Showing posts with label History. Show all posts
Showing posts with label History. Show all posts

మహమద్ కులీకుతుబ్ షా - విశ్వ నగరంగా భాగ్యనగరం



మహమద్ కులీకుతుబ్ షా




  • క్రీ.శ 1580 లో గోల్కోండ సింహాసనాన్ని మహమద్ కులీకుతుబ్ షా అధిష్టించాడు.
  • క్రీ.శ 1591 లో హైదరాబాద్ నగరం ( భాగ్యనగరం ) నిర్మించాడు.
  • హైదరాబాద్ నగరవాస్తుశిల్పి- మీర్ మెమిన్ అస్త్రాబాది.
  • మహమద్ కులీకుతుబ్ షా తన ప్రేయసి భాగమతికి హైదర్ మహల్ అనే బిరుదును ప్రధానం చేసాడు.
  • మహమద్ కులీకుతుబ్ షా గోప్ప విద్వాంసుడు, కవి, ఇతను కలం పేరు- మానీలు.
  • మహమద్ కులీకుతుబ్ షా కాలాన్ని గోల్కోండ చరిత్రలో స్వర్ణయుగంగా భావిస్తారు.
  • గోల్కోండ కోటకు మగ్మద్ నగరు అని పేరు పేట్టాడు
  • మహమద్ కులీకుతుబ్ షా నిర్మించిన కట్టడాలు: చార్మినార్, మూసీనదికి ఆనకట్ట, చార్ కమాన్, దారుల్ షిఫా, దాదుమహల్, జామా మసీదు
  • 1593-94 హైదరాబాద్ ప్లేగు వ్యాధిని నిర్మూలించిన సందర్భంగా చార్మినార్ ను నిర్మించాడు
తెలంగణ రాజధాని నగరం హైదరాబాద్. దీనిని భాగ్యనగరం అని కూడా పిలుస్తారు. క్రీస్తుశకం 1591లో మహ్మద్‌కులీకుతుబ్ షా దీనిని నిర్మించాడు. కుతుబ్ షాహీ వంశంలో ఆయన అయిదో రాజు. ఈ నగరానికి 400ఏళ్ల చరిత్ర ఉంది. నగర చరిత్రకు చార్మినార్, గొల్కొండ కట్టడాలు మకుటాయమానం. ప్రత్యేక రాజ్యంగా అనేక ఏళ్లు వర్థిల్లిన హైదరాబాద్ ఎట్టకేలకు 1948 సైనిక చర్య తర్వాత భారత్‌లో అంతర్భాగమైంది. హైదరాబాద్-సికింద్రాబాద్ జంటనగరాలుగా ప్రసిద్ధికెక్కాయి. ప్రస్తుతం నగరం గ్రేటర్ హైదరాబాద్‌గా విస్తరిస్తోంది. పారిశ్రామికంగా, వాణిజ్యపరంగా, సాంకేతికంగా శరవేగంగా అభివృద్ధి సాధిస్తోంది. ముఖ్యంగా ఐటీ హబ్‌గా వర్థిల్లుతోంది.
   

చర్వితచరణమైనా చరిత్ర అది ఎప్పటికీ శ్రవణానందకరమే. వేల గొంతులతో వీనులవిందుచేసిన రాగాల దర్బారు కూడా ఒకనాటికి వానకారు కోయిలలా మూగబోవచ్చు. కాని బూజుపట్టిన మూగ దర్బారులోనే రాలి పడిన మువ్వ ఒకటి నాటి ఘనమైన జ్ఞాపకాలను ఏర్చికూర్చి పాటలా వినిపిస్తుంటుంది. ఆ పాట వేల రాగాలకు స్వాగతగీతం పాడుతుంది. నేటి తరాన్ని వెన్నంటి ప్రొత్సహిస్తుంది. ఇలాంటి ఘనచరిత గురుతులున్న భాగ్యనగరం నేడు సైబర్ సొబగులతో, డిజిటల్ మోతలతో ఆధునికతతో అలరారుతున్నంత మాత్రాన 'గతం గతః' అనుకుంటే పొరపాటే. మధురస్మృతులు ఒడిన దాచుకుని వడివడిగా పరుగెత్తిన మూసీ నేడు మురికినీటితో మూగబోయింది. అయినా మనసుండాలేకాని ఆ తీరంలో సాగిన నాగరికత జాడలు... ఎందరో నవాబుల, షరాబుల ప్రణయగాధలు... ఇంకెందరో గరీబుల గాయాల గుండెచప్పుళ్లు... మనకిప్పటికీ వినిపిస్తునే ఉంటాయి. 'కారే రాజులు రాజ్యముల్ గల్గవే, వారేరి సిరి మూటగట్టుకుని పోవంజాలిరే...' అంటారు పోతనామాత్యులు. అలా రాజ్యాలు, రాజులు పోయినా ఈ సుందరనగరపు సుమధుర కథనాలు మాత్రం మనను విడిచిపోలేదు. మతంకన్నా మమతలు మిన్నని మనసుపడి ఓ నేలమగువలను మనువాడిన నవాబులు ఆనాడే అందరూ ఒక్కటేనని నిరూపించారు. ఆ ప్రేమకథలకు గురుతుగా ఈ భాగ్యనగరాన్ని బహుమతిగా మిగిల్చారు. నగరానికే ఓ అందమైన నగగా చార్‌మినార్‌ను నిలబెట్టారు. ముంగిళ్లలో ముత్యాలు రాశులుగా పోసి అమ్మిన ఈ నగరంలో నేడు 'మంచినీరు' కూడా వెలకట్టే విలువైన వస్తువుగా పరిణమించింది. అణువణువు 'ప్రియం'గా మురుతున్నా, ఎందరికో ప్రియమైన ప్రదేశంగానే మారుతోంది. ఎందరో చరిత్రపురుషులు అడుగుజాడల్లో ఈ నగరం తరించిపోయింది. ఈ మట్టివాసనలో ఆనాటి చరిత్ర జ్ఞాపకాలెన్నో పరిమళిస్తాయి. ప్రపంచాన్నే అబ్బురపరిచే విభిన్న సంస్కృతుల సమ్మిశ్రమమం ఒకవైపు, పడుగుపేకల్లా అల్లుకుపోయిన భిన్న సంస్కృతులు మరోవైపు ఈ భాగ్యనగరపు ఉనికికి నిరంతరం నీరాజనాలై వెలుగుతున్నాయి.
కుతుబ్‌షాహీల చరిత్ర
బహమనీ సుల్తానులలో రెండోవాడైన మహమ్మద్ షా (1358-75) గోల్కొండ దుర్గాన్ని ఆక్రమించగలిగాడు. క్రమ క్రమంగా బహమనీ సామ్రాజ్యం తెలంగాణా ప్రాంతాలకేకాక, కోస్తాఆంధ్ర ప్రాంతాలకు కూడా విస్తరించింది. ఆ సామ్రాజ్యాన్ని 1482 నుంచి 1518 వరకు పరిపాలించిన మహమూద్ షా బహమనీ 1496లో ''కులీకుతుబ్-ఉల్-ముల్క్'' అనే అనుచరుని తెలంగాణా ప్రాంతానికి గవర్నర్‌గా నియమించాడు. కులీకుతుబ్ గోల్కొండను కేంద్రంగా చేసుకొని తన ఆదీనంలో ఉన్న ప్రాంతాలను పరిపాలించాడు. మహమూద్ షా బహమనీ మరణానంతరం బహమనీ సామ్రాజ్యం బలహీనపడి నామమాత్రమైంది. ఇదే అదనుగా తీసుకొని అహమ్మద్‌నగర్, బీరార్, బీదర్, బీజపూర్ రాష్ట్రాల పాలకులు స్వతంత్రులయ్యారు. ఈ తరుణంలోనే కులీకుతుబ్ 1518లో స్వతంత్ర ప్రతిపత్తిని సాధించి గోల్కొండ సామ్రాజ్యానికి మూలపురుషుడయ్యాడు.
హుస్సేన్‌సాగర్ నిర్మించిన ఇబ్రహీం
ఇబ్రహీం గొప్ప నిర్మాత. ఆయన హుస్సేన్ సాగర్‌ను నిర్మింపజేసి ఆ ప్రాంత ప్రజలకు మంచి నీటి సౌకర్యం కల్పించాడు. మూసీ నదిలో కలిసే మూడు చిన్న చిన్న ఏరులకు 2500 అడుగుల పొడుగు కల అడ్డకట్ట (టాంక్‌బండ్) వేయించడంతో ఈ సరస్సు ఏర్పడింది. దీనికి ఆ రోజులలోనే రెండున్నర లక్షల రూపాయల ఖర్చు చేశారు. ఇది పట్టణ ప్రజలకు మంచి నీరు అందివ్వడమే కాక ఇక్కడి వాతావరణాన్నే చల్లబరచింది. నేటి ప్రమాణాలతో పోల్చి చూస్తే దీనిని గొప్ప ఇంజనీరింగ్ ఘనకార్యంగానే భావించాలి. దీని పేరు దాని నిర్మాత అయిన ఇబ్రహీం పేర ఇబ్రహీంసాగర్‌గానే కుతుబ్‌షాహీ రికార్డుల్లో నమోదు అయింది. కాని దాని నిర్మాణానికి రూపకల్పన చేసి దానిని అమలుపర్చడంలో ప్రముఖపాత్ర వహించిన హుస్సేన్‌షా వలి పేరుమీదగానే ప్రజలు దీనిని హుస్సేన్‌సాగర్ అని పిలిచేవారు.
భాగ్యనగర నిర్మాత కులీకుతుబ్‌షా
హైదరాబాద్ నగర నిర్మాణం మహమ్మద్ కులీకుతుబ్ చేపట్టిన కార్యాలన్నిటిలోకి అత్యంత చిరస్మరణీయమైనది తన తండ్రి రూపొందించిన పథకం ప్రకారం మూసీకి దక్షిణదిశగా ఈ నగరాన్ని నిర్మించడం. దీనికాయన 1591లో పునాది వేశాడు. హిందూ, ముస్లిం పంచాంగాలను అనుసరించి దీనికి ముహుర్తం పెట్టించాడని ప్రతీతి. చంద్రుడు సింహరాశిలోను, బృహస్పతి తన స్వస్థానంలో ఉన్న శుభ ముహూర్తంలో ఈ నగర శంకుస్థాపన జరిగింది. దీనికి ఇరాన్‌లోని సుప్రసిద్ధ నగరమైన 'ఇస్ఫహాన్' రూపకల్పనననుసరించి 'అలీం' అనే వాస్తుశిల్పి రూపకల్పన చేశాడని చరిత్రకారుల అభిప్రాయం. అందువల్లనే ఈ నగర నిర్మాణంలో సముచిత పాత్ర వహించిన మహమ్మద్ కులీకుతుబ్ షా ప్రధానమంత్రి మీర్ మొమిన్ ఈ నగరాన్ని 'నూతన ఇస్ఫహాన్'గావర్ణించాడు.
   

నిజాంల పాలన
ఆనాటి మొగల్ చక్రవర్తులు గోల్కొండ, బీజపూర్, తమిళనాడు, గుల్బర్గా, బీదర్, బీరార్ ప్రాంతాలను ఒక సుభాగా ఏకం చేసి దాని పరిపాలనకు ఒక సుభాదారుడిని నియమించేవారు. ఈ దక్కన్ సుభాదార్ ఔరంగాబాద్‌ను కేంద్రంగా చేసుకొని ఈ ప్రాంతాలను పరిపాలించేవాడు. 1713లో ఆనాటి మొగల్ చక్రవర్తి ఫరూక్ సియార్ మీర్ కమ్రుద్దీన్ చింక్ లిచ్‌ఖాన్ అనే సర్దార్‌ను దక్కన్ సుబేదారుగా నియమించారు. రెండు సంవత్సరాల తర్వాత ఆయన స్థానంలో సయ్యద్ హుస్సేన్ ఆలీఖాన్‌ను ఆ పదవిలో నియమించారు. మీర్ కమ్రుద్దీన్ కేంద్రమంత్రులలో ఒకడిగా నియమితుడయ్యాడు. 1720లో సయ్యద్ సోదరుల తిరుగుబాటును అణచివేయడంలో ఆనాటి మొగల్ చక్రవర్తి అయిన మహమ్మద్ షా (1719-1748)కు సాయపడి ఆయన నుంచి 'నిజాం-ఉల్-ముల్క్' అనే బిరుదు పొందారు.
   

కాని ఆయన దృష్టి దక్కన్‌పైనే ఉండేది. 1920లో దక్కన్ సుబేదార్‌గా నియమితుడయ్యాడు. కాని అప్పటికే ఆ పదవిలో ఉన్న ముబారిజోఖాన్ సుబేదారీ పదవిని వదులుకోడానికి ఇష్టపడలేదు. దీంతో వీరిరువురి మధ్య 1724లో అక్టోబరు 11వ తేదీన షక్కర్‌గెడ్డ యుద్ధం జరిగింది. ఇందులో జయించిన నిజామ్ -ఉల్-ముల్క్ దక్కన్ సుబేదారుగా స్థిరపడ్డాడు. హైదరాబాద్ రాజ్యస్థాపన ఈ తేదీ నుండే ప్రారంభమైందని చెప్పవచ్చు. మహమ్మద్ ఆయనకు 'అసఫ్‌జా' అనే బిరుదు కూడా ఇచ్చాడు. నిజామ్-ఉల్-ముల్క్ వారసులు ఆ బిరుదునే తమ వంశ నామంగా ఉపయోగించారు. ఒకపక్క దక్కన్ సుబేదారుగా వ్యవహరిస్తూనే అసఫ్‌జా మొగల్ సామ్రాజ్య ప్రధాన మంత్రులలో ఒకడిగా కూడా వ్యవహరించేవాడు. 1739లో నాదిర్షా దండయాత్ర జరిగిన తర్వాత ఆయన ఢిల్లీని సందర్శించనేలేదు. ఢిల్లీ చక్రవర్తులు కూడా నామావశిష్టులైపోవడంతో నిజాం స్వతంత్రుడయ్యాడు. అలా దక్కన్ సుబేదారు ఆచరణలో స్వతంత్ర ప్రతిపత్తిని సాధించింది.
చార్మినార్‌లోని 'చార్'ల అద్భుతం
నాలుగువందల సంవత్సరాల చరిత్ర కలిగిన చార్మినార్‌కు 'చార్'తో విడదీయరాని సంబంధం ఉంది. నాలుగు మీనార్‌లతో నిర్మితమై ఉంది. కనుక దీనికి చార్మినార్ అని పేరు వచ్చిందనేది అందరికీ తెలిసిందే. కానీ చార్మినార్ నిర్మాణంలో అడుగడునా 'నాలుగు' దాగి ఉందనేది అందరకీ తెలియని అద్భుతం. ప్రపంచంలోనే అద్భుత కట్టడంగా ఖ్యాతి గాంచిన చార్మినార్‌లోని చార్‌కు చాలా ప్రత్యేకత ఉంది. ప్రతి కోణంలోను 'నాలుగు' ప్రతిబింబించేలా నిర్మించిన చార్మినార్ అప్పటి నిర్మాణ చాతుర్యానికి, కళా నైపుణ్యానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది. కేవలం నాలుగు మినార్‌ల కారణంగానే చార్మినార్‌కు ఆ పేరు స్థిరపడలేదు.
   



ఆర్కియాలజీ అండ్ మ్యూజియం శాఖ పరిశోధనలలో ఈ కట్టడానికి ఆ పేరు పెట్టటానికి దారి తీసిన అనేక కారణాలు వెలుగు చూశాయి. చార్మినార్‌కి ఆ పేరుపెట్టడానికి మరో 20 రకాల కారణాలున్నాయంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. చార్మినార్ కు నలువైపులా ఉన్న 40 ముఖాల కొలతలు నాలుగుతో భాగించే విధంగా నిర్మించారు. ఇది అద్భుతమైన నిర్మాణ శైలికి దర్పణంగా నిలుస్తుంది. అలాగే నాలుగు మినార్‌ల ఎత్తు కూడా 60 గజాలు. వీటిని కూడా నాలుగుతో భాగించవచ్చు. ఈ చారిత్రాత్మక కట్టడం నాలుగు రోడ్ల కూడలిలో గస్తీ తిరిగే సైనికునిలా ఉంటుంది. భారతదేశంలో అతి తక్కువ స్థలంలో నిర్మించిన చారిత్రక కట్టడాలలో చార్మినార్ ఒకటి. చార్మినార్ నిర్మాణం చేపట్టిన మొత్తం స్థలం విస్తీర్ణం 840 చదరపు గజాలు.
హైదరాబాద్ పేరు వెనుక చరిత్ర
అఫ్ఘాన్ ప్రాంతం నుంచి వలస వచ్చి మొగలుల ద్వారా దక్కన్ ప్రాంతానికి రాజైన సుల్తాన్‌కులీ పరిపాలన సజావుగానే సాగినప్పటికీ ఆయన ఏడుగురు కొడుకుల మధ్య సయోధ్య లేని కారణంగా కుటుంబ కలహాలు తీవ్రస్థాయిలో ఉండేవి. రాజ్య కాంక్ష, కక్షలు తీవ్రరూపం దాల్చటంతో కులీ కుమారుడు ఇబ్రహీం పొరుగు రాజ్యమైన విజయనగరంలో దాదాపు ఏడు సంవత్సరాల పాటు తలదాచుకున్నాడు. ఈ సమయంలోనే అతను విజయనగర యువరాణిలలో ఒకరైన భాగీరథిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. ఇబ్రహీం, భాగీరథి దంపతులకు పుట్టిన మహ్మద్ కులీ కుతుబ్‌షా కలల సాకారంగా రూపొందిందే హైదరాబాద్ నగరం. మహ్మద్ కులీ ప్రేమ చిహ్నంగా హైదరాబాద్ నగరాన్ని పేర్కొనవచ్చు. షాజహాన్ ప్రేమ తాజ్‌మహల్ రూపంలో ప్రపంచం అంతా పాకింది. కులీ తన భార్య భాగమతికి ఒక నగరాన్నే అంకితం ఇచ్చాడు. అయితే పేరు వివాదాస్పదం కావటం, దానిని మార్చటానికి కులీ అంగీకరించటంతో చరిత్రలో షాజహాన్ అంతటి గొప్ప ప్రేమికుడిగాప్రత్యేక ముద్ర సంపాదించుకోలేకపోయాడు. సంప్రదాయాలను ఎదిరించి కులీ భాగమతిని వివాహం చేసుకుని కోటకు తీసుకువచ్చాడు. భాగమతి ప్రతి కదలికా అప్పట్లో సంచలనం కలిగించేదట. స్వతహాగా మంచి కవి, కళాభిరుచి ఉన్న వ్యక్తి అయిన మహ్మద్ కులీ ఆమె అందాన్ని వర్ణిస్తూ కవితలు కురిపించేవాడు. ఒక రోజు తాను కొత్తగా నిర్మిస్తున్న ప్రాంతానికి భాగమతిని తీసుకువెళ్లిన కులీ 'దీన్ని నీకు అంకితం ఇస్తున్నా' అని చెప్పాడట. నగర నిర్మాణం పూర్తయిన తర్వాత భాగమతి పేరు మీద నగరాన్ని భాగ్యనగరంగా పిలిచాడు మహ్మద్‌కులీ. అయితే ముస్లిం ప్రపంచానికి ప్రతినిధులుగా ఉండాల్సిన ప్రభువులు తమ రాజధానిని హిందూ ఛాయలు ఉన్న పేరుతో వ్యవహరించటం రాచకుటుంబంలో అనేక మందికి నచ్చలేదు. తరువాత భాగమతి తన మనుగడకే ప్రమాదం వచ్చే సూచనలు ఉండటంతో నిరాశకులోనైంది. పరిస్థితుల ప్రభావానికి తలవంచిన మహ్మద్‌కులీ మరో మార్గంలేక ప్రవక్త అల్లుడైన హైదర్అలీ పేరు మీద భాగ్యనగరాన్ని హైదరాబాద్‌గా మార్చటానికి అంగీకరించాడని చరిత్రకారుల నమ్మకం. అయితే కులీ మాత్రం హైదరాబాద్‌ని భాగ్యనగరంగానే వ్యవహరించేవాడని తెలుస్తోంది.




