Make free internet calls - :free call online to cell phone







    • https://ievaphone.com/
    • https://call2friends.com/
    • https://www.poptox.com/





Tags:free call online to cell phone  free call pc to mobile  free call online to mobile in india  free call mobile  free call online pc to mobile  free call online globe  Google voice  free call online without registration free call online to cell phone  free call pc to mobile  free call online to mobile in india  free call mobile  free call online pc to mobile  free call online globe  Google voice  free call online without registration

తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాలు- కలెక్టర్లు- ఎస్పీలు, కమీషనర్లు, డీసీపీలు


కొత్త జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీలను, కొత్త కమిషనరేట్లకు కమిషనర్లు, డీసీపీలను ప్రభుత్వం ఖారారు చేసింది. విజయదశమి సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడుతున్న 21 జిల్లాలకు కలెక్టర్లను నియమిస్తూ, పాత జిల్లాల కలెక్టర్లను కూడా బదిలీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. రేపు ఉదయం 11:13 గంటలకు మంత్రులతొ పాటు కలెక్టర్లు కొత్త జిల్లాల ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. ఇంకా కొన్ని జిల్లాలకు ఎస్పీలు ఖరాలు కావాల్సి ఉంది.

జిల్లా కలెక్టర్లు
ఆదిలాబాద్- జ్యోతి బుధ్ద ప్రసాద్
మంచిర్యాల - ఆర్వీ కర్నన్
నిర్మల్ - ఇలంబర్తి
ఆసిఫాబాద్( కొమరం భీం) - చంపాలాల్

నిజామాబాద్- యోగితా రాణా
కామారెడ్డి - సత్యనారాయణ

కరీంనగర్- సర్పరాజ్ అహ్మద్
పెద్దపల్లి - అలుగు వర్షిణి
జగిత్యాల - శరత్
సిరిసిల్ల (రాజన్న) - కృష్ణ భాస్కర్

వరంగల్ అర్భన్- అమ్రపాలి
వరంగల్ (రూరల్)- పాటిల్ ప్రశాంత్ జీవన్
మహబూబాబాద్ - ప్రీతి మీనన్
జనగామ - దేవసేన
జయశంకర్ - మురళి

ఖమ్మం- లోకేశ్ కుమార్
కొత్తగూడెం (భద్రాద్రి) - రాజీవ్ జీ హన్మంతు

నల్లగొండ- గౌరవ్ ఉప్పల్
సూర్యాపేట - సురేంద్ర మోహన్
యాదాద్రి - అనిత రామచంద్రన్

మెదక్ - భారతి
సంగారెడ్డి-మాణిక్ రాజ్
సిద్దిపేట్- వెంకట్రామరెడ్డి

హైదరాబాద్- రాహుల్ బొజ్జా
రంగారెడ్డి- రఘునందన్ రావు
మేడ్చల్ (మల్కాజిగిరి) - ఎంవీరెడ్డి
వికారాబాద్ - దివ్య

మహబూబ్ నగర్- రోనాల్డ్ రోస్
నాగర్ కర్నూలు - శ్రీధర్
జోగులాంబ - రజత్ కుమార్ షైనీ
వనపర్తి - శ్వేతామహంతి

కమీషనర్లు, డీసీపీలు
వరంగల్ కమిషనర్- అకున్ సబర్వాల్
కరీంనగర్ కమిషనర్- కమలహాసన్ రెడ్డి
సెంట్రల్ జోన్ డీసీపీ- జ్యోయల్ డెవిస్
సిద్దిపేట్ కమిషనర్- శివకుమార్
నిజామాబాద్ కమిషనర్ -కార్తీకేయ
మాదాపూర్ డీసీపీ- విస్సా ప్రసాద్
రామగుండం కమిషనర్- విక్రజిత్ దుగ్గల్
ఖమ్మం కమిషనర్-షానవాజ్ ఖాసీం
శంషాబాద్ డీసీపీ- పద్మజారెడ్డి


జిల్లాల ఎస్పీలు
సూర్యాపేట ఎస్పీ - పరిమళ నూతన్
నల్లగొండ- ప్రకాశ్ రెడ్డి
యాదాద్రి- యాదగిరి
సిరిసిల్ల - విశ్వజిత్
నిర్మల్- విష్ణు వరియార్
మెదక్- చందన దీప్తి
కొత్తగూడెం- అంబర్ కిషోర్ ఝా
కామారెడ్డి-
జగిత్యాల- అనంత్ శర్మ
ఆదిలాబాద్- శ్రీనివాస్
వనపర్తీ జిల్లా ఎస్పీ- రోహిణి
నాగర్ కర్నూల్- సింగన్ వార్
ఆసిషాబాద్- సన్ ప్రీత్ సింగ్
ఆచార్య జయశంకర్ జిల్లా- భాస్కర్
గద్వాల జిల్లా ఎస్పీగా- విజయ్ కుమార్






కొత్త జిల్లాలకు ఇంటర్ విద్యాధికారులు


హైదరాబాద్: కొత్తగా ఏర్పడిన జిల్లాలకు ఇంటర్ విద్యాధికారులను నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
కరీంనగర్, జగిత్యాల- ఎల్ సుహాసిని
మంచిర్యాల, పెద్దపల్లి- ప్రభాకర్ దాసు
సిరిసిల్ల-రామచందర్
ఆదిలాబాద్, నిర్మల్, ఆసీఫాబాద్- బి. నాగేందర్
నిజామాబాద్, కామారెడ్డి-ఓదెన్న
వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్- కేవీ ఆనంద్
మహబూబాబాద్, భూపాలపల్లి-ఎస్ కే అహ్మద్
జనగామ-వై. శ్రీనివాస్
ఖమ్మం, కొత్తగూడెం- ఆండ్రూస్
సూర్యపేట- ప్రకాష్ బాబు
నల్లగొండ, యాదాద్రి- హన్మంతరావు
హైదరాబాద్-కాదీనాథ్
శంషాబాద్-మహమూద్ అలీ
మహబూబ్‌నగర్, వికారాబాద్- విజయలక్ష్మీ
మల్కాజ్‌గిరి- ప్రభాకర్
వనపర్తి, నాగర్ కర్నూల్- సుధాకర్
సంగారెడ్డి- కిషన్
సిద్ధిపేట, మెదక్- నాగమునికుమార్


అణు సామర్థ్యం కలిగిన పృథ్వి-II క్షిపణి ప్రయోగం విజయవంతం

భారత్ పూర్తీ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన అణు ఆయుధాలను మోసుకుపోగల సామర్ధ్యం గల పృథ్వి-II క్షిపణిని రక్షణశాఖ 26 నవంబర్ 2015న ఒడిషా తీరంలోని చాందీపూర్ విజయవంతంగా పరీక్షించింది.
భూతలం నుంచి భూతల లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం కలిగిన ఈ క్షిపణిని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటిఆర్)లోని మూడవ లాంచ్ కాంప్లెక్స్‌ నుంచి మొబైల్ లాంచర్ పైనుంచి ఉదయం 12 గంటల 10 నిమిషాలకు సైన్యంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ ఈ పరీక్షను నిర్వహించింది.
350 కిలో మీటర్ల దూరంలో లక్ష్యాన్ని చేధించగల సామర్ధ్యం ఉన్న పృథ్వి-2 క్షిపణి 1000 కిలోల బరువు ఉన్న అణు ఆయుధాలను మోసుకోనిపోగల సామర్ధ్యం కలిగి ఉంది.
2003లో సైన్యం అమ్ముల పొదిలో చేరిన పృథ్వి క్షిపణ మన దేశం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇంటిగ్రేటెడ్ క్షిపణి అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా రూపొందించిన తొలి క్షిపణి.
2014లో కూడా ఈ క్షిపణిని ఒడిషా తీరంలోని చాందీపూర్ పరీక్షించారు.

మాతృ మూర్తి కి క్రొత్త నిర్వచనం..



కడుపుతో ...ఆమె
..................................
తాళికట్టిన మరునిముషంలోనే
కట్టిన తాళితో అమె మీద..
సర్వ హక్కులూ..నాకు వచ్చేశాయి.
ఆమె నా భార్య
పెళ్ళి పేరుతోనో..ప్రేమ పేరుతోనో..
ఆమె మీద..
పగబట్టిన నేను...
పూర్తి మగజంతువుగా మారిపోయి
చీకటిలో.. నాలుగు గోడల మధ్య చేసిన..
రహస్య యుద్ధ జ్వాల
పరుగెత్తుకుంటూ వెళ్ళి..ఆమె లోపలెక్కడో దాగున్న
మాత్రుబిందువును..తాకగానే..
ఆమె ఓ కొత్త రక్త చరిత్రగా..ఆమె ఓ కొత్త స్రుస్టి ధరిత్రిగా మారిపోతుంది.
నన్ను.. స్పర్శించిన చేతులు అవే..
నన్ను.. ప్రేమించిన స్పర్శ అదే..
కానీ ఆమె నన్ను తాకగానే ..
అమె కాక కొత్త గా మరెవ్వరో నన్ను
తాకుతున్న అనుభూతి మొదలవుతుంది.
ఆమె వయిపు నేను చూడగానే
ఆమెలో దాక్కుని
నన్నెవ్వరో కొత్త గా
చూస్తున్న అనుభూతి కలుగుతుంది..
స్రుష్టి అనేది దిగ్బ్రాంతంగా..విభ్రాంతంగా
నా కళ్ళ ఎదుటే
ఓ రూపాన్ని సంతరించుకుంటూంది
మనిషి రూపంలో..ఓ దీపాన్ని వెలిగించటానికి
మరో మనిషి ..స్త్రీ మూర్తి.. దీపంలా
నిలువునా కాలుతుండటాన్ని
నా ఎదురుగానే..నేను చూస్తాను..
కర్తను నేనయినా..
క్రియ మొత్తం ఆమెదే..
కత్తిని నేనయినా
గాయం మాత్రం ఆమెదే
2
కస్టానికి..సుఖానికి మధ్య
ఎండిపోయిన ఓ చెలమ బావిని తవ్వి..
అందులో చిరునవ్వుతో స్నానం చేస్తున్నట్లు
ఆమె కస్టాన్ని అనుభవిస్తూనే
సుఖాన్ని అనుభూతిస్తున్నట్లు
చుట్టూ ప్రపంచాన్ని ఎంతగా భ్రాంతీకరిస్తుందో..
సుఖం పేరుతో ఆమె కష్టాన్ని తలకెత్తుకున్న విషయాన్ని
ఆమే కాదు.. చుట్టూఎవరూ కూడా గ్రహింఛరు
ఓ అసంకల్పిత మరణమో..ఓ సంకల్పిత కొత్త జీవమో తెలీకుండా
ఆమె ఓ నవ్వుకో ..ఓ దుహ్ఖానికో అంతిమ ద్వారంగా
నిల్చుందన్న విషయాన్ని కూడా ఎవరూ గ్రహించరు.
గుక్కెడు నీళ్ళు కూడా కడుపులో ఇమడవు
తీరని దాహంతో పైకి నవ్వుతూ
లోపల్లోపల విలవిలాడుతూ ఉండాలి.
పిడికెడు మెతుకులు కూడా కడుపులో ఆగవు.
తీరని ఆకలితో పైకి నవ్వుతూ
లోపల్లోపల గిలగిల లాడుతూ ఉండాలి.
సుఖించటమంటే... దుహ్ఖించటానికే అన్న
మాటలకు కొత్త రెక్కలొస్తాయి.
ఎడారి బావిలో ఎక్కడో నీళ్ళూరుతున్నట్లు
ఆమె సరీరం లో మరో శరీరం ఏదగటం
స్పస్టంగా పైకే తెలుస్తూనే ఉంటుంది
తనకు తానుగా ఓ దైవరూపంగా
మారిన ఆ స్త్రీ దివ్యత్వంలో ఇమిడిపోయిన
ప్రాణ ప్రవాహాన్ని స్పర్శించటానికి ..ఎంతటి మహాయోధుడయినా
తనకు తానుగా..ఓ నక్షత్ర హారతిలా మారి
ఆమె ముందు సాస్టాంగ పడ వలసిందే.
3
స్త్రీ కడుపుతో ఉండటమంటే
నిముష నిముషానికి రూపాన్ని మార్చుకునే
మండుతున్న నిప్పురవ్వని రహస్యంగా
సమూహంలో కడుపులో దాచుకోని..
మంత్రించిన మంత్రజలాన్ని తాగినట్టు
కొత్త జీవితానికి..నాందీ వాక్యంగా మారటమే.
ఆమె జీవితంలో పగళ్ళన్నీ మండిపొతున్న
మంచుముక్కలవుతాయి.
ఆమె జీవితంలో రాత్రుళ్ళన్నీ మేల్కోని మండుతున్న
చలిమంటలుగా మిగులుతాయి.
తన శరీరం బరువుకి తనే కుంగిపోతుంటే
నిలువెత్తు అద్దంలో ..తన ప్రతిబింబమే తనకు
భయంగొల్పేలా మారిపోయి ....
ఆమె అద్దాన్ని చూసుకోవటాన్ని మర్చిపోయినప్పుడు
అయ్యో అంటూ ఆ..పుణ్యం నాదే అనిపిస్తుంది..
అయ్యో అంటూ ఆ.. పాపం కూడా నాదే అనిపిస్తుంది.
అది కామమో ..అది మోహమో ..
మొగవాడి మూడు నిముషాల పోరాటానికి
తన శరీరాన్ని స్వరాలుగా మార్చుకున్నందుకు
కనిపించకుండా సహస్ర జననాలు ఒక్కచోటే అయినట్టు
రహస్యంగా సహస్ర మరణాలు ఒక్క చోట పోగుపడ్డట్టు
ఊపిరికి ..ఊపిరికి కిమధ్య
ఒక్క చోటే...సత్యాన్ని..అసత్యాన్ని చూసినట్లు..
ఆమె శరీరం మొత్తం గగుర్పాట్లతో
ఆమె శరీరం మొత్తం అదిరిపాట్లతో..
ఎప్పుడూ లేని కొత్త ఉలికిపాట్లకు లోనవుతూ ఉంటుంది
4
ఓ హత్యానంతర ద్రుశ్యాన్ని..
హత్యకు ముందుగానే చూస్తూ..చూపిస్తూ
దేహంతో మొదలయిన ప్రయాణం
తొమ్మిది నెలలతో దేహంతోనే అంత్యాంకానికి జేరుతుంది
అది జననమో.. మరణమో...తెలీని
అవ్యక్త నిరామయ అయోమయంలో నమ్రతగా నిలబడినచోట
ప్రతినిముషం కళ్ళముందు ఏవో దెయ్యాలు తిరుగుతున్నట్టనిపిస్తుంది.
తను బతుకుతుందో ..తను చచ్చిపోతుందో తెలీని సందిగ్ధంలో
అమానుష ఏకాంతంలో ఆమెనే ముణిగిపొతూ ఉంటుంది
కడుపులో ఉన్న శిశువు అటూ ఇటూ తిరిగినఫ్ఫుడు
కాల్లతో లోపల్నించే తన్నినప్పుడు ..
కళ్ళవెంట తెలియకుండానే నీళ్ళు తిరుగుతుంటాయి.,
నెలలు నిండిన అమెని చూసినప్పుడు
ఎలుగెత్తి మరీ ""నన్ను క్షమించు""అని ఆమెకి చెప్పాలనిపిస్తుంది.
ఏదో తెలియని పస్చాత్తాపం
నన్ను నిలువునా కోస్తున్నట్టనిపిస్తుంది.
గుంభనంగా దాచుకున్నదాచుకున్న భయం
బయటకు తన్నుకొస్తూండగా ..బేలగా ..జాలిగా నా వైపు చూస్తూ
ఆమె ఆసుపత్రి లోపలకు వెళ్ళిపోతుంది.
తన రక్తాన్ని తన ప్రాణాలని ధారబోసి
పురుడు అవగానే ఆమె నా వైపు చూసిన చూసిన మొదటిచూపులో
మ్రుత్యువును జయించిన అనుభూతి...
నన్ను స్త్రీత్వం ముందు చేతులు మోడ్చి
శిలగా మిగిల్చిన నిజత్వంలో..నన్ను తండ్రిగా మిగిల్చిన
ఆమె కరుణత్వాన్ని తల్లిపేరుతో కొలవాలా
భార్య పేరుతో నిర్వచించాలా..?
................................................
త్వరలో విడుదల అవుతున్న
""మీరొకప్పుడు బ్రతికుండే వారు""
కొత్త కవితాసంపుటి లోనుంచి
.................................. కొనకంచి లక్ష్మి నరసింహా రావు: facebook link

