప్పుడు నోటిఫికేషన్ వెలువడుతుంది? - ఆర్
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ . అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన విద్యాసంస్థ. ఈ సంస్థ 50 దేశాలలోని విద్యా సంస్థలలో ఎక్స్‌చేంజ్ కార్యక్ర మాలను ఏర్పర్చుకుంది. ప్రస్తుతం ఈ సంస్థకు అహ్మాదాబాద్, గాంధీ నగర్, బెంగళూర్‌లలో క్యాంపస్‌లు న్నాయి. ఆంధ్రప్రదేశ్, అసోం, హర్యానా, మధ్యప్రదేశ్‌లలో క్యాంపస్‌లు ఏర్పాడు చేయాలని నిర్ణయించింది. హైదరాబాదులో క్యాంపస్ నిర్మాణానికి మే 25వ తేదీన శంఖుస్థాపన చేశారు. 2015-16 సంవత్సరానికి హైదరాబాద్ క్యాంపస్‌లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ సంస్థ నాలుగు సంవత్సరాల గ్రాడ్యుయేట్ డిప్లొమా ప్రొగ్రామ్ ఇన్ డిజైన్ (జి.డి.పి.డి) రెండున్నర సంవత్సరాల పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ప్రొగ్రామ్ ఇన్ డిజైన్ (పి.జి.డి.పి.డి) కోర్సులను ఆఫర్ చేస్తోంది. జిడిపిడి కోర్సును అహ్మదాబాద్ ఆఫర్ చేస్తోంది. పి.జి. కోర్సులు అన్ని క్యాంపస్‌లలో ఆఫర్ చేస్తోంది. డిగ్రీలలో 100 సీట్లు, పి.జిలో 245 సీట్లుంటాయి. ఈ క్రింది డిజైన్ కోర్సులను ఆఫర్ చేస్తోంది. ప్రోడక్ట్ డిజైన్, ట్రాన్స్‌పొర్టేషన్ అండ్ ఆటోమోబైల్ డిజైన్, ఫర్నిచర్ అండ్ ఇంటీరీయర్ డిజైన్, గేమ్ డిజైన్, అప్పరల్ డిజైన్ అండ్ మర్చండైజింగ్, లైఫ్‌స్టైల్ అక్సెసరీ డిజైన్, గ్రాఫిక్ డిజైన్, యానిమేషన్ ఫిల్మ్‌డిజైన్, ఫిల్మ్ అండ్ వీడియో కమ్యూనికేషన్, న్యూ మీడియా డిజైన్, సాఫ్ట్‌వేర్ అండ్ యూజర్ ఇంటర్‌ఫేస్ డిజైన్, ఇన్‌ఫర్మేషన్ అండ్ డిజిటల్ డిజైన్, ఇన్‌ఫర్మేషన్ అండ్ ఇంటర్ ఫేస్ డిజైన్, డిజైన్ ఫర్ డిజిటల్ ఎక్సిపీరియన్స్, స్ట్రాటజీ డిజైన్ మేనేజ్‌మెంట్, డిజైన్ ఫర్ రిటైల్ ఎక్సిపీరియన్స్. ఈ కోర్సుల్లో ఎంపిక, సంస్థ నిర్వహించే డిజైన్ డిప్టిట్యూడ్ టెస్ట్ (డిఎటి)లో వచ్చిన మార్కుల ఆధారంగా ఉంటుంది. ప్రతి ఏటా నోటిఫికేషన్ సెప్టెంబర్/ అక్టోబర్ నెలల్లో వెలువడుతుంది. జనవరిలో డి.ఎటి పరీక్ష దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన నగరాలలో జరుగుతుంది. 2014-15 సంవత్సరానికి నోటిఫికేషన్ వెలువడింది. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ నవంబర్ 2న ముగిసింది.దరఖాస్తు చేసుకున్న వారికి పరీక్ష 2014 జనవరి 12న జరుగుతుంది. మీరు వచ్చే సంవత్సరానికి ఇప్పటి నుండి ప్రిపేర్ కావాలి. దీనికి గత సంవత్సర ప్రశ్నపత్రాలు పరిశీలించండి. పూర్తి వివరాలకు సంస్థ వెబ్‌సైట్ www. nid.edu చూడగలరు. ప: ఆర్మీలోకి ప్రవేశించాలంటే ఎప్పటి నుంచి ప్లానింగ్ చేసుకోవాలి? 10 వరతగతి తర్వాత ? లేక ఇంటర్ తర్వాతా? దీనికి కావాల్సిన ప్రత్యేక అర్హతలు ఏవైనా ఉన్నాయా? వివరంగా తెలపండి.? -కె. సుధాకర్, నిజామాబాద్. జ ః ఆర్మీలోకి ప్రవేశించాలంటే రెండు దశలుగా ఆఫీసర్‌గా మరియు సైనికు డిగా (సోల్జర్) చేరవచ్చు. ఇంటర్మీడి యట్ అర్హతతో యు.పి.ఎస్.సి నిర్వహించే నేషనల్ డిఫెన్స్ ఎకాడమీ (ఎన్.డి.ఎ) పరీక్ష ద్వారా ఆఫీసర్‌గా చేరవచ్చు లేదా డిగ్రీ అర్హతతో కంబైండ్ డిఫెన్స్ సర్వీసెస్ (సిడిఎస్) పరీక్ష రాసి ఆఫీసర్‌గా నేరుగా ఆర్మీలో చేరవచ్చు. పదవతరగతి అర్హతతో సైనికుడిగా చేరవచ్చు. ఇంటర్మీడి యట్ అర్హతతో సోల్జర్ టెక్నికల్, సోల్జర్ క్లర్క్, సోల్జర్ నర్సింగ్, సోల్జర్ ట్రేక్స్‌మెన్‌గా చేరవచ్చు. అభ్యర్థులను శారీరక దారుఢ్య పరీక్షలు, మెడికల్ టెస్టులు, రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. అభ్యర్థులు కనీస ఎత్తు 165 సెంటిమీటర్లు ఉండాలి. బరువు 50 కేజీలు తగ్గకుండా ఉండాలి. ప్రతియేటా రిక్రూట్‌మెంట్ ర్యాలీలు నిర్వహించి వివిధ రకాల సైనిక ఉద్యోగాలకు ఎంపిక చేయటం జరుగుతుంది. ప్రణాళిక బద్ధంగా ప్రిపేర్ అయితే ఎంపిక కావడం సుసాధ్యమే

Followers