ఎవరీ బాహుబలి ? బాహుబలుడు రాజ్యం చేసింది తెలంగాణలోనే?...


జైన విష్ణు పురాణాల ప్రకారం ఇక్ష్వాకు వంశానికి చెందిన రిషభదేవుడు లేదా వృషభనాథుడు, సునందల కుమారుడు బాహుబలి, ప్రస్తుత తెలంగాణరాష్ట్రంలోని బోధన్ (పోదనపురం) రాజధానిగా బాహుబలి రాజ్యపాలన చేశాడని కొన్ని సారస్వత ఆధారాలు చెబుతున్నాయి. ఆయన కాలంలో జైనమతం ఇప్పటి రూపాన్ని సంతరించుకోలేదు. నిజానికి అప్పట్లో జైన మతం అనే పేరే లేదు. మొదట్లో అంటే సింధునాగరికతా కాలం వరకు బాహుబలి జీవిత కాలంలో ఆయన తండ్రి స్థాపించిన మతాన్ని రిషభధర్మం అని వ్యవహరించారు. వేదకాలంలో వ్రత్యధర్మం అన్నారు. ఉపనిషత్తుల కాలం వచ్చే నాటికి అర్హంత్‌ ధర్మం అనీ, మౌర్యుల కాలంనాటికి నిగ్రంథి అనీ, ఆ తరువాత కాలంలో జైనం అని పిలిచారని అనేక సారస్వత ఆధారాల వల్ల తెలుస్తోంది. బాహుబలి ఒక చారిత్రక పురుషుడని కానీ, లేక పౌరాణిక పురుషుడని కానీ ఇదమిత్థంగా చెప్పటం సాధ్యం కాదు
బాహుబలి పుట్టుక:
 విష్ణుపురాణం, జైన గ్రంథాలు, ప్రచారంలో ఉన్న కొన్ని కథలను బట్టి బాహుబలి చరిత్రను తెలుసుకోవచ్చు. జైనమతానికి సంబంధించిన మొదటి తీర్థంకరుడుగా పేరుగడించిన రిషభదేవుడు అయోధ్య రాజధానిగా రాజ్యపాలన చేశాడు. ఆయనే ఇక్ష్వాకు వంశాన్ని ప్రారంభించాడని జైన మతస్తులు విశ్వసిస్తున్నారు. సునందాదేవి, యశస్వతీ దేవి (సుమంగళీదేవి అని కొందరు ఉదహరిస్తున్నారు) అనే ఇద్దరు రాకుమార్తెలను రిషభదేవుడు వివాహమాడాడు. సుమంగళకు 99 మంది కుమారులు, బ్రహ్మి అనే కుమార్తె జన్మించారు. కుమారుల్లో పెద్దవాడి పేరు భరతుడు. సునందకు బాహుబలి అనే కుమారుడు, సుందరి అనే కుమార్తె జన్మించారు. (విష్ణుపురాణం భరతుడు, బాహుబలి ఇద్దరే రిషభదేవుని కుమారులని చెబుతోంది). భరతుడు గొప్ప వీరునిగాను, రాజనీతి కోవిదుడుగానూ తయారయ్యాడు. బాహుబలి చాలా పొడగరి. మంచి దేహదారుఢ్యంతో అత్యంత బలశాలిగా తయారయ్యాడు. అతడి భుజబలం అమోఘమయింది. బ్రహ్మి సాహిత్యంలో ప్రావీణ్యం సంపాదించింది. ఆమె పేరు మీదే అప్పట్లో 'బ్రాహ్మీ' లిపిని రిషభదేవుడు కనిపెట్టాడంటారు. అశోకుని కాలంలో దొరికిన తొలి శాసనాలు అత్యధికం బ్రాహ్మి లిపిలోనే ఉండటం ఈ సందర్భంగా గమనార్హం. సుందరి గణితంలో దిట్టయింది. వృషభదేవుడు చాలా కాలం రాజ్యపాలన చేశాడు.ఒకరోజు రాజనర్తకి అయిన 'నీరాంజన' నిండుకొలువులో ప్రభువు సన్నిధిలో నాట్యం చేస్తూ హఠాత్తుగా కిందపడి మరణిస్తుంది. ఈ మృతితో 'జీవితం క్షణభంగురం' అని అర్థమైన ఋషభనాథుడు విరక్తుడవుతాడు. తన రాజ్యంలోని అయోధ్యకు భరతుడిని పట్టాభిషిక్తుణ్ణి చేసి, పోదనపురానికి రాజుగా బాహుబలిని ప్రకటించి- తాను సర్వసంగపరిత్యాగిగా మారి జనారణ్యంలోకి వెళ్లిపోతాడు. తన రాజ్యాన్ని నూరుగురు కుమారులకు పంచిపెట్టాడు. తరువాత సన్యాస దీక్ష తీసుకుని వస్త్రభూషణాదులను త్యజించి అడవులకు వెళ్ళి తపస్సు ప్రారంభించాడు. అనేక ఏళ్ళ తపస్సు అనంతరం ఆయనకు జ్ఞానోదయం అయింది. దీన్నే 'జినత్వం' పొందడం అంటారు. తాను తెలుసుకున్న సత్యాలను దేశాటన చేస్తూ ప్రజలకు తెలియ చేశాడు రిషభుడు. ప్రజల్లో ఆయనకు మంచి ఆదరణ లభించింది. అనేకమంది రాజులు, వ్యాపారులు, సాధార ప్రజలు రిషభుని మతాన్ని స్వీకరించారు.

చక్రరత్న ఆయుధం

రిషభుడు లేదా రిషభదేవుడు అడవులకు వెళ్ళిన తరువాత అతని కుమారుడు భరతుడు ఓ గొప్ప సామ్రాజ్యాన్ని స్థాపించడం కోసం బలమైన సైన్యాన్ని నిర్మించడంతో పాటు కొత్త కొత్త ఆయుధాలను తయారుచెయ్యడం ప్రారంభించాడు. అతడి సైన్యం 'చక్రరత్న' అనే ఆయుధాన్ని తయారు చేసింది. దీన్ని భరతుడే ప్రయోగిస్తాడు. ఇది గురితప్పదు. అప్పటి ప్రపంచంలో భరతుని చేతుల్లో ఉన్న ఆయుధాలు మరెవరి దగ్గరాలేవు. అందుకే అతడు పాలిస్తున్న అయోధ్య చుట్టుపక్కల ఉన్న రాజ్యాలన్నీ లొంగిపోయాయి. చివరికి తన 98 మంది సోదరుల రాజ్యాలను కూడా ఆక్రమించుకున్నాడు. తమ్ముళ్ళందరూ తమ రాజ్య భాగాలను అన్నగారికి అప్పగించి తమ తండ్రి ఉంటున్న అడవులకు వెళ్ళి ఆయన శిష్యులుగా మారారు. ఇలా మహా సామ్రాజ్యం స్థాపించడం వల్లనే ఈ భరతుని పేరుమీదుగా భారతదేశానికి ఆ పేరు వచ్చింది అని జైనమతం ఆధారంగా చెపుతారు. శకుంతల,దుశ్యంతుల కుమారుడైన భరతుని పేరుమీదుగా ఈ పేరు రాలేదన్నది ఈ వాదనలోని ముఖ్యాంశం అయితే భరతుని జైత్ర యాత్రను అడ్డుకుంటూ ముందుకు వచ్చిన వీరుడు మాత్రం బాహుబలి

భరతుడు, బాహుబలి ల యుద్ధం


భరతుడు బాహుబలి ఇద్దరూ బలశాలురే, ఇద్దరి బలగాలూ బలమైనవే కాబట్టి ఈ యుద్ధంలో ప్రాణ నష్టాన్ని నివారించేందుకు మంత్రులు ఒక ఒప్పందం చేసారు. యుద్ధరంగంలో పోరుకు సిద్ధమైన అన్నదమ్ముల దగ్గరకు వచ్చి తమ ఒక ప్రతిపాదన వారి ముందు ఉంచారు. ఇరు సైన్యాలు తలపడితే అపార ప్రాణ నష్టం జరుగుతుందని కాబట్టి, సైన్యాలను యుద్ధంలో దించకుండా అన్నదమ్ములిద్దరే యుద్ధం చెయ్యాలని, ఆ యుద్ధంలో ఎవరు ఓడిపోతే వారి రాజ్యం గెలిచినవారికి ఇచ్చివెయ్యాలనేది మంత్రుల ప్రతిపాదన సారాంశం. ఈ ప్రతిపాదనకు ఇద్దరూ సమ్మతించారు. వీరిద్దరి మధ్య దృష్టి యుద్ధం, జలయుద్ధం, మల్ల యుద్ధం (ద్వంద్వ యుద్ధం) అనే మూడు రకాల యుద్ధాలు జరగాలని మంత్రులు నిర్ణయించారు. అయితే ఎవ్వరూ ఆయుధం ప్రయోగించరాదనే షరతు విధించారు. ఆయుధాలు లేకుండా పోరాడి విజయం సాధించిన సమరం మానవచరిత్రలో ఇదే మొదటిది. అందుకే దీన్ని 'నిశస్త్రీకరణ' అన్నాడు. దీన్నే ఈరోజుల్లో మనం 'నిరాయుధీకరణ'గా అంటున్నాం.
ముందుగా దృష్టి యుద్ధం ప్రారంభమయింది. ఈ యుద్ధ నియమం ప్రకారం ఒకరి కళ్ళలోకి ఒకరు తీక్షణంగా చూస్తూ ఉండాలి. కళ్ళార్పకూడదు. ఎవరు ముందు కళ్ళు ఆర్పుతారో వారు ఓడిపోయినట్లు లెక్క. బాహుబలి తన అన్న భరతుని కళ్ళలోకి తీక్షణంగా చూస్తున్నాడు. అతడిలో ఏవేవో ఆలోచనలు చెలరేగుతున్నాయి. చిన్నప్పటి నుంచి తాను చూస్తున్న ఈ కళ్ళలోకి క్రోధాగ్నుల్ని ఎలా విరజిమ్మడం... అనుకుంటూ ప్రసన్నవదనంతో అన్నగారి కళ్ళలోకి చూస్తున్నాడు బాహుబలి. భరతుని పరిస్థితీ అలాగే ఉంది. తమ్ముడి ముఖంలో కనిపిస్తున్న ప్రేమ మమకార వాత్సల్యాలకు తనలో ఉన్న కోపాన్ని మరిచిపోయి ప్రశాంత చిత్తుడై కళ్ళు మూసుకున్నాడు. అంతే భరతుడు దృష్టి యుద్ధంలో ఓడిపోయినట్లు మధ్యవర్తులు ప్రకటించారు. కళ్ళుమూసి తెరిచేలోపల ఓటమి పాలవ్వడంతో భరతుడు నివ్వెరపోయాడు. రెండవదైన జలయుద్ధం ప్రారంభమయింది. నదిలో దిగి ఒకరిపై ఒకరు నీటిని చిమ్ముకోవడం ఈ యుద్ధం ప్రత్యేకత. యుద్ధం ప్రారంభమైన కొంతసేపటికి భరతుడు అలిసిపోయాడు. ఈసారి కూడా అమేయ భుజబల సంపన్నుడైన బాహుబలినే విజయం వరించింది.
రెండు యుద్ధాల్లో ఓడిపోయిన భరతుడు మల్ల యుద్ధంలోనైనా గెలవాలని గట్టిగా నిశ్చయించుకున్నాడు. ఆ యుద్ధమూ ప్రారంభమయింది. ముందుగా భరతుడు బాహుబలునిపై పిడిగుద్దులు కురిపించాడు. రెండో గుద్దుకే బాహుబలి కిందపడిపోయాడు. తమ్ముడు కిందపడిపోవడంతో కంగారు పడ్డాడు భరతుడు. తమ్ముడు మరణిస్తున్నాడేమోనని బాధపడ్డాడు. ఇంతలో తెప్పరిల్లి పైకి లేచాడు బాహుబలి. ఇప్పుడు గుద్దే వంతు అతడిదే. అన్నను రెండు చేతుల్తో పైకి లేపి గిరగిరా తిప్పి జాగ్రత్తగా కిందకు దించాడు. గట్టిగా గుద్దటానికి చెయ్యి పైకి లేపాడు. ఈ దెబ్బతో భరతుడు చనిపోవడం ఖాయమని అక్కడ చేరిన వారందరూ హాహాకారాలు చేశారు. భరతుడు కూడా ప్రాణ భయంతో ఒణికిపోయాడు. ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో ఆయుధాన్ని వాడరాదనే నియమాన్ని పక్కనబెట్టి తన చక్రరత్న ఆయుధాన్ని ప్రయోగించడానికి ప్రయత్నించాడు. కానీ అది పనిచెయ్యలేదని జైన గ్రంథాలు చెబుతున్నాయి. నియమ విరుద్ధంగా ఆయుధాన్ని ప్రయోగించాడనే కోపంతో బాహుబలి అన్నను గుద్దటానికి పిడికిలి ఎత్తాడు. చెయ్యి ఎత్తిన వెంటనే అతడి మనసులో రకరకాల ఆలోచనలు చెలరేగాయి. నేనేం చేస్తున్నాను. నా తండ్రి తృణప్రాయంగా భావించి త్యజించిన రాజ్యాధికారం కోసమా తోబుట్టువును చంపబోతున్నాను...తుచ్ఛమైన ఈ రాజ్య భోగభాగ్యాలు వద్దు. తండ్రిగారు, తమ్ముళ్ళ లాగే నేనూ సన్యాసం స్వీకరించి శాశ్వితానందాన్ని విశ్వప్రేమను పొందుతాను... ఇలా సాగింది బాహుబలి ఆలోచన. అంతే తనను క్షమించమని అన్న భరతుని కోరాడు. తన రాజ్య భాగాన్ని కూడా అన్నగారికి ఇస్తున్నట్లు ప్రకటించాడు. అప్పటికప్పుడు సన్యాస దీక్ష తీసుకుంటున్నట్లు చెప్పి ఆభరణాలు, దుస్తులను తొలగించుకుని వెంట్రుకలను చేత్తో పీక్కున్నాడు. (జైన మతంలో దీక్ష తీసున్నవారు వెంట్రుకలను పీకడం ద్వారా తొలగించడం ఇప్పటికీ చూడవచ్చు). భరతుడు ఎంత వారిస్తున్నా వినకుండా బాహుబలి దీక్ష తీసుకున్నాడు.
తెలంగాణలో బాహుబలి

బాహుబలుడు రాజ్యం చేసింది  తెలంగాణలోనే. ప్రస్తుతం నిజామాబాద్‌ జిల్లాలో ఉన్న బోధన్‌ను పూర్వం పౌదన్యపురం అనీ, పోదన పురం అనీ పిలిచేవారు. ఇదే బాహుబలుని రాజధాని. ఈ విషయాన్ని చెప్పే కొన్ని ఆధారాలు అందుబాటులో ఉన్నాయి. పోదనపురం గురించి మహాభారతంలో కూడా ఉంది. అక్కడ జైన, బౌద్ధ, వైదిక మతాలు సమానంగా విలసిల్లాయి. అటువంటి పట్టణాన్ని బాహుబలుడు తన రాజధానిగా చేసుకున్నట్లు జైన గ్రంథాలు, విష్ణుపురాణం చెబుతున్నాయి. బోధన్‌లో అనేక జైన విగ్రహాలు, ఆలయాలు కనిపించడంతో బాహుబలుని రాజధానిగా నిజంగానే ఈ పట్టణం విలసిల్లిందేమో అని కొందరు చరిత్రకారులు అంటున్నారు.


