భారత రాజ్యాంగం -బిట్స్



1. రాజ్యాంగ పరిహార హక్కును రాజ్యాంగం యొక్క ఆత్మ మరియు హృదయం అని ఎవరు వర్ణించారు?
(డా|| బి.ఆర్‌. అంబేద్కర్‌)
2. ఆత్యయిక పరిస్థితులలో 'ప్రాథమిక హక్కులను' నిలుపు చేసే అధికారం ఎవరికి వుంది? (రాష్ట్రపతి)
3. 'ప్రాథమిక విధులు' ఎన్నవ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చ బడ్డాయి? (42వ సవరణ)
4. ఆదేశ సూత్రాల ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి? (శ్రేయోరాజ్య స్థాపన)
5. ఎన్నవ రాజ్యాంగ సవరణ 'ఆదేశిక సూత్రాలకు ప్రాథమిక హక్కులపై అధిక్యత'ను కల్పిం చింది?(42వ రాజ్యాంగ సవరణ)
6. ఎన్నవ రాజ్యాంగ సవరణ ద్వారా తిరిగి 'ప్రాథమిక హక్కు లకే ఆదేశ సూత్రాలపై ఆధిక్యత' ను కల్పించబడింది?
(44వ సవరణ)
7. మనదేశానికి కార్యనిర్వహణ అధిపతి ఎవరు? (రాష్ట్రపతి)
8. పార్లమెంటు ఆమోదించిన ప్రతి బిల్లు ఎవరి ఆమోదం పొందితేే చట్టమవుతుంది? (రాష్ట్రపతి)
9. 'సామ్యవాద, లౌకిక, జాతీయ సమైక్యత' పదాలను ఎన్నవ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశికలో చేర్చారు?
(42వ రాజ్యాంగ సవరణ)
10. 'రాజ్యాధిపతిని ప్రజలేఎన్నుకొనే రాజ్యాన్ని' ఏమంటారు?
(గణతంత్ర రాజ్యం)
11. జమ్మూ-కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న అధి కరణం ఏది?(అధికరణం 370)
12. జమ్మూ - కాశ్మీర్‌ రాజ్యాంగాధి నేతను పూర్వం ఏమని పిలిచే వారు? (సదర్‌-యి-రియాసత్‌)
13. ప్రస్తుతం రాజ్యాంగాధినేతను ఏమని పిలుస్తున్నారు? (గవర్నర్‌)
14. జమ్మూ-కాశ్మీర్‌ ప్రభుత్వ అధినేతను పూర్వం ఏమని పిలిచేవారు?(ప్రధానమంత్రి)
15. ప్రస్తుతం ప్రభుత్వ అధినేతను ఏమని పిలుస్తున్నారు?
(ముఖ్యమంత్రి)
16. రాజ్యాంగసవరణలో అతి సుదీర్ఘ మైన సవరణ ఏది? (44వ రాజ్యాంగ సవరణ)
17. 'మినీ రాజ్యాంగం' అని పేరు పొందిన సవరణ ఏది? (42వ రాజ్యాంగ సవరణ)
18. రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్‌లో 'అధికార విభజన' గురించి తెలిపారు?
(7వ షెడ్యూలు)
19. దేశ పాలనకు సంబంధించిన అంశా లను రాజ్యాంగం ఎన్ని జాబితాల క్రింద విభజించింది? (3 జాబితాలు. 1. కేంద్ర జాబితా 2. రాష్ట్ర జాబితా 3. ఉమ్మడి జాబితా)
20. కేంద్ర జాబితాలోని పాల నాంశాలపై చట్ట నిర్మాణాధికారం ఎవరికి ఉంది? (పార్లమెంటు)
21. రాష్ట్ర జాబితాలోని పాలనాంశా లపై చట్టాలను ఎవరు ఆమోదిస్తారు?
(రాష్ట్ర శాసనసభ)
22. ఉమ్మడి జాబితాలోని ఒక అంశంపై కేంద్ర, రాష్ట్రాలు ఆమోదించిన చట్టా లలో వైరుధ్యం ఉంటే ఎవరిచట్టం అమలులోకి వస్తుంది? (కేంద్రచట్టం)
23. రాజ్యాంగంలోని ఏ నిబంధన ప్రకారం 'ఎన్నికల సంఘం' భారతదేశంలో ఏర్పాటైంది? (నిబంధన 324)
24. ఎన్నికల సంఘానికి అధ్యక్షుడు ఎవరు? (ప్రధాన ఎన్నికల కమిషనర్‌)
25. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను ఏవిధంగా తొలగించవచ్చు?
(హాజరై, ఓటింగ్‌లో పాల్గొన్న సభ్యులలో మూడింట రెండు వంతుల మెజారిటీతో పార్లమెంటు అభిశంసన తీర్మానాన్ని ఆమోదించడం ద్వారా)
26. ప్రధానమంత్రికి ఇచ్చే జీతభత్యాలను ఎవరు యిస్తారు? (పార్లమెంటు)
27. లోక్‌సభ, రాజ్యసభ సభ్యుడు కానప్ప టికి, రెండు సభల కార్యకలాపాలలో పాల్గొనే అధికారం ఎవరికి ఉంది? (అటార్ని జనరల్‌)
28. విధి నిర్వహణలో భారతదేశంలోని అన్ని న్యాయస్థానాలలోకి ప్రవేశించే అర్హత ఎవరికిఉంది? (అటార్ని జనరల్‌)
29. మన రాజ్యాంగాన్ని అనుసరించి సార్వ భౌమాధికారం ఎవరి చేతుల్లో వుంది? (ప్రజలు)
30. రాజ్యాంగంను అనుసరించి, మన దేశంయొక్క పేరు ఏమిటి?
(భారత్‌ / ఇండియా)
31. మన రాజ్యాంగంలో 'ప్రాథమిక బాధ్యతలు' అనే అంశాన్ని ఎప్పుడు చేర్చారు? (1976)
32. ఈ మధ్య రాజ్యాంగంలోని ఏ అధి కరణకు సవరణ చేయాలనే అంశం చర్చలోనికి వచ్చింది?
(356వ అధికరణం)
33. 356వ అధికరణం దేనికి సంబం ధించినది? (రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలనకు సంబంధించినది)
34. ఎవరి అధ్యక్షతన 'రాష్ట్రాల పునర్విభజన సంఘం' నియమించ బడింది?
(జస్టిస్‌ ఫజల్‌ అలి)
35. 77వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏయే భాషలను రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో చేర్చారు?
(నేపాలి, మణిపురి, కొంకణి)

