'నేనెవరిని' అంటున్న 'బాహుబలి'


'nenevarini' antunna 'baahubali'



ఎట్టకేలకు 'బాహుబలి' ట్రైలర్‌ విడుదలైంది. హిందీలో కరణజోహార్‌ సోమవారం సాయంత్రం విడుదల చేశారు. తెలుగులో ఉదయమే అన్ని థియేటర్లలో ట్రైలర్స్‌ వెళ్ళాయి. కాగా, విలేకరులకు ప్రత్యేకంగా ప్రసాద్‌మల్టీప్లెక్స్‌లో సోమవారంనాడు 4గంటలకు ట్రైలర్‌ చూపించారు. హాలీవుడ్‌ సినిమాను చూసిన రేంజ్‌లో ఆ ట్రైలర్‌ వుంది. డాల్బీ సౌండ్‌లో ఎఫెక్ట్‌గా అనిపించిన ఆ ట్రైలర్‌లో.. బాహుబలి పాత్రధారి ప్రభాస్‌ను ఓ సన్నివేశంలో కొండిపాంతంవారు చూసి గౌరవంగా నమస్కారం చేస్తుంటారు.. వీరంతా నాకెందుకు నమస్కారంపెడుతున్నారు.. అసలు నేనెవర్ని' అంటూ ప్రశ్నిస్తాడు. అమరేంద్రబాహుబలి వంశీయుడువు అంటూ వాయిస్‌ ఓవర్‌ వినిపిస్తుంది. ఇది ఓ రాజవంశానికి చెందిన చరిత్రగా చెప్పేశాడు. అప్పటి కాలంనాటి రాజవంశీయులు బానిన వ్యవస్థలు వంటి నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుందని తెలిసింది. తన వంశాన్ని నమ్ముకున్న ప్రజలకు బాహుబలి ఏంచేశాడనేది మొదటిపార్ట్‌గా కన్పిస్తుంది. కాగా, ఈచిత్రం జులై 12న విడదులచేయడానికి యుద్ధ ప్రాతిపదికన సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.


శ్రీలంక తెరపై తమిళ కూటమి

శ్రీలంకలో మైనార్టీ తమిళులకు ప్రాతినిధ్యం వహిస్తున్న మూడు తమిళ రాజకీయ పార్టీలు కొత్త రాజకీయ కూటమిగా ఏర్పడాలని నిర్ణయించాయి. ఇప్పటి వరకూ తమిళులకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రధాన పార్టీ 'తమిళ జాతీయ కూటమి' దేశ ఉత్తర, ఈశాన్య ప్రాంతాలలో వున్న తమిళులకు మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నదని పశ్చిమ ప్రావిన్స్‌లోని తమిళులకు చెందిన మైనార్టీ పార్టీ డెమొక్రాటిక్‌ పీపుల్స్‌ ఫ్రంట్‌ నేత మనో గణేశన్‌ అన్నారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ కూటమిలో భాగస్వాములు కాబోతున్న మరో రెండు పార్టీలు సెంట్రల్‌ హిల్‌ ప్లాంటేషన్స్‌ ప్రాంతానికి చెందినవని వివరించారు. తమిళులు కేవలం ఉత్తర ఈశాన్య ప్రాంతాల్లో మాత్రమే కాక పశ్చిమ, వాయవ్య, మధ్య, నైరుతి రాష్ట్రాల్లోనూ నివశిస్తున్నారని ఆయన చెప్పారు. ఈ ప్రాంత తమిళులకు టిఎన్‌ఎ ప్రాతినిధ్యం వహించటం లేదని అందువల్లే ఆయా ప్రాంతాలకు చెందిన తమిళ పార్టీలు నేషనల్‌ యూనియన్‌ ఆఫ్‌ వర్కర్స్‌ (ఎన్‌యుడబ్ల్యు), కంట్రీస్‌ పీపుల్స్‌ ఫ్రంట్‌ (యుసిపిఎఫ్‌)లతో కలిసి కూటమి ఏర్పాటు చేస్తున్నామని ఆయన వివరించారు. భారత సంతతి తమిళులన్న మాటను నిలిపివేయాలని వారు కేవలం తమిళులు మాత్రమేనని
వారికి భారత సంతతి అన్న తోక ఎందుకని ఆయన ప్రశ్నించారు. త్వరలో పార్లమెంట్‌ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఈ కొత్త తమిళ కూటమి అధికార యుఎన్‌పికి చెందిన ప్రధాని రణిల్‌ విక్రమిసంఘేకు కీలకం కానున్నది. గణేశన్‌ దీర్ఘకాలంగా యుఎన్‌పి మిత్రుడిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.

Followers