తెలంగాణ – ఆంధ్రకు తేడా అదే



ss
తెలంగాణకు ఆంధ్రకు తేడా ఏంటి ? తెలంగాణలో ప్రజలు ఎలా వ్యవహరిస్తారు ? తమ ఇంటికి వచ్చిన వ్యక్తిని .. తమ ఊరికి వచ్చిన వ్యక్తిని ఎలా ఆదరిస్తారు ? అన్నది సాక్షాత్తు ఆంద్రాకు చెందిన ప్రముఖ సినీ రచయిత, ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో స్పష్టంగా తేల్చిచెప్పాడు. ఆయన తన సునిశిత పరిశీలన తెలంగాణ గొప్పదనాన్ని చాటి చెప్పారు.
“తెలంగాణలో ఎక్కడికి వెళ్లినా .. ఏ ఇంటికి వెళ్లినా బాబు ఛాయ తాగుతావా ? అన్నం తింటావా ? అని అడుగుతారు. ఎదుటి వ్యక్తి సోషల్ స్టేటస్ గురించి .. అతను ఎంత సంపాదిస్తాడు ? అతడు ఎవరు ? అన్నది పట్టించుకోరు. ఇది నాకు ఎంతో బాగా నచ్చుతుంది. అదే ఆంధ్రాలో ఎక్కడికి వెళ్లినా ముందు నువ్వు ఏం చేస్తావు బాబు ? మీ నాన్నగారు ఏం చేస్తారు ? అంటూ సోషల్ స్టేటస్ కనుక్కుంటారు. దాన్ని బట్టే మర్యాద ఇస్తారు” అని విజయేంద్రప్రసాద్ స్పష్టం చేశారు.
ఆంధ్రలో మనుషుల మధ్య సంబంధాలు ఆర్థిక సంబంధాలుగానే ఉంటాయి. మనిషి ఆర్థిక స్థితిని బట్టి అతనికి గౌరవం ఉంటుంది. కానీ తెలంగాణలో డబ్బుకు ప్రాధాన్యం చాలా తక్కువ. మానవత్వానికి ఎక్కువ విలువ ఇస్తారు. ఎదుటి వ్యక్తి ఇబ్బందుల్లో ఉంటే వీలయినంతవరకు అతనిని ఆదుకోవడానికి ప్రయత్నిస్తారు.

రిశికేశ్వరి చనిపోలేదు మనమే చంపేసాం


రిశికేశ్వరి చనిపోలేదు మనమే చంపేసాం
అయ్యా నన్ను లైంగికంగా వేదిస్తుండు అని ప్రిన్సిపాల్ కు
మోర పెట్టుకుంటే , నువ్వే వాడిని కదిలిస్తున్నావ్ అని
తిరిగిబెదిరించి పంపించిన ఆచార్యులును ఏమనాలి.
అర్ధనగ్నంగా నడిపించిన ఆ వ్యక్తులను ఏమనాలి ?ఆ వీడియో
తీసిన వాడిని ఏమనాలి ?ప్రేమించకపోతే ఆ వీడియో ని యు ట్యూబ్ లో పెడతాను అన్నా వాడిని ఏమనాలి .?
తన బవిష్యత్తు పాడుచేయవద్దు అని కాళ్ళ వెల్ల పడ్డ
కనికరించని వార్డెన్ ,ప్రిన్సిపాల్ ,ఇంకో ఉన్మాది తదితరులను
వీళ్ళందరిని ఏమి చెయ్యాలి (వాస్తవం :మా కులపోడుకదా వాడిమీద
action తీసుకొను).
అగ్రకుల అహంకారంతో చదువుకోడానికి వచ్చిన ఒక అమ్మాయిని అర్ధ్గనగ్నంగా నడిపించిన కమ్మటి రాక్షసులను ఏమనాలి ,దాన్ని
వీడియో తీసి అందరకి షేర్ చేసిన కుల పిశాచాలను ఏమిచెయ్యాలి .?
రిశికేశ్వరి చనిపోయి ఇన్నిరొజులైనా కనీసం ఒక్కడి మీదకూడా పోలీసు
కేసు పెట్టలేదు ఒక్క fir file అవ్వలేదు ,కనీసం ఆడపిల్ల చావుని
అర్ధం చేసుకొనే మీడియా కూడా సపోర్ట్ చెయ్యట్లేదు
.ఎందుకంటే నేరం చేసింది మనకులంవాడు కాబట్టి . ఇప్పుడు యునివర్సిటీ కాంపస్ లో 15 రోజులు ఆకస్మిక సెలవులు
,బలవంతంగా ఖాలీ చేయిస్తున్న హాస్టళ్ళు ,రిశికేశ్వరి ని సపోర్ట్
చేస్తున్నవారిపై విరుగుతున్న లాటీలు , కాంపస్ లో పోలీసుల
,పారామిలటరీ బలగాల మోహరింపు ,విద్యార్ధి సంఘాలకు కులపు
సంఘాలని పేరు పెట్టి నిషేధాజ్ఞలు, ఉద్యమాన్ని నీరుగార్చడానికి
రాష్ట్ర మంత్రే స్వయంగా వచ్చాడు . ఒక విద్యార్ధి ఆత్మహత్య చేసుకొని చనిపోతే
న్యాయంచేయ్యకపోగా న్యాయం చెయ్యమని అడిగేవారిని
పోలీసులతో బెదురింపులు.ఇదేమి రాజ్యం ?
కులపు ఉన్మాదంతో పెట్రెగిపోయిన వారికి ఒక ప్రశ్న ,రేపు మీ అక్కో
,మీ చేల్లో,మీ కూతురో ఇలాంటి మా కులమే కదా అని వోదిలేసేవారా ?
డైరెక్టుగా రాష్ట్ర ముక్యమంత్రే కేసుని పక్కద్రోవ పట్టిస్తుంటే ఇంకా రిశికేశ్వరికి న్యాయం ఎలా జరుగుతుంది .అందుకే
అంటున్న రిశికేశ్వరి చనిపోలేదు మనమే చంపేసాం అని .దయచేసి ఈ
విషయన్ని రాజకీయకోణం లో కాకుండా ఒక మనిషిగా ఆలోచించాలి అని నా
మనవి.

by:
తెజావతు రవి తెలంగాణా



Followers