ఓరుగల్లులోని పద్మాక్షి ఆలయ నిర్మాత ? పోటీ పరీక్షల ప్రత్యేకం



  పోటీ పరీక్షల ప్రత్యేకం
1. ఏ సంవత్సరంలో ఆంధ్ర జన సంఘం పేరు నిజాం రాజ్య ఆంధ్రజన సంఘంగా మార్చారు ?
- 1922
2.పాలేరు నుంచి పద్మశ్రీ వరకూ అన్న పేరుతో తన జీవిత చరిత్ర రాసుకున్నది ?
- బోయి భీమన్న
3. కుతుబ్‌షాహీల కాలంలో శిస్తు వసూలుకు ప్రమాణం ?
- సర్కార్లు (జిల్లాలు)
4. మహాతలవరి బిరుదుతో వ్యవహారం పొందిన ఇక్ష్వాక వంశ స్త్రీ ?
- శాంతిశ్రీ
5. ఏ రాజు 108 యుద్ధాలు చేసి పాపపరిహారంగా 108 శివాలయాలు నిర్మించాడు ?
- విజయాధిత్యుడు
6. రాష్ట్ర స్థాయిలో లోక్‌దళ్‌ పార్టీని ఏర్పాటు చేసిన వారు ?
- గౌతు లచ్చన్న
7.స్వారాజ్య సంపాదన కరపత్రం ఎవరిది ?
- లక్కరాజు బసవయ్య
8. కాకతీయుల కాలంలో నియోగులు అంటే ఎవరు ?
- గ్రామాధికారులు
9. పాశ్చాత్య యాత్రికులు దేన్ని రెండో ఈజిప్ట్‌గా కీర్తించారు ?
- గోల్కొండ
10. ఆంధ్రలో జైనపంచలోహ విగ్రహాలు లభించిన ప్రదేశం ?
- బాపట్ల
11. వజ్ర కరూర్‌ బంగారు గనులు ఏ జిల్లాలో ఉన్నాయి ?
- అనంతపురం
12.స్వాతంత్య్రం లేని జీవనం జీవచ్చవం లాంటిది అని చాటి చెప్పింది ?
- అనిబిసెంట్‌
13. విద్యానాధుడు ఎవరి ఆస్థానంలో ఉండేవాడు ?
- రెండో ప్రతాపరుద్రుని ఆస్థానంలో
14. సంస్కృతంలో నీతిసారం అనే గ్రంథం రచించింది ఎవరు ?
- రుద్రదేవుడు
15. హన్మకొండలో వేయి స్థంబాలగుడిని 1162లో నిర్మించింది ఎవరు ?
-కాకతీయ రుద్రదేవుడు
16. శ్రీనాథునికి కనకాభిషేకం చేసిన విజయనగర రాజు ఎవరు ?
- రెండో దేవరాయులు
17. తిరుమల వేంకటేశ్వరుని సన్నిధిలో పట్టాభిషేకం చేసుకొన్నది ?
- అచ్యుతరాయలు
18. తిలక్‌ స్వరాజ్యనిధికి తన నగలనిచ్చి, విదేశీ వస్త్రాలను త్యజించి, ఖద్దరు ధరించి జాతీయోద్యంలో పాల్గొన్న తొలి మహిళ ?
- మాగంటి అన్నపూర్ణమ్మ
19.రాష్ట్రంలో ప్రాచీన శివలింగం ఎక్కడ ఉంది ?
-గుడిమల్లం
20. నరపతుల కెల్ల ఘోర దానవుడు వీడు అని నిజాంపై అగ్ని ధార కురిపించింది ? -దాశరది
21. 1857 తిరుగుబాటులో కడపప్రాంతం నుంచి పాల్గొన్న నాయకుడు ?
- పీర్‌సాహెబ్‌
22. నిమ్నజాతుల చరిత్ర రాసింది ?
-జాలా రంగస్వామి
23. ముత్యాలశాఖ సభా భవనం ఎవరిది ?
-దేవరాయలు-2
24. ప్రతి సంవత్సరం భద్రాచలం రాముని కళ్యాణ మహోత్సవానికి కానుకలు (తలంబ్రాలు) పంపే సంప్రదాయాన్ని ఏ నిజాం ప్రవేశపెట్టాడు ?
-నసీరుద్దౌలా
25. పంచతంత్రం తెలుగులో రచించింది ?
-దూబగుంట నారాయణ
26. ఆంధ్రలో ఆంగ్లేయుల మొదటి స్థావరం ?
- మచిలీపట్నం
27.చందుర్తి యుద్ధం ఎప్పుడు జరిగింది ?
- 1758 డిసెంబర్‌ 7
28.ఆంధ్ర భాషా సంజీవని పత్రిక స్థాపకుడు ?
- కొక్కొండ వెంకటరత్నం పంతులు
29. దేశాభిమాన పత్రిక ఎక్కడి నుంచి వెలువడింది ?
- గుంటూరు
30. ఆంధ్ర కేసరి పత్రిక సంపాదకుడు ?
- చిలుకూరి వీరభద్రరావు
31.ఓరుగల్లులోని పద్మాక్షి ఆలయ నిర్మాత ?
- మొదటి ప్రోలరాజు
32. మారన మార్కండేయ పురాణం అంకితం పొందింది ఎవరు ?
- గోన గన్నారెడ్డి
33. భాస్కర రామాయణం రచయిత ?
- హుళక్కి భాస్కరుడు
34. కేశవ దేవాలయాన్ని నిర్మించింది ?
- గంగాధరుడు(ఓరుగల్లులో)
35. సిద్దేశ్వర నిర్మాత ?
- పోలరాజు-2(హన్మకొండ)
36. వృషాధి శతకం రచయిత ?
- పాల్కురికి సోమనాథుడు
37. కాకతీయ రాజ్య స్థాపనాచార్య బిరుదు పొందింది ?
- రేచర్ల ప్రాసాదాదిత్యుడు
38.అశితివరాల సింగమ అని ప్రసిద్ధి చెందినవారు ?
- రేచర్ల సింగమ నాయకుడు
39. పద్మనాయకుల మొదటి రాజధాని ?
- రాచకొండ (నల్గొండ)
40. ధర్మ ప్రతిష్టాగురు, చెంచుమలచూరకార అనే బిరుదులు పొందినవాడు ?
- ప్రోలయ వేమారెడ్డి
41.విజయనగర రాజులను ఓడించి నెల్లూరును స్వాధీనం చేసుకున్నది ఎవరు ?
- అనవేమారెడ్డి
42. పురుటి సుంకం విధించి ప్రజల చేతిలో హతమైంది ఎవరు ?
- రాచవేమారెడ్డి
43. శంభుదాసుడు ప్రబంధపరమేశ్వరుడు అనే బిరుదులున్న ఎర్రన ఎవరి ఆస్థానంలోని వాడు ?
-ప్రోలయ వేమారెడ్డి
44. మధురను ఎవరి కాలంలో జయించారు ?
- బుక్కరాయలు
45. మొదటిసారిగా విజయనగర, బహ్మనీ రాజ్యాల మధ్య విభేదాలు ఎవరి కాలంలో ప్రారంభమయ్యాయి ?
- మొదటి బుక్కరాయలు
46. కన్యాశుల్కం స్థానంలో కాన్యదానాన్ని (వరకట్నం) ప్రోత్సహించిన రాజు ?
- రెండో దేవరాయలు
47. శ్రీభండారు అంటే ?
- కోశాధికారి
48. ఏకశిలారథం సప్తస్వరాల మండపాలున్న ఆలయం ?
- విఠలస్వామి ఆలయం
49.విజయనగరం వీధులలో బంగారం, రత్నాలు రాశులుగా పోసి అమ్మేవారని చెప్పింది ఎవరు ?
- రజాక్‌
50. కళింగలో గణపతి రాజ్యస్థాపకుడు ?
- కపిలేశ్వర గణపతి
51.గీత రత్నావళి వాద్య రత్నావళి సృత్త రత్నావళి గ్రంథాల రచయిత ఎవరు ?
- జాయవసేనాని
52. ఫటోదృతి అనే బిరుదున్న కాకతీయ రాజు ?
- రుద్రమదేవి
53. ప్రతాపరుద్రుడు నర్మదానదీ తీరంలో ఆత్మహత్య చేసుకున్నట్లు ఏ శాసనాల ద్వారా తెలుస్తుంది ?
- ముసునూరి ప్రోలయ నాయకుడు, అతడి తల్లి వేయించిన కలువచేరు శాసనాల వల్ల
54. ప్రసిద్ధి చెందిన పాకాల చెరువును ఏ కాకతీయ రాజు కాలంలో సేనాని జగదల ముమ్మిడి తవ్వించాడు ?
- మొదటి ప్రోలరాజు
55. కాకతీయుల కాలంలో భూములను కొలిచే సాధనాలు ?
- గడ, లేదా కోలతో కొలిచేవారు
56. మెదడును కప్పి ఉండే వెలుపలి, మధ్య పొరల మధ్య ఉండే ద్రవం ?
- మస్తిష్క మేరుద్రవం
57. మెదడును కప్పి ఉండే మధ్య పొర ?
-లౌతికళ
58. మెదడును కప్పి ఉండే లోపలి పొర
- మృద్వి
59. మెదడును కప్పి ఉంచే, ఎముకలతో ఏర్పడిన పెట్టి లాంటి నిర్మాణం ?
- కపాలం
60. మానవుడిలో వెన్నునాడుల జతల సంఖ్య ?
-31
61. మానవుడిలో కపాల నాడుల జతల సంఖ్య ?
- 12
62. వేరులో పెరిగే భాగం ?
-కొనకింది భాగం
63.మొక్కల్లో ఆక్సిజన్‌ తయరయ్యే స్థలం ?
-విభాజ్య కణాలు
64. మొక్కల్లో పెరుగుదల పదార్ధాలుంటాయని తొలిసారి ప్రతిపాదించిన వారు ఎవరు ?
- చార్లెస్‌ డార్విన్‌
65. పరిసరాల్లో కలిగే మార్పులకు ఒక జీవి అనుక్రియ చూపే లక్షణాన్ని ఏమంటారు ?
- క్షోభ్యత
66. అగ్రాధిక్యత అంటే?
- కొనమొగ్గ పార్శ్వపు మొగ్గలను అదుపు చేయడం
67. పొట్టి మొక్కలను పొడవుగా చేయడంలో సహాయపడే హార్మోన్‌ ?
- జిబ్బర్లిన్లు
68. కణ విభజనను ప్రేరేపించే హార్మోన్‌ ?
- సైటోకైనిన్లు
69. ఆకులు, ఫలాలు రాలడంతో ప్రభావం చూపే హార్మోన్‌ పేరు ?
- అబ్‌సిసిక్‌ ఆమ్లం
70. అనిషేక ఫలాలు అంటే ?
- విత్తనాల్లేని ఫలాలు