telangana history books in telugu pdf


Click here for Telangana History in Telugu PDF

Click here for Telangana History Important Dates PDF

For More Telangana History Book Click Here


    TAGS
    telangana history books in english pdf, telangana history books in telugu pdf, telangana history reference books, telangana history text books in English, telangana history text books in telugu


తెలంగాణ : కొత్తగా 2200 పోస్టులు?

జిల్లాల పునర్వ్యవస్థీకరణ నేపధ్యంలో మరిన్ని పోస్టులకు ప్రభుత్వం ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తోంది. ఇటీవలే రెవెన్యూ శాఖలో 2వేలకు పైగా పోస్టులకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన ప్రభుత్వం.. మరో 2200 పోస్టులు భర్తీ చేయాలని యోచిస్తోంది. పలు శాఖలలో ఖాళీగా ఉన్న పోస్టులకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తోంది. జిల్లాల పునర్వ్వస్థీకరణతో కొత్తగా 120 మండలాలు, 21 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటవుతున్న విషయం విదితమే. ఇప్పటి లెక్క ప్రకారం ప్రతి జిల్లా కలెక్టరేట్‌కు 89 పోస్టులు అవసరమవుతాయి. అది కూడా 1977నాటి లెక్కల ప్రకారం చూస్తే అన్ని పోస్టులు కావాలి. కాగా, ఇప్పుడు జిల్లాల పునర్‌వ్యవస్థీకరణతో వాటి జనాభా మరింత పెరిగే వీలున్నందున, పాలన సజావుగా సాగాలంటే కొత్త పోస్టుల మంజూరు తప్పనిసరి అని ప్రభుత్వం భావిస్తోంది. వివిధ శాఖల్లో 2200 పోస్టులు భర్తీ చేసే అంశాన్ని చురుకుగా పరిశీలిస్తోంది. కాగా, జిల్లా, డివిజన, మండలాల పునర్‌వ్యవస్థీరణతో ఇటీవలే రెవెన్యూశాఖకు కొత్తగా 2109 పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. వీటిలో చాలా పోస్టులను పదోన్నతుల ప్రాతిపదికన, మరికొన్ని డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా భర్తీ చేయనున్నారు. జేసీ అధికారాలపై నేడే నివేదిక
జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ నేపథ్యంలో కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌, జిల్లా రెవెన్యూ అధికారుల అధికారాలకు సంబంధించి సాధారణ పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శి అధర్‌సిన్హా నేతృత్వంలోని కమిటీ సోమవారం ప్రభుత్వానికి నివేదిక అందించనుంది. నివేదిక ఆధారంగా కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు, డీఆర్వోల అధికారాలను వర్గీకరిస్తూ జీవోనెం.77ను(ఉమ్మడి రాష్ట్రంలో కలెక్టర్‌, జేసీ అధికారాల జీవో) సవరిస్తూ ఉత్తర్వులు ఇవ్వనుంది.

మిషన్ కాకతీయ, తెలంగాణ హరితహారం


చెరువులు... పాడి పంటలకు పట్టుకొమ్మలు. కాకతీయుల కృషితో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో గొలుసు కట్టు చెరువులు అభివృద్ధి చెందాయి. అనంతర కాలంలో పాలకుల నిర్లక్ష్యం, పూడిక, ఆక్రమణలు ఫలితంగా చెరువులు తమ ప్రాభవాన్ని కోల్పోయాయి. ప్రభుత్వం చేపట్టిన ‘మిషన్ కాకతీయ’తో చెరువులు తిరిగి జల సిరులను సంతరించుకుంటున్నాయి. ఇందులో భాగంగా తొలి దశలో రూ. 2,611 కోట్లు ఖర్చు చేసి, 8,217 చెరువులను పునరుద్ధరించారు. 2016, జనవరి నుంచి జూన్ వరకు రెండో దశ మిషన్ కాకతీయ చేపట్టనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
కృత్రిమ పద్ధతులను ఉపయోగించి, పంట పొలాలకు నీటి వసతిని కల్పించడాన్ని నీటిపారుదల అంటారు. తెలంగాణలో నీటిపారుదలకు సంబంధించి కాకతీయులు విశేష కృషి చేశారు. కాకతీయ రాజులు 12వ శతాబ్దంలో చిన్న, చిన్న నదులకు ఆనకట్టలు కట్టడం ద్వారా నీటి పారుదల సౌకర్యాలు కల్పించారు. అంతేకాకుండా వారు పెద్ద సంఖ్యలో చెరువులను కూడా తవ్వించారు.
కాకతీయులు రామప్ప చెరువు, పాకాల, లక్నవరం చెరువులు వంటి పెద్ద చెరువులనే కాకుండా చిన్న చెరువులను కూడా తవ్వించారు. కాకతీయుల అనంతరం నిజాం పరిపాలన కాలంలో నిర్మించిన ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్, నిజాంసాగర్ వంటి నీటిపారుదల ప్రాజెక్టులు ప్రజల తాగు, సాగునీటి అవసరాలను తీరుస్తున్నాయి.

చెరువుల పుట్టిల్లు తెలంగాణ
  • దక్కన్ పీఠభూమిలో ఉన్న తెలంగాణ రాష్ర్టం చెరువుల నిర్మాణానికి అనువైన ప్రాంతం.
  • శాతవాహనుల కంటే ముందే తెలంగాణలో చెరువుల నిర్మాణం ఉందనడానికి చారిత్రక ఆధారాలున్నాయి.
  • కాకతీయుల కాలంలో మాత్రం చెరువుల నిర్మాణం అత్యున్నత ప్రమాణాలతో సాగినట్లు తెలుస్తోంది.
  • కాకతీయులు నిర్మించిన రామప్ప, పాకాల, లక్నవరం, ఘనవరం, బయ్యారం వంటి అనేక పెద్ద చెరువులు నేటికీ సేవలు అందిస్తున్నాయి.
  • కాకతీయుల తర్వాత తెలంగాణను పాలించిన కుతుబ్‌షాహీలు, అసఫ్‌జాహీలు, వివిధ సంస్థానాధీశులు చెరువుల నిర్మాణాన్ని కొనసాగించి, వ్యవసాయ విస్తరణకు తోడ్పడ్డారు.
  • తెలంగాణలో ప్రతీ ఊరికి ఒక చెరువు తప్పనిసరిగా ఉండేది. ఒకటి కంటే ఎక్కువ చెరువులు ఉన్న గ్రామాలు తెలంగాణలో చాలా ఉన్నాయి.
  • ప్రత్యేక తెలంగాణ ఏర్పాటయ్యాక రాష్ర్ట ప్రభుత్వం పునర్నిర్మాణంపై దృష్టి సారించింది.
  • పునర్నిర్మాణం ప్రధానంగా సాగునీటి రంగంపై ఆధారపడి ఉందని భావించిన ప్రభుత్వం చెరువుల పునరుద్ధరణకు ప్రత్యేక కార్యచరణ ప్రకటించింది.
  • చెరువుల పునరుద్ధరణ జరిగితే తెలంగాణలో వలసలు తగ్గుతాయి. గ్రామాల్లో అనేక కులవృత్తుల ప్రజలకు జీవనోపాధి లభిస్తుంది.
  • చెరువులను పునరుద్ధరించి వాటి నిల్వ సామర్థ్యాన్ని పెంచడం ద్వారా వ్యవసాయాభివృద్ధి సాధించాలని ప్రభుత్వం భావిస్తోంది.
మిషన్ కాకతీయ
  • తెలంగాణలో వేల సంఖ్యలో చెరువులను తవ్వించిన కాకతీయుల స్ఫూర్తిగా రాష్ర్ట ప్రభుత్వం మిషన్ కాకతీయను ప్రారంభించింది.
  • తెలంగాణ రాష్ర్ట ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు 2015, మార్చి 12న నిజామాబాద్ జిల్లా సదాశివనగర్ మండలం పాత చెరువులో ‘మిషన్ కాకతీయ’ పైలాన్‌ను ప్రారంభించారు.
  • ఈ కార్యక్రమం ద్వారా చెరువులను పునరుద్ధరించి కాకతీయుల కాలం నాటి శోభను తిరిగితెచ్చేందుకు ప్రభుత్వం దృఢసంకల్పంతో ముందుకు సాగుతోంది. మిషన్ కాకతీయ కార్యక్రమం ద్వారా 46 వేలకు పైగా చెరువులను పునరుద్ధరించనున్నారు. దీని కోసం ప్రభుత్వం భారీ మొత్తంలో వ్యయం చేయనుంది.
  • 2014-15 నుంచి దశల వారీగా చెరువుల పనరుద్ధరణ జరగనుంది. ఏడాదికి ఐదో వంతు చొప్పున మొత్తం 46,531 చెరువులను పునరుద్ధరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొంది. ఇందులో భాగంగా ‘మిషన్ కాకతీయ’ కోసం 20 వేల కోట్లు ఖర్చు చేయనున్నారు. అన్ని చెరువులను 5 ఏళ్లలో అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
జిల్లాల వారీగా చెరువుల సంఖ్య
1) మెదక్ 7,941
2) మహబూబ్‌నగర్ 7,480
3) కరీంనగర్ 5,939
4) వరంగల్ 5,839
5) నల్గొండ 4,762
6) ఖమ్మం 4,517
7) ఆదిలాబాద్ 3,951
8) నిజామాబాద్ 3,251
9) రంగారెడ్డి 2,851
మొత్తం 46,531

సంవత్సరం-ప్రతిపాదించిన చెరువులు (2014-19)
1) 2014 - 15 9,305
2) 2015 - 16 9,308
3) 2016 - 17 9,430
4) 2017 - 18 9,480
5) 2018 - 19 9,008
మొత్తం 46,531
అనుకున్న స్థాయిలో చెరువుల పునరుద్ధరణ జరిగితే 10.17 లక్షల హెక్టార్లకు సాగునీటి వసతి లభిస్తుంది.