Tags  భారత రాజ్యాంగం -బిట్స్ ,Political Science, Civics, GK Bits, 44వ రాజ్యాంగ సవరణ, 42వ రాజ్యాంగ సవరణ,శ్రేయోరాజ్య స్థాపన

నినాదాలు- ఇచ్చిన వ్యక్తులు



1) ‘స్వరాజ్యం నా జన్మహక్కు దానిని సాధించి తీరుతాను’ అన్నదెవరు?- బాలగంగాధర తిలక్

2) ’డిల్లీ చలో’, ‘జై హింద్’ నినాదాలు ఇచ్చిందెవరు- సుభాష్‌చంద్రబోస్

3) ‘ప్రతి కంటినుండి కారే కన్నీరు తుడవడమే నా అంతిమ లక్ష్యం’ అని పలికిన జాతీయోద్యమ నాయకుడు ఎవరు?
జవహర్‌లాల్ నెహ్రూ

4) ‘జై జవాన్- జై కిసాన్’ అన్నదెవరు?- లాల్‌బహదూర్‌శాస్ర్తీ

5) ‘వేదాలకు మరలండి’ అన్నదెవరు?-  దయానంద సరస్వతి


6) ‘ఒకే దేశం, ఒకే దేవుడు, ఒకే కులం, ఒకే ఆలోచన, తేడా ఏమీ లేకుండా, అనుమానం ఏమీలేకుండా మేమందరం అన్నదమ్ములం’అని పలికిన నాయకుడు ఎవరు?
 వి.డి.సావర్కర్

7) ‘చేయండి లేదా చావండి’ (డూ ఆర్ డై) అని క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో పిలుపునిచ్చినదెవరు?
 మహాత్మాగాంధీ
8) ‘నాకు రక్తానివ్వండి మీకు స్వాతంత్య్రం ఇస్తాను’ అని పలికినదెవరు-  సుభాష్ చంద్రబోస్

9) ‘బెంగాల్ విభజన తర్వాత భారతదేశంలో నిజమైన చైతన్యం పెంపొందిందని బెంగాల్ విభజన దినం బ్రిటీష్ సామ్రాజ్య పతన దినంగా పరిగణించాలని’ పేర్కొన్న జాతీయోద్యమ నాయకుడు ఎవరు?- మహాత్మాగాంధీ