మానవ హక్కుల దివిటీ మాగ్నాకార్టా


maanava hakkula diviti maagnaakaarta

గోరంత దీపం కొండంత వెలుగు..ఇది అక్షర సత్యం. మానవ హక్కుల ఉద్యమాల చారిత్రక, మహోన్నత ప్రయాణానికి మార్గనిర్దేశన చేసిన స్వేచ్ఛాయుత సామాజిక నియమావళే మాగ్నాకార్టా. ఎనిమిది శతాబ్దాల క్రితం అప్పటి ఇంగ్లాండ్ రాజు జాన్ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటు ఫలితమే ఈ మహోత్కృష్ట నియమావళి. రాజైనా పేదైనా అందరూ చట్టం ముందు సమానమేనని నాటి ఇంగ్లాండ్ ప్రజానీకం నినదించింది. రాజరికం, నిరంకుశత్వం, అరాచక పాలనలపై తిరుగుబాటు చేసి అనంతర కాలంలో యావత్ ప్రపంచం మానవ హక్కులకు పట్టం కట్టడానికి దోహదం చేసింది. మానవ విలువలంటే ఏమిటో తెలియని..నిరంకుశ పాలనలో బతికేస్తూ రాజులకు సాగిలపడటమే దైనందిన జీవితంగా భావించిన రోజుల్లోనే భావి మానవ హక్కుల మహా ప్రయాణానికి ఈ నియమావళి నాందీ ప్రస్తావన చేసింది. ఆ తిరుగుబాటు మొదట్లో కొందరు వ్యక్తులు తమ హక్కుల కోసం చేసిన పోరాటమే అయినా అది అనంతర కాలంలో ఆధునిక ప్రజాస్వామ్య దేశాకు బలమైన విలువల పునాదిగా మారింది. కింగ్‌జాన్ సంతకం చేసిన మాగ్నాకార్టా ఎన్నో మార్పులకు, చేర్పులకు లోనైనా భారత్ సహా వందకు పైగా దేశాలకు విలువల కరపత్రమే అయింది. రెండు వందల కోట్ల మంది ప్రజల జీవితాలను, జీవనాన్నీ ప్రభావితం చేస్తూనే ఉంది. మానవ,ప్రజాస్వామ్య, వ్యక్తిగత స్వేచ్ఛా హక్కుల పరిరక్షణోద్యమాలకు అనునిత్యం వెలుగుదివ్వెగా భాసిల్లుతోంది. మానవ హక్కులను ఎప్పటికప్పుడు శక్తివంతంగా తీర్చిదిద్దడానికి, సరికొత్త విలువలతో ఉన్నత భావనలను పాదుగొల్పడానికి ఇది ఆధునిక సమాజంలోనూ ఎంతగానో దోహదం చేస్తోంది. స్వేచ్ఛాయుత జీవన హక్కులతో ముడివడి ఉన్న మానవీయ కోణాలను విస్తృతం చేస్తోంది. ఈ ఎనిమిది శతాబ్దాల కాలగతిలో ఎన్నో మార్పులు, ఎన్నో పరిణామాలు, ఎన్నో ఉత్కృష్ఠ ఘట్టాలు చోటుచేసుకున్నాయి. వీటిలో ప్రతీది కూడా మనిషి సాధించిన ఆలోచనాత్మక, విజ్ఞానదాయక పరిణతికి తోడ్పడింది. అందుకే..నిన్న మొన్న జరిగిన పరిణామాలనే మర్చిపోతున్న నేపథ్యంలో 1215 జూన్ 15నాటి మాగ్నాకార్టా ఇప్పటికీ నిరుపమానంగా, జాజ్వల్యంగా వెలుగుతోందంటే..ప్రజాస్వామ్యం, మానవ హక్కులు, వ్యక్తిగత స్వేచ్ఛను పరిరక్షించే దేశాలకు స్ఫూర్తిదాయక మార్గదర్శకమైందంటే..దీనికి ఉన్న ప్రాధాన్యత ఏమిటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వెలుగు చిన్నదే అయినా శూన్యాన్ని తరిమికొట్టడంలో అజే య శక్తే అవుతుంది. తిరుగులేని ఇంగ్లాండ్ రాజే చట్టానికి లోబడి వ్యవహరించే అనివార్య పరిస్థితిని ఈ చారిత్రక ఒప్పందం కల్పించింది. ఆ పరిణామంతో నియంతృత్వ, తిరుగులేని అధికారాలు క్రమంగా పలుచబడుతూ ప్రస్తుతం ప్రజలే ఎన్నుకునే ప్రజాస్వామ్య ప్రభుత్వాల ఆవిర్భావానికి దారితీసింది. ఈ ఎనిమిది శతాబ్దాల్లో మాగ్నాకార్టా ఉద్దేశిత సిద్ధాంతాలు, నియమాలూ కాలానుగుణంగా మార్పులు చెందుతూ, హద్దులనూ చెరిపేసుకుని విశ్వ జనీనమైన మానవ హక్కులకు ఊతాన్నిచ్చాయి. న్యాయ, స్వేచ్ఛ, ప్రజాస్వామ్య వ్యవస్థలు, రాజ్యాంగాలూ శక్తివంతం కావడానికి దోహదం చేశాయి. భారత రాజ్యాంగానికి, అందులోని అత్యంత వౌలికమైన ప్రాథమిక హక్కులు, వ్యక్తిగత స్వేచ్ఛ్భావనలకు మాగ్నాకార్టానే స్ఫూర్తిదాయకమని చెప్పడానికి సందేహించాల్సిన అవసరం లేదు. ఒక్క భారత దేశమే కాదు, ప్రపంచంలో అగ్రగామిగా ఉన్న అమెరికా రాజ్యాంగ రూపకల్పనలోనూ మాగ్నాకార్టా ముద్ర స్పష్టం. మానవ హక్కులు, పౌర హక్కులకు అగ్రరాజ్య రాజ్యాంగం తిరుగులేని పునాదులు వేయగలిగిందంటే..వీటి పరిరక్షణ విషయంలో రాజీలేకుండానే కొనసాగుతోందంటే అందుకు మాగ్నాకార్టా అందించిన స్ఫూర్తే నిదర్శనం. చట్ట పాలన ఎలా ఉండాలో చెప్పడమే కాకుండా, నియంతల అధికారాలకూ ఈ మహా నియమావళి కత్తెర వేసింది. నేడు మనం చెప్పుకుంటున్న మహిళా సమానత్వ హక్కులకూ ఎనిమిది శతాబ్దాల క్రితమే పునాది పడిందన్న నిజం ఈ మహోన్నత హక్కుల పత్రాన్ని విశే్లషిస్తే స్పష్టమవుతుంది. అన్ని విధాలుగా ఎంతో పరిణతి చెందిన ప్రజాస్వామ్య వాతావరణంలో జీవిస్తున్న మానవాళికి హక్కుల పరంగా, అధికారాల పరంగా ఇతరత్రా కూడా వారి స్వేచ్ఛాయుత జీవనానికి గండి కొట్టే అవాంఛనీయ పరిణామాలెన్నో చోటుచేసుకుంటున్నాయి. మహిళలు రక్షణ కోసం, విద్యార్థులు హక్కుల కోసం, కార్మికులు వేతనాల కోసం, నిరుద్యోగులు ఉపాధి కోసం చేస్తున్న చేస్తున్న ఆక్రందనలకు మూలం మాగ్నాకార్టానే. భారత రాజ్యాంగం, పౌర హక్కుల రూపకల్పనలో మాగ్నాకార్టా కనబరిచిన ప్రభావం తిరుగులేనిదే. దేశ ప్రజలకు ప్రాధమిక హక్కులను, స్వేచ్ఛనూ కల్పిస్తున్న రాజ్యాంగ 21వ అధికరణకు మాగ్నాకార్టానే మూలమని ఓ కేసు విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు స్పష్టం చేసిన విషయాన్ని ఈ నేపథ్యంలో ప్రస్తావించడం ఎంతైనా సముచితం. 'న్యాయపాలనలో జాప్యం జరుగకూడదు.ఎవరికీ అన్యాయం జరుగకూడదు.న్యాయం అమ్ముడు పోకూడదు'అన్న ఉదాత్త భావనలను నాడే ప్రోదిచేసుకున్న మాగ్నాకార్టా ప్రపంచ హక్కుల ఉద్యమాలన్నింటికీ దివిటీగానే పని చేసింది. ప్రజాస్వామ్య ప్రస్థానాలనూ, రాజ్యాంగాల ఆవిర్భావాన్ని, అత్యంత వౌలికమైన మానవీయ భావనలను బలంగా పాదుగొల్పే ప్రయత్నంలో మార్గదర్శనే కాదు, నిర్దేశనా చేసింది. ప్రజాస్వామ్య వ్యవస్థల్లో ప్రజల ప్రాథమిక హక్కులకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో, రాజ్యాంగ పరమైన, పాలనాపరమైన విధానాలను మానవీయ కోణంలో రూపొందించుకోవాల్సిన అవసరమూ అంతే ఉంటుంది. భారత దేశ చట్ట, న్యాయ పాలనకు సంబంధించి అనేక కోణాల్లో మాగ్నాకార్టా స్ఫూర్తిదాయకమే అయింది. మిగతా దేశాల మాట ఎలా ఉన్నా మాగ్నాకార్టా భారత స్వాతంత్య్రోద్యమానికి తిరుగులేని శక్తిని అందించింది. ఆంగ్ల పాలకులపై రాజకీయ స్వేచ్ఛ కోసం మహాత్మాగాంధీ సాగించిన పోరాటానికి మాగ్నాకార్టానే మూలం. రాజకీయ హక్కుల సాథన, స్వేచ్ఛ సముపార్జన తమకు ముఖ్యమని చాటిచెప్పిన గాంధీ ఆ దశగానే దేశాన్ని ముందుకు నడిపించారు. ఆ మహోద్యమం ఫలించి భారతావని సర్వసత్తాక గణతంత్య్ర ప్రజాస్వామ్య దేశంగా ఆవిర్భవించడానికి మూలం కూడా మాగ్నాకార్టానే. మూడువేల పదాలు, ఎన్నో నిబంధనలతో కూడిన మాగ్నాకార్టా నుంచే భారత రాజ్యాంగం మానవ హక్కులు, వ్యక్తిగత స్వేచ్ఛ, ప్రజాసామ్య విలువల వంటి ఉన్నత భావనలను పుణికి పుచ్చుకోగలిగింది. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో అమలులో ఉన్న రాజ్యాంగాలను క్రోడీకరించే దేశ రాజ్యాంగాన్ని నిర్మించుకున్నా..ఈ మొత్తం ప్రయత్నం వెనుక మాగ్నాకార్టా ప్రభావం చాలా స్పష్టం. 12శతాబ్ద కాలం నాటి సామాజిక, ఆర్థిక,రాజరిక, నిరంకుశ పరిస్థితుల పరీక్షలు నెగ్గి ఎప్పటికప్పుడు పునీతమవుతున్న మాగ్నాకార్టా తరగని వెలుగు దివ్వె. మానవ జాతి ఉన్నంత వరకూ, ఆక్రమణలు, అణచివేతలు, హక్కుల ఉల్లంఘనలు పేట్రేగుతున్నంత వరకూ ఇది తిరుగులేని స్ఫూర్తి మంత్రమే అవుతుంది. అంతిమంగా మానవ జాతి నాగరికంగా పరిణతి చెందడానికి, మానవీక కోణంలో రాణించడానికీ మాగ్నాకార్టా సాగించిన శతాబ్దాల ప్రయాణం నిరంతరం వెలుగుబాటను పట్టిస్తూనే వచ్చింది. మార్పు గుణాత్మకమైతే అది విలువలను ప్రోది చేస్తుంది. పరివర్తనాయుతమైన జీవన విధానానికి ప్రేరణ అవుతుంది. మాగ్నాకార్టాను ఈ కోణంలోనే పరిగణించాలి. అందులో ప్రవచించిన ప్రతి నిబంధన, ప్రతి డిమాండ్ ఆధునిక నాగరిక ప్రపంచావిష్కరణకు విశేషంగానే దోహదం చేసింది. మానవాళి చరిత్రలో ఎన్నో మధుర ఘట్టాలున్నాయి. ఎన్నో ఉత్కృష్ఠ పరిణామాలూ ఉన్నాయి. వీటిలో కొన్ని మాయని మచ్చలుగా మిగిలిపోతే ఇంకొన్ని సరికొత్త చరిత్రనే సృష్టించాయి. చారిత్రక గమనాన్ని నిర్దేశించడమే కాదు..అసలు ఉన్నతమైన జీవన ప్రమాణం ఏమిటో ప్రబోధించాయి. అదే క్రమంలో విలువలతో కూడిన ఉన్నత భావనలకూ ఉద్దీపనగా నిలిచాయి. ఇలాంటి ఘట్టాలెన్నింటినో తనలో ఇముడ్చుకుంటూ, ఎప్పటికప్పుడు నిగ్గుదేలుతూ సాగిన మానవ హక్కుల మహా ప్రయాణమే మాగ్నాకార్టా. కాలమేదైనా, పాలనా విధానమేదైనా..పాలకుల ధోరణులు ఒక్కటే రీతిలో ఉంటాయి. నాటి నిరంకుశ పాలకుడు కింగ్‌జాన్‌పై జరిగిన తిరుగుబాటుకు హక్కుల సాధనే కార ణం. చట్టాలు అందరికీ సమానమన్నదే మూ లం. నేడూ అలాంటి పరిస్థితులు,సవాళ్లనే మానవాళి ఎదుర్కొంటోంది. దేశమేదైనా హక్కులకు దిక్కులేని పరిస్థితులు నేడూ అన్ని చోట్లా కనిపిస్తున్నాయి. ఎనిమిది శతాబ్దాలను పూర్తి చేసుకుంటున్న మాగ్నాకార్టానే ఇలాంటి హక్కుల ఉద్యమాలకు స్ఫూర్తి. ప్రాథమిక హక్కుల సాధనకు ఎనలేని దీృప్త. చిత్రం... మాగ్నాకార్టాపై సంతకం చేస్తున్న కింగ్ జాన్

ప్రపంచ (భారతదేశం) చరిత్ర


దేవాలయాల సంప్రదాయం భారతదేశంలో ఎప్పుడు, ఎక్కడ మొదలయిందో తెలుసుకునే దిశగా విశ్వసించదగిన పరిశోధన జరగలేదు. మహాభారతంలో దేవాలయాల ప్రస్తావన లేదు. అందులో పురోహితులే తప్ప పూజారులు కనిపించరు. భాగవతంలో రుక్మిణీ కల్యాణం సందర్భంగా ‘అంబికాలయం’ ఉన్నట్టు చెప్పబడింది. ఇటు అయోధ్యలోనూ, అటు లంకలోనూ అనేక దేవాలయాలు ఉన్నట్టు రామాయణంలో కనిపిస్తుంది.

 ఒకవైపు ఇంత భారీ సమ్మేళనం జరుగుతున్నా, మెసొపొటేమియాకు తూర్పు దిశగా ఉండే సింధూ నాగరికత మాత్రం దేవాలయాల సంప్రదాయాన్ని స్వీకరించలేదు. తవ్వకాల్లో బయటపడిన ప్రాచీన సింధూనాగరికతలో దేవాలయం ఆనవాళ్ళు లేవు. వాళ్ళ లిపిని ‘డిసెఫర్’ చేసే ఉపాయం ఇంతవరకు దొరక్కపోవడంతో, ఆ నాగరికుల విశ్వాసాలను గురించి ఊహాగానాలే తప్ప, నిర్ధారణకు వీలు కలగడం లేదు. బహుశా, వాటిల్లో కొన్ని ఆ తర్వాత వచ్చిన ఆర్యుల సంప్రదాయాలతో కలిసిపోయి ఉండవచ్చు. పూర్వకాలం ఆర్యుల్లో యజ్ఞయాగాది వైదిక కర్మలే గాని, విగ్రహారాధన లేదు. పై రెండు సంస్కృతుల సమ్మేళనంగా సింధూనది నుండి తూర్పుకు విస్తరించిన ‘హిందూ’ నాగరికతలో క్రీ.శ. 4వ శతాబ్దం దాకా కూడా ఉత్తర భారతదేశంలో దేవాలయం జాడే కనిపించదు. (దేవాలయాలు లేవంటే అసలు శిల్పమే లేదని కాదు; మౌర్యుల కాలం నాటికే శిల్పకళ బాగా అభివృద్ధి చెందిన దశకు చేరుకుంది.) ఆ తదుపరి ఉత్తరభారతదేశంలో ప్రవేశించిన జైన, బౌద్ధ మతాలకు విగ్రహారాధన లేకపోవడంతో, మెసొపొటేమియా, ఈజిప్టుల్లో దేవాలయాల నిర్మాణం ప్రారంభమైన కాలం నుండి కనీసం 4000 సంవత్సరాల దాకా ఉత్తర భారతదేశానికి ఆ సంప్రదాయం విస్తరించలేదు.

 దేవాలయాల సంప్రదాయం భారతదేశంలో ఎప్పుడు, ఎక్కడ మొదలయిందో తెలుసుకునే దిశగా విశ్వసించదగిన పరిశోధన జరగలేదు. మహాభారతంలో దేవాలయాల ప్రస్తావన లేదు. అందులో పురోహితులే తప్ప పూజారులు కనిపించరు. భాగవతంలో రుక్మిణీ కల్యాణం సందర్భంగా ‘అంబికాలయం’ ఉన్నట్టు చెప్పబడింది. ఇటు అయోధ్యలోనూ, అటు లంకలోనూ అనేక దేవాలయాలు ఉన్నట్టు రామాయణంలో కనిపిస్తుంది. అయితే, భాగవత రామాయణాల రచనా కాలానికి సంబంధించిన ఆధారాలు అందుబాటు కాలేదు. శ్రీరాముని విషయం మహాభారతం అరణ్యపర్వంలో ఉటంకించడాన్ని బట్టి, ఆ వృత్తాంతం భారత రచనాకాలానికే ప్రాచుర్యంలో ఉందనడానికి సందేహం లేదు. రామాయణ కావ్యం ఉపోద్ఘాతంలో వాల్మీకి తన రచనను ‘ఆదికావ్యం’గా తనకు తానే చెప్పుకోవడంతో, అది భారతానికంటే ముందు రచనగా విశ్వాసం పాతుకుపోయింది.

 మహాభారతం ఒక కావ్యంగా కాక, ఇతిహాసంగానూ పంచమ వేదంగానూ పరిగణించడం వల్ల, ఒక కావ్యంగా తనది మొదటిది అన్నాడో, లేక ఇతివృత్తాలతో సాగిన రచనల్లో తనది మొదటిదిగా వాల్మీకి భావించాడో చెప్పలేం. కొనామొదలు మహాభారతంలో తారసపడే వందలాది మహర్షుల జాబితాలో వాల్మీకి పేరు ఎక్కడా కనిపించదు. అరణ్యపర్వంలో రాముని కథ క్లుప్తంగా వివరించే సందర్భంలోనూ ఆ గాథ గ్రంథస్థమైన సూచన కనిపించదు. పైగా, భారతంలోని పాత్రలు వ్యాసునికి సమకాలికులైనా, వాళ్ళ వ్యవహారాలు జ్ఞాపకాల మీదా, మౌఖిక వర్తమానాల మీద నడిచాయే తప్ప లిఖితరూపమైన సందేశాలు ఎక్కడా కనిపించవు. ఇంతేకాక, భాషలోనూ, సామాజిక వ్యవస్థకు సంబంధించిన పలు అంశాల్లోనూ కనిపించే వ్యత్యాసం వల్ల రామాయణ రచనాకాలం భారతం కంటే ముందుందని చెప్పటానికి ప్రబలమైన విశ్వాసం మినహా మరో ఆధారం దొరకదు.

 భారత, భాగవతాలు రెండూ వ్యాస విరచితాలేనని ప్రతీతి. ఆ రెండు రచనల మధ్య వ్యవధి ఎంతుందో తెలీదుగానీ, సారాంశంలో మాత్రం విపరీతమైన వ్యత్యాసం కనిపిస్తుంది. కథ రూపంలో వైదిక కర్మకాండను ప్రోత్సహించేది మహాభారతం. కానీ, క్రీ.పూ. 600 ప్రాంతంలో వైదిక కర్మల పట్ల నిరసనలు ప్రారంభమయ్యాయి. ప్రముఖంగా ‘చార్వాకులు’ అనబడే ఒక వర్గం వాటికి వ్యతిరేకమైన తర్కాన్ని ప్రజల్లో ప్రవేశపెట్టింది. యజ్ఞయాగాదుల్లో జరిగే జంతుబలిని నిరసించే ధోరణి అప్పటికే ప్రబలిందని మహాభారతం అశ్వమేథ పర్వం వివరించే ‘ముంగిస కథ’ మూలంగా వెల్లడౌతుంది. చార్వాకుల హింసావ్యతిరేక సిద్ధాంతంలో పుట్టిన ‘అహింసావాదం’ బౌద్ధానికీ జైనానికీ ప్రాణం పోసింది.


కుతుబ్ షాహీ రాజ్యం

   కుతుబ్ షాహీ  రాజ్యం 

                                    బహమని సామ్రాజ్యం

1347 లో హసన్ గంగు స్తపించాడు
రాజిదాని : గుల్బర్గా
హసన్ గంగు; 
గంగు అనే బ్రమ్మనుడు ఇతని గురువు
బహమనీ షా  యీతని బిరిడు
ఫిరోజ్ షా బహమనీ:
ఖురాన్ శారియాత్ పై వ్యక్యనలు రాసాడు 
హిందువులు కు అదిక ఉద్యోగాలు ఇచాడు
ఖగోళ  ప్రయోగశాల దవల్తాబాద్  నందు  నిరిమించాడు
18వ శతాబ్దం నందు  రాజపుత్రా రాజు సవాయి జైసింఘు:
                                                                           జైపూర్ నిర్మాత
                                                                           ఖగోళ  శాస్త్రం  అధ్యనం కోసం జంతర్ మంతర్ నిర్మిచాడు(ప్రపంచ వారసత్వ సంపద)
అహమద్ షా-1:
ఇతని పైన సూఫీ సన్యాసి గేసు  దరేజు ప్రబావం కలదు
ఎతనని ప్రజలు వలి అని పిలిచే వారు
రాజిదని ని గుల్బర్గా  నుండి బీదర్ కి మార్చాడు.
బీదర్ నుండి రాజులు కన్నా వారి ప్రధాన మంత్రులు ఎక్కువగా పాలించారు
మహమద్ గవన్ షా:
మహమద్ షా-3 ప్రధాన మంత్రి
విజయనగర రాజులు ను  ఓడించాడు
విద్యావ్యాప్తి కోసం గవాన్ మదర్ శా బీదర్ నందు  ఏర్పరిచాడు, ఇది శిల్ప కల పరంగా చాల గొప్పది
ఈతనని మహమద్ షా-3 ఉరి తీసాడు
ఊరి కి  కారణాలు:
భాహమని కాలం లో రెండు అధికారిక వర్గాలు కలవు
                                                                    1.దక్కన్
                                                                     2.ఆపాబి (పరదేశి)
గవన్ ధీ ఇరాన్(షీయ ముస్లింమతస్తడు), అక్కడ నుండి కులి అనే వ్యక్తి ని తేసుకోచాడు.
గవన్ కులీ కి కుతుబుల్ అనే  ఇచాడు,
కూలి  ప్రకటించుకున్నాడు, అందువలన గవన్ కి ఊరి  శిక్ష పడింది

                                                బీరార్ రాజ్యం

బహమనీ నుండి స్వతంత్రం ప్రకటించుకున్న తొలి రాజ్యం
స్తపకుడు: ఫతుల్ల ఇమ్మాద్ ఉల్ ముల్క్
ఈ వంశం  వారిని ఇమ్మాద్ షాహీ వంశం వారు అంటారు
తళ్ళికోట యుద్ధం లో ఈ రాజ్యం పాల్గొనలేదు
ఆహామదనగర్ రాజ్యం ఈ రాజ్యం ని ఆక్రమించుంకుంది

                                                  బీదర్ రాజ్యం:

ఖాసిం బరీద్ అను బహమనీ ప్రధాన మంత్రి స్తపించాడు.
బీజపూర్ రాజ్యం ఈ రాజ్యం ను ఆక్రమించింది
అహమద్ నగర్  రాజ్యం
అహమద్ నిజాం శ అనే గోవేర్నార్ స్తపించాడు
సాజహన్ ఈ రాజ్యం ను ఆక్రమించాడు

                                                బీజపూర్ రాజ్యం:

యూసుఫ్ అడిర్ షా స్తాపించాడు
ఇబ్రహీం అదిర్ షా 3:
ఈ వంశం లో గొప్ప వాడు
జగత్ గురువు అని హిందువులు  పిలిచేవారు
నోవ్రసనామ అనే గ్రంధం రాసాడు
నోవ్రసపుర  అనే నగరం నిర్మించాడు.

