అశ్లీల వెబ్‌సైట్లను నిరోధించలేం


నిస్సహాయత వ్యక్తం చేసిన సుప్రీం న్యూఢిల్లీ : భారత్‌లో అశ్లీల వెబ్‌సైట్లను నిరోధించేందుకు తాత్కాలిక ఆదేశాలు జారీ చేయాలన్న విజ్ఞప్తిని సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. ఒక వ్యక్తి తన గదిలో కూర్చుని అశ్లీల చిత్రాలు చూడాలనుకునే ఆయన వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన ప్రాధమిక హక్కును ఎవరూ నిలువరించలేరని నిస్సహాయత వ్యక్తంచేసింది. ''అటువంటి తాత్కాలిక ఆదేశాలను ఈ కోర్టు జారీ చేయలేదు. ఎందుకంటే ఎవరో ఒకరు కోర్టుకు వచ్చి మైనారిటీ తీరిన వ్యక్తిని నేను, నా గదిలో కూర్చుని నేను చూస్తుంటే మీరెలా నన్ను నిలువరించగలుగుతారు. ఇది రాజ్యాంగంలోని 21వ అధికరణను ఉల్లంఘించడమే అవుతుందని ప్రశ్నించవచ్చని'' ప్రధాన న్యాయమూర్తి హెచ్‌.ఎల్‌.దత్తు మౌఖికంగా తెలిపారు. న్యాయవాది కమలేష్‌ వాష్వాని వేసిన పిటిషన్‌పై విచారించిన ప్రధాన న్యాయమూర్తి పై విధంగా పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ఇంకా స్పందించడం లేదని అందువల్ల కోర్టు కల్పించుకుని తగు చర్యలు తీసుకోవాలని కోరారు. మరిన్ని సంబందిత వార్తలు


127,42,39,769.. ఇది ప్రస్తుత భారత జనాభా


ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకొని నేషనల్‌ పాపులేషన్‌ స్టెబిలైజేషన్‌ ఫండ్‌(ఎన్‌పీఎస్‌ఎఫ్‌) భారత జనాభా నివేదికను విడుదల చేసింది. ఎన్‌పీఎస్‌ఎఫ్‌ నివేదిక ప్రకారం జులై 11 సాయంత్రం 5 గంటలకు భారత జనాభా 127,42,39,769కు చేరింది. ఇది ప్రపంచ జనాభాలో 17.25 శాతం.* ఏడాదికి 1.6శాతం చొప్పున మనదేశంలో జనాభా పెరుగుతోంది.* ఈ పెరుగుదల ఇలాగే కొనసాగితే 2050 నాటికి భారత్‌ జనాభా 163కోట్లను దాటి అత్యధిక జనాభాతో ప్రపంచంలోనే మొదటిస్థానంలో నిలవనుంది.* ప్రస్తుతం చైనా 137 కోట్లకుపైగా జనాభాతో మొదటిస్థానంలో ఉంది.* 2011 జనాభా లెక్కల ప్రకారం భారత జనాభా 121కోట్లు. అమెరికా, ఇండోనేషియా, బ్రెజిల్‌, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, జపాన్‌లాంటి దేశాల జనాభా అంతా కలిపితే భారత జనాభాకు సరిసమానం

Followers