చేపట్టనున్న కార్యక్రమాలు
  • చెరువులు, కుంటల్లోని పూడికను తొలగించి వాటి నీటి నిల్వ సామర్థ్యం పెంచడం.
  • చెరువు కట్టలను బలోపేతం చేయడం, చెరువు అలుగు, తూములకు మరమ్మత్తులు చేయడం.
  • చెరువుల్లో పెరిగిన తుమ్మచెట్లను నరికివేయడం, గుర్రపు డెక్క లొట్టపీసు మొక్కల తొలగింపు.
  • గొలుసు కట్టు చెరువులను పునరుద్ధరిస్తారు.
  • తొలగించిన పూడికను రైతుల పంట భూముల్లో చల్లుతారు.
  • చెరువు కట్ట బలోపేతానికి సరిపడా పూడికమట్టిని వాడుకోవడం.
  • అవసరమైన చోట్ల ఫీడర్ చానళ్లను రీసెక్షన్ చేయడంతో పాటు పూడిక ను తొలగిస్తారు.
  • చెరువుల శిఖం భూములను కబ్జాల నుంచి కాపాడటం.
  • మిషన్ కాకతీయ మొదటి దశలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో ఒక పట్టణ చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి చేస్తారు.
చెరువుల పునరుద్ధరణలో ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి కార్యక్రమాలు
చెరువుల పునరుద్ధరణ వల్ల రైతులు, వ్యవసాయ కూలీలు ప్రత్యక్షంగా ప్రయోజనం పొందనున్నారు. దీంతో పాటు గ్రామాల్లోని అన్ని వర్గాల ప్రజలకు పరోక్షంగా ప్రయోజనం కలగనుంది. చెరువుల మీద ఆధారపడి జీవించే అనేక కులవృత్తులు... రజకులు, కుమ్మరులు, బేస్తవారు, కల్లు గీత కార్మికులు తదితరులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి.

చెరువులు - సాంస్కృతిక కేంద్రాలు
తెలంగాణ రాష్ర్టంలో చెరువులు సాంస్కృతిక కేంద్రాలుగా కూడా విలసిల్లుతున్నాయి. తెలంగాణలో వైభవంగా జరుపుకునే బతుకమ్మ పండగను చెరువు కట్టలపైనే జరుపుకుంటారు.
జిల్లా
ఏడాదికి ప్రతిపాదించిన చెరువులు
మొత్తం చెరువులు
2014-15 2015-16 2016-17 2017-18 2018-19
కరీంనగర్ 1188 1210 1220 1200 1121 5939
ఆదిలాబాద్ 790 800 800 800 761 3951
వరంగల్ 1168 1170 1180 1200 1121 5839
ఖమ్మం 903 910 920 930 854 4517
నిజామాబాద్ 650 650 650 650 651 3251
మెదక్ 1588 1590 1600 1610 1553 7941
రంగారెడ్డి 570 500 570 600 611 2851
మహబూబ్‌నగర్ 1496 1500 1510 1510 1464 7480
నల్గొండ 952 978 980 980 872 4762
మొత్తం 9305 9308 9430 9480 9008 46531
తెలంగాణకు హరితహారం (టీకెహెచ్‌హెచ్)

  • తెలంగాణలో అడవుల విస్తీర్ణం 24 శాతంగా ఉంది. రాష్ర్ట భౌగోళిక విస్తర్ణీంలో వృక్షాల విస్తీర్ణ శాతాన్ని 33 శాతానికి పెంచటం లక్ష్యంగా ప్రభుత్వం ‘తెలంగాణకు హరితహారం’ పథకాన్ని ప్రారంభించింది.
  • ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు 2015, జూలై 3న రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని ‘చిలుకూరు బాలాజీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో ‘సంపంగి’ మొక్కను నాటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
  • కార్యక్రమంలో భాగంగా బహుళ రహదారుల పక్కన, నదులు, కాలువలు, చెరువుల గట్టుల మీద, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ప్రాంగణాల్లో, ఆధ్యాత్మిక ప్రదేశాల్లో, హౌసింగ్ కాలనీల్లో, కమ్యూనిటీ భూముల్లో పెద్ద ఎత్తున మొక్కలు పెంచనున్నారు.
  • హరిత హారం కార్యక్రమంలో అందరినీ భాగస్వాములను చేయనున్నారు.ఇందులో భాగంగా సంబంధిత విధానాలు, చట్టాలు, పాలనాపరమైన అంశాల్లో అవసరమైన మార్పులు చేస్తారు.
  • రానున్న మూడేళ్లలో రాష్ర్ట వ్యాప్తంగా 230 కోట్ల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకొన్నారు. వీటిలో 130 కోట్ల మొక్కలను నోటిఫైడ్ అటవీ ప్రాంతాలకు వెలుపల నాటాలని ప్రతిపాదించారు. ఇందులో భాగంగా 10 కోట్ల మొక్కలను హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) పరిధిలో, మిగిలిన 120 కోట్ల మొక్కలను రాష్ర్టంలోని మిగిలిన ప్రాంతాల్లో నాటనున్నారు.
  • అడవులను సంరక్షించటం, లైవ్ రూట్ స్టాక్‌ను ప్రోత్సహించడం ద్వారా నోటిఫైడ్ అడవుల లోపల వంద కోట్ల మొక్కలను పునరుజ్జీవింప చేయాలని నిర్ణయించారు.
  • ‘మన ఊరు - మన ప్రణాళిక (ఏంవీఎంపీ)’ కార్యక్రమం ద్వారా వచ్చే సూచనల ఆధారంగా హరితహారం కార్యక్రమంలో నర్సరీలు, మొక్కలను నాటే ప్రదేశాలను గుర్తిస్తారు.
  • ఇలా గుర్తించిన 3,888 నర్సరీల్లో 2015లో 40 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ లక్ష్యాన్ని సాధించడానికి అటవీశాఖ, వ్యవసాయ, ఉద్యానవన, గిరిజన సంక్షేమం తదితర శాఖలను కూడా కార్యక్రమంలో భాగస్వామ్యం చేస్తున్నారు.
  • 2016లో మరో 40 కోట్ల మొక్కలను నాటేందుకు భవిష్యత్ ప్రణాళికను రూపొందించారు.
  • చైనా, బ్రెజిల్ తర్వాత తెలంగాణలోనే భారీ ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.


తెలంగాణ రాష్ట్ర స్థూల ఉత్పత్తి - మదింపు ప్రక్రియలు


తెలంగాణ 2014 జూన్ 2న భారతదేశంలో 29వ రాష్ట్రంగా ఆవిర్భవించింది. భౌగోళికంగా ఇది పూర్తిగా దక్కన్ పీఠభూమి మధ్యభాగంలో విస్తరించి ఉంది. రాష్ట్ర విస్తీర్ణం 1,14,840 చదరపు కిలోమీటర్లు. విస్తీర్ణ పరంగా, జనాభా పరంగా ఇది దేశంలో 12వ పెద్ద రాష్ట్రం. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ జనాభా 3,51,93,978 మంది. రాష్ట్రం స్థూల ఆర్థికాభివృద్ధిలో గణనీయ ఫలితాలు సాధిస్తూ ముందడుగేస్తోంది. తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు బలమైన పునాదులున్నాయి. ఈ ప్రాంత భౌగోళిక, వాతావరణ స్థితిగతులు, సహజ వనరుల లభ్యత, సామాజిక నిర్మితి తదితరాలు ఆర్థికాభివృద్ధికి సోపానాలుగా ఉన్నాయి


ఆర్థిక వ్యవస్థను ప్రధానంగా మూడు రంగాలుగా వర్గీకరించారు. అవి:
1. ప్రాథమిక రంగం (Primary Sector)
2. ద్వితీయ రంగం (Secondary Sector)
3. తృతీయ రంగం (Tertiary Sector)
వీటిని వివిధ ప్రధాన వృత్తుల ఆధారంగా విభజించారు. ఒక దేశంలోని జనాభా వివిధ వృత్తుల్లో పనిచేసే తీరును ఈ వృత్తుల వారీ విభజన తెలుపుతుంది. జాతీయ/ రాష్ట్ర ఆదాయానికి ఏయే రంగాల ద్వారా ఎంత ఆదాయం సమకూరుతుందో తెలుసుకోవడానికి, వాటి అభివృద్ధి, పెరుగుదల శాతాల్లో ఏ విధమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయో అర్థం చేసుకొని తగిన సంస్కరణలు ప్రవేశపెట్టడానికి ఈ విభజన తోడ్పడుతుంది. వివిధ ఆర్థిక రంగ అభివృద్ధి ప్రక్రియలు దేశ పురోభివృద్ధి గమనాన్ని, సామాజిక, ఆర్థిక వ్యవస్థలను అధికంగా ప్రభావితం చేస్తాయి.
ప్రాథమిక రంగంలోని ఉప రంగాలు: వ్యవసాయం, పశుసంపద - పాడి పరిశ్రమ, అడవులు - అటవీ ఉత్పత్తులు, మత్స్య పరిశ్రమ, గనులు, తవ్వకాలు.
ద్వితీయ రంగంలోని ఉప రంగాలు: వస్తూత్పత్తి తయారీ పరిశ్రమలు, నిర్మాణ రంగం, విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా.
తృతీయ రంగంలోని ఉప రంగాలు: వ్యాపారం, హోటళ్లు, రెస్టారెంట్లు, రవాణా, నిల్వలు, సమాచార వ్యవస్థ, రైల్వేలు, రక్షణ, తపాలా సేవలు, ఫైనాన్సింగ్, బీమా, రియల్ ఎస్టేట్, బ్యాంకింగ్, సామాజిక వ్యక్తిగత సేవలు, ప్రజాపరిపాలన, ఇతర సేవలు.
సాధారణంగా వ్యవసాయ రంగాన్ని ప్రాథమిక రంగంగా, పారిశ్రామిక రంగాన్ని ద్వితీయ రంగంగా, సేవా రంగాన్ని తృతీయ రంగంగా పేర్కొంటారు. అయితే ‘గనులు, తవ్వకాలు’ అనే ఉప రంగం లేని ప్రాథమిక రంగంలోని అంశాలను వ్యవసాయ రంగంగా భావిస్తారు. ‘గనులు, తవ్వకాలు’ ఉప రంగంతో కూడిన ద్వితీయ రంగంలోని అంశాలను పారిశ్రామిక రంగంగా గుర్తిస్తారు. తృతీయ రంగంలోని అంశాలన్నీ సేవల రంగం కిందకి వస్తాయి. ఈ ముఖ్య ఆర్థిక రంగాల్లో వివిధ ఉప రంగాల వారీగా ఆదాయం, వృద్ధి, మొత్తం ఆదాయంలో వాటి వాటాను మదింపు చేసి జాతీయాదాయం లేదా రాష్ట్ర ప్రాంతీయాదాయాన్ని తెలుసుకుంటారు. ‘కేంద్ర గణాంక సంస్థ’ (Central Statistical Organisation - CSO) జాతీయాదాయాన్ని అంచనా వేస్తుంది. రాష్ట్ర ఆర్థిక గణాంక సంచాలకులు రాష్ట్ర ఆదాయాన్ని అంచనా వేస్తారు. ఇందులో భాగంగా వీరు వివిధ లెక్కింపు పద్ధతుల ద్వారా గణాంకాలను రూపొందిస్తారు.