ఆంధ్రుల చరిత్ర _ చారిత్రక పూర్వ యుగం

ఆంధ్రుల చరిత్ర _ చారిత్రక పూర్వ యుగం 

ప్రాచీన శిలాయుగం చెందినా ప్రాంతాలు:
కర్నూల్:   బిల్లసర్గం
               బేతం చెర్ల
              మచ్చల చింత మని గవి(ఇక్కడ మానవడు దేశం లో తొలి సారి ఎముకులు తో  చేసిన పనిముట్లు వాడాడు)
అనంతపూర్ : గుంతకల్
 కడప : రాయచోటి
ఆదిలాబాద్ :
వరంగల్

మద్యసిలయుగం కు  ప్రాంతాలు:

సుక్ష్మ శీలా పనిముట్లు లబించాయీ:
గిద్దలరు, నాగార్జున కొండ , ఆదిలాబాద్

 నవినా శీలా యుగం :

ఇక్కడ పండించన పంటలు : రాగులు , ఉలవులు
గోదామా వరి పండించలేదు
పాలవాయి,  ఉట్నూరులో భూడిద కుప్పలు  బయటపడ్డాయి
ఈ భూడిద    పసువల పేడ కాల్చడం ద్వారా వచ్చిన భూడిద

తామ్ర  శీలా యుగం :

 రాగి  శిలలను వాడనట్టు   ఆధారాలు లేవు

బృహతశిలా యుగం:

ఇది కేవలం దక్షిన భారత సంబందించింది 500బి సి నుండి 200 బి సి  లో ఈ యుగం ప్రారంబైంది.
ఈ నాగరకత కి సంబనిచన సమాచారం సమాధులు ద్వారా తెల్స్తుంది
 ఆంధ్ర లో బృహతశిలా యుగం ప్రారంబైంది.
సమాధులలో  దొరికినవి : వరి , వ్యవసాయ పనిముట్లు , ఇనుప ఆయుధాలు బంగర అబరణలు , ఎరుపు నలుపు మట్టి పాత్రలు
ఈ  సమాదలును రాక్షస గుళ్ళు అంటారు.
వీటిలో 12 రకాల సమాధులు  కలవు

1.సిస్ట్:  

 గ్రానైట్ తో చేసిన శవపేటిక(విశాక లో తప్ప అన్ని జిల్లలో దొరికాయి )

2.దొల్మెన్: ఇది  రకమైన సిస్తే, 

దీనిని భూమిలో పూడ్చరు

 పెద్ద బండ రాయి శవపేటిక మిధ పెడతారు(మనకు ఒక సామిత ఉంది కదా ని మిధ బండ బడ అని అది ఇక్కడ నుండి వచిందే)

3.సక్రోఫాగి :  

చితబస్మం కలిగిన కుండ వివిధ రకాలలో ఉంటుంది 

నల్గొండ ఏలేశ్వరం దగ్గర దొరికిన కుండ ఏనుగు ఆకారం లో ఉంది
కర్నూలు శంకవరం లోధీ మేక ఆకారం లో కలదు

4.మేన్హిర్:  

సమాధి చుట్టూ ప్రత్యక ఆకారం లో రాతి స్తంబాలు అమరుస్తారు 

గుంటూరు లో దొరికాయి

కాకతీయులు - పరిపాలనాంశాలు Telangana History


కాకతీయులు సంప్రదాయ రాజరికం అమలు చేశారు. సంప్రదాయ పద్ధతిలో అంటే తండ్రి నుంచి కుమారునికి వారసత్వంగా రాజ్యం సంక్రమిస్తుంది. రాజులకు ప్రజా శ్రేయస్సు, ప్రజలకు రాజులయెడల అనురక్తి, కలిగించేటట్లు ఎలా పరిపాలన చేయాలో, కాకతీయుల నుంచే కన్పిస్తుంది.


ఏ రాజులైనా నేర్చుకోవాల్సిన అంశాలు?


-ముఖ్యంగా కాకతీయులు ప్రజల్లో జాతీయభావం, సమైక్య దృష్టి, దేశాభిమానం, పెంపొందించాల్సిన అవసరం ఉందని గ్రహించిన తొలి రాజులు. కాకతీయ సామ్రాజ్యాన్ని అనన్య సామాన్యంగా తీర్చిదిద్ది, అనితర సాధ్యమైన రీతిలో పాలించారు.

పాలనలో గమనించాల్సిన విషయాలు


-రాజ ముద్ర: వరాహ లాంఛనం- వరాహాన్ని కాకతీయులు తమ రాజముద్రగా ఎంచుకోవడానికి గల ముఖ్య కారణం?

-హిరణ్యాక్షుడు భూమిని చాపలా చుట్టి సముద్రంలో పడవేసినప్పుడు విష్ణువు వరాహావతారం ఎత్తి భూమిని రక్షించాడు. అలాగే భూమిని రక్షించాలనే ఉద్దేశంతో కాకతీయులు వరాహాన్ని రాజలాంఛనంగా చేసుకున్నారు.

-గరుడ ధ్వజం: అంటే వారి జెండా మీద గరుడ పక్షి బొమ్మ ఉండేది. (గరుడ ఎంత ఎత్తులో వెళ్తున్నా భూమిపై ఉన్న చిన్న సూదిని కూడా గుర్తించగలిగే శక్తి గరుడ పక్షికి ఉంది. ప్రజల సమస్యలేంటో తెలుసుకొని పరిపాలించే శక్తి ఒక్క కాకతీయులకే సాధ్యం)

-విశాల ప్రపంచంలో అనంత కాలగమనంలో జన్మించిన కోట్లాది స్త్రీలల్లో అఖండ మణిద్వీపం రుద్రాంబ (రుద్రమదేవి మహారాజు, మొట్టమొదటి హిందూ సామ్రాజ్ఞి)ను అందించిన ఘనత కాకతీయలదే.

-(హిందూ రాజవంశాలలో స్త్రీని సింహాసనం ఎక్కించిన అపూర్వ గౌరవం కాకతీయులది).

-ప్రథమంగా ఒక వేదికపై రెండు సింహాసనాలు వేసుకొని పాలించడం, దత్తత ద్వారా కిరీటం లభించే పద్ధతి కూడా కాకతీయ వంశంలోనే జరిగింది.

-మంత్రిమండలి: రాజ్యక్షేమం, ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు పనిచేయడం, రాజుకు సహకరించేందుకు మంత్రి పరిషత్తు ఉండేది.

-భట్టారక నియోగాధిపతి: సమర్థ్దులైన మంత్రుల ఎంపికలో కీలకపాత్ర పోషించేదిగా శ్రీనీలకంఠశాస్త్రి, పరబ్రహ్మశాస్త్రి, గులాం యాజ్దానీ, సోమశేఖర శర్మ, సింథియా తాల్‌బోట్ (అమెరికా) మొదలైన వారు కాకతీయుల పాలనపై స్పష్టమైన అభిప్రాయాలు తెలిపారు.
రాజరిక సిద్ధాంతం: కాకతీయుల కాలంలో రాజు దైవాంశ సంభూతుడు. రాజుకు అసమానమైన అధికారాలు ఉండేవి.

-హిందూ ధర్మశాస్ర్తాలను అనుసరించి రాజనీతి జరిగింది. యాజ్ఞవల్కుని న్యాయస్మృతిని కేతన, విజ్ఞానేశ్వరీయం పేరుతో తెలుగులో అనువదించాడు.(విజ్ఞానేశ్వరుడు మితాక్షరి పేరుతోయాజ్ఞవల్కస్మృతికి వ్యాఖ్యానం రచించెను. దానిని తెలుగులో కేతన అనువదించెను. ఇది తెలుగులో వచ్చిన తొలి న్యాయశాస్త్రం. శిక్షాస్మృతి, ఇది భారతదేశంలో మనుస్మృతి, యజ్ఞవల్కస్మృతి, పరాశస్మృతి, నారదస్మృతి మొదలైనవి. లీగల్ గ్రంథాలు, శిక్షాస్మృతులు రచించిరి. తెలుగులో తొలిసారిగా కేతన కాకతీయుల కాలంలో రచించడం గర్వకారణం)

-రాజనీతిపై కాకతీయుల కాలంలో స్వయంగా ప్రతాపరుద్రుడు -1 నీతిసారం రచించెను. ఇంకనూ బద్దెన (సుమతిశతకం) నీతిశాస్త్రముక్తావళి, మడికి సింగన సకలనీతి సమ్మతం మొదలైనవి రచించెను.


కాకతీయుల రాజ్య విభజన

రాజ్య విభజన: కాకతీయులు పాలనా సౌలభ్యం కోసం రాజ్యాన్ని కొన్ని నాడులుగా విభజించారు. నాడులను తిరిగి స్థలాలుగా విభజించారు. స్థలాలను తిరిగి గ్రామాలుగా విభజించారు. ఒక స్థలంలో 10 నుంచి 60 గ్రామాలు ఉంటాయి. వాడి భూమి, సీమ అనే పదాలు నాడు అనే పదానికి సమానార్థాకాలు. పన్నిద్దరు ఆయంగార్లు అని అంటారు. (ఆయం అనగా పొలం. గ్రామంలో కొంత పొలం(ఆయం) వీరికి ఇవ్వబడుతుంది. వీరికి జీతాలుండవు. రాజు ఈ విధంగా ఇచ్చిన దానిపై (ఆయం) పన్ను కట్టనవసరం లేదు. అంతేకాకుండా గ్రామంలో పండిన పంటలో కొంతభాగం ఆయంగార్లకు ఇస్తారు)

-1. కరణం 2. రెడ్డి 3. తలారి 4. పురోహితుడు 5. కమ్మరి 6. కంసాలి 7. వడ్రంగి 8. కుమ్మరి 9. చాకలి 10. మంగలి 11. శెట్టి 12. చర్మకారుడు

-పై వారందరూ పన్ను మినహాయింపు పొందిన పొలం కల్గియున్నారు. కాబట్టి ఆయంగార్లుగా పిలవబడ్డారు.

నాయంకర విధానం 


-కాకతీయుల పరిపాలన ముఖ్యంగా జాగీర్దారీ లేదా భూస్వామ్య వ్యవస్థ (ప్యూడలిజం)పై ఆధారపడి ఉంది. వీరు ప్రవేశపెట్టిన ఈ విధానాన్ని నాయంకర విధానం అని అంటారు. రాజ్యాన్ని అనేక రాష్ర్టాలుగా విభజించి వాటికి పరిపాలనాధిపతులుగా సైన్యాధ్యక్షులను నియమించేవారు. వీరిని నాయంకరులు అని అంటారు. వీరు ఎక్కువగా వెలమ, రెడ్డి, బ్రాహ్మణ కులాలకు చెం దినవారే.

-ఈ నాయంకరులు చక్రవర్తి (రాజు) నుంచి భూములను పొంది వాటి నుంచి వచ్చే ఆదాయంతో చతురంగ బలాలను పొషించి, యుద్ధసమయాల్లో చక్రవర్తికి తోడ్పడేవారు. సాధారణంగా రాజ్యంలోని దాదాపు నాల్గోవంతు భూమి ఈ నాయంకరుల ఆధీనంలో ఉం డేది. కాకతీయులు ప్రవేశపెట్టిన ఈ నాయంకర విధానం తర్వాత విజయనగర రాజుల కాలంలో అభివృద్ధి చెంది ఆంగ్లేయ రాజ్య నిర్మాణం వరకు అవిచ్ఛిన్నంగా వర్ధిల్లింది.


పరిశ్రమలు


-పాల్కురికి సోమనాథుడు పండితారాధ్య చరిత్రలో 20కి మించి వస్ర్తాలను గురించి పేర్కొన్నాడు. ఓరుగల్లులో చిత్తరువులు రాసే 1500 ఇండ్లు ఉన్నాయని. ఏకామ్రనాథుడు రాశాడు. పాల్కురికి బసవపురాణంలో 50 రకాల వస్ర్తాల పేర్లును పేర్కొన్నాడు. కొన్ని ముఖ్యమైన పరిశ్రమల పేర్లు...
1. నిర్మల్ - కత్తుల పరిశ్రమ -ఇక్కడి కత్తులు సిరియా దేశానికి ఎగుమతి అయ్యేవి.
2. గోల్కొండ - వజ్రాల పరిశ్రమ - ప్రపంచంలోనే అగ్రస్థానం - తర్వాత గొల్కొండ రాజ్యానికి మార్పు
3. ఓరుగల్లు - రత్నకంబళ్లు తివాచీలు, సువాసనలు ఇచ్చే బియ్యం
4. చండూరు - కంచు గంటలు, పాత్రలు, పల్లాలు (పల్లెములు)
5. నర్సాపురం - నౌకాపరిశ్రమ. ఏకైక నౌకానిర్మాణపరిశ్రమ

-ఇంకనూ పారిశ్రామిక రంగంలో ఆనాడు తెలంగాణ రాష్ట్రం ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. అనేక విధాల వస్ర్తాలు వాడుకలో ఉన్నాయి. సన్నని నూలు వస్ర్తాలు, అద్దకపు వస్ర్తాలు విదేశాలకు ఎగుమతి అయ్యేవి. ఈ ఎగుమతులతో ఆసియాలోనే భారతదేశానికి, కాకతీయ రాజ్యానికి విదేశీ ఆదాయం ఎక్కువగా వచ్చేది. దీంతో తుర్కష్కులకు కంటగింపు అయ్యెను.

-కాకతీయుల సముద్రవ్యాపారం విశేషంగా వృద్ధిచెందుట వల్ల నౌకా పరిశ్రమ చాలా అభివృద్ధి చెందింది. కాకతీయుల ముఖ్యమైన నౌకా కేంద్రం మోటుపల్లి. నేడు అది ప్రకాశం జిల్లాలో ఉంది. (క్రీడాభిరామంలో దేశీ, విదేశీ వస్త్ర వ్యాపారం గురించిన వివరాలు ఉన్నాయి)
కృష్ణపట్నం,మోటుపల్లి, మైసోలియా, ఘంటసాల నాటి ప్రధాన ఓడరేవులు. సుగంధ ద్రవ్యాలు, దంతవస్తువులు, విదేశాలకు ఎగుమతి అయ్యేవి. ఈ ప్రాం తంలో గణపతి దేవుడు అభయ శాసనం వేయించాడు. సముద్రపు దొంగలను అణిచివేసెను.

ముఖ్యమైన అధికారులు


-అష్టాదశ తీర్థులు - 18 మంది అధికారులు (మడికి సింగన గ్రంథంలో వివరాలు కలవు)
-మౌర్యుల కాలంలో ప్రజా అధికారులను తీర్థులు అనేవారు.
-నగరి శ్రీకావళి: అంతఃపురాన్ని ఎల్లవేళలా కాపాడే రక్షకుడు.
-భహత్తర నియోగాధిపతి: 72 శాఖలకు పై అధికారిగా పనిచేసేవారు.
-ఆయంగార్లు: 12 మంది. వీరినే పన్నిద్దరు ఆయంగార్లు అంటారు.

ముఖ్య ఉద్యోగులు


- తలారి - గ్రామ రక్షకుడు
--కరణం - గ్రామ లేఖకుడు
-బోయ - గ్రామ సేవకుడు
- సంధి విగ్రహీ - విదేశాంగ మంత్రి



ముఖ్యమైన పన్నులు


1. తోటపై తోంఘ్ట పన్ను
2. పచ్చిక బీళ్లపై పుల్లరి పన్ను వసూలు చేసేవారు. పన్ను వసూలు చేయు అధికారాలను కాలకాండు అంటారు.
3. దశబంద ఇనాము: 1/10 వంతు చెరువుల కింద వ్యవసాయం చేసే రైతులు చెల్లించాలి
4. ఇల్లరి: గృహాలపై విధించే పన్ను దక్షిణ భారతదేశంలోనే కాకతీయుల కాలంనాడు ఎక్కువ పన్నులు విధించబడెను.
5. పుట్టిపహండి: ధనరూపంలో చెల్లించే పన్ను
6. పుట్టి కొలుచు: ధాన్య రూపంలో చెల్లించే పన్ను
7. మగము: వర్తకుల నుంచి భూయజమానులు వసూలు చేయు పన్ను
8. సింగినాదం- హెచ్చరికలు చేసేవార్కి చెల్లించు పన్ను

ముఖ్యమైన రవాణా మార్గాలు


1. ఓరుగల్లు నుంచి మంథెన వరకు
2. బళ్లారి నుంచి చిత్తూరు వరకు
3. రాయచూర్ నుంచి కొలనుపాక వరకు
4. బీదర్ -కొలనుపాక, కళ్యాణి - కొలనుపాక వరకు
5. బీదర్ - పటాన్‌చెరు - గోల్కండ వరకు
6. వరంగల్ నుంచి వాడపల్లి వరకు ప్రధానమార్గాలుగా చెప్పవచ్చును.


ముఖ్యమైన నాణేలు


-గద్వాణం : బంగారు నాణెం
-రూకము: వెండి నాణెం
- అన్నెము : రాగి నాణెం
-తార : వెండినాణెం
-నాణెల గురించి బాపట్ల శాసనంలో వివరించబడెను. తర్వాత 18వ శతాబ్దం నాటికి దక్షిణ భారతదేశంలో పోర్చుగీసులు క్రుజుడో నాణెం ప్రవేశపెట్టిరి. దాంతో గద్వాణం ప్రస్తుతం డాలర్ ముందు రూపాయిలా బక్కచిక్కి పోయింది.