10) ‘పిచ్చాసుపత్రుల వెలుపల ఉన్న పిచ్చివారు మాత్రమే స్వాతంత్య్రం గురించి ఆలోచిస్తారు, మాట్లాడతారు’ అని పలికిన మితవాద నాయకుడు ఎవరు?- గోపాలకృష్ణ గోఖలే

11) ‘అవసరమైతే చిరిగిన చొక్కా తొడుక్కో గాని, ఒక మంచి పుస్తకం కొనుక్కో’ అన్న గొప్ప సంఘ సంస్కర్త ఎవరు?
 కందుకూరి వీరేశలింగం

12) ‘రాజకీయ స్వేచ్ఛ అన్నది జాతికి ప్రాణవాయువు’ అని పల్కిన జాతీయోద్యమ నాయకుడు ఎవరు?-అరబిందో ఘోష్

13) ‘ఆధునిక విద్య, విజ్ఞానాలను ఆర్జించకుండా మన జాతి పురోగమించడం సాధ్యంకాదు’ అని ప్రబోధించినవారు ఎవరు?-  రాజారామ్మోహన్‌రాయ్

14) ‘హిందువులు, ముస్లింలు భారతదేశానికి రెండు కళ్ళు లాంటివారు’ అని పలికిన జాతీయోద్యమ నాయకుడు ఎవరు?- సయ్యద్ అహ్మద్‌ఖాన్

15) ‘పోరాడితే పోయేది ఏమీలేదు బానిస సంకెళ్ళు తప్ప ప్రపంచ కార్మికులారా ఏకం కండి’ అని పిలుపునిచ్చిందెవరు?-  కార్ల్‌మార్క్స్

16) ‘మనిషి స్వేచ్ఛగానే జన్మించాడు కానీ ఎక్కడ చూసినా బంధితుడే’ అన్నదెవరు?- రూసో

17) ‘నీకు బానిసగా ఉండుటకు ఇష్టం లేనప్పుడు యజమానిగా ఉండటం కూడా ఇష్టపడకూడదు’ అన్నవారు ఎవరు?- అబ్రహం లింకన్

18) 'భూమిపై పుట్టే ప్రతి వ్యక్తి ఆర్థికంగా నరకాన్ని సృష్టించిన వాడవుతాడు’ అని పలికిన ఆర్థికవేత్త ఎవరు?- మాల్థన్

19) ‘మానవ పరిణామక్రమాన్ని ఒక గంట సినిమా తీస్తే అందులో 59 ని. శిలాయుగానికే సరిపోతుంది’ అని పలికినదెవరు?- హైమెనీలెనీ

20) ‘నేనే విప్లవాన్ని, నేనే విప్లవ శిశువుని’ అన్నదెవరు?- 14వ లూయి 

21) ‘స్ర్తిలకు ప్రసవం ఎలాగో దేశానికి స్వాతంత్య్రం అలాగే..’ అని పిలుపునిచ్చినదెవరు?- ముస్సోలినీ


22) ‘చైనా నిద్రావస్థలో వున్న పెనుభూతం దానికి మెలకువ వచ్చిననాడు ప్రపంచంపై పాశ్చాత్య దేశాల పెత్తనం అంతమవుతుంది’ అని అన్నదెవరు?- నెపోలియన్ బోనపార్టీ 

23) ‘సంగీత విద్వాంసుడు ఫిడేల్‌ను ప్రేమించినట్లే నేను అధికారాన్ని ప్రేమిస్తాను’ అని ఎవరు అన్నారు?- మొదటి నెపోలియన్

24) ‘స్ర్తి వ్యక్తిత్వానికి మాతృత్వం ఎలాంటిదో జాతుల వికాసానికి యుద్ధం అలాంటిది’ అన్నదెవరు?- హిట్లర్

25) ‘యుద్ధం ప్రష్యా దేశంలో ఒక జాతీయ పరిశ్రమ’ అని పల్కినదెవరు?- మిరాబో
Tags:నినాదాలు- ఇచ్చిన వ్యక్తులు ,History, GK Bits, చరిత్ర - మొట్టమొదటి వ్యక్తులు,తెలుగు జనరల్ నాలెడ్జి, జనరల్ నాలెడ్జి

Followers