ఆదాయ మదింపు పద్ధతులు
సాధారణంగా జాతీయ లేదా రాష్ట్ర ఆదాయాన్ని 3 రకాల పద్ధతుల్లో లెక్కిస్తారు. అవి:
1. ఉత్పత్తి లేదా నికర ఉత్పత్తి పద్ధతి
2. ఆదాయ పద్ధతి (నికర ఆదాయ పద్ధతి)
3. వ్యయ పద్ధతి
ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో ఈ మూడు పద్ధతులనే అనుసరిస్తున్నారు. మన దేశంలో (అన్ని రాష్ట్రాల్లోనూ) ఉత్పత్తి, ఆదాయ మదింపు పద్ధతుల ఆధారంగా జాతీయదాయాన్ని గణిస్తున్నారు.
ఉత్పత్తి మదింపు పద్ధతి
దీన్ని విలువ జోడించిన పద్ధతి (Value Added Method), Industrial Origin Method, Inventory Method అని కూడా అంటారు. ప్రముఖ ఆర్థికవేత్త సైమన్ కుజినెట్స్ ఈ పద్ధతిని ‘ఉత్పత్తి సేవా పద్ధతి’గా పేర్కొన్నాడు. ఆర్థిక వ్యవస్థలో ఏడాది కాలంలో జరిగే అంతిమ వస్తు సేవల ఉత్పత్తిని కలిపితే ‘నికర ఉత్పత్తి’ వస్తుంది. ఈ విలువను జాతీయాదాయం లేదా రాష్ట్ర ప్రాంతీయాదాయంగా భావిస్తారు. ఆర్థిక వ్యవస్థలో ప్రాథమిక, ద్వితీయ, తృతీయ రంగాల్లో జరిగిన ఉత్పత్తిని కలిపితే మొత్తం ఉత్పత్తి వస్తుంది. అయితే ఒక రంగంలో జరిగిన ఉత్పత్తిని మరో రంగంలో ఉత్పత్తి కారకాలు (మాధ్యమిక వస్తువులు)గా ఉపయోగించవచ్చు. కాబట్టి వాటి విలువను లెక్కలోకి తీసుకోకూడదు. అంటే ఒకే వస్తువును రెండుసార్లు లెక్కించకూడదు. ఈ పద్ధతిలో.. జాతీయాదాయం = కారకాల దృష్ట్యా నికర దేశీయోత్పత్తి + నికర విదేశీ కారకాల ఆదాయాలు.
ఆదాయ మదింపు పద్ధతి
దీన్ని కారక చెల్లింపు పద్ధతి (Factor Payment Method), వాటాల పంపిణీ పద్ధతి (Distributed Share Method), ఆదాయ చెల్లింపు పద్ధతి (Income Paid Method), ఆదాయ గ్రాహక పద్ధతి (Income Received Method) అని పిలుస్తారు. ఈ పద్ధతిలో జాతీయ/ రాష్ట్ర ఆదాయాన్ని పంపిణీ కోణం నుంచి లెక్కిస్తారు. వివిధ ఉత్పత్తి కారకాలు.. అంటే శ్రమపై వచ్చే వేతనాలు, భూమిపై వచ్చే అద్దె, మూలధనంపై వచ్చే వడ్డీ, పరిశ్రమ వ్యవస్థాపకుడికి వచ్చే లాభాలు, వీటన్నింటి ప్రతిఫలాల మొత్తం విలువతో పాటు నికర విదేశీ ఆదాయాలను కలిపితే వచ్చేదే జాతీయాదాయం. ఈ పద్ధతిలో వివిధ ఉత్పత్తి కారకాల మధ్య జాతీయాదాయం ఏ విధంగా పంపిణీ అయిందో తెలుసుకోవచ్చు. దీంతో పాటు వివిధ వర్గాల ప్రజలకు ఎంతెంత ఆదాయం వస్తుందో అంచనా వేయవచ్చు. ఆదాయ మదింపు పద్ధతిలో.. జాతీయాదాయం = వేతనం + భాటకం + వడ్డీ + లాభాలు + నికర విదేశీ ఆదాయాలు.
వ్యయాల మదింపు పద్ధతి
ఇది ఆధునిక పద్ధతి. దీన్ని ఎక్కువగా అభివృద్ధి చెందిన దేశాల్లో అనుసరిస్తున్నారు. భారతదేశంలో ఇది అంతగా వినియోగంలో లేదు. ఈ పద్ధతిలో వ్యక్తులు, సంస్థలు, ప్రభుత్వం ఒక ఏడాది కాలంలో అంతిమ వస్తు సేవలపై చేసే మొత్తం వ్యయాన్ని లెక్కించడం ద్వారా జాతీయాదాయాన్ని గణిస్తారు. జాతీయాదాయ లెక్కింపు పద్ధతులన్నింటిలో ఇది చాలా కచ్చితమైంది. దీన్ని వినియోగ - పెట్టుబడి పద్ధతి అని కూడా అంటారు. ఈ వ్యయ మదింపు పద్ధతిని ప్రఖ్యాత ఆర్థికవేత్త జే.ఎం. కీన్‌‌స రూపొందించారు. ఈ పద్ధతిలో జాతీయాదాయం = గృహ సంబంధ వ్యయాలు + సంస్థల వ్యయాలు + ప్రభుత్వ వ్యయాలు.
 
ఆదాయ లెక్కింపు - ప్రామాణిక ధరలు
జాతీయ, రాష్ట్ర ప్రాంతీయ ఆదాయాన్ని గణించేటప్పుడు సాధారణంగా రెండు రకాల ధరలను ప్రామాణికంగా తీసుకుంటారు.
ప్రస్తుత ధరల్లో జాతీయాదాయం
ప్రస్తుత సంవత్సరం ఆచరణలో ఉన్న వస్తు సేవల ధరల్లో ఆదాయాన్ని లెక్కిస్తే దాన్ని ‘ప్రస్తుత ధరల్లో ఆదాయం’ లేదా ‘నామమాత్రపు ఆదాయం’ అంటారు.
ఉదా: 2014-15 జాతీయాదాయన్ని లెక్కించేటప్పుడు 2014-15లోని ధరలనే ప్రామాణికంగా తీసుకోవడం.
ప్రస్తుత ధరల్లో ఆదాయాన్ని లెక్కించినప్పుడు.. గతేడాది, ప్రస్తుత సంవత్సరం జాతీయాదాయాలను సరిపోలిస్తే ఉత్పత్తి పెరగనప్పటికీ ధరలు అధికమవడం వల్ల జాతీయదాయం పెరిగినట్లు ఫలితాలు రావచ్చు. ఎందుకంటే వస్తు సేవల ధరలు అనేక కారణాల వల్ల రోజురోజుకూ పెరుగుతుంటాయి. ధరలు పెరగడం వల్ల ఆదాయం అధికమైనట్లు గోచరిస్తుంది. ఈ కారణంగా వాస్తవ వస్తు సేవల ఉత్పత్తులను అంచనా వేయలేం. అందువల్ల ఈ పద్ధతిలో వాస్తవ జాతీయాదాయాన్ని లెక్కించడం వీలు కాదు.
స్థిర (ప్రామాణిక) ధరల్లో జాతీయాదాయం
ఏ విధమైన సామాజిక, రాజకీయ, ఆర్థిక, ప్రకృతి పరమైన ఒడుదొడుకులు లేకుండా ఉత్పత్తి మంచిగా జరిగిన ఒకానొక సంవత్సరాన్ని ఆధార సంవత్సరం (బేస్ ఇయర్)గా తీసుకొని ఆ ధరల ఆధారంగా జాతీయాదాయాన్ని లెక్కిస్తే దాన్ని ‘స్థిర ధరల్లో ఆదాయం’ లేదా ‘వాస్తవ ఆదాయం’ అంటారు.
ఉదా: 2014-15 జాతీయాదాయాన్ని లెక్కించేటప్పుడు 2004-05 ధరలను ప్రామాణికంగా తీసుకోవడం.
స్థిర ధరల్లో జాతీయాదాయాన్ని లెక్కించడానికి కేంద్ర గణాంక సంస్థ (సీఎస్‌వో) ఎప్పటికప్పుడూ ఆధార సంవత్సరాన్ని నిర్ధారిస్తుంది. మన దేశంలో ఇప్పటివరకూ 1948-49, 1960-61, 1970-71, 1980-81, 1993-94, 1999-2000, 2004-05లను ఆధార సంవత్సరాలుగా తీసుకున్నారు.
ప్రస్తుత ధరల్లో ఆదాయాన్ని గణించినప్పటికీ దాన్ని ‘ధరల సూచీ’ (Price Deflator) ఆధారంగా స్థిర ధరల్లోకి మార్చవచ్చు.
స్థిర ధరల్లో ఆదాయం = (ప్రస్తుత ధరల్లో ఆదాయం / ధరల సూచీ) × 100
స్థూల రాష్ట్రోత్పత్తి (జీఎస్‌డీపీ)
ఒక రాష్ట్ర భౌగోళిక హద్దుల మధ్య, నిర్ణీత కాల వ్యవధిలో (సాధారణంగా ఒక సంవత్సరం) ఉత్పత్తి చేసిన వస్తువుల, సేవల మొత్తం విలువను స్థూల రాష్ట్రోత్పత్తి (Gross State Domestic Product - GSDP) అంటారు. జీఎస్‌డీపీ నుంచి ‘తరుగుదల’ను తీసేస్తే ‘నికర రాష్ట్రోత్పత్తి (Net State Domestic Product - NSDP) వస్తుంది. సాధారణంగా జీఎస్‌డీపీనే రాష్ట్ర ఆదాయంగా పరిగణిస్తారు. కానీ, ఆర్థిక పరిభాషలో రాష్ట్ర ఆదాయం అంటే ఎన్‌ఎస్‌డీపీ. వీటిని గణించేటప్పుడు ఒక రాష్ట్రంలోని వారు ఇతర రాష్ట్రాల్లో సంపాదించిన ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకోరు.
రాష్ట్ర తలసరి ఆదాయం = ఎన్‌ఎస్‌డీపీ ÷ రాష్ట్ర జనాభా
స్థూల జిల్లా ఉత్పత్తి (జీడీడీపీ)
ఒక జిల్లాలో ఏడాది కాలంలో ఉత్పత్తి చేసిన అంతిమ వస్తు సేవల మొత్తం విలువను ‘స్థూల జిల్లా ఉత్పత్తి’ (Gross District Domestic Product - GDDP) అంటారు.

రాష్ట్ర స్థూల ఉత్పత్తి - దృగ్విషయాలు
జీఎస్‌డీపీ లెక్కింపునకు అనువుగా ఉండటానికి రాష్ట్రంలో మూడు రంగాలను తొమ్మిది విభాగాలుగా విభజించారు. ఈ పద్దులను కింది విధంగా వర్గీకరించారు.
  1. వ్యవసాయ రంగం
    1.1 (ఎ) వ్యవసాయం
    1.1 (బి) జీవోత్పత్తులు (పశు సంపద - పాడి పరిశ్రమ)
    1.2 అటవీ ఉత్పత్తులు, కలప
    1.3 మత్స్య సేకరణ
  2. పారిశ్రామిక రంగం
    2. గనులు, తవ్వకాలు
    3. వస్తూత్పత్తి
    4. విద్యుచ్ఛక్తి, గ్యాస్, నీటి సరఫరా
    5. నిర్మాణాలు
  3. సేవల రంగం
    6. వాణిజ్యం, హోటళ్లు, రెస్టారెంట్లు
    7.1 రైల్వేలు
    7.2 రవాణా, నిల్వ చేయడం
    7.3 సమాచార సంబంధాలు
    8. రుణ సహాయం (ఫైనాన్సింగ్), బీమా, స్థిరాస్తులు, వ్యాపార సేవలు
    9. సామూహిక, సామాజిక, వ్యక్తి స్థాయి సేవలు, ఇతర సేవలు
వీటిలో మొదటి మూడు అంశాలను ఉత్పత్తి మదింపు పద్ధతి; 4, 6, 7, 8, 9లోని అంశాలను ఆదాయ మదింపు పద్ధతి; 5వ అంశాన్ని (నిర్మాణ రంగం) వ్యయ మదింపు పద్ధతి ద్వారా గణిస్తున్నారు
Tags: Telangana Gross Production Telangana Economic System Telangana Economy Study Material TSPSC Groups Study Material