భూమి విభజన


1. వెలిమ చేను: మెట్టభూమి, వర్షాధార భూమి, (పన్నులు తక్కువ)
2. నీరు భూమి: పల్లపు ప్రాంతం, మాగాణి భూమి (పన్నుల భారం ఎక్కువ)
3. తోట భూమి : ఉద్యానవనాలు, తోటల భూములు (2 లేదా 3 సంవత్సరాల కొకసారి పన్నుల విధింపు)
కోల/గడ: 1. భూమిని కొలుచు సాధనం. అంటే ఇది 32 జానలు కలిగి ఉండును.
2. మర్తురు : 50 నుంచి 100 సెంట్ల
భూమిని మర్తురు అనేవారు



సైన్య విధానం:


కాకతీయ రాజులు అపారమైన సైన్యాన్ని పోషించారు. వీరు చతురంగ బలాలను కలిగిఉన్నప్పటికీ రథ బలానికి ఎక్కువగా ప్రాముఖ్యతనివ్వలేదు.
1. అత్యధిక సంఖ్యలో కాల్బలం (సైనికులు) -
9 లక్షలు
2. అశ్వబలం (గుర్రాలు) - 20 వేలు
3. గజబలం (ఏనుగులు) - 100




సైన్యాధిపతులు:


1. జాయపసేనాని - గజసేనాని - గణపతిదేవునికి
2. మారయ - అశ్వసేనాని - ప్రతాపరుద్రునికి

బిరుదులు పొంది ఉన్నారు. నాయంకరుల సైన్యం కంటే చక్రవర్తుల సైన్యం ఎక్కువగా ఉండేది. కాకతీయ వీరులు కత్తిసాములో జగత్ ప్రసిద్ధులు. రాజులు ధైర్యసాహసాలు ప్రదర్శించిన సైనికులకు గ్రామాలను బహుమానంగా ఇచ్చుటయే గాక...
1. కోట గెల్పట్టు
2. ద్వీపల ముంతక
3. వెలనాటి ధూషక వంటి బిరుదులు ఇచ్చి గౌరవించేవారు.
Dr.Murali


Telugu History Bits

Click Text ZOOM


















Click Text ZOOM

Tags:Telugu History Bits, History Bits, History Telugu Bits

కాకతీయులు సామ్రాజ్యం



  • వీరు చిన్న భిన్నామైన ఆంధ్రజాతిని ఏకం చేసి ప్రజల్లో జాతీయ భావాలను పెంపోందించారు.
  • బయ్యారం శాసనం ప్రకారం కాకతీయుల మూల పురుషుడు - వెన్నయనాయకుడు.
  • బయ్యారం చెరువు శాసనాన్ని మైలాంబ  వేయించెను
  • మొదటి బేతరాజు తోలి కాకతీయ రాజదాని - ఖాజీపేట
  • రేండో బేతరాజుకు - త్రిభువనమల్ల,  విక్రమ చక్రి , మహా మండలేశ్వర, చలమర్తి గండడు, అనే బిరుదులు ఉన్నాయి.
  • రెండో బెతరాజు కాలంలో కాకతీయులకు హనుమకోండ రాజధనిగా ఉండేది.



 రెండో బేతరాజు: 
మొదటి ప్రోలరాజు కుమారుడు రెండో బేతరాజు. ఇతడు క్రీ.శ. 1075-1090 వరకు పాలించాడు. బేతరాజు పశ్చిమ చాళుక్య ఆరో విక్రమాదిత్యుడికి సామంతుడు. విక్రమాదిత్యుడి నుంచి సబ్బి మండలాన్ని (కరీంనగర్) బహుమానంగా పొందాడు. ఇతడి కాలం నుంచే అనుమకొండ కాకతీయులకు రాజధాని అయింది. రెండో బేతరాజుకు త్రిభువనమల్ల, విక్రమచక్రి, చలమర్తి గండడు, మహా మండలేశ్వరుడు అనే బిరుదులున్నాయి. ఇతడి గురువు కాలాముఖి శైవ శాఖకు చెందిన రామేశ్వర పండితుడు.

 రెండో ప్రోలరాజు: 
రెండో బేతరాజు పుత్రుల్లో మొదటివాడు దుర్గరాజు, రెండోవాడు తొలి కాకతీయ రాజుల్లో ప్రసిద్ధిగాంచిన రెండో ప్రోలరాజు. రాజ్యం కోసం దుర్గరాజు, రెండో ప్రోలరాజుల మధ్య పోరు సాగింది. తుదకు రెండో ప్రోలరాజు తన అన్న దుర్గరాజును తొలగించి, మొదటి కాకతీయ స్వతంత్ర రాజుగా స్వాతంత్య్రాన్ని ప్రకటించుకున్నాడు. రెండో ప్రోలరాజు మిక్కిలి ప్రతిభావంతుడు. ఇతడి కాలంలోనే కాకతీయ రాజ్యానికి తగిన రూపురేఖలు వచ్చాయి. శత్రువులందరినీ తదుముట్టించి కాకతీయ రాజ్యాన్ని ఇతడు పటిష్టం చేశాడు. అనుభవజ్ఞుడైన వైజదండనాధుడు ఇతడి వద్ద మంత్రిగా పనిచేశాడు. రెండో ప్రోలరాజు రాజ్యకాలం క్రీ.శ.    1117-1158. రెండో ప్రోలరాజు సాధించిన విజయాలను అతడి కుమారుడైన కాకతీ రుద్రదేవుడు క్రీ.శ. 1163లో వేసిన అనుమకొండ శాసనం విశదీకరిస్తోంది.


కాకతీయ రుద్రదేవుడు/ మొదటి ప్రతాపరుద్రుడు
  • స్వతంత్ర కాకతీయ రాజ్యస్థాపకుడు.
  • అచితేంద్రుడు సంస్కృత భాషలో రచించిన హన్మకొండ శాసనం ఇతడి విశదీకరిస్తుంది.
  • ఇతని (మొదటి ప్రతాపరుద్రుడు) బిరుదు- విధ్యభూషణుడు
  •  
(క్రీ.శ. 1158-1195): రెండో ప్రోలరాజుకు పుత్రులు చాలామంది ఉన్నప్పటికీ, వారిలో రుద్రదేవుడు, మహాదేవరాజులు మాత్రమే విశేష ఖ్యాతి గడించారు. స్వతంత్ర కాకతీయ రాజ్యస్థాపకుడు రుద్రదేవుడు. ఇతడిని మొదటి ప్రతాపరుద్రుడిగా కూడా పిలుస్తారు. రుద్రదేవుడి ప్రతిభాపాటవాలు, రాజ్యనిర్మాణ దక్షత, యుద్ధ విజయాలను క్రీ.శ. 1163లో ఇతడు వేయించిన అనుమకొండ శాసనం వివరిస్తుంది. అనుమకొండ శాసన ప్రశస్తిని అచితేంద్రుడు సంస్కృతంలో రచించాడు. రుద్రదేవుడి విజయాలకు కారకుడు అతడి మంత్రి గంగాధరుడు. ఇతడు విశేష సేవలందించాడు. గంగాధరుడి ప్రతిభను గుర్తించిన రుద్రదేవుడు.. నగునూరు, సబ్బినాటి ప్రాంతాలకు అధిపతిగా నియమించాడు. రుద్రదేవుడు తన రాజ్యాన్ని తూర్పున బంగాళాఖాతం, దక్షిణాన  శ్రీశైలం, పశ్చిమాన కళ్యాణీ, ఉత్తరాన గోదావరి నదీతీరం వరకు విస్తరించాడు. కాకతీ రుద్రదేవుడు క్రీ.శ.1182 లో జరిగిన పల్నాటి యుద్ధంలో నలగామ రాజుకు సైన్యాన్ని పంపి, సహాయ పడ్డాడు. ఇతడి సామ్రాజ్య విస్తరణలో సేనానులైన చెరకు, మల్యాల, పిల్లలమర్రి, రేచర్ల వంశీయుల అండదండలు రుద్రదేవుడికి  లభించాయి.





 
ఇంకా ఉంది......
Update అవుతుంది........


 రుద్రుడి మంత్రిగణంలో వెల్లంకి గంగాధరుడు ప్రసిద్ధుడు. ఇందులూరు బ్రాహ్మణ వంశానికి చెందిన పెద్ద మల్లన, చిన్నమల్లన అనే అధికారుల వివరాలను శివయోగసారం గ్రంథం తెలుపుతోంది. రుద్రదేవుడు అనుమకొండ ప్రసన్న కేశవాలయం వద్ద గంగచియ చెరువును తవ్వించాడు. అనుమకొండలో వేయిస్తంభాల గుడి, ఓరుగల్లు దుర్గం, ఏకశిలానగరాలకు పునాది వేశాడు. రుద్రదేవుడు అనుమకొండలో వేయి స్తంభాల గుడిని క్రీ.శ.1163లో ని ర్మించాడు. ఇది త్రికూట ఆలయం. నక్షత్రం     ఆకారంలో ఉంటుంది. ఈ ఆలయంలో రుద్రేశ్వరుడు, వాసుదేవ, సూర్యదేవుడి ఆలయాలు నక్ష త్ర ఆకారంలో(త్రికూటం) రుద్రదేవుడు నిర్మించాడు.రుద్రదేవుడు సంస్కృత భాషలో నీతిసార అనే గ్రంథాన్ని రచించాడు. ఇతడికి వినయ భూషణుడు అనే బిరుదు ఉంది. క్రీ.శ. 1196లో దేవగిరి యాదవరాజైన జైతుగి చేతిలో ఓడి రుద్రదేవుడు మరణించాడు. అనంతరం రాజ్యాధికారాన్ని చేపట్టిన రుద్రదేవుడి సోదరుడు మహాదేవుడు యాదవులపై దండెత్తి, యు ద్ధంలో మరణించాడు. యాదవ రాజైన జైతుగి లేదా జైత్రపాలుడు, యువరాజైన గణపతి దేవుడిని బందీగా పట్టుకున్నాడు. అయితే, గణపతి దేవుడి గుణగణాలను అతడు మెచ్చుకొని కాకతీయ సింహాసనంపై తిరిగి కూర్చోబెట్టాడు






ఇంకా ఉంది......
Update అవుతుంది........



మరింత సమాచరం:


 తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ చిహ్నం మధ్యభాగంలో సగర్వంగా కనిపించే స్వాగతద్వారం తెలుగు ప్రజలను మహోన్నతంగా పాలించిన కాకతీయ రాజులను స్ఫురణకు తెస్తుంది.ఏకశిలతో రూపొందించిన ఆ స్వాగత తోరణం కాకతీయుల విజయ చిహ్నం. ఇది ఏకశిల నగర నిర్మాతల పటిష్టమైన, ప్రజారంజక పాలనను ఘనంగా చాటుతోంది. తెలుగువారి కీర్తి ప్రతిష్టలను సమున్నతంగా నిలబెడుతోంది. ఇప్పటికీ తెలంగాణలోని గ్రామీణ వ్యవస్థ స్వయం సమృద్ధితో నిలకడగా ఉందంటే దానికి కారణం కాకతీయులు తవ్వించినచెరువులు, కాలువలు, సరస్సులే. నేటికీ తెలుగువారి సామాజిక, ఆర్థిక జీవన విధానంలో కాకతీయుల పాలనా ముద్ర సజీవంగా ఉంది. తెలంగాణలోని ప్రతి పల్ల్లె పచ్చగా ఉండటానికి కారణం కాకతీయులే అనడం ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. ఈ ప్రాంతంలోని అనేక శిలలు, సుందరమైన దేవాలయాలు, వైవిధ్యభరితమైన కళలు కాకతీయుల కళా నైపుణ్యానికి తార్కాణాలుగా నిలుస్తున్నాయి. నేటికీ ఎందరో కవుల రచనలు, కళాకారుల గళాల ద్వారా వీరి పాలనా వైభవం కీర్తి పొందుతూనే ఉంది. కాకతీయులు శాతవాహనుల తర్వాత తెలుగు ప్రాంతాన్నంతా సమైక్యం చేసి పాలనతో వారి సర్వతో ముఖాభివృద్ధికి పాటు పడిన రాజులు కాకతీయులు. వీరు భిన్న మతాల మధ్య  తెలుగు ప్రజల ప్రగతికి కృషి చేశారు. రెడ్డి రాజులు, విజయనగర రాజపాలకులకు మార్గదర్శకులయ్యారు. క్రీ.శ. 9వ శతాబ్దంలో రాష్ట్రకూట రాజులకు సేనానులుగా పనిచేస్తూ తెలుగు ప్రాంతంలో స్థిరపడ్డారు. తర్వాత తమ బలాన్ని పెంచుకొని తూర్పు చాళుక్యులకు సామంతరాజులుగా వరంగల్ జిల్లాలోని మానుకోట దగ్గరలో ఉన్న 'కొరివి' ప్రాంతాన్ని పాలించారు. కాకతీయుల ప్రస్తావన మొదటిసారిగా తూర్పు చాళుక్య రాజైన దానార్ణవుని 'మాగల్లు శాసనం' (క్రీ.శ. 956)లో ఉంది. ఈ శాసనంలో దానార్ణవుడు తనకు రాష్ట్రకూట సేనాని కాకర్త్యగుండన సహాయం చేశాడని ప్రస్తావించాడు. ఈ కాకర్త్యగుండన రాష్ట్రకూట రాజైన మూడో కృష్ణుడి ఆదేశాల మేరకు దానార్ణవునికి సహాయపడ్డాడు. దానార్ణవుని మరణం తర్వాత గుండన స్వాతంత్య్రం ప్రకటించుకున్నాడు. ఖమ్మం జిల్లాలోని ముదిగొండ కేంద్రంగా పాలించిన ముదిగొండ చాళుక్యులు గుండన స్వతంత్రతను అంగీకరించలేదు. గుండన వారిని ప్రతిఘటించాడు. పశ్చిమ చాళుక్యులు కూడా గుండన స్వతంత్రతను ఒప్పుకోలేదు. ఫలితంగా జరిగిన యుద్ధంలో పశ్చిమ చాళుక్యుల సేనాని 'విరియాల ఎర్ర భూపతి' చేతిలో గుండన మరణించాడు. ఇతడి పాలనాకాలం క్రీ.శ. 955 నుంచి 995. ఇతడు పాలించిన ప్రాంతం పశ్చిమ చాళుక్యుల ఆధీనంలోకి వెళ్లింది. ఆ సమయంలో గుండన కుమారుడైన మొదటి బేతరాజు, ఎర్ర భూపతి భార్య కామసాని సహాయంతో 'అనమకొండ' (హన్మకొండ) విషయాన్ని (ప్రాంతం) పశ్చిమ చాళుక్యుల నుంచి పొందాడు. వీరికి సామంతునిగా ఉండి క్రీ.శ. 1000 నుంచి తన పాలనను ప్రారంభించాడు. ఈ వివరాలన్నీ కాకతీయ రాజు గణపతిదేవుని చెల్లెలైన మైలమదేవి వేయించిన బయ్యారం చెరువు శాసనం ద్వారా తెలుస్తున్నాయి. కాకతీయ వంశ నామం: కాకతీయ వంశానికి మూలపురుషుడు వెన్ననృపుడు. ఇతని పాలనాకాలం క్రీ.శ. 800-815 మధ్య ఉంటుందని బయ్యారం చెరువు శాసనం ద్వారా తెలుస్తోంది. ఈయన 'కాకతిపురం' నుంచి పాలన సాగించాడని, అందువల్ల ఈ వంశానికి కాకతీయులు అనే పేరు వచ్చిందని చరిత్రకారుల అభిప్రాయం. కానీ నాడు 'కాకతి' అనే నగరం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లేవు. 'కాకతి' అనే దేవిని పూజించడం వల్ల వీరిని కాకతీయులుగా పిలిచారని మరికొందరి అభిప్రాయం. కాకతీయులు మొదట జైనమతాన్ని అవలంభించారు. ఆ తర్వాత రెండో ప్రోలరాజు కాలంలో సుప్రసిద్ధ శైవమతాచార్యుడైన రామేశ్వర పండితుని సూచన మేరకు శైవ మతాన్ని స్వీకరించారు. తొలి కాకతీయులు 'కాకతమ్మ' అనే జైన దేవత విగ్రహాన్ని ప్రతిష్టించిన వరంగల్ పట్టణమే 'కాకతిపురం'గా ప్రసిద్ధి చెందిందని కొన్ని ఆధారాల ద్వారా తెలుస్తోంది. విద్యానాథుడు రాసిన ప్రతాపరుద్ర యశోభూషణం, వినుకొండ వల్లభాచార్యుడి 'క్రీడాభిరామం' గ్రంథాల్లోని అంశాలు ఈ వాదనను బలపరుస్తున్నాయి. కాకతీయ రాజులు - వారి పాలన మొదటి బేతరాజు (క్రీ.శ. 1000 - 1030): కాకతీయుల గురించి తెలిపే శాసనాధారాలు మొదటగా బేతరాజు పాలన గురించే వివరిస్తున్నాయి. ఇతడు పశ్చిమ చాళుక్యుల సామంతునిగా అనమకొండ ప్రాంతాన్ని పాలించాడు. నేతవాడి, కొరివి ప్రాంతాలు బేతరాజు పాలనలోనే ఉండేవి. ఇతడు కాకతిపురాన్ని రాజధానిగా చేసుకుని పాలించాడు. ఈ విషయాలన్నీ కాజీపేట శాసనం ద్వారా తెలుస్తున్నాయి. మొదటి ప్రోలరాజు (క్రీ.శ. 1030 - 1075): పశ్చిమ చాళుక్యరాజైన మొదటి సోమేశ్వరుడికి అనుంగు మిత్రుడైన ప్రోలరాజు 'అనమకొండ'పై పూర్తి అధికారాన్ని సాధించాడు. చక్రకూట రాజులతో జరిగిన యుద్ధాల్లో సోమేశ్వరుడికి ప్రోలరాజు చాలా సహాయపడ్డాడు. కాకతీయుల్లో సొంతంగా నాణేలు ముద్రించుకున్న మొదటి రాజు ప్రోలరాజే. ఇతడికి 'అరిగజకేసరి' అనే బిరుదు ఉంది. మొదటి ప్రోలరాజు కాకతీయ రాజుల్లో వ్యవసాయాభివృద్ధికి తొలిసారిగా చెరువులు తవ్వించాడు. ఇతడు 'జగత్ కేసరి' అనే చెరువును తవ్వించాడు. పశ్చిమ చాళుక్యులు ఇతడికి అనమకొండపై వంశ పారంపర్య హక్కులు కూడా ఇచ్చారు. రెండో బేతరాజు (క్రీ.శ 1075 - 1108): పశ్చిమ చాళుక్యుల వారసత్వ పోరులో విక్రమాదిత్యుడి పక్షం వహించిన రెండో బేతరాజు 'విక్రమ చక్రి', 'త్రిభువనమల్ల' అనే బిరుదులు పొందాడు. విక్రమాదిత్యుడి అనుమతితో రెండో బేతరాజు తన సైన్యాధికారైన 'వైజ్యనుడు' చేసిన కృషితో 'సబ్బి' మండలాన్ని (కరీంనగర్ ప్రాంతం) ఆక్రమించుకున్నాడు. ముదిగొండ (ఖమ్మం) ప్రాంతాన్ని కూడా తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. కాజీపేట శాసనం ఇతడి వీరత్వం గురించి వర్ణిస్తుంది. అనమకొండ ప్రాంతంలో మొదటగా శివాలయాలను కట్టించిన కాకతీయరాజు రెండో బేతరాజు. శైవమతాన్ని ఆదరించిన మొదటి కాకతీయ రాజు కూడా ఇతడే. ఇతని కాలం నుంచే అనమకొండ కాకతీయులకు రాజధాని అయింది. రెండో ప్రోలరాజు (క్రీ.శ. 1116-1157): రెండో ప్రోలరాజు కంటే ముందు దుర్గనృపతి పాలించాడు. ఇతడికి 'చలమర్తిగండ' అనే బిరుదు ఉంది. రెండో ప్రోలరాజు కాకతీయ రాజుల్లో మొదటి స్వతంత్ర రాజు. అనమకొండపై పశ్చిమ చాళుక్యుల పెత్తనాన్ని ఎదిరించాడు. మిగతా చాళుక్య సామంతరాజులనూ ఓడించాడు. వీరిలో మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల పాలకుడు తైలరాజు, నేలకొండపల్లిని పాలించిన గోవిందరాజు, మంథని (కరీంనగర్) పాలకుడు గండరాజు, పోలవలస గిరిజన రాజ్యపాలకుడైన మేడరాజు, వేములవాడ ప్రభువు జగద్దేవుడు ముఖ్యులు. ఈ విధంగా మొత్తం తెలంగాణా ప్రాంతాన్ని జయించి తన పాలనను సుస్థిరం చేసుకున్నాడు. ఇతడి విజయాల గురించి రుద్రదేవుడు వేయించిన అనమకొండ శాసనం, గణపాంబ వేయించిన గణపవరం శాసనం వివరిస్తున్నాయి. కృష్ణా, గుంటూరు మండలాలను జయించాలనుకున్న రెండో ప్రోలరాజు అక్కడి పాలకుడైన బోధరాజు (వెలనాటి వంశం) చేతిలో మరణించాడు. ఈ విషయాన్ని ద్రాక్షారామం శాసనం తెలియజేస్తోంది. రుద్రదేవుడు (మొదటి ప్రతాపరుద్రుడు): క్రీ.శ. 1158 నుంచి 1195 వరకు పాలించాడు. ప్రాంతీయ రాజ్యంగా ఉన్న కాకతీయ రాజ్యాన్ని సామ్రాజ్యంగా మార్చాడు. వెలనాటి రాజులను ఓడించి ద్రాక్షారామం, శ్రీశైలం, త్రిపురాంతకాలను ఆక్రమించి కృష్ణానది వరకు తన రాజ్యాన్ని విస్తరించాడు. తర్వాత దొమ్మరాజును (కరీంనగర్ ప్రాంతరాజు), మైలగిదేవుడు (జగిత్యాల ప్రాంత రాజు)లను ఓడించాడు. తెలంగాణలో పశ్చిమ చాళుక్యుల పాలనను పునఃప్రతిష్ట చేయాలనుకున్న కాలాచూరి బిజ్జలుడు, పోలవలస రాజు మేడరాజుతో కలిసి ప్రణాళిక రచించాడు. అది తెలిసిన రుద్రదేవుడు మేడరాజును ఓడించాడు. (మేడరాజు గోదావరిని దాటి అడవుల్లోకి పారిపోయినట్లుగా చెబుతారు). అప్పుడు బిజ్జలుడు వెనుకడుగు వేశాడు. రుద్రుడి ఈ విజయ యాత్రల్లో వెల్లకి గంగాధరుడనే మంత్రి పాత్ర గణనీయమైంది. దీనికి ప్రతిఫలంగా గంగాధరున్ని సబ్బి మండలానికి (కరీంనగర్ ప్రాంతం) అధిపతిగా చేశాడు. కాకతీయరాజ్యం తెలంగాణా ప్రాంతం దాటి తూర్పున బంగాళాఖాతం, ఉత్తరాన గోదావరి నది, పశ్చిమాన కళ్యాణి, దక్షిణాన రాయలసీమ సరిహద్దుల వరకు విస్తరించింది. క్రీ.శ. 1176 నుంచి 1182 మధ్య కాలంలో జరిగిన పల్నాటి యుద్ధంలో నలగామ రాజుకు సహాయంగా రుద్రుడు తన సైన్యాన్ని పంపాడు. కందూరు పాలకుడైన ఉదయచోళుడిని ఓడించిన రుద్రదేవుడు పానగల్లులో రుద్ర సముద్రం అనే చెరువును తవ్వించాడు. తర్వాత పాలమూరు, ధరణికోట, వెలనాడులోని చాలా ప్రాంతాలను తన రాజ్యంలో కలుపుకున్నాడు. పశ్చిమ చాళుక్యులకు సామంతులుగా ఉన్న యాదవరాజులు, కాకతీయుల మాదిరిగానే స్వతంత్ర రాజులై 'దేవగిరి' రాజధానిగా పాలిస్తున్నారు. వీరు కాకతీయుల రాజ్య విస్తరణ భవిష్యత్తులో తమకు ప్రమాదమని భావించారు. యాదవరాజు జైతుగి (జైత్రపాలుడు) క్రీ.శ. 1195లో కాకతీయ రాజ్యంపై దండెత్తి రుద్రదేవున్ని వధించాడు. కాకతీయ రుద్రుడు మంచి వాస్తు కళాభిమాని. అతడు అనమకొండలో రుద్రేశ్వరాలయాన్ని కట్టించాడు. పక్కనే వేయి స్తంభాల దేవాలయాన్ని నిర్మించారు. ప్రసన్న కేశవాలయం వద్ద గంగాచీయ సరస్సును నిర్మించాడు. విశాల సామ్రాజ్యానికి రాజధానిగా అనమకొండ చిన్నదిగా ఉందని ఓరుగల్లు పట్టణాన్ని నిర్మించాడు. రుద్రదేవుడు స్వయంగా కవి. ఇతడు సంస్కృతంలో 'నీతిసారం' గ్రంథాన్ని రచించాడు. ఇతడు రెండో ప్రోలరాజు విజయాలను తెలుపుతూ క్రీ.శ. 1163లో 'అచితేంద్ర' రచించిన అనమకొండ శాసనాన్ని చెక్కించాడు. రుద్రదేవుడికి సంబంధించిన అనేక విషయాలు అనమకొండ శాసనం, గణపతి దేవుడు వేయించిన ఉప్పరపల్లి శాసనం, రుద్రమదేవి వేయించిన మల్కాపురం శాసనాల ద్వారా తెలుస్తున్నాయి. రుద్రదేవుడి మరణం తర్వాత అతడి తమ్ముడు మహాదేవుడు అధికారంలోకి వచ్చాడు. మహాదేవుడు (క్రీ.శ. 1195-1199): యాదవరాజు జైతుగీపై పగ తీర్చుకోవడానికి దేవగిరిపై దండయాత్ర చేశాడు. ఇతడు జైతుగీ చేతిలో మరణించాడు. మహాదేవుడి కుమారుడైన గణపతిదేవుడు జైతుగీకి చిక్కి, బందీ అయ్యాడు. మహాదేవుడికి మైలాంబ, కుదాంబిక అనే ఇద్దరు కుమార్తెలున్నారు. 
ఇంకా ఉంది......
Update అవుతుంది........


Tags: కాకతీయులు సామ్రాజ్యం, కాకతీయులు, మొదటి ప్రతాపరుద్రుడు,  రేండో బేతరాజు, రుద్రదేవుడు, హన్మకొండ, గణపతి దేవుడు, రాణి రుధ్రమదేవి, ప్రతాపరుద్రుడు, మహాదే్వుడు, kakatiyulu, kakateeya samrajyam, modati prataparudrudu, rudramadevi, mahaadevudu,,కాకతీయులు- రాజకీయ చరిత్ర, బేతరాజు, kakathiya-political history, betha raju,కాకతీయులు- రాజకీయ చరిత్ర, బేతరాజు, kakathiya-political history, betha raju,కాకతీయులు- రాజకీయ చరిత్ర, బేతరాజు, kakathiya-political history, betha raju, కాకతీయులు- రాజకీయ చరిత్ర, బేతరాజు, kakathiya-political history, betha raju, కాకతీయులు- రాజకీయ చరిత్ర, బేతరాజు, kakathiya-political history, betha raju



















Sindu Nagarikata History in Telugu,




Sindu Nagarikata History in Telugu, Sindu Nagarikatha in Telugu, Telugu Gk Bits, Telugu Study Meatireal Sindu Nagarikata History in Telugu, Sindu Nagarikatha in Telugu, Telugu Gk Bits, Telugu Study Meatireal Sindu Nagarikata History in Telugu, Sindu Nagarikatha in Telugu, Telugu Gk Bits, Telugu Study Meatireal Sindu Nagarikata History in Telugu, Sindu Nagarikatha in Telugu, Telugu Gk Bits, Telugu Study Meatireal Sindu Nagarikata History in Telugu, Sindu Nagarikatha in Telugu, Telugu Gk Bits, Telugu Study Meatireal Sindu Nagarikata History in Telugu, Sindu Nagarikatha in Telugu, Telugu Gk Bits, Telugu Study Meatireal Sindu Nagarikata History in Telugu, Sindu Nagarikatha in Telugu, Telugu Gk Bits, Telugu Study Meatireal Sindu Nagarikata History in Telugu, Sindu Nagarikatha in Telugu, Telugu Gk Bits, Telugu Study Meatireal


నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు భారతరత్న.. ఎవరు తీసుకుంటారు?

నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు అత్యున్నత భారతరత్న పురస్కారం ఇవ్వాలని నరేంద్ర మోడీ సర్కారు నిర్ణయించిందట. అయితే మాలవ్యా, వాజ్‌పేయిలతో పాటు నేతాజీకి ఆ మహోన్నత పురస్కారాన్ని అందిస్తే.. నేతాజీ తరపున స్వీకరించే వారు లేక కేంద్రం వెనక్కు తగ్గినట్టు తెలుస్తోంది. 1945 ఆగస్ట్‌లో‌ అదృశ్యమైన ఆయన మరణించాడనటానికి సాక్ష్యాలు లేవు. అలాగని బతికే ఉన్నాడని చెప్పేందుకూ నిదర్శనం లేదు. నేతాజీ ఎక్కడో జీవించే ఉన్నారని, ఏదో ఒక రోజు తిరిగి వస్తారని నేతాజీ కుటుంబ సభ్యులు ఇప్పటికీ నమ్ముతున్నారు. బతికున్న వ్యక్తి పురస్కారాన్ని నేతాజీ తరపున ఎలా స్వీకరిస్తామని వారు ప్రశ్నించడమే ప్రభుత్వం వెనక్కు తగ్గటానికి కారణమని సమాచారం. కాగా నేతాజీ బతికే వున్నారని... ఆయన్ని కోర్టు ముందు హాజరు పరుస్తామని ఓ పిటిషనర్‌ కోర్టుకు తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం నేతాజీ అందజేయడంపై వెనక్కి తగ్గడం గమనార్హం.

నెపోలియన్‌ బొనపార్టి ఫ్రాన్సు

సామాన్య సైనికుడిగా ప్రారంభమైన నెపోలియన్‌ బొనపార్టి జీవితం ఫ్రాన్సు దేశానికి చక్రవర్తిగా, సకల ఐరోపా ఖండానికి తిరుగులేని నాయకుడుగా కలిగిన స్థానానికి ఎదగ గలిగింది. 1804 నుండి 1815 వరకు ఫ్రాన్సు దేశాన్ని పాలించిన నెపోలియన్‌ మొదట సైన్యంలో సాధారణ ఉద్యోగిగా చేరాడు. ఫ్రెంచి విప్లవం కొనసాగుతున్న ఆ రోజుల్లో చేవ గల సైనికాధికార్లకు అవకాశాలు మిన్నగా ఉండడంతో నెపోలియన్‌ చాకచక్యంగా అట్టి అవకాశాల్ని జారవిడువకుండా ఎదగగలిగాడు.
1796 ఏప్రిల్‌లో నెపోలియన్‌ ఇటలీపై దండయాత్రకు నిర్దేశించబడిన ఫ్రెంచి సైన్యానికి నాయకుడుగా నియమించబడ్డాడు. 27 ఏండ్లు కూడా నిండని నెపోలియన్‌కు ఇది ప్రతిష్టాకరమైన నియామకం. అతని జీవితంలో ఇది గొప్ప మలుపుగా పరిణమించింది. దాదాపు ఒక సంవత్సరం కొనసాగిన ఈ ఇటలీ దండయాత్ర తర్వాత నెపోలియన్‌ ఒక శక్తిగా రూపొందడం, అతి వేగంగా మహోన్నత శిఖరాలను చేరుకోవడం జరిగింది.
ఇటలీ దేశం ఆ రోజుల్లో అనేక స్వతంత్ర రాజ్యాల సమాహారం. ఒక్క సార్డీనియా తప్ప మిగిలిన రాజ్యాలన్నీ ఇతర ఐరోపా దేశాల అధీనంలో వ్ఞండేవి. అత్యధిక ప్రాంతం ఆస్ట్రియా పాలన క్రింద కొనసాగింది. అందు వల్ల నెపోలియన్‌ తన సేనలతో ఇటలీలో ఆస్ట్రియా సైన్యాలను ఎదుర్కొన వలసి వచ్చింది.
సైన్యాధ్యక్షుడుగా నెపోలియన్‌ అనేక సమస్యల నెదుర్కొనవలసి వచ్చింది. ఫ్రాన్సులో నెలకొన్ని అస్థవ్యస్థ పరిస్థితుల వల్ల సైనికులకు కలిగిం చిన సౌకర్యాలు చాలా తక్కువ. చాలీచాలని జీతాలు; చినిగిన యూనిఫారంలు, అర్ధ ఆకలితో కొనసాగే సైనికులతో నెపోలియన్‌ తన ఇటాలియన్‌ దండయాత్రను కొనసాగించవలసి వచ్చింది. కాని అన్ని అవరోధాలను అధిగమించి తన సైనికులకు ఉత్సాహాన్ని కలిగిస్తూ వారిలోని జాతీయ భావాన్ని పురిగొల్పుతూ అశేష ఆస్ట్రియా సైన్యాలను ఎదిరించి అనేక విజయాలు సాధించగలిగాడు నెపోలియన్‌.
మొదట పీడ్మాంటు రాజ్యంపై విజయం సాధించాడు నెపోలియన్‌. దీని తార్వత బైల్యూ అనే పేరు పొందిన సైన్యాధ్యక్షుని క్రింద గల ఆస్ట్రియా సైన్యాలను ఎదుర్కోవలసి వచ్చింది. ఇటలీలో క్రమంగా చొచ్చుకొస్తున్న ఫ్రెంచి సైన్యాలను అడ్డగించడానికి బూల్యూ అప్పటికప్పుడు కొత్త సైన్యాలను రప్పించి నెపోలియన్ను ఎదుర్కొన్నాడు. కాని 1796 మే నెల 6వ తేదినాటికి లంబార్డి రాజ్యాన్ని ప్రవేశించి మూడురోజుల తర్వాత 'అడ్డ అనే నది సవిూపానికి చేరుకొన్నాడు. నెపోలియన్‌ తన సేనలతో మెరుపుతీగలా జరిగిన ఈ చొరబాటుకు ఆస్ట్రియా సేనలు మే 10వ తేదీన నదిని దాటి తప్పించుకొన ప్రయత్నించాయి. చేరువ గల మిలన్‌ నగరానికి ఎట్టి రక్షణ లేకపోయింది.
'అడ్డ నదికి కుడివైపు తీరంలో వ్ఞంది 'లోడి అనే ఒక ప్రధాన పట్టణం. దానిచుట్టూ బలమైన కోట గోడలు వ్ఞండేవి. అప్పటికే ఆస్ట్రియా సేనలు వెళ్లినందున నెపోలియన్‌ సులభంగా లోడి పట్టణాన్ని ప్రవేశించాడు. దాదాపు 12 వేల మంది సైనికులు గల ఆస్ట్రియా సేనలు నదిపై గల వంతెనను దాటి అవతలివైపు మాటు వేశారు. మిలన్‌ పట్టణానికి గల దారి నెపోలియన్‌కు అధీనమైంది. కాని అడ్డ నదిపై గల లోడి బ్రిడ్జ్‌ కవతల సవిూకరించబడి వ్ఞన్న ఆస్ట్రియా సేనలను జయించిగాని మిలన్‌ నగరాన్ని చేరుకోలేడు.
లోడి వంతెన దాదాపు 200 అడుగుల పోడవ్ఞ కర్రలతో నిర్మించబడిన సన్నని వంతెన. దాదాపు 9 బెటాలియన్లతో ఆస్ట్రియా సైనికులు ఫ్రెంచి సేనలు బ్రిడ్జిని దాటనీయకుండా దిగ్భందన చేశారు. కాని నెపోలియన్‌ ఆస్ట్రియా సైన్యాలను శక్తివంతంగా ఎదుర్కొని పోరాడడానికి నిర్ణ యించుకొన్నాడు.
మే నెల 10వ తేది (1796) జరిగిన ఈ యుద్ధానికి ''లోడి బ్రిడ్జ్‌ యుద్ధం అని చరిత్రలో ప్రసిద్ధి పొందింది. సాయంకాలం 6 గంటలకు ప్రారంభమైన ఈ యుద్ధం సుమారు 5 గంటలు కొనసాగింది. గొప్ప వీరులుగా పేరుపొందిన సైవాయి సైనికులను మొదట శ్రేణుల్లో పంపాడు నెపోలియన్‌. కాని వారు వంతెనపై దాదాపు సగం దూరం రావడంతో ఆస్ట్రియా సేనలు వారిపై ఎగబడి తమ తుపాకుల వర్షంతో తిప్పిగొట్టారు. తర్వాత నెపోలియన్‌ మస్సీన, బార్తియర్‌ అనే ఇద్దరు యోధుల నాయకత్వం కింద మరికొంత సైన్యాన్ని పంపి రెండవ ప్రయత్నం కొనసాగించాడు. వీరు విజయవంతంగా ఆస్ట్రియా తుపాకులను ఛేదిస్తూ అవతలివైపుకు చేరగలిగారు. ఇంతలో మరికొన్ని కొత్త ఫ్రెంచి సైన్యాలు నెపోలియన్‌ను చేరాయి. దీనితో ఆస్ట్రియా సైన్యాలు వెనుదిరిగాయి.
ఈ లోడి బ్రిడ్జ్‌యుద్ధంలో ఆస్ట్రియా సేనలు విపరీత నష్టానికి గురైనాయి. దాదాపు 2 వేల మంది చనిపోయారు. అనేక తుపాకులు ఫ్రెంచివారి వశమయ్యాయి. మే నెల 14వ తేది నెపోలియన్‌ మిలన్‌ నగరాన్ని వీరోచితంగా ప్రవేశించాడు.
సైనికపరంగా లోడియుద్ధం అంత ప్రత్యేకత కలిగిందికాదు. కాని నెపోలియన్‌ జీవితంలో ఇది గొప్ప మలుపుగా పరిణమించింది. భవిష్యత్తులో అతని విజయపరంపరలకిది నాందిగా మారి, తనపై తనకు అమిత ఆత్మవిశ్వాసాన్ని సమకూర్చింది. దీని గురించి తన భార్య జోసఫిన్‌కు రాసిన జాబులో నెపోలియన్‌ ఇలా తెలియజేశాడు. ''నా వద్ద గల ఖడ్గంతో నేనెంతకైనా ఎదగగలను అని.
లోడి బ్రిడ్జ్‌ దాటడానికి సైనికులనుత్తేజపరుస్తూ అతడు చేసిన ప్రసంగాలు బాగా పనికి వచ్చిన కారణంగా తర్వాతి యుద్ధాలలో అట్టి పద్ధతిని అనుస రించేవారు నెపోలియన్‌.
తాను కేవలం 5 అడుగుల 2 అంగుళాల ఎత్తు మాత్రమే కలిగిన తన సైనికులందరి కన్నా పొట్టిగా వ్ఞన్నా, అతడు కనబరచిన ధైర్య సాహసాలకు అతని సైనికులు నెపోలియన్‌ను ''లిటిల్‌ కార్పొరల్‌ అని అన్నారట. అది తర్వాత కూడా తన ముద్దు పేరయింది.
భవిష్యత్తులో అనేక సైనిక విజయాలు సాధించాలనే అకుంఠిత దీక్ష; తన దేశంలో ఇతరులందరికంటే తానే గొప్పవాడనే ధీమా నెపోలియన్‌కు లోడి బ్రిడ్జ్‌ యుద్ధం మూలంగా కలిగింది.
''నెపోలియన్‌ అజేయుడు అన్న బలమైన భావాన్ని తాను నమ్మి, ఇతరులను నమ్మింపజేయడానికి కూడా ఈ యుద్ధం దోహద పడిందనవచ్చు