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం



పరిచయం: అసమానత్వం అశాంతికి చిహ్నం. సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక వెనుకబాటుతనం ప్రశాంతతను భంగపరుస్తుంది. అది ప్రజల ఆకాంక్షలను సంతృప్తిపర్చదు. ఆ అసంతృప్తి, అన్యాయంపై పోరాడటానికి వారిని ఉద్యుక్తులను చేస్తుంది. తమ ఆస్తిత్వానికి ఎదురుదెబ్బతగిలినప్పుడు ఆ ప్రజల ఆక్రోశం హింసాత్మకంగా మారి సమాజమనుగడను ప్రశ్నిస్తుంది. ఇలాంటి పరిణామాలే తెలంగాణ సమాజంలో చోటు చేసుకున్నాయి. తమ ప్రత్యేక ఉనికిని, గుర్తింపును కాపాడుకునే క్రమంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనోద్యమం ఊపిరిపోసుకుంది. కానీ, పైన చెప్పినట్టు కాకుండా తెలంగాణ ప్రజలు నూతన అహింసాత్మక ఉద్యమరూపాలతో, సుదీర్ఘ శాంతియుత పోరాటంతో తమ లక్ష్యాలను నెరవేర్చుకున్నారు. ఎందరో అమరవీరుల త్యాగాలతో తెలంగాణ ప్రజల చిరకాల కల 2014 జూన్ 2న సాకారమైంది. ఆ రోజున భారతదేశంలో 29వ రాష్ట్రంగా ‘‘ తెలంగాణ’’ నూతనంగా ఆవిర్భవించింది.
ముఖ్యాంశాలు:
  • హైదరాబాద్ రాష్ట్ర శాసనసభకు మొదటి సారిగా 1952లో ఎన్నికలు జరిగాయి. ముఖ్యమంత్రిగా బూర్గుల రామకృష్ణారావు ఎన్నికయ్యారు..
  • మద్రాస్ రాష్ట్రం నుంచి 1953లో విడిపోయిన ఆంధ్రరాష్ట్రం మొదటి ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశం ఎన్నికయ్యారు.
  • తెలుగు మాట్లాడే ప్రాంతాలు ఒకే రాష్ట్రంగా ఏర్పడాలనే కోరికతో ఆంధ్రరాష్ట్రం నుంచి ‘‘విశాలాంధ్ర’’ ఉద్యమం మొదలైంది.
  • రెండు రాష్ట్రాల నాయకుల మధ్య 1956 ఫిబ్రవరి 20న ‘‘పెద్దమనుషుల ఒప్పందం’’ జరిగి నవంబర్ 1, 1956న ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు.
  • ఈ ఒప్పందంపై ఆంధ్రాప్రాంతం నుంచి బెజవాడ గోపాలరెడ్డి, నీలం సంజీవరెడ్డి, గౌతులచ్చన్న, అల్లూరి సత్యనారాయణ రాజులు,తెలంగాణ నుంచి బూర్గుల రామకృష్ణారావు, మర్రిచెన్నారెడ్డి, జె.వి. నర్సింగరావు, కె.వి రంగారెడ్డి లు సంతకాలు చేసి 14 అంశాలపైన అంగీకారానికి వచ్చారు.
  • పై ఒప్పందంలోని పలు అంశాలను విస్మరించడం వల్ల 1969లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ప్రారంభమైంది. తెలంగాణ వారిని సంతృప్తిపరచడం కోసం అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ 8 సూత్రాల పథకాన్ని సూచించారు.
  • తెలంగాణ ఉద్యమానికి ప్రతిస్పందనగా సీమాంధ్ర ప్రాంతంలో 1972లో ‘‘జై ఆంధ్ర ఉద్యమం’’ మొదలైంది. అందుకు ప్రతిగా కేంద్ర ప్రభుత్వం 1973లో 6 సూత్రాల పథకం రూపొందించింది. వాటిలోని అంశాలు పెద్ద మనుషుల ఒప్పందానికి వ్యతిరేకంగా ఉండడం వల్ల తెలంగాణ తన ప్రత్యేక అస్తిత్వాన్ని కోల్పోయింది.
  • ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలు అన్యాయానికి గురైయ్యారు. అన్ని వనరులు సీమాంధ్ర ప్రాంతం వారే అనుభవించడం వల్ల తెలంగాణ ప్రజలు అసంతృప్తికిలోనయ్యారు. 1990లో జరిగిన వరంగల్ రైతు కూలీ సంఘం బహిరంగ సభతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం తిరిగి ప్రారంభమైంది.
  • 2001 ఏప్రిల్ 27న కె.చంద్రశేఖర్‌రావు నాయకత్వంలో ‘‘తెలంగాణ రాష్ట్ర సమితి’’ (టీఆర్‌ఎస్) రాజకీయ పార్టీ ఏర్పడింది. ఈ పార్టీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే ప్రధాన ఎజెండాగా ప్రజలను ముందుకు నడిపింది.
  • 2009 నవంబరు 29న కె.చంద్రశేఖర్‌రావు ఆమరణ నిరాహార దీక్ష చేయడంతో ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి 2009 డిసెంబరు 9న ‘‘ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర’’ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేసింది.
  • ఆంధ్ర నాయకుల ఒత్తిడితో 2009 డిసెంబరు 23న కేంద్రం తన డిసెంబరు 9న చేసిన ప్రకటనను ఉపసంహరించుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని పరిణామాలపై అధ్యయనం చేయడానికి జస్టిస్ శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేశారు.
  • ఈ నేపథ్యంలో అన్ని రాజకీయ పక్షాలు, సంస్థలు ఏకమై ‘‘తెలంగాణ ఐక్యకార్యాచరణ కమిటి’’ గా ఏర్పడి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని తీవ్ర తరం చేశాయి. దాని ఫలితమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణ ప్రాంతం విడిపోయి 2014 జూన్ 2న కొత్త రాష్ర్టంగా రూపుదిద్దుకుంది.
కీలక పదాలు - నిర్వచనాలు:
  1. భాష ప్రాయుక్త రాష్ట్రాలు: ఒకే భాషను మాట్లాడే ప్రాంతాలన్ని ఒకే రాష్ట్రంగా ఏర్పాటు చేయడం. ఈ ప్రాతిపదికపై ఏర్పడిన తొలి రాష్ట్రం ‘ఆంధ్రరాష్ట్రం’ (1953).
  2. పెద్దమనుషుల ఒప్పందం: ఆంధ్ర రాష్ట్రానికి హైదరాబాద్ రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన 8 మంది పెద్దమనుషులు (నాయకులు) ఢిల్లీలోని ‘హైదరాబాద్ అతిథి గృహంలో సుధీర్ఘంగా చర్చించి రెండు ప్రాంతాల విలీనానికి 1956 ఫిబ్రవరి 20న ఒప్పందం కుదుర్చుకున్నారు. తెలంగాణ ప్రజల భ్రమలను పోగొట్టడానికి వీరు 14 అంశాలపైన అంగీకారానికి వచ్చారు.
  3. ముల్కీ నిబంధనలు: ముల్కీ అనే ఉర్దూ పదానికి అర్థం ‘స్థానిక’. స్థానికంగా ఉన్న ఉద్యోగాలలో స్థానికులనే నియమించాలని ముల్కీ నిబంధనాన్ని హైదరాబాద్ నిజాం ప్రవేశపెట్టారు. పెద్ద మనుషుల ఒప్పందం కూడా వీటిని ఆమోదించింది. కాని ఆచరణలో ఈ నియమాలను పట్టించుకోకపోవడం వల్ల తెలంగాణ ప్రజలకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్యాయం జరిగి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం చెలరేగింది.
  4. జై ఆంధ్ర ఉద్యమం: 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ప్రతిగా సీమాంధ్ర ప్రాంతంలో 1972లో ‘‘జై ఆంధ్ర’’ ఉద్యమం మొదలైంది. తెలంగాణ లోని ముల్కీ నిబంధనల వల్ల తమ అవకాశాలు సన్నగిల్లుతాయని భావించిన సీమాంధ్ర విద్యార్థులు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమాన్ని కొనసాగించారు. వీరి కోరికలను సంతృప్తి పరుస్తూ 1973లో కేంద్ర ప్రభుత్వం ఆరు సూత్రాల విధానాన్ని ప్రకటించడంతో ఈ ఉద్యమం చల్లారింది.
  5. శ్రీకృష్ణ కమిటి: ఆంధ్రప్రదేశ్‌లోని పరిణామాలను అధ్యయనం చేసి పరిష్కారాలను సూచించడానికి కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు న్యాయమూర్తి బి.ఎన్.కృష్ణ ఆధ్వర్యంలో 2010లో ఫిబ్రవరి 3న ఒక కమిటిని నియమించింది. శ్రీకృష్ణ కమిటి తన 505 పేజీల నివేదికను 2011 జనవరి 6న కేంద్రానికి అందించింది.
  6. సకల జనుల సమ్మె: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకు తెలంగాణ లోని అన్ని వర్గాల ప్రజలు, కార్మికులు, ఉద్యోగులు, రైతులు అనేక రకాలుగా నిరసనలు తెలిపి సమ్మె చేశారు. ఇది సకల జనుల సమ్మెగా ప్రసిద్ధి చెందింది. సెప్టెంబరు 13, 2011 నుంచి 42 రోజుల పాటు శాంతియుతంగా జరిగిన ఈ సకల జనుల సమ్మె ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగు వేయడానికి దోహదపడింది.
ముఖ్యమైన ప్రశ్నలు - జవాబులు: 4 మార్కులు
1. పెద్ద మనుషుల ఒప్పందంలోని ప్రధానాంశాలను పేర్కొనండి.
జ: పెద్దమనుషుల ఒప్పందం:-
తెలుగు మాట్లాడే రెండు ప్రాంతాలను విలీనం చేసి ఒకే రాష్ట్రంగా మార్చాలని అటు ఆంధ్రరాష్ట్రంలోని నాయకులు ఇటు హైదరాబాద్ రాష్ట్రంలోని కొందరు తెలంగాణ నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం ఆరంభించారు. కేంద్రం అందుకు ఒప్పుకుని రెండు ప్రాంతాలకు చెందిన ముఖ్యమైన నాయకులైన బి.గోపాల్‌రెడ్డి, ఎన్.సంజీవరెడ్డి, జి.లచ్చన్న, ఎ.సత్యనారాయణరాజు (ఆంధ్ర ప్రాంతం), బి.రామకృష్ణారావు, ఎం.చెన్నారెడ్డి, జి.వి.నర్సింగరావు, కె.వి.రంగారెడ్డి (తెలంగాణ )లను ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో సమావేశపర్చి ఒక అంగీకారానికి రావాలని సూచించింది. 1956 ఫిబ్రవరి 20న వీరు సమావేశమై 14 అంశాలపైన ఒప్పందానికి వచ్చి ఉమ్మడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటుకు మార్గం సుగమం చేశారు. ఆ ఒప్పందం ప్రకారమే నవంబరు 1, 1956న ‘ఆంధ్రప్రదేశ్’ అవతరించింది.

ఈ ఒప్పందంలోని ముఖ్యాంశాలు:
  • తెలంగాణ లోని రెవెన్యూ మిగులుని తెలంగాణ అభివృద్ధికి మాత్రమే ఉపయోగించాలి.
  • తెలంగాణ లో 12 సంవత్సరాలు నివసిస్తే ముల్కీ నిబంధనలకువారు అర్హులు అవుతారు.
  • తెలంగాణ అభివృద్ధికి 20 మందితో చట్టబద్ధమైన తెలంగాణ ప్రాంతీయ సంఘాన్ని ఏర్పాటు చేయాలి.
  • ఆంధ్రప్రదేశ్ మంత్రుల బృందంలో 40 శాతం తెలంగాణ నుంచి, 60 శాతం ఆంధ్ర ప్రాంతం నుంచి సభ్యులు ఉండాలి.
  • ముఖ్యమంత్రి ఆంధ్ర నుంచి ఉంటే ఉపముఖ్యమంత్రి తెలంగాణ నుంచి ఉండాలి.
  • తెలంగాణ ఉన్నత విద్యాసంస్థల్లో తెలంగాణ వారికే ప్రవేశాలివ్వాలి.
1969లో ప్రత్యేక తెలంగాణా ఉద్యమం ప్రారంభమవడానికి ఈ ఒప్పందం ఏ విధమైన కారణం కాదు. ఈ ఒప్పందంలోని చాలా అంశాలు అమలుపర్చక పోవడం వల్ల, అలాగే ఆంధ్ర ప్రాంతనాయకులు ఈ అంశాలను ఉల్లంఘించడం వల్ల తెలంగాణా ప్రజల్లో వారిపై అపనమ్మకం, వ్యతిరేకత పెరిగి ప్రత్యేక తెలంగాణా ఉద్యమం ఉద్భవించింది.

2. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తెలంగాణ ప్రజల్లో అసంతృప్తి పెరగడానికి దోహదపడిన అంశాలను తెలపండి? (విషయావగాహన)
జ: తెలంగాణ ప్రజల్లో అసంతృప్తికి కారణాలు
:-
  • రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దమనుషుల ఒప్పందంలోని కీలక అంశాలను విస్మరించాయి.
  • జై ఆంధ్ర ఉద్యమాన్ని చల్లార్చాడానికి కేంద్ర ప్రభుత్వం 1973లో రూపొందించిన ‘6 సూత్రాల విధానం’ తెలంగాణ ప్రాంతీయ అభివృద్ధి కమిటిల ఏర్పాటును, ముల్కీ నిబంధనలకు నిలిపివేసింది.
  • ప్రణాళికబద్ధ అభివృద్ధి ఫలాలు తెలంగాణ కంటే రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలు చేజిక్కించుకున్నాయి.
  • తెలంగాణ లోని వనరులను, ఉపాధి అవకాశాలను సీమాంధ్ర ప్రాంతీయులు సొంతం చేసుకుంటున్నారని తెలంగాణ యువత భావించారు.
  • స్థూల సాగు విస్తీర్ణం 1955-56లో ఆంధ్ర ప్రాంతంలో 4.2 మిలియన్ హెక్టార్లు ఉండగా 2006-07లో 5.3 మి.హె.కు (వృద్ధి 20 శాతం) పెరిగింది. అదే కాలంలో తెలంగాణ లో 4.8 మి.హె. నుంచి 5 మి.హె.కు (వృద్ధి శాతం 5) మాత్రమే పెరిగింది.
  • 1993-94లో రెండు ప్రాంతాల్లోను గ్రామీణ రైతుకు లభించే ఆదాయం 7800 రూపాయలు ఉండాగా 2007-08లో ఆంధ్ర రైతుకు రూ.11,800 ఆదాయం ఉంటే తెలంగాణ రైతు పదివేల రూపాయల ఆదాయం మాత్రమే పొందాడు.
  • అదే కాలంలో తెలంగాణ లో వ్యవపాయ కూలీల సంఖ్య 38 శాతం నుంచి 47 శాతానికి పెరిగితే ఆంధ్రలో 1 శాతం మాత్రమే పెరిగింది.
  • వ్యవసాయంలో సంక్షోభం వల్ల 2004-05లో ఆంధ్రప్రదేశ్ మొత్తంలో 1068 రైతుల ఆత్మాహత్యలు జరిగితే అందులో 663 మంది తెలంగాణ వారే ఉన్నారు.
  • 2001 లెక్కల ప్రకారం ఆంధ్రలో అక్షరాస్యత 63 శాతం ఉంటే తెలంగాణ లో 53 శాతం మాత్రమే ఉంది.
  • కళాశాల విద్యకు గ్రాంటు తెలంగాణాకు 93 కోట్ల రూపాయలు కేటాయించగా ఆంధ్రకి 224 కోట్ల రూపాయలు ఉంది.
  • వివక్షతతో కూడిన ఈ ముఖ్యమైన కారాణాలతో పాటు అసమాన అభివృద్ధి కూడా తెలంగాణ ప్రజలను కృంగదీసింది. సామాజికంగా, సాంస్కృతికంగా ద్వితియ శ్రేణి పౌరులుగా మారుతున్నామన్న ఆలోచన తెలంగాణ విద్యావంతుల్లో పెరిగిపోయింది. వివక్షతలు లేని తెలంగాణ రూపకల్పనకు ప్రత్యేక రాష్ట్ర సాధన అంతిమ పరిష్కారమని తెలంగాణ ప్రజలు భావించారు.
2 మార్కుల ప్రశ్నలు
1. నూతనంగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి నీ ఇచ్చే సూచనలేంటి? (సమకాలీన అంశాలపై స్పందన)
జ: తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుండడానికి నేనిచ్చే సూచనలు:-
  • తెలంగాణలోని అపార వనరులను ఉపయోగించి అన్ని ప్రాంతాలను, వర్గాలను సమానంగా అభివృద్ధి చేయాలి.
  • ఉపాధి అవకాశాలను పెంచి నిరుద్యోగ యువతను సమాజ అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలి.
  • నీటి పారుదల వసతులను, విద్యుచ్ఛక్తి సరిపడ అందించి వ్యవసాయ సాగుభూమి విస్తీర్ణాన్ని, ఉత్పత్తిని, ఉత్పాదకతను పెంచాలి.
  • పభుత్వం గామీణ రైతులకు సంఘటితరంగ వ్యవసాయ రుణాలను కాలానుగుణంగా అందించి వారికి ఆర్థిక పరిపుష్టి కలిగించాలి.
  • విద్యా, ఆరోగ్య మౌలిక వసతులను ప్రతి మారుమూల ప్రాంతానికి కల్పించి తెలంగాణ ను ‘విజ్ఞాన తెలంగాణ’ , ‘ఆరోగ్య తెలంగాణ’గా మార్చాలి.
  • ప్రభుత్వ పాలనలో పారదర్శకత పెంచి అశ్రీతపక్షపాతాన్ని, అలసత్వాన్ని, అవినీతిని రూపుమాపాలి.
2. తెలంగాణ ఐక్యకార్యాచరణ కమిటి చేసిన ముఖ్యమైన ఆందోళనలు, అవి జరిగిన తీరు, తేదీలను సేకరించి రాయండి. (సమాచార సేకరణ నైపుణ్యాలు)
:అన్ని రాజకీయ పక్షాలను, సంస్థలను ఏకం చేసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ‘తెలంగాణ ఐక్యకార్యాచరణ సంస్థ’ వివిధ రూపాలలో ఆందోళనలు నడిపింది. అవి:-
1. సహాయ నిరాకరణోద్యమం 2011, ఫిబ్రవరి 17 నుంచి సుమారు 3 లక్షల మంది తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు 16 రోజుల పాటు తమ నిరసనలతో ప్రభుత్వానికి సహాయ నిరాకరణ చేశారు.
2. మిలియన్ మార్చ్ 2011, మార్చి 10న 50 వేల మంది ఉద్యమకారులు టాంక్ బండ్ (హైదరాబాద్) పై మిలియన్ మార్చ్‌ను నిర్వహించారు.
3. సకల జనుల సమ్మె సెప్టెంబరు 13, 2011 నుంచి అన్ని వర్గాల ప్రజలు, ఉద్యోగులు, కార్మికులు, వృత్తి నిపుణులు 42 రోజుల పాటు సమ్మె చేశారు.
4. సాగర హారం సెప్టెంబరు 30, 2012న సుమారు 2 లక్షల మందితో హుస్సేన్ సాగర్ చుట్టూ మానవహారం నిర్వహించారు.

1 మార్కు ప్రశ్నలు
1. కోస్తా ఆంధ్ర ప్రాంతం అభివృద్ధి చెంది ఉండడానికి ప్రధాన కారణం ఏమిటి? (విషయావగాహన)
జ:
కోస్తా ఆంధ్ర ప్రాంతం తెలంగాణ కంటే అభివృద్ధి చెందిన ప్రాంతంగా గుర్తింపు పొందింది. అందుకు ప్రధాన కారణాలు:-
  • కోస్తా ప్రాంతం బ్రిటిష్ ప్రత్యక్ష పాలన కింద ఉండడం వల్ల అక్కడ ఆంగ్ల విద్య అందుబాటులోకి వచ్చింది. తద్వారా విద్యావంతులు పెరిగి ఆధునీకీకరణ చెందింది.
  • నదులు ఏర్పరిచిన డెల్టా ప్రాంతం, కాలువల ద్వారా సాగునీటి సదుపాయం ఉండడం వల్ల వ్యవసాయం అభివృద్ధి చెందింది.
  • రైలు రవాణా, ఓడరేవుల సదుపాయాలు, రహదారి వ్యవస్థ విస్తరించి ఉండడం వల్ల కూడా కోస్తా ఆంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందిందిగా గుర్తిస్తున్నారు.
2. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం కృషి చేసిన రాజకీయేతర సంస్థలను తెలపండి? (సమాచార సేకరణ)
జ:
ప్రత్యేక తెలంగాణ  రాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన రాజకీయేతర సంస్థలు:-
 - తెలంగాణ జనపరిషత్, తెలంగాణ మహాసభ, తెలంగాణ జనసభ, తెలంగాణ ఐక్యవేదిక.

3. తెలంగాణ ఉద్యమంలోని వివిధ నిరసన రూపాలను తెలపండి? (విషయావగాహన)
జ: ప్రజలను సమీకరించడానికి ప్రత్యక్ష తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సంస్థలు వివిధ రూపాల్లో నిరసనలు వ్యక్తికరించాయి. అవి:

- తెలంగాణ ధూంధాం, తెలంగాణ గర్జన, పాదయాత్రలు, బోనాలు, రహదారులపై వంట వార్పు, మానవహారాలు, సడక్‌బంద్‌లు, రైల్‌రోకోలు, సహపంక్తి భోజనాలు, మిలియన్ మార్చ్, సాగరహారం, చలో అసెంబ్లీ, సకల జనుల సమ్మె మొ॥

అబ్జెక్టివ్
1. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) ఏ రోజున ఆవిర్భవించింది... ( a )
a) 2001 ఏప్రిల్ 27
b) 2001 మార్చి 9
c) 2001 మార్చి 30
d) 2002 ఏప్రిల్ 1న

2. హైదరాబాద్ సంస్థానాన్ని స్వతంత్ర భారతదేశంలో విలీనం చేసిన సంఘటనను ఏమని పిలుస్తారు.... ( c )
a)  ఆపరేషన్ సక్సెస్ 
b) ఆపరేషన్ కోబ్రా
c) ఆపరేషన్ పోలో
d) ఆపరేషన్ సైనిక్

3. ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి ......  ( b)
a)  నీలం సంజీవరెడ్డి
b) టంగుటూరి ప్రకాశం పంతులు
c)బెజవాడ గోపాల్‌రెడ్డి
d) బూర్గుల రామకృష్ణారావు

4. హైదరాబాద్ రాష్ట్ర మొదటి, చివరి ముఖ్యమంత్రి.....  ( c )
a) జి.ఎన్.చౌదరి
b) ఎం.కె.వెల్లోడి
c) బూర్గుల రామకృష్ణారావు
d) నీలం సంజీవరెడ్డి

5. పెద్దమనుషుల ఒప్పందం ఎవరెవరి మధ్య జరిగింది.....  ( a )
 a) ఆంధ్ర, తెలంగాణ నాయకుల మధ్య
 b) ఆంధ్ర, తెలంగాణ, ఢిల్లీ నాయకుల మధ్య
 c) ఆంధ్ర, తెలంగాణ ముఖ్యమంత్రుల మధ్య
 d) ఆంధ్ర, తెలంగాణలకు చెందిన వివిధ రాజకీయ పార్టీల నాయకుల మధ్య

6. పెద్దమనుషుల ఒప్పందం ప్రకారం ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గంలో తెలంగాణ వారు ఎంత శాతం మంది ఉండాలి.......  ( c )
a) 50
b) 60
c) 40
d) 30
 
7. ముల్కీ నిబంధనలు దేనికి సంబంధించినవి...... ( a )
a) ఉద్యోగాలకు
b) నివాసానికీ
c) రాజకీయపదవులకు
d) స్థానికతకు

8. ఆంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి ఎవరు.......... ( b )
a) బూర్గుల రామకృష్ణారావు, నీలం సంజీవరెడ్డి
b) నీలం సంజీవరెడ్డి, కె.వి.రంగారెడ్డి
c) మర్రి చెన్నారెడ్డి, దామోదరం సంజీవయ్య
d) బి.గోపాల్‌రెడ్డి, మర్రి చెన్నారెడ్డి

9. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం మొదట ఏ సం॥మొదలైంది..........  ( a )
a) 1969
b) 1971
c) 1973
d) 1974

10. కింది వారిలో తెలంగాణ ప్రజా సమితి నాయకుడు ఏవరు? ......  ( c )
a) ఆలే నరేంద్ర
b) కె.చంద్రశేఖర్‌రావు
c) మర్రి చెన్నారెడ్డి
d) విజయశాంతి

11. ఆంధ్రప్రదేశ్‌లోని పరిణామాలను అధ్యయనం చేయడానికి కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటి.......... ( c )
a) ఫజల్‌ఆలీ కమిటి
b) వాంభూ కమిటి
c) కృష్ణ కమిటి
d) కమలనాథన్ కమిటి

12. వరంగల్‌లోని మేధావులు ‘తెలంగాణ విద్రోహదినాన్ని’ ఏ రోజున పాటించారు.....(  a )
a) నవంబరు 1, 1996
b) నవంబరు 1, 2000
c) నవంబరు, 2001
d) నవంబరు, 2009

13. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు ప్రకటనను ఏ రోజున చేసింది...... (  b )
a) డిసెంబర్ 7
b) డిసెంబర్ 9
c) డిసెంబర్16
d) డిసెంబర్23

14. 2009 నవంబర్ 29న కె.చంద్రశేఖర్‌రావు తన ఆమరణ నిరాహార దీక్షను ఎక్కడ నిర్వహించారు .....( d )
a) సిద్దిపేట
b) హైదరాబాద్
c) వరంగల్
d) ఖమ్మం

15. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం ఏ రోజున జరుపుకుంటున్నాము...... ( b )
a) జనవరి 4
b) జూన్ 2
c) జూన్ 14
d) డిసెంబరు 9


Tags:  తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం  తెలంగాణ ఉద్యమం చరిత్ర  తెలంగాణ ఉద్యమ చరిత్ర  తెలంగాణ చరిత్ర pdf  తెలంగాణ కవులు  తెలంగాణ ఉద్యమ పాటలు  తెలంగాణ ఉద్యమం పాటలు  తెలంగాణ సంస్కృతి  తెలంగాణ రాష్ట్ర చిహ్నాలు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం

How to install Android on a PC



Although Android is an operating system designed for mobile devices, the system and its app ecosystem make for a very comfortable working environment even on desktop. Here we explain how to install Android on a PC.


Android Nougat 7.0 (Beta) Android-x86

Android-x86 is an open source project designed to bring Android to desktop computers with x86 processors instead of the ARM chips found in most Android phones. Android-x86 is still in its early stages, it has some bugs, but it's still a working version of Android 7.0 on your computer.
The main problem I experienced was related to the Wi-Fi – I was unable to connect to the internet and download apps – but the Android system itself is smooth.
AndroidPIT install android pc 7664
Android Nougat on a PC. / © AndroidPIT

How to install Android-x86 based on Android 7.0 Nougat 

  • You will need a USB stick with at least 2 GB of storage in FAT-32 format
  • Download this Android image: nougatx8620160902.iso.bz2
  • Unzip the file with 7zip, or a similar program
  • Connect the USB stick to your computer
  • Open the program Rufus. It will detect the connected USB drive. In the dialog box, choose "ISO Image" and press the next button to find the picture in the folder just decompress
  • Now click on 'Start' to flash Android x86 to the USB memory
  • Once you've finished, restart your computer
  • When it loads again, enter the BIOS or UEFI and choose to boot from USB memory
AndroidPIT install android pc 7674
Split screen Android-x86 Nougat. / © AndroidPIT

Final thoughts on Android-x86 

As I mentioned above, there is a problem with how the internet works, but you can try most of the functions and new features that come with Android Nougat. It's in beta, so some niggles are to be expected. If you want a true desktop Android experience, I recommend trying the free Marshmallow Remix OS, described below.

Android 6.0 Marshmallow with Remix OS

Remix OS is a very stable and highly productive desktop version of Android. It draws from the Android-x86 project to but provides several extra features to make it, from my point of view, the best experience of Android on desktop.
The free download is available for 32-bit and 64-bit systems and the installation is simple.


How to install Remix OS based on Android 6.0 Marshmallow

  • You will need a USB stick with at least 8 GB of available storage space formatted in FAT-32. You could also use a disk partition, if you prefer
  • Download the 32 or 64-bit Remix OS image depending on the processor of your computer
  • Unzip the file with 7zip, or a similar program
  • Inside the unzipped folder you will find instructions, an md5sum file to verify that the image is intact, the image with the .iso extension and an executable installation file
  • Connect the USB stick to your computer and then double-click the executable installation file
  • When the installation program opens search the .iso image, select the icon which refers to USB memory and click OK
  • When it's done, your computer will reboot
  • Start your computer in the BIOS or UEFI and choose the boot from the USB Remix OS to launch the Android system 
AndroidPIT install android pc 7700
Remix OS provides a unique Android experience. / © AndroidPIT

Final thoughts on Remix OS

In early 2016, I was testing the first beta for OS Remix and it worked quite well. This version, however, is far more stable, it's clearly a project which has undergone a lot of hard work. Incidentally, the founder of the Android-x86 project now works on Remix OS. It's a full desktop experience where the Android OS perfectly adapted to a big screen and mouse. Check it out.

Android emulators for PC 

Remix OS Player

Another way to get the large-screen Android experience is to use an emulator. One of the best, and the only running with Marshmallow, is Remix OS Player. This is a version of OS Remix mounted on a virtual machine to run directly in a Windows environment.
You only need to download Remix OS Player, unzip it and run the RemixOSPlayer.exe file located in the folder. At first, it will prompt you to set up a few things and takes a few minutes to boot. To use the mouse emulator window press Ctrl + Alt.
On the right, you have several options and a menu where you can change aspects of the emulation like battery status, location, network signal and save screenshots. To move files from the system to the emulation simply drag and drop.
I AndroidPIT remix player
The Remix emulator interface. / © AndroidPIT
Note: if you see this error: "x86_64 emulation Currently requires hardware acceleration!
Please Ensure Intel HAXM is Properly installed and usable CPU acceleration status. Unable to open HAXM device: ERROR_FILE_NOT_FOUND," you only have to go to the folder Remix OS Player > RemixOSPlayer > remixemu > haxm-windows_v6_0_3 and run the file intelhaxm-android.exe. When it's finished you can re-launch Remix OS Player and it should be working

Other emulators and alternatives

There is a wide range of Android emulators for PC, but OS Remix Player is the best, as the others tend to use older versions of Android like Lollipop and KitKat. Popular emulators include BlueStacks, Andy, Droid4x and Koplayer. For Linux, you can use shashlik, which is still under development.
So there's no excuse to try Android on your PC. Do you like the idea of having Android on the desktop?

మీది అస‌లైన 4జీ ఫోన్ అవునో, కాదో తెలుసుకోండిలా.!




అస‌లైన 4జీ... ట్రూ 4జీ... నేడు చాలా మంది ఆండ్రాయిడ్ యూజ‌ర్ల‌ను క‌న్‌ఫ్యూజ్ చేస్తున్న మాట ఇది. 4జీ స్మార్ట్‌ఫోన్లను వాడుతున్నాం అని అంద‌రూ అనుకుంటున్నారు కానీ, అస‌లు తాము వాడుతోంది ట్రూ 4జీ ఫోనేనా అని అంద‌రికీ సందేహం క‌లుగుతోంది. ఇంత‌కీ ట్రూ 4జీ అంటే ఏమిటి..?

ట్రూ 4జీ అంటే స‌ద‌రు ఫోన్ కేవ‌లం 4జీ ఇంట‌ర్నెట్ డేటాకే కాదు, 4జీ వాయిస్ కాల్స్‌కు కూడా స‌పోర్ట్ చేయాలి. దాన్నే ట్రూ 4జీ అంటారు. అంటే యూజ‌ర్ త‌న డివైస్‌లో 4జీ ఇంట‌ర్నెట్ డేటాతోపాటు, హెచ్‌డీ క్వాలిటీతో కూడిన 4జీ వాయిస్ కాల్స్‌ను కూడా చేసుకునే విధంగా ఉంటేనే దాన్ని ట్రూ 4జీ అంటారు. ఈ ట్రూ 4జీ ఉన్న డివైస్‌ల స్పెసిఫికేష‌న్ 4G VoLTE అని ఉంటుంది. అంటే వాయిస్ ఓవ‌ర్ ఎల్‌టీఈ అని అర్థం. అంటే... స‌ద‌రు డివైస్‌లో 4జీ ఇంట‌ర్నెట్ డేటా మాత్ర‌మే కాదు, 4జీ వాయిస్ కాల్స్ కూడా చేసుకోవ‌చ్చ‌ని అర్థం. దీన్ని త‌మ త‌మ డివైస్‌ల‌లో గుర్తించ‌డం చాలా మందికి క‌ష్ట‌త‌ర‌మ‌వుతోంది. అందుకే గూగుల్ ప్లే స్టోర్‌లో అలాంటి వారి కోసం ఈ యాప్ అందుబాటులోకి వ‌చ్చింది.

'VoLTE checker' పేరిట ప్లే స్టోర్‌లో ల‌భ్య‌మ‌వుతున్న ఈ యాప్‌ను ఆండ్రాయిడ్ యూజ‌ర్లు ఇన్‌స్టాల్ చేసుకోవ‌చ్చు. దీన్ని ఇన్‌స్టాల్ చేసుకుని ఓపెన్ చేస్తే ఈ యాప్ వెంట‌నే స‌ద‌రు డివైస్ అస‌లైన 4జీ ఫోన్ అవునో కాదో వెంట‌నే తెలియ‌జేస్తుంది. దీంతో యూజ‌ర్లు త‌మ ఫోన్‌లో VoLTE ఉందా, లేదా అని గుర్తించ‌వ‌చ్చు.

రియో పారా ఒలింపిక్స్


బ్రెజిల్‌లోని రియో నగరంలో ఈ ఏడాది సెప్టెంబర్ 7 నుంచి 18 వరకు 15వ పారాలింపిక్స్ క్రీడలు జరిగాయి. ఒలింపిక్స్‌కు ఏమాత్రం తీసిపోని విధంగా ఈ పారాలింపిక్స్‌ను నిర్వహించారు. శారీరక అంగవైకల్యం, పాక్షిక అంధత్వం, పక్షవాతం కలిగిన అథ్లెట్‌లు పారాలింపిక్స్‌లో పాల్గొంటారు. భారత్ 1968 నుంచి (1976, 1980 తప్ప ) పారాలింపిక్స్‌లో పాల్గొంటూ వస్తోంది. రియోలో జరిగిన పారాలింపిక్స్‌తో కలిపి మొత్తం 11 పారాలింపిక్స్‌లలో భారత్ పాల్గొన్నది. రియో ఒలింపిక్స్‌లో పతకాలు సాధించడానికి భారత అథ్లెట్‌లు నానా కష్టాలు పడ్డారు. పతకం తెస్తారని ఆశలు పెట్టుకున్న క్రీడాకారులు ఒకరి తర్వాత ఒకరు వరుసగా వెనుదిరుగుతూ నిరాశపరిచారు. అయితే పారాలింపిక్స్‌లో మాత్రం అందుకు భిన్నంగా జరిగింది. సకల సౌకర్యాలు ఉండి, అత్యుత్తమ శిక్షణ పొందిన అతిపెద్ద క్రీడాబృందం నిరాశపరిచిన వేదికపైనే భారత దివ్యాంగుడు మరియప్పన్ తంగవేలు అద్భుతం చేశాడు. హైజంప్‌లో స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించాడు. దేవేంద్ర జఝారియా జావెలిన్ త్రో వ్యక్తిగత విభాగంలో రెండోసారి స్వర్ణం సాధించడంతోపాటు ప్రపంచ రికార్డులు నెలకొల్పా డు. మహిళా అథ్లెట్ దీపా మాలిక్ షాట్‌పుట్‌లో రజతం సాధించారు. వైకల్యాన్ని జయించి ప్రపంచ క్రీడా వేదికపై సత్తాచాటారు మన పారా అథ్లెట్‌లు. 11 రోజులపాటు ఉత్సాహంగా సాగిన పారాలింపిక్స్‌లో చివరిరోజు విషాదం చోటుచేసుకుంది. ఇరాన్ అథ్లెట్ బహ్మాన్ గోల్బార్నిజాద్.. సైక్లింగ్ రేసులో ప్రమాదవశాత్తు జారిపడి ప్రాణాలు కోల్పోయాడు.

పారాలింపిక్స్ విశేషాలు


-ఆరంభం, ముగింపు వేదిక - మారకాన స్టేడియం (బ్రెజిల్)
-క్రీడలు జరిగిన తేదీలు - సెప్టెంబర్ 7 నుంచి 18 వరకు
-మొత్తం జరిగిన రోజులు - 11
-క్రీడా ప్రారంభకులు - మైఖేల్ టైమర్ (బ్రెజిల్ అధ్యక్షుడు)
-మస్కట్ - వీనిసియస్, టామ్
-నినాదం - ఒక కొత్త ప్రపంచం
-పాల్గొన్న దేశాలు - 159 + ఇండిపెండెంట్ పారాలింపిక్స్ అథ్లెట్స్ టీమ్
-పాల్గొన్న క్రీడాకారులు - 4,342
-క్రీడలు - 22
-క్రీడా విభాగాలు - 528
-మొత్తం స్వర్ణాలు - 529
-మొత్తం రజతాలు - 529
-మొత్తం కాంస్యాలు - 539
-మొత్తం పతకాలు - 1,597
-పారాలింపిక్స్‌లో చేర్చిన క్రీడలు - కనోయింగ్, ట్రయథ్లాన్
-మార్చ్‌పాస్ట్‌లో తొలి దేశం - ఇండిపెండెంట్ పారాలింపిక్స్ అథ్లెట్స్ టీమ్
-మార్చ్‌పాస్ట్‌లో భారత్ - 73వ దేశం
-మార్చ్‌పాస్ట్‌లో చివరి దేశం - బ్రెజిల్
-భారత్ నుంచి పాల్గొన్న క్రీడాకారులు - 19 మంది (16 మంది పురుషులు, ముగ్గురు మహిళలు)
-భారత్ పాల్గొన్న క్రీడలు - 5
-ప్రారంభ వేడుకల్లో భారత త్రివర్ణ పతాకధారి - దేవేందర్ (జావెలిన్ త్రోయర్)
-తొలి స్వర్ణ పతక విజేత - వెరోనికా (స్లోవేకియా) 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో 208 స్కోర్‌తో స్వర్ణం సాధించింది.
-అత్యధిక స్వర్ణాలు సాధించిన దేశం - చైనా (107)
-అత్యధిక పతకాలు సాధించిన దేశం - చైనా (107 స్వర్ణాలు, 81 రజతాలు, 51 కాంస్యాలు = మొత్తం 239 పతకాలు)
-తొలి పతకం సాధించిన భారత క్రీడాకారుడు - మరియప్పన్ తంగవేలు (తమిళనాడు), హైజంప్
-భారత్ సాధించిన పతకాలు - 4 (2 స్వర్ణాలు, 1 రజతం, 1 కాంస్యం)
-పారాలింపిక్స్‌లో స్వర్ణాలు సాధించిన దేశాలు - 63
-ఏదో ఒక పతకం సాధించిన దేశాలు - 83
-ఒక్క పతకం కూడా సాధించని దేశాలు - 76
-పతకాల సాధనలో బ్రెజిల్ స్థానం - 8
2 పతకాల సాధనలో భారత్ స్థానం - 43
-16వ పారాలింపిక్స్ క్రీడలను నిర్వహించేది - జపాన్ (టోక్యో)
-అంతర్జాతీయ పారాలింపిక్స్ ఏర్పడినది - 1989, సెప్టెంబర్ 22
-అంతర్జాతీయ పారాలింపిక్స్ సంఘం గౌరవ అధ్యక్షుడు - జాక్వెస్ రోగె
-అంతర్జాతీయ పారాలింపిక్స్ సంఘం అధ్యక్షుడు - ఫిలిప్ క్రావెన్
-భారత పారాలింపిక్స్ సంఘం ఏర్పడినది - 1992
-సంఘం అధ్యక్షుడు - రాజేష్ తోమర్
-సంఘం ప్రధాన కార్యదర్శి - జె. చంద్రశేఖర్

పారాలింపిక్స్ - 2016 ప్రత్యేకతలు


-పారాలింపిక్స్ చిహ్నం టామ్. బ్రెజిల్ వాయిద్యకారుడు టామ్ జొబిమ్‌కు గుర్తుగా ఈ చిహ్నానికి ఆ పేరు పెట్టారు. బ్రెజిల్‌లోని వృక్ష సంపదను ప్రతిబింబిస్తూ ఈ చిహ్నాన్ని రూపొందించారు.

-ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాచ్ లేకుండా పారాలింపిక్స్ ప్రారంభమయ్యాయి. ఎందుకంటే ఆయన పశ్చిమ జర్మనీ మాజీ అధ్యక్షుడు వాల్టర్ అంత్యక్రియల్లో పాల్గొనడానికి వెళ్లాడు.

-డోపింగ్ ఆరోపణల వల్ల రష్యా అథ్లెట్లు ఈ పారాలింపిక్స్‌లో పాల్గొనలేదు.

-పారాలింపిక్స్ ప్రారంభోత్సవం, ముగింపు వేడుకలను భారత్‌లో దూరదర్శన్ సహా ఏ నెట్‌వర్క్ కూడా ప్రసారం చేయలేదు. అయితే 154 దేశాలు వేడుకలను ప్రసారం చేశాయి.

-పారాలింపిక్స్‌లో స్వర్ణ విజేతలకు రూ. 75 లక్షలు, రజత పతక విజేతకు రూ. 50 లక్షలు, కాంస్య పతక విజేతకు రూ. 30 లక్షలు ఇస్తామని క్రీడల మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

మరియప్పన్ (21) :

తమిళనాడులోని సేలం సమీపంలో పెరియవాడగంపట్టి గ్రామంలో 1995, జూన్ 28న జన్మించిన మరియప్పన్ తంగవేలు.. ఐదేళ్ల వయసులో పాఠశాలకు వెళ్తుండగా ప్రమాదవశాత్తు ఓ బస్సు అతడి కాలుపై నుంచి వెళ్లింది. ప్రమాదంలో అతడి కుడికాలు ఛిద్రమైంది. మరియప్పన్ తల్లి వైద్యం కోసం రూ.3,00,000 ఖర్చు చేసింది. పేద కుటుంబం కావడంతో ఆమె కూరగాయలు అమ్ముతూ ఇప్పటికీ ఆ అప్పు చెల్లిస్తోంది. పారాలింపిక్స్ విజయంతో తమిళనాడు ప్రభుత్వం తంగవేలుకు రూ. 2 కోట్లు ప్రకటించింది. భారత ఒలింపిక్ సంఘం రూ.75 లక్షలు ఇవ్వనుంది. దీంతో వారి ఆర్థిక కష్టాలన్నీ తీరినట్లే. మరియప్పన్ తంగవేలు 14వ ఏట తొలిసారి ఎలాంటి శారీరక వైకల్యం లేని వారితో నేషనల్ అథ్లెటిక్ మీట్‌లో పాల్గొని రజతం గెలిచాడు. 2013లో 18 ఏళ్ల వయసులో జాతీయ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనేటప్పుడు కోచ్ సత్యనారాయణ.. మరియప్పన్ ప్రతిభను గుర్తించాడు. బెంగళూరులో కఠోర సాధన, శిక్షణతో రాటుదేలి ఏడాది క్రితం సీనియర్ లెవల్ పోటీల్లో అడుగుపెట్టిన మరియప్పన్ అదే ఏడాది ట్యునీషియాలో జరిగిన పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిలో 1.78 మీటర్ల ఎత్తు ఎగిరి స్వర్ణం గెలిచాడు. పారాలింపిక్స్‌కు అర్హత సాధించాడు. ఇప్పుడు రియో పారాలింపిక్స్‌లో హైజంప్‌లో భారత్‌కు స్వర్ణ పతకం సాధించి త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించాడు.

దేవేందర్ జఝారియా (35) :

రాజస్థాన్‌లో 1981, జూన్ 10న జన్మించిన దేవేందర్ జఝారియా 8 ఏళ్ల ప్రాయంలో చెట్టు ఎక్కగా కరెంట్ వైరు తగలడంతో షాక్‌కు గురై ఎడమ చేతిని కోల్పోయాడు. అంగవైకల్యం వచ్చిందని కుంగిపోకుండా జావెలిన్ త్రోలో కఠోర సాధనచేసి 2004, 2016 పారాలింపిక్స్‌లలో స్వర్ణ పతకాలు సాధించాడు. 2013లో ఫ్రాన్స్‌లోని లయోన్‌లో, 2015లో ఖతార్‌లోని దోహలో జరిగిన ఐపీసీ అథ్లెటిక్స్ ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీల్లో వరుసగా స్వర్ణం, రజతం సాధించాడు. 2004లో అర్జున అవార్డు పొందాడు. 2012లో పద్మశ్రీ అవార్డు స్వీకరించి, ఆ అవార్డు అందుకున్న తొలి పారాలింపియన్‌గా గుర్తింపు పొందాడు.

దీపామాలిక్ :

హర్యానాకు చెందిన దీపామాలిక్ మహిళల షాట్ పుట్ విభాగంలో రజతం సాధించారు. ఈ ఘనతతో పారాలింపిక్స్‌లో పతకం సాధించిన తొలి భారత మహిళా అథ్లెట్‌గా దీప రికార్డు సృష్టించారు. దీపా మాలిక్ 2011లో న్యూజిలాండ్‌లోని క్రిస్ట్‌చర్చిలో జరిగిన ఐపీసీ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీల్లో షాట్‌పుట్‌లో రజతం గెలుపొందా రు. ఆమె పట్టుదలను చూసి సైనికాధికారి అయిన భర్త ప్రోత్సాహం తోడవడంతో దీప ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించారు. 2012లో అర్జున అవార్డు అందుకున్నా రు. 1999లో వెన్నెముకకు కణితి రావడంతో దీప శరీరంలోని నడుము కింది భాగం చచ్చుబడిపోయింది. దీంతో ఆరేళ్లపాటు చక్రాల కుర్చీకే పరిమితమైన ఆమె ఆ తర్వాత పారా అథ్లెట్‌గా మారారు. దీప పేరుమీద రెండు లిమ్కా బుక్ రికార్డులు ఉన్నాయి. మొదటిది 2008లో కిలోమీటరు దూరం యమునా నది ప్రవాహాన్ని దాటడం. రెండోది 2013లో ప్రత్యేక బైక్‌పై 58 కిలోమీటర్లు ప్రయాణించడం.

వరుణ్ సింగ్ భాటి:

1995, ఫిబ్రవరి 13న ఉత్తరప్రదేశ్‌లో జన్మించిన వరుణ్‌సింగ్ భాటి (21) పోలియో రావడంతో వికలాంగుడిగా మారాడు. 2012లో లండన్‌లో జరిగిన పారాఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశం కోల్పోయాడు. 2014లో దక్షిణ కొరియాలో జరిగిన ఆసియన్ పారాలింపిక్స్‌లో 5వ స్థానం, అదే ఏడాది చైనాలో జరిగిన ఓపెన్ అథ్లెట్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణాన్ని సాధించాడు. 2015లో జరిగిన పారా ప్రపంచ చాంపియన్ పోటీల్లో 5వ స్థానంలో నిలిచాడు. రియోలో జరిగిన పారాలింపిక్స్‌లో హైజంప్ విభాగంలో కాంస్యం సాధించాడు.

బహ్మాన్ గోల్బార్నిజాద్:

ఇరాన్‌కు చెందిన ఈ సైక్లిస్ట్ 1980లో జరిగిన యుద్ధంలో కాలు కోల్పోయాడు. ఈ పారాలింపిక్స్‌లో పురుషుల రోడ్ రేస్ సీ-4, 5 విభాగాల్లో పాల్గొన్న బహ్మాన్ సైకిల్‌పై నుంచి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. దవాఖానకు తరలిస్తున్న తరుణంలో గుండెపోటుతో మృతిచెందాడు. ఇలా పారా ఒలింపిక్స్‌లో ఒక అథ్లెట్ మరణించడం ఇదే మొదటిసారి. బహ్మాన్ మృతికి సంతాప సూచకంగా రియో ముగింపు వేడుకల్లో కొన్ని క్షణాలు మౌనం పాటించారు.

పారాలింపిక్స్‌లో పెను సంచలనం


నలుగురు పారా అథ్లెట్లు ఏ వైకల్యం లేని ఆటగాళ్లని తలదన్నేలా పరుగెత్తి ప్రపంచాన్ని నివ్వెరపరిచారు. 1500 మీ. (టీ-13 క్లాస్) పరుగులో తొలి నాలుగు స్థానా ల్లో నిలిచిన అథ్లెట్లు.. ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన అథ్లెట్ కంటే అత్యుత్తమ టైమింగ్‌ను నమోదు చేశారు. అబ్దెల్లతీఫ్ బాకా (అల్జీరియా) 3 నిమిషాల 48.29 సెకన్లలో లక్ష్యాన్ని పూర్తిచేసి స్వర్ణం చేజిక్కించుకున్నాడు. ఇథియోపియాకు చెందిన తమిరు డొమిసెస్ (3 నిమిషాల 48.59 సెకన్లు) రజతం సాధించగా, కెన్యాకు చెందిన హెన్రీ కిర్వా (3 నిమిషాల 49.59 సెకన్లు) కాంస్యం గెలుచుకున్నాడు. అబ్దెల్లతీఫ్ సోదరుడు ఫౌద్‌బాకా (3 నిమిషాల 49.84 సెకన్లు) నాలుగో స్థానంలో నిలిచాడు. ఈ నలుగురు పారా అథ్లెట్లు.. ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన అమెరికా రన్నర్ మాథ్యూ సెంట్రోవిజ్ (3 నిమిషాల 50 సెకన్లు) కంటే వేగంగా రేసును పూర్తిచేశారు.

-జర్మనీకి చెందిన మార్సర్ రెమ్ కృత్రిమ కాలుతో లాంగ్‌జంప్‌లో 8.40 మీటర్లు దూకి స్వర్ణం సాధించాడు. ఒలింపిక్స్‌లో అమెరికా అథ్లెట్ జెఫ్ హెండర్సన్ 8.38 మీటర్లు దూకి స్వర్ణం సాధించాడు. హెండర్సన్ కంటే మార్సర్ దూకిన ఎత్తు ఎక్కువ కావడం విశేషం.

పారాలింపిక్స్‌లో భారత్


-మొదటిసారి 1968లో పారాలింపిక్స్‌లో పాల్గొన్నది.
-మధ్యలో జరిగిన 1976, 1980 పారాలింపిక్స్‌లో పాల్గొనలేదు.
-ఇప్పటివరకు 11 సార్లు పారాలింపిక్స్‌లో పాల్గొన్నది.
-1972 పారాలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకం వచ్చిం ది. మురళీకాంత్ షెట్కర్ స్విమ్మింగ్‌లో స్వర్ణం సాధించాడు.

-రియో పారాలింపిక్స్‌లో షాట్ పుట్ విభాగంలో దీపా మాలిక్ రజతం సాధించారు. ఈమె పారాలింపిక్స్‌లో పతకం సాధించిన తొలి భారత మహిళ.
-వ్యక్తిగత విభాగంలో రెండు పారాలింపిక్స్‌లో (2004, 2016) స్వర్ణాలు సాధించిన అథ్లెట్ దేవేందర్ జఝారియా (జావెలిన్ త్రో).
-జోగిందర్‌సింగ్ బేడీ వ్యక్తిగత విభాగంలో ఒకే పారాలింపిక్స్‌లో వేర్వేరు క్రీడల్లో మూడు పతకాలు సాధించాడు. న్యూయార్క్‌లో జరిగిన పారాలింపిక్స్‌లో రజతం (షాట్ పుట్), కాంస్యం (జావెలిన్ త్రో), కాంస్యం (డిస్కస్ త్రో) గెలుచుకున్నాడు.
-ఇప్పటి వరకు జరిగిన పారాలింపిక్స్‌లో భారత్‌కు 12 పతకాలు వచ్చాయి. వాటిలో 4 స్వర్ణాలు, 4 రజతాలు, 4 కాంస్యాలు ఉన్నాయి.
















telangana bathukamma songs 2016
































telangana bathukamma songs  telangana bathukamma songs download  telangana bathukamma songs free download mp3  telangana bathukamma festival songs free download  telangana bathukamma songs free download  telangana bathukamma songs online  telangana songs  telangana bathukamma songs lyrics  telangana bathukamma songs 2016, v6 telangana bathukamma songs  telangana bathukamma songs download  telangana bathukamma songs free download mp3,  Tnews telangana bathukamma festival songs free download  telangana bathukamma songs free download  maa tv telangana bathukamma songs online  telangana songs  telangana bathukamma songs lyrics  telangana bathukamma songs 2016

Followers