ద్రాక్షారామంలోని భీమేశ్వరాలయాన్ని నిర్మించింది ఎవరు ?




1. ఇటీవల కరీంనగర్‌ జిల్లాలో కోటిలింగాల వద్ద దొరికిన నాణేలు ఎవరికి చెందినవి ? – శ్రీముఖుడు
2. శాతవాహనుల కాలంలో నగర పాలన ఎవరి ద్వారా జరిగేది ? - నిగమ సభ
3. ఆంధ్రులు మౌర్య సామ్రాజ్యంలో వారని అశోకుని ఎన్నో శిలాశాసనం తెలుపుతుంది ?- 13వ శిలా శాసనం
4.కవి వత్సలుడు అనే బిరుదున్న రాజు ? – హాలుడు
5. ధరణికోట శాసనం ఏ శాతవాహన రాజుకి సంబంధించింది ? - వాశిష్టిపుత్ర పులోమావి
6. శాతవాహనుల కాలంలో పల్నాడు ప్రాంతం దేనికి ప్రసిద్ధి ? – వజ్రాలు
7. శాతవాహనుల కాలం నాటి కొడాయిరాను ప్రస్తుతం ఎలా పిలుస్తున్నారు ? – ఘంటసాల
8. ఆంధ్రుల ప్రస్తావన మొట్టమొదటి సారి ఉన్న ఐతరేయ బ్రాహ్మణం ఏ వేదానికి సంబంధించింది ? – రుగ్వేదానికి
9. ఆంధ్ర మహావిష్ణువు దేవాలయం ఎక్కడ ఉంది ? - కృష్ణాజిల్లాలోని శ్రీకాకుళం
10.గుణాఢ్యుడు రచించిన బృహత్కథ ఏ భాషలో ఉంది ? – పైశాచి
11.శాతవాహనుల కాలంనాటి తొలి గుహ చైత్యాలు ఎక్కడ ఉన్నాయి ? – గుంటుపల్లి
12.విష్ణు కుండినులు పోషించిన భాష ? – సంస్కృతం
13. మంచికల్లు శాసనం ఏ వంశ రాజుల గురించి తెలుపుతుంది ? – పల్లవులు
14. 108 శివాలయాలను నిర్మించిన చాళుక్యరాజు ? – రెండో విజయాదిత్యుడు

15. ఐవోల్‌ శాసనం ఎవరి విజయాలను గురించి తెలుపుతుంది ? - రెండో పులకేశి
16. ఉండవల్లి గుహలు ప్రస్తుతం ఏ జిల్లాలో ఉన్నాయి ? - కృష్ణా
17.బైరవ కొండ గుహలు ఏ జిల్లాలో ఉన్నాయి ? - నెల్లూరు
18. విష్ణు కుండినుల రాజధాని ? - వినుకొండ
19.రేనాటి చోళుల మూల పురుషుడు ?- కరికాళ చోళుడు
20. శూన్య వాదాన్ని ప్రభోదించింది ? - ఆచార్యనాగార్జునుడు
21. ఆచార్య నాగార్జునుడు శాతవాహన రాజుల్లో ఎవరికి సమకాలికుడు ? - యజ్ఞశ్రీ పుత్ర శాతకర్ణి
22.శాతవాహనుల నాణేలను ఎలా పిలిచేవారు ? - కర్షపణలు
23. ప్రఖ్యాత శివలింగం గత చిత్తూరు జిల్లాలోని గుడిమల్లం ఏ రాజుల కాలానికి చెందింది ? - శాతవాహనులు
24. చేజర్ల శిలాశాసనం ఏ రాజు వంశీయులను గురించి తెలుపుతుంది ? - ఆనంద గోత్రులు
25. జయవర్మ కొండముది శాసనం ఏ రాజు వంశీయులను గురించి తెలుపుతుంది ? - బృహత్పలాయనులు
26.సమస్త గాంధర్వ విద్యల్లో ప్రావీణ్యులైన చెల్లవ్యను పోషించిన రాజు? - మొదటి చాళుక్య భీముడు
27. నిర్వచనోత్తర రామాయణ గ్రంథకర్త ? - తిక్కన
28.ఆంధ్రదేశంలో హిందూ గుహాలయాలను మొట్టమొదటి సారిగా నిర్మించిన వారు ? - విష్ణు కుండినులు
29. ద్రాక్షారామంలోని భీమేశ్వరాలయాన్ని నిర్మించింది ఎవరు ? - మొదటి చాళుక్య భీముడు
30. తూర్పు గోదావరి జిల్లాలోని బిక్కవోలు దేవాలయాల సముదాయాన్ని నిర్మించిన వారు ఎవరు ? - గుణగ విజయాదిత్యుడు
31. శాతవాహనుల వాణిజ్య సంబంధాలు ఏ దేశంతో అభివృద్ధి చెందాయి ? - రోమ్‌
32.శాతవాహన సామ్రాజ్యాన్ని అంతంచేసి స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించిన వంశం ? - ఇక్ష్వాకులు
33.యజ్ఞశ్రీ పుత్ర వాతకర్ణి వేయించిన నాణేలపై ముద్ర ? - నౌక
34.గౌతమీ బాలశ్రీ వేయించిన నాసిక్‌, కార్లే శాసనాలు ఎవరి విజయాలను వివరంగా తెలుపుతాయి ?-గౌతమీ పుత్ర శాతకర్ణి
35. శాతవాహన రాజుల్లో ఘనుడు ? -గౌతమీ పుత్ర శాతకర్ణి
36. గాథా సప్తశతి గ్రంథ సంకలన కర్త ? - హాలుడు
37. నానాఘాట్‌ శాసనం ఎవరి విజయాలను గురించి తెలియజేస్తుంది ? - మొదటి శాతకర్ణి
38. సుహ్రృల్లేఖ అనే గ్రంథాన్ని రాసింది ఎవరు ? - ఆచార్య నాగార్జునుడు
39. గిర్నార్‌ శాసనం వేయించిన రాజు ? - రుద్రదాముడు
40. ఇటీవల తవ్వకాల్లో కాల్చిన ఇటుకలతో నిర్మితమైన అతి పెద్ద బౌద్ధస్థూపాన్ని ఎక్కడ కనుగొన్నారు ? - నేలకొండపల్లి
41. శాతవాహన కాలంలో గ్రీకు, రోమన్ల ప్రభావం దేనిపై అధికంగా ఉండేది ? - వాస్తు శిల్పం
42. కళింగ రాజైన ఖారవేలుని సమకాలికుడైన శాతవాహన రాజు ? - రెండో శాతకర్ణి
43. మహాక్షాత్ర రుద్రదామునితో పోరాడిన శాతవాహన రాజు ? - గౌతమీ పుత్ర శాతకర్ణి
44. ఇటీవల భావికొండ వద్ద (భీముని పట్నం) బయటపడిన స్థూపాలు ఎవరి కాలానికి చెందినవి ? - శాతవాహనులు
45. శాలివాహన శకం ఎప్పుడు ప్రారంబమైంది ? - క్రీ.శ78లో

46.  విదేశీ బౌద్ధమత ఆధారాలతో ఆంధ్రదేశాన్ని ఏ విధంగా పేర్కొన్నారు ? - మంజీరక దేశం
47.  అశోకుడి శాసనాలు ఆంధ్రాలో లభించిన ప్రాంతాలు? – యర్రగుడి
48. ఇటీవల ఏలూరు ప్రాంతంలోని గుంటుపల్లిలో లభించిన శాసనం ఎవరి గురించి తెలుపుతుంది ? – ఖారవేలుడు
49. శాతవాహనుల సామ్రాజ్యంలోని రాష్ట్రాలు ? – ఆహారాలు
50. శాతవాహన కాలంలో వ్యాపార అభివృద్ధికి తోడ్పడింది ? – శ్రేణులు



51. కంటక శిల దేనికి పూర్వ నామము ? –ఘంటసాల
52.అలహాబాద్‌ స్తంభ శాసనంలో పేర్కొన్న శాలంకాయన రాజు ఎవరు ? – హస్తివర్మ
53. ఉజ్జయినీ రాకుమార్తెను వివాహమాడిన ఐక్ష్వాకు రాజు ఎవరు ? - వీర పురుషదత్తుడు
54. ఈపూరు, పొలమూరు శాసనాలు ఏ రాజు వంశస్తులను గురించి తెలుపుతాయి ? - విష్ణు కుండినులు
55. త్రికూట పూర్వతాధిపతులు ? – శాలంకాయనులు
56. నవబ్రహ్మ ఆలయాలు ఎక్కడ కొలువదీరి ఉన్నాయి ? -అలంపూర్‌
57. తెలుగులో కుమార సంభవ గ్రంథకర్త ఎవరు ? – నన్నెచోదుడు
58.మహబూబ్‌నగర్‌ జిల్లా అలంపూర్‌లోని నవబ్రహ్మ ఆలయాలు ఏ రాజవశీయుల కాలానికి చెందినవి ? - పశ్చిమ (బాదామి) చాళుక్యులు
59. చోళ తూర్పు చాళుక్య రాజులను ఏకం చేసిన రాజు ? - రాజేంద్ర చోళుడు
60. ఆంధ్రాలో వీరశైవ రాజ్యాలను ఏకం చేసిన రాజు ? - రాజేంద్ర చోళుడు
61.ఆంధ్రాలో వీరశైవ మతాన్ని ప్రవేశపెట్టి ప్రచారం చేసిన వారు ? – పందితారాధ్యుడు
62. ఇక్ష్వాకుల రాజధాని ? – విజయపురి
63. ఏ రాజ వంశ కాలంలో ఆంధ్రదేశంలో బౌద్ధమతం విలసిల్లింది ? –ఇక్ష్వాకులు
64. జయవర్మ ఆంధ్ర రాజవంశాల్లో దేనికి చెందినవారు ? - బృహత్పలాయనులు65. శాలంకాయన రాజ్యస్థాపకుడు ఎవరు ? – విజయదేవవర్మ
66. శాలంకాయనుల రాజధాని ? – పెదవేగి
67. పల్లవులను ఓడించి దక్షిణాదికి తరిమివేసి కృష్ణానది దక్షిణ తీరప్రాంతాన్ని పాలించిన ఆంధ్ర దేశ రాజులు ? – ఆనందగోత్రులు
68.ఆనందగోత్రుల రాజధాని ? – కందరపురం
69. ఉండవల్లి గుహలయాలు నిర్మించిన రాజులు ? – విష్ణుకుండినులు
70. పల్లవుల రాజధాని ? – కాంచిపురం
71. పల్లవుల రాజ లాంఛనం ? – వృషభం
72. పల్వవ వంశ మూల పురుషుడు ? – వీరకూర్చవర్మ
73. మహాబలి (మామల్ల) పురం రేవు పట్టణాన్ని నిర్మించిన పల్లవరాజు ? - మొదటి నరసింహవర్మ
74. కులోత్తుంగ చోళ బిరుదాంకెతుడై గంగైకొండ చోళాపురం (చోళరాజ్యం)ను పాలించిన రాజేంద్రుడు ఎవరి కుమారుడు ? - రాజరాజ నరేంద్రుడు
75. తూర్పు చాళుక్యుల్లో సుప్రసిద్ధ రాజు ? - గుణగ విజయాధిపత్యుడు
76. తూర్పు చాళుక్య రాజ్య స్థాపకుడు ? - కుబ్జ విష్ణువర్థనుడు
77. రాజారాజ నరేంద్రుని రాజ్య పరిపాలనా కాలం ? - క్రీశ.1019-1061
78. తూర్పు చాళుక్యుల రాజధానిని వేంగి నుంచి రాజమహేంద్రవరానికి ఎవరు మార్చారు ? - మొదటి అమ్మరాజు
79.శాలంకాయనుల ఆరాధ్య దైవం ? - చిత్రరథ స్వామి
80. వేంగి (తూర్పు) చాళుక్య రాజ్యస్థాపకుడైన కుబ్జ విష్ణువర్ణనుడు ఎవరి ప్రతినిధిగా రాజ్యాన్ని పాలించాడు ? - రెండో పులకేశి
81. రెడ్డి రాజుల రాజధానిని అద్దంకి నుంచి కొండవీడుకి మార్చిన రాజు ? - పెద్దకోమటి వేమారెడ్డి
82. నేలమల రాజధాని రాచకొండ ప్రస్తుతం ఏ జిల్లాలో ఉంది ? – నల్గొండ
83. ఇక్ష్వాకుల కాలంలో బౌద్ధ మతాభివృద్ధికి నిదర్శనం ? - ఉపాసిక బోధి శాసనం
84. ఆనంద గోత్రికులు ఎవరి సామంతులు ? – పల్లవులు
85. మొదటి హిందూ దేవాలయాన్ని కట్టించిన ఆంధ్ర వంశ రాజులు ? – ఇక్ష్వాకులు
86. బృహత్పలాయనుల గురించి తెలిపే ఒకే ఒక ఆధారం - కొండముది శాసనం
87.త్రికూట మలయాధిపతి అను బిరుదు ఎవరిది ? - రెండో మాధవ వర్మ
88.గూడూరు ఏ వంశరాజుల రాజధాని ? – బృహత్పలాయనులు
89. తూర్పు చాళుక్య రాజుల్లో సుప్రసిద్ధుడు ? - గుణగ విజయాదిత్యుడు
90. తొలి చాళుక్యుల నాటి కుడ్య చిత్రాలు (పెయింటింగ్స్‌) ఎక్కడ లభ్యమయ్యాయి ? - అజంతా
